BUFFET / tydiqa /te /tydiqa_8_100_train.tsv
akariasai's picture
Upload 204 files
479c437
raw
history blame
13.1 kB
question: మల్లవిల్లి గ్రామ విస్తీర్ణం ఎంత? context: మల్లవిల్లి కృష్ణా జిల్లా, బాపులపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన బాపులపాడు నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నూజివీడు నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1374 ఇళ్లతో, 5082 జనాభాతో 3166 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2569, ఆడవారి సంఖ్య 2513. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 758 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589072[1].పిన్ కోడ్: 521111, ఎస్.టి.డి.కోడ్ = 08656. 3166 హెక్టార్ల
question: సత్యం శంకరమంచి తల్లి పేరేమిటి ? context: సత్యం శంకరమంచి (1937-1987) గుంటూరు జిల్లా అమరావతిలో 1937వ సంవత్సరం మార్చి 3న శేషమ్మ, కుటుంబరావులకు జన్మించారు. తల్లిదండ్రులు పసితనంలోనే దూరమైపోగా సీతమ్మ, పెదపున్నమ్మలు సత్యాన్ని పెంచి పెద్ద చేసారు. సాహిత్యాభివృద్ధికి అన్నలు రామారావు, రాధాకృష్ణమూర్తి, పూర్ణానందశాస్త్రి గార్లు ప్రోత్సహించారు. శేషమ్మ
question: అరకులోయ గ్రామం సముద్ర మట్టము నుండి ఎంత ఎత్తున ఉంది? context: అరకులోయ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. అరకు లోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం. సముద్ర మట్టము నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న అద్భుత పర్వతపంక్తి. అనేక కొండజాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు. విశాఖ నుంచి రైలులో అరకు చుట్టివెళ్ళే ప్రయాణం ఒక అందమైన అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతము ప్రతి సినిమాలలో ఏదో ఒక భాగములో కనిపిస్తుంది. నిత్యము సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఈ ప్రాంతము చూడదగ్గ పర్యాటక ప్రదేశం. ఇది తూర్పు కనుమల లో ఉంది. ఇది విశాఖపట్నం నుండి 114 కి.మీ దూరంలో ఒడిషా రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంది. అనంతగిరి మరియు సుంకరిమెట్ట రిజర్వు అడవి ఈ అరకులోయలో ఒక భాగము. ఇచట బాక్సైట్ నిక్షేపాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం అయిన గాలికొండ ఇచట ఉంది. దీని ఎత్తు 5000 అడుగులు (1500 మీటర్లు). ఇచట జూన్-అక్టోబరు నెలల మధ్య సరాసరి వర్షపాతం 1,700 మి.మీ (67 అంగుళాలు). ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1300 ఎత్తున ఉన్నది. ఈ లోయ 36 కి.మీ విస్తరించి ఉంది. అరకు లోయకు ఘాట్ రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నప్పుడు రోడ్డుకిరువైపుల ఉన్న దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ భలే సరదాగా ఉంటుంది. మొత్తం 46 టన్నెళ్లు, బ్రిడ్జిలు ఉంటాయి. ఇక అరకులోయకు వెళ్లే మార్గమధ్యంలో దర్శనమిచ్చే అనంతగిరి కొండలు కాఫీ తోటలకు ప్రసిద్ధి. బొర్రా గుహలు అరకులోయకు సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 900 మీటర్ల
question: 2011 జనగణన ప్రకారం వీరబల్లె గ్రామములో పురుషుల సంఖ్య ఎంత? context: వీరబల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లా వీరబల్లె మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 516 268., ఎస్.టి.డి.కోడ్, 08561.[1] ఇది సమీప పట్టణమైన రాయచోటి నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2167 ఇళ్లతో, 8720 జనాభాతో 3746 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4385, ఆడవారి సంఖ్య 4335. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1724 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 99. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593571[2].పిన్ కోడ్: 516268. 4385
question: మానవుని మూత్రపిండాల సంఖ్య ఎంత ? context: ఒకొక్క మూత్రపిండం చిక్కుడు గింజ ఆకారంలో, పిడికిలి ప్రమాణంలో ఉంటుంది. ఈ రెండూ వీపుకి మధ్య భాగంలో, కడుపుకి వెనక, పక్క ఎముకలకి దిగువగా, వెన్నుకి ఇటూ అటూ ఉంటాయి. తరచుగా ఎడమ వైపు ఉండే మూత్ర పిండం కుడి పిండానికి ఎదురుగా కాకుండా రెండు సెంటీమీటర్లు ప్రాప్తికి ఎగువకి ఉంటుంది. ప్రతి పిండం దరిదాపు 10 సెంటీమీటర్లు పొడవు, 5 సెంటీమీటర్లు మందం ఉండి, దరిదాపు 150 గ్రాముల బరువు ఉంటుంది. ఈ పిండాలలోనికి రక్తం వృక్క ధమని (renal artery) ద్వారా వెళ్ళి, శుభ్రపడి వృక్క సిర (renal vein) ద్వారా బయటకి వస్తుంది. (ఇంగ్లీషులో 'రీనల్‌' అనే విశేషణం 'మూత్రపిండాలకి సంబంధించిన' అనే అర్ధాన్ని ఇస్తుంది. సంస్కృతంలో ఇదే అర్ధం వచ్చే ధాతువు 'వృక్క'.) చిక్కటి రక్తనాళాల వలయంతో నిండి ఉంటాయి కనుక మూత్రపిండాలు చూడటానికి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. రెండూ
question: సింధు నాగరికత ఏ నది ప్రాంతంలో పుట్టింది? context: సింధూ నది (సంస్కృతం: सिन्धु ; ఆంగ్లం: Indus River) భారత ఉపఖండంలో ప్రసిద్దమయిన హిమ నది. ఇది హిమాలయాలలో టిబెట్లో పుట్టి కాశ్మీర్, పంజాబ్, సింధ్ రాష్ట్రాలలో ప్రవహించి పాకిస్తాన్‍ లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది.[1][2] పాకిస్థాన్లోని అతిపెద్ద, జాతీయ నది సింధు.[3] సింధు నదికి ఉపనదులు జీలం, చీనాబ్, రావీ, బియాస్, సట్లెజ్ ప్రవహించే ప్రాంతం అంతా అతి సారవంతమయిన నేల. ఈ నదుల మీద పాకిస్తాన్ ప్రభుత్వం మంగళా డాము, సుక్కూలారు బ్యారేజ్, భారతదేశంలో పంజాబ్‍లో సట్లెజ్ నది మీద భాక్రానంగల్ ఆనకట్ట, భారీ డ్యాములు, ఆనకట్టలు కట్టి సాగునేలకు పంట నీటిని అందించి గోధుమ, వరి, చెరకు విరివిగా పండించుటయేగాక జలవిద్యుత్తును ఉత్పత్తి చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. సింధు నది పొడవు 2880 కి.మీ. హరప్పా, మొహంజోదారో ప్రాంతాల్లో ఈ సింధు నదీ లోయలో సుమారు 5,000 ఏళ్ళ ఉజ్జ్వలమైన సింధు లోయ నాగరికత వెలసి వర్థిల్లింది. టిబెట్
question: పూర్నియా జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి? context: పూర్నియా జిల్లాలో 4 విభాగాలు ఉన్నాయి: పూర్నియా, బన్మంఖి, బైసి ధందహా. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. అవి వరుసగా తూర్పు పూర్నియా, క్రిత్యానంద్ నగర్, బన్మంఖి, కస్వా, అముర్, బైంసి, బైసా, ధందహా, బర్హరా కొథి, రూపౌలీ, భవానీపూర్, డగరుయా, జలాల్గర్ మరియు శ్రీనగర్. 14
question: అప్పన్నదొరపాలెం గ్రామ విస్తీర్ణం ఎంత? context: అప్పన్నదొరపాలెం, విశాఖపట్నం జిల్లా, మాకవరపాలెం మండలానికి చెందిన గ్రామము.[1] ఇది మండల కేంద్రమైన మాకవరపాలెం నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 155 ఇళ్లతో, 533 జనాభాతో 409 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 276, ఆడవారి సంఖ్య 257. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 45 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 586303[2].పిన్ కోడ్: 531113. 409 హెక్టార్ల