link
stringlengths 41
231
| text
stringlengths 28
5k
|
---|---|
https://www.telugupost.com/movie-news/ilaya-dalapathi-joseph-vijay-ready-to-join-in-politics-but-on-these-conditions-1484562 | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలతో ప్రభుత్వం మీద మంచి దూకుడు మీద ఉన్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఎంతో వివాదాస్పదం అవుతున్నాయి. ఆయన సినిమా కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉంది. అయితే ఒకప్పుడు రాజకీయాల్లోకి రావడానికి సినిమాలను వదిలేసిన సంగతి తెలిసిందే..! రాజకీయాల్లో పూర్తిగా టైమ్ కేటాయించాలంటే తప్పకుండా సినిమాలకు దూరం అవుతాయని అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పడం అభిమానులను ఎంతో బాధపెట్టింది. మెగా స్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ను సినిమాలు చేయాల్సిందే అంటూ కోరారు. దీంతో పవన్ మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలను పూర్తీ చేసి.. వచ్చే ఏడాది ఎన్నికల్లో జనసేనానిని గెలిపించుకోడానికి ప్రయత్నించాలని అనుకుంటూ ఉన్నారు.కట్ చేస్తే తమిళనాడులో కూడా ప్రస్తుతం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎదురైన పరిస్థితే అక్కడి టాప్ హీరో విజయ్ కు ఇప్పుడు ఎదురవుతూ ఉంది. విజయ్ కూడా రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుండో ప్రచారం సాగుతూ ఉంది. ఆయన కూడా ఒక కండిషన్ పెడుతూ ఉన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తే సినిమాలకు పూర్తిగా దూరం అవుతానని అంటున్నాడు ఇళయదళపతి. ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేస్తున్నారు. కానీ ఆయన అభిమానులకు ఇది మింగుడు పడని విషయమే..! విజయ్ చెన్నై నగర శివారు ప్రాంతమైన పనైయూరులో ‘విజయ్ మక్కల్ ఇయ్యక్కం’కు చెందిన జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. తాజాగా తిరువళ్ళూరు, అరియలూరు, పెరంబలూరు, దిండిగల్, సేలం, తేని జిల్లాలకు చెందిన నిర్వాహకులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీ ముగిసిన బయటకు వచ్చిన మక్కల్ ఇయ్యక్కం సభ్యులు కీలక విషయాలను చెప్పారు. రాజకీయాల్లోకి వస్తే సినిమాల్లో నటించడం మానేసి పూర్తిస్థాయిలో రాజకీయాలపైనే దృష్టి సారిస్తానని విజయ్ చెప్పారని అన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తాము చేశామన్నారు. త్వరలో విజయ్ పొలిటికల్ జర్నీ మొదలు కాబోతోందని తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. |
https://www.telugupost.com/movie-news/అందమైన-సెల్ఫీ-లతో-ఆకట్టు-19737/ | తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లతో పాటు యూత్ లో క్రేజ్ వున్నా అక్కినేని నాగ చైతన్య ల సరసన నటించినప్పటికీ మళయాళ బ్యూటీ అమల పాల్ కి ఇక్కడ అవకాశాల కొదవ తగ్గలేదు. కానీ అమల పాల్ కెరీర్ తొలి దశ నుంచి విరామం లేకుండా మళయాళ, తమిళ చిత్రాలు వరుసగా చేస్తూనే ఉండేది. అనంతరం అతి పిన్న వయసులోనే తమిళ దర్శకుడు విజయ్ ని మనువాడి రెండు సంవత్సరాలకే విడాకులు ఇచ్చింది. ఈ రెండు సంవత్సరాలు సినిమా ప్రపంచానికి దూరం కావటంతో విడాకుల అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోవాలని అమల చేసిన ప్రయత్నాలు ఫలించాయి కూడా. ప్రస్తుతం మళయాళ, తమిళ భాషలలో కలిపి అమల నటిస్తున్న అరడజను చిత్రాలు సెట్స్ మీద వున్నాయి. తెలుగు లో మాత్రం అమల పాల్ కి ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎదురైన అనుభవాలే ఎదురవుతుండటం బాధాకరం.అయితే సోషల్ మీడియా ద్వారా తన లేటెస్ట్ ఫోటో షూట్స్ అండ్ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకట్టుకుంటుంది. ఇటీవలి కాలం లో అయితే సోషల్ మీడియా లో అమల పాల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అమల పోస్ట్ చేస్తున్న ఫొటోస్ లో గ్లామర్ డోస్ పెంచటమే ఇందుకు కారణం. విడాకులతో విజయ్ తో వివాహ బంధం రద్దవటంతో వచ్చిన స్వేచ్ఛ ని పూర్తిగా వాడేసుకుంటుంది అమల పాల్. తన ఫోటో షూట్స్ లోనే కాక తన స్నేహితులతో దిగిన సెల్ఫీల లోకూడా అమల ఎంత మాత్రం తగ్గటం లేదు. తాజా గా తన స్నేహితురాలితో కలిసి అమల పాల్ దిగిన సెల్ఫి ని తన పేజీ పై పోస్ట్ చేసింది అమల పాల్. ఆ ఫొటోలో బాగా కురచ షాట్స్ వేసుకుని, డీప్ కట్ టాప్ తో అందాలు ప్రదర్శిస్తూ దర్శనమిచ్చింది ఈ డస్కీ బ్యూటీ. మరి ఫొటోలకే ఇలా కనిపిస్తుంటే రానున్న చిత్రాల అమ్మడి ప్రదర్శన ఎలా వుండబోతుందో... |
https://www.telugupost.com/Telangana-assembly-elections-2023/list-of-candidates-for-the-first-phase-of-congress-has-been-released-candidates-are-waiting-for-the-second-list-1501138 | కాంగ్రెస్ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదలయింది. యాభై ఐదు మంది అభ్యర్థులతో వచ్చిన తొలి జాబితాలో అక్కడక్కడ కొంత అసంతృప్తులున్నా పెద్దగా అవి కనిపించలేదు. ఫస్ట్ లిస్ట్ సూపర్బ్ అని మెచ్చుకున్న వారు కూడా లేకపోలేదు. అన్ని వర్గాలకూ స్థానం కల్పిస్తూ విడుదల చేసిన జాబితాతో కొంత కాంగ్రెస్ కు హైప్ క్రియేట్అయింది. గాంధీభవన్ వద్ద నిరసనలు, డౌన్ డౌన్ నినాదాలు వినిపించినా వాటిని పెద్దగా పట్టించుకోలేని పరిస్థితి. కానీ రెండో జాబితా ఇంత వరకూ విడుదల కాలేదు. ఎన్నికలకు ఇంకా నలభై రోజులకు మించి సమయం లేదు. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి వెళ్లింది.కర్ణాటక తరహాలోనే...కర్ణాటక తరహాలో ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పిన పార్టీ హైకమాండ్ తెలంగాణ విషయానికి వచ్చే సరికి మాత్రం కొంత వెనక్కు తగ్గింది. నలభై రోజులే ఎన్నికలకు సమయం ఉన్నా ఇంకా సగానికి మించిన సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. సీనియర్ నేతలకే టిక్కెట్లు దక్కకపోవడంతో అభ్యర్థులు కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి నెలన్నర అవుతున్నా నియోజకవర్గాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి అభ్యర్థుల ఖరారు కాకపోవడమేనని చెబుతున్నారు. రాహుల్ గాంధీ మొదటి విడత బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఆయన రెండో విడత కూడా రాష్ట్రానికి రానున్నారు.ఇంకా భర్తీ కాకపోవడంతో...ముఖ్యమైన స్థానాలను ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. ఇంకా ఢిల్లీలో కసరత్తు జరగుతూనే ఉంది. నేతలు హస్తినలోనే మకాం వేశారు. దసరా పండగ కూడా ఈసారి నేతలకు లేకుండా పోయింది. ఏఐసీసీ భవన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమ అనుచరులతో వెళ్లి కొందరు అక్కడ ఆందోళనకు కూడా దిగుతున్నారు. చివరి నిమిషంలోనైనా పార్టీ హైకమాండ్ మనసు మార్చే ప్రయత్నం మరికొందరు చేస్తున్నారు. నెల రోజులలో నియోజకవర్గమంతటా తిరగాలంటే అభ్యర్థులకు కష్టమవుతుంది. ఎన్నికలంటే కేవలం ప్రచారం మాత్రమే కాదు. ప్రచార సామాగ్రిని సిద్ధం చేసుకోవడంతో పాటు ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది. పనంతా పెండింగ్లోనే...ముఖ్యమైన కార్యకర్తలను బూత్ ల వారీగా గుర్తించి, నమ్మకమైన వారిని నియమించుకోవాలి. అంత టైమ్ ఉంటుందా? సమయం లేకుండా హైకమాండ్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు తప్పవన్న కామెంట్స్ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. రెండో విడతలో పూర్తి స్థాయిలో స్థానాలను ప్రకటించాలని నేతలు కోరుతున్నారు. లేకుండా మలి విడతగా మళ్లీ మరో జాబితా అంటే ఇక సమయం ఉండదని చెబుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ అన్ని సర్వేల్లో ముందంజలో ఉన్నప్పటికీ అభ్యర్థుల ఖరారు విషయంలో మాత్రం వెనకబడి పోయిందనే చెప్పాలి. మరి ఈరోజు, రేపట్లోనైనా పూర్తి స్థాయి జాబితా వస్తుందని నేతలు భావిస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/త్రివిక్రమ్-కి-నచ్చిన-హీ-49346/ | ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా పూజ కార్యక్రమాలతో ఒక మంచి ముహూర్తాన మొదలైపోయింది. కానీ సినిమా మాత్రం కొంచెం లెట్ గానే సెట్స్ మీదకెళుతుంది. త్రివిక్రమ్.. పవన్ సినిమా పూర్తవగానే ఎన్టీఆర్ సినిమాతో సెట్స్ మీదకెళతాడు. ఈ మధ్యలో త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమా కోసం నటీనటుల ఎంపిక, ప్రి ప్రొడక్షన్ పనులను చక్కబెట్టస్తాడట. అయితే ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్.... అను ఇమ్మాన్యువల్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నాడని ప్రచారం బాగా జరిగింది. కానీ ఎన్టీఆర్ పక్కన అను కాదు డీజే భామ పూజ హెగ్డే అన్నారు. ఇక పూజ హెగ్డే, ఎన్టీఆర్ హీరోయిన్ గా ఫైనల్ అన్నారు. ఇలా ఎన్టీఆర్ పక్కన చాలామంది హీరోయిన్స్ ప్రచారంలోకి రాగా... ఇప్పుడు కొత్తగా త్రివిక్రమ్ మరో హీరోయిన్ ని ఎన్టీఆర్ కోసం తెగ ట్రై చేస్తున్నాడంటున్నారు.అవునా... నిజమా?మరి త్రివిక్రమ్ కి అంతగా నచ్చిన హీరోయిన్ ఎవరో కాదు... కృష్ణగాడి గర్ల్ ఫ్రెండ్ మెహ్రీన్ కౌర్. వరుసగా మూడు సినిమాల విజయంతో దూసుకుపోతున్న మెహ్రీన్ కౌర్ ని తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ భావించి ఆమెని సంప్రదించగా... మెహ్రీన్ డైరీ ఫుల్ అవడంతో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో నటించడానికి తన దగ్గర డేట్స్ లేవని చెప్పిందట. కానీ త్రివిక్రమ్, మెహ్రీన్ నే ఎన్టీఆర్ కోసం కావాలని పట్టుబట్టి మరి మెహ్రీన్ కి ఫోన్ మీద ఫోన్స్ చేస్తున్నాడట. మరి ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతో జోడి కట్టిన మెహ్రీన్ కి ఎన్టీఆర్ పక్కన నటిస్తే హీరోయిన్ గా నిలదొక్కుకోవచ్చని ఉన్నా కూడా ఆమెకున్న బిజీ షెడ్యూల్ మూలంగా నో చెప్పిందట.డేట్లు అడ్జెస్ట్ చేసి...అయితే త్రివిక్రమ్ ఎక్కువసార్లు ఫోన్ చేసి అడగడంతో ఈ ముద్దుగుమ్మ తన డేట్స్ అడ్జెస్ట్ చేసి మరి త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందని టాక్ వినబడుతుంది. అయితే మెహ్రీన్, ఎన్టీఆర్ సినిమాలో నటించే విషయం త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా తెలియజేస్తారట. ఇకపోతే ఇప్పటికే హిట్స్ మీదున్న మెహ్రీన్ కి సన్నాఫ్ సూర్య తో ఎదురు దెబ్బ తగిలింది. అయినా ఆమె నటించిన జవాన్ విడుదలకు సిద్ధం గా ఉండగా... సంఘం సినిమా చేతిలో ఉంది. |
https://www.telugupost.com/movie-news/nani-taking-clases-to-diriector-indraganti-mohan-krishna-127540/ | నాని ని ఇంద్రగంటి మోహన కృష్ణ అష్టాచమ్మతో హీరో ని చేసాడు. నాని ఒకే ఒక్క సినిమాతో హీరోగా నేచురల్ స్టార్ అవతారమెత్తాడు. మధ్యలో మాస్ వెంటబడిన నాని ప్లాప్స్ లో కొట్టుకుపోయాడు. కానీ గత కొన్నేళ్లుగా కథల ఎంపిక లో నాని చూపిస్తున్న వేరియేషన్స్ తో నాని వరస హిట్స్ అందుకున్నాడు. ఎంతో ఇష్టపడి చేసిన కృష్ణార్జున యుద్ధం ఫలితం తారుమారవడం, జెర్సీ సినిమాకి బ్లాక్ బస్టర్ టాకొచ్చినా.. కలెక్షన్స్ రాకపోవడంతో.. ఇప్పుడు నాని తన తదుపరి చిత్రాలు మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. విలన్ గా…. విక్రమ్ కుమార్ తో గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్న నాని ఆ సినిమాని ఆగష్టు 30 న విడుదల చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. విక్రమ్ కుమార్ గ్యాంగ్ లీడర్ షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఇక నాని మొదటిసారిగా ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చెయ్యబోతున్నాడు. అది కూడా తనకి లైఫ్ ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ వ్ సినిమాలో. సుధీర్ బాబు హీరోగా అదితి రావు, నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నఈ సినిమాలో నాని విలన్ రోల్ చెయ్యబోతున్నాడు. గెస్ట్ రోల్ అన్నప్పటికీ…. మొదట్లో గెస్ట్ రోల్ అన్నప్పటికీ. సినిమా మొత్తం నాని రోల్ ఉండబోతుంది. అయితే ఈ సినిమా కొంతమేర షూటింగ్ జరిగిన తర్వాత తన సీన్స్ కన్నా ఎక్కువగా సుధీర్ బాబు సీన్స్ సినిమాలో హైలెట్ అనేలా అనిపించడంతో… నాని ఈ సినిమా షూటింగ్ అపి మరీ ఇంద్రగంటి మోహనకృష్ణ తో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని సూచించాడట. మరి విలన్ గా చేసినా కూడా ఆ పాత్ర కి ఎంత ప్రాధాన్యత లేకపోతే నాని ఒప్పుకున్నాడో అనుకున్నారు. మరి తన పాత్ర కి ప్రాధాన్యత తగ్గితే ఓ సక్సెస్ ఫుల్ హీరో ఊరుకుంటాడా.. అందుకే తనకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కే నాని పాఠాలు చెబుతున్నాడు. |
https://www.telugupost.com/crime/it-is-three-years-since-the-murder-of-former-minister-ys-vivekananda-reddy-he-was-murdered-on-march-15-2019-1359570 | మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి మూడేళ్లవుతుంది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగింది. పులివెందులలోని ఆయన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఈ హత్య మిస్టరీగా మారింది. 2019 సాధారణ ఎన్నికలకు ముందు ఈ హత్య జరగడంతో అప్పట్లో సంచలనమే అయింది. టీడీపీ అధికారంలో ఉండటంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేశారు.సీబీఐ దర్యాప్తుతో....జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మరో టీం ను విచారణ కోసం ఏర్పాటు చేశారు. అయితే హత్యకు గల కారణాలు, నిందితులు ఎవరో తెలియకపోవడంతో వివేకా కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తును కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.రాజకీయంగా....బెంగళూరులోని ఒక ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలోనే ఈ హత్య జరిగినట్లు సీబీఐ ఒక నిర్థారణకు వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. నిందితుడు దస్తగిరిని అప్రూవర్ గా మారాడు. అయితే ఇటీవల ఈ హత్య కేసు రాజకీయంగా అనేక మలుపులు తిరుగుతోంది. మొత్తం మీద వైఎస్ వివేకా హత్య జరిగి మూడేళ్లవుతున్నా హత్య విషయంలో ఇంకా ఒక స్పష్టత రాకపోవడం విశేషం. |
https://www.telugupost.com/movie-news/జూన్-2న-రాజ్తరుణ్-అంధగ-31860/ | మల్టీ టాలెంటెడ్, ఎనర్జిటిక్ యాక్టర్ రాజ్తరుణ్ పుట్టినరోజు నేడే(మే 11). ఇప్పుడు రాజ్తరుణ్ 'అంధగాడు'గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ 'అంధగాడు' ప్రముఖ రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈచిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈడోరకం-ఆడోరకం, కుమారి 21ఎఫ్ వంటి హిట్ చిత్రాలు తర్వాత రాజ్తరుణ్, హెబ్బాపటేల్ హిట్ కాంబినేషన్లో రిపీట్ అవుతుంది. . రాజ్తరుణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ 'అంధగాడు' మూవీ పోస్టర్ను విడుదల చేశారు. భవిష్యత్లో ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో అసోసియేట్ కానున్నారు.డిఫరెంట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రాజ్తరుణ్కు హ్యాట్రిక్ హిట్ మూవీ అవుతుంది. రాజ్తరుణ్ పుట్టినరోజు సందర్భంగా 'దెబ్బకు పోయే పోయే..' అనే సాంగ్ టీజర్ను విడుదల చేశారు. ఈ సాంగ్ టీజర్కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన సాంగ్స్ను సోషల్ మీడియా, ఎఫ్.ఎం. రేడియో స్టేషన్స్లో విడుదల చేయనున్నారు. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షను నిర్వహించి జూన్ 2న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/అక్కినేని-వారసులకు-రెండవ-14595/ | అక్కినేని మూడవ తరం వారసులు కథానాయకులుగా బిజీ అయిపోయారు. అక్కినేని నాగ చైతన్య తొలి చిత్రం జోష్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో భారీ అంచనాల మధ్యన విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. కానీ జోష్ చిత్రానికి కనెక్ట్ ఐన యూత్ కొందరు ఉండటం విశేషం. చైతు తదుపరి చిత్రం ఏ మాయ చేసావే గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో చైతూకి తొలి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది.అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని తొలి చిత్రం మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో మితిమీరిన అంచనాలు, భారీ ప్రచారాల నడుమ విడుదలై అఖిల్ అక్కినేని కి జీవిత కాలం మర్చిపోలేని చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. నాటి నుంచి తన రెండవ చిత్ర కథ నిర్ణయం పై అనేక తర్జన భర్జనలు పడుతూనే వున్నాడు అఖిల్ అక్కినేని. తాజాగా మనం ఫేమ్ విక్రమ్ చెప్పిన కథ ను అంగీకరించాడు. కాగా దర్శకుడు విక్రమ్ ఈ చిత్రం సంగీతానికి రెహ్మాన్ తో సంప్రదింపులు జరుపుతున్నాడు. తొలి చిత్ర వైఫల్యం తరువాత ఆకలి మీద వున్నా అఖిల్ కు అన్న చైతు తరహాలో రెహమాన్ సంగీతం రెండవ సినిమా సెంటిమెంట్ ను నిలుపుతుందో లేదో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/kalyan-ram-sudheer-babu-movie-75700/ | ఈ వారం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ సపోర్ట్ తో నా నువ్వే అంటూ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ నా నువ్వే ని ప్రేక్షకులే కాదు క్రిటిక్స్ కూడా తిరస్కరించారు. కళ్యాణ్ రామ్ పదేళ్ల క్రితం చెయ్యాల్సిన సినిమా ని ఇప్పుడు చేసాడని... అవుట్ డేటెడ్ దర్శకుడిని నమ్ముకుని కళ్యాణ్ రామ్ చేసిన తప్పే మళ్ళీ చేసాడని అన్నారు. ఇక తమన్నా అందాలు కూడా సినిమాని కాపాడలేని పరిస్థితి. ఇక ఇదే వారం అంటే నిన్న శుక్రవారం మహేష్ బాబు బావ సుధీర్ బాబు మహేష్ సపోర్ట్ తో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో... అదితి రావు తో కలిసి సమ్మోహనం అంటూ థియేటర్స్ లో దిగిపోయాడు. అయితే సుధీర్ బాబు సమ్మోహనం అందరిని సమ్మోహన పరిచేసింది. క్లాస్ ప్రేక్షకులకు నచ్చే సినిమానే అయినా... క్రిటిక్స్ నుండి ప్రేక్షకుల నుండి కూడా సమ్మోవాహనం మంచి మార్కులే వేయించుకుంది.సుధీర్ బాబు సమ్మోహనం సినిమాలో బాగా నటించాడని... మంచి బాడీ బిల్డింగ్ తో ఇరగదీశాడని... ఇంకా అదితి రావు కూడా ఈ సినిమా విజయంలో పాలు పంచుకుందని... అదితి అందాలు, సీనియర్ నరేష్ కామెడీ సమ్మోహనం మెయిన్ హైలెట్ గా ప్రేక్షకులు సమ్మోహనం సినిమాకి పాజిటివ్ టాక్ ఇచ్చేసారు. భలే మంచి రోజు, శమంతకమణి తో ఓ మాదిరి విజయాలను సొంతం చేసుకున్న సుధీర్ బాబు కి ఈ సినిమా హిట్ ఊరటనిచ్చింది. గత వారం రోజులనుండి థియేటర్ లలో మంచి సినిమాలు లేక బోర్ ఫీల్ అవుతున్న ప్రేక్షకులకు సమ్మోహనం సినిమా కాస్త ఊరటనిచ్చింది.కాలా సినిమా కూడా ప్రేక్షకులు కొత్త సినిమా కోసం ఎదురు చూసేలా చేసింది. ఇక మంచి టైం లో కళ్యాణ్ రామ్ తో పోటీకి సై అన్న సుధీర్ బాబు ఈ పోటీలో పై చెయ్యి సాధించాడు. నా నువ్వే ని ప్రేక్షకులు రిజెక్ట్ చేసి.. సమ్మోహనాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్ లో సమ్మోహనంతో మంచిఓపెనింగ్స్ తెచ్చుకున్నాడు. సుధీర్ బాబు విజయాన్ని సాధించడానికి మెయిన్ కారణం దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. ఇంద్రగంటి తన సినిమాల్లో కథ కథనం అన్ని బలంగా ఉండేలా చూసడుకుంటాడు. అష్టాచెమ్మ, జెంటిల్మెన్, అమీ తుమీ ఇలా అన్ని సినిమాల్లోనూ ఇంద్రగంటి మార్క్ కనబడినట్లే ... సమ్మోహనం లోను ఇంద్రగంటి మార్క్ స్పష్టంగా కనబడుతుంది. |
https://www.telugupost.com/movie-news/rakul-gave-her-the-red-dress-she-was-wearing-134889/ | రకుల్ కి అవకాశాలు లేవని ఆమె అభిమానులు కంగారు పడుతూ బాధపడుతున్నారు కానీ.. రకుల్ మాత్రం ఎలాంటి బాధ పడుతున్నట్లుగా కనిపించడం లేదు. నిన్న రకుల్ ప్రీత్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో భాగంగా బాలీవుడ్ నటి మలైకా అరోరా తనకు విసిరిన ఛాలెంజ్ ను తాను పూర్తి చేశానని… ఇదే ఛాలెంజ్ ను మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, అజయ్ దేవగణ్, రానా దగ్గుబాటి, మోహన్ శక్తిలకు విసురుతున్నానని తెలిపింది. మరి వారి ఫిట్నెట్ మూవ్స్ ను చూపించాలని ఛాలెంజ్ చేసింది. ఇక తాజాగా రకుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాటెస్ట్ ఫొటోస్ చూస్తే మతి పోవాల్సిందే. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గానని మరోసారి ఈ హాట్ లుక్ తో రకుల్ చూపించింది. ఇరగదీసిన రకుల్… క్లివేజ్ అందాలతో… హాట్ లుక్ తో మత్తెక్కించే చూపుతో.. రకుల్ ని చూస్తుంటే… అబ్బ పోరి భలే గా వుంది అంటారు. రకుల్ అందాలతో ఆమె వేసుకున్న ఆ రెడ్ డ్రెస్సుకే అందమొచ్చింది. ఎలాంటి అచ్చేదన లేకుండా అలా కసిగా రెడ్ హాట్ చూపులతో చూస్తున్న రకుల్ చూపుల గాలానికి కుర్రాళ్ళు చిక్కడం ఖాయం. ఎప్పుడూ అందాల ఆరబోతకు అడ్డు చెప్పని రకుల్ ఈమధ్యన మరిన్ని అందాలతో అందరికి విందు చేస్తుంది. హీరోయిన్ అంటే హాట్ గా ఉండాలని రకుల్ ని చూసి అందరూ నేర్చుకోవాల్సిందే. |
https://www.telugupost.com/movie-news/krish-pawan-heroine-177688/ | పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబోలో తెరకెక్కనున్న జానపద చిత్రం షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఈ నెలలోనే మొదలవ్వాల్సి ఉండగా.. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్స్ వలన జనవరి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ వల్ల సినిమా లేట్ అవడం కన్నా ఇప్పుడు పవన్ సినిమా కోసం క్రిష్ వేయించిన సెట్స్ నిర్మాణం మళ్ళీ చేపట్టిన కారణంగానే క్రిష్ – పవన్ సినిమా లేట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ చేసే సినిమా కోసం క్రిష్ ఫిబ్రవరిలోనే అల్యూమినియం ఫ్యాకటరీలో ఓ సెట్ ని నిర్మించగా అది ఇప్పుడు లాక్ డౌన్ వల్ల వాడకపోవడం, అలాగే భారీ వర్షాలకు సెట్ నిర్మాణం దెబ్బతినడంతో.. మళ్ళీ ఆ సెట్ నిర్మాణం చేపట్టినట్టుగా తెలుస్తుంది. అందుకే క్రిష్ తో పవన్ సినిమా కొద్దిగా లేట్ అవుతుందట. మరోపక్క క్రిష్ పవన్ సినిమాలో నటించబోయే హీరోయిన్ వేటలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ముందు రకుల్ ప్రీత్ నే హీరోయిన్ గా అనుకున్నారు. అందుకే క్రిష్ వైష్ణవ తేజ్ సినిమాలో రకుల్ ని తీసుకున్నాడనే టాక్ నడిచింది. అయితే క్రిష్ పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా కోసం రకుల్ ప్రీత్ ని అనుకోలేదట. ఎందుకంటే రకుల్ ప్రీత్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడమే కాదు.. తెలుగులోనూ రెండు సినిమాలు చేస్తుంది. అందుకే రకుల్ ని అసలు క్రిష్ పవన్ సినిమా కోసం సంప్రదించలేదట. మరి పవన్ కళ్యాణ్ సినిమా కోసం క్రిష్ ఏ భామని తీసుకొస్తాడో గాని.. ఈ సినిమాలో అయితే రకుల్ కాదంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/venkatesh-nagachaitanya-venkymama-collections-142695/ | శుక్రవారం విడుదలైన వెంకిమామ శుక్ర, శని, ఆదివారాల్లో కలెక్షన్స్ కుమ్ముడే కుమ్ముడు. ఈ మూడు రోజుల కలెక్షన్స్ తో వెంకిమామ చాలా వరకు సేఫ్. మూడు రోజులు కలెక్షన్స్ చూసిన ట్రేడ్ వర్గాలు వెంకిమామ కి తొందరగానే బ్రేక్ ఈవెన్ చేరుతుందని అంచనా వేశారు. కానీ వీక్ డేస్ లో వెంకిమామ కలెక్షన్స్ డ్రాప్ కనబడుతుంది. మండే వెంకిమామ వసూళ్లు బాగా పడిపోయాయి. థియేటర్స్ లో ప్రేక్షకులు కూడా చాలా పల్చగా కనబడ్డారు. దీనితో సోమవారం వెంకిమామ రెండున్నర కోట్ల తోనే సరిపెట్టుకుని.. మొత్తం నాలుగు రోజులకు గాను రెండు రాష్ట్రాల్లో వెంకిమామ 19.44 వసూళ్లు కొల్లగొట్టింది. ఏరియా: షేర్ (కోట్లలో) నైజాం 7.52 సీడెడ్ 3.34 నెల్లూరు 0.71 కృష్ణ 1.17 గుంటూరు 1.62 వైజాగ్ 2.60 ఈస్ట్ గోదావరి 1.57 వెస్ట్ గోదావరి 0.91 టోటల్ ఏపీ & టీస్ షేర్: 19.44 |
https://www.telugupost.com/movie-news/negative-comments-on-rakul-preeth-94107/ | గత కొంతకాలం నుండి రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎందుకో కనిపించడం మానేసింది. ఒక్కప్పుడు తెలుగులో స్టార్ట్ హీరోల సరసన నటించిన రకుల్ జోరు ఈ మధ్య తగ్గిపోయింది. ఇక్కడ సినిమాలు సక్సెస్ అవ్వకపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ అమ్మడుకు బాగానే కలిసొచ్చింది. గత ఏడాది కార్తీ సరసన 'ఖాకీ' సినిమాలో నటించింది. అక్కడ అది ఘన విజయం సాధించింది. దీంతో ఆమెకు కార్తీ మరో సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. అలానే సూర్య పక్కన 'ఆర్జికె' లో కూడా ఛాన్స్ కొట్టేసింది రకుల్. అంతేకాదు శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తుంది. ఇలా కోలీవుడ్ నుండి మంచి ఆఫర్స్ రకుల్ చేతిలో ఉన్నాయి. కోలీవుడే కాదు బాలీవుడ్ లో కూడా రకుల్ అజయ్ దేవగన్ సరసన 'దే దే ప్యార్ దే' లో ఛాన్స్ కొట్టేసింది.జీరో సైజ్ కోసం...అంతా బాగానే ఉంది కానీ రకుల్ శరీరంలో ఈ మధ్య విపరీతమైన మార్పు కనిపిస్తోంది. డైలీ గంటల తరపడి జిమ్ లో వర్కవుట్స్ చేయడం... దీంతో ఆమె మొహంలో గ్లో పోతోంది. జీరో సైజు కోసం ఈ బ్యూటీ మరీ పీలగా అవ్వడంతో అభిమానులకు నచ్చడం లేదు. సోషల్ మీడియాలో ఆమెపై నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. హీరోయిన్స్ కొద్దిగా బొద్దుగా ఉంటేనే మొహంలో గ్లోతో పాటు ఆకర్షణ ఉంటుంది. మరీ ఇలా ఉంటె ఆఫర్స్ రావడం కూడా కష్టమే. మరి రకుల్ ఏం చేస్తుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/after-disco-raja-ravi-teja-working-in-krack-cinema-146370/ | రవితేజ వరస ప్లాప్స్ తో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు అనుకుంటే పొరబాటే. ఎందుకంటే పారితోషకం విషయంలో ప్లాప్స్, డిజాస్టర్స్, హిట్స్ తో పనిలేకుండా డిమాండ్ చేస్తాడు. అవకాశం ఉంది ఇస్తారంటూ రెమ్యునరేషన్ లెక్కలు చెబుతాడు. ప్రస్తుతం నాలుగు ప్లాపులతో ఉన్న రవితేజ క్రాక్ సినిమా చేస్తున్నాడు. శృతి హాసన్ తో కలిసి నటిస్తున్న క్రాక్ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం బయటికొచ్చిన క్రాక్ పోస్టర్స్ చూస్తే రవితేజ మల్లి ఫామ్ లోకి రావడం ఖాయంగా కనబడుతుంది. అయితే తాజాగా క్రాక్ సినిమా తమిళ సినిమాకి ఫ్రీమేక్ అంటూ ప్రచారం మొదలైంది. హిట్స్ లేని రవితేజ ఈసారి ఫ్రీమేక్ ని నమ్ముకున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయ్యింది. రవితేజ – గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న క్రాక్ సినిమా తమిళ సేతుపతికి ఫ్రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది. తమిళ సేతుపతి కథకి, క్రాక్ సినిమా కథకి దగ్గర పోలికలు ఉన్నాయని అంటున్నారు. అయితే తమిళ సేతుపతి ని గతంలోనే గంటా శ్రీనివాస్ కొడుకు తెలుగులో జయదేవ్ అంటూ రీమేక్ చేసి ప్లాప్ కొట్టాడు. మల్లి అదే సినిమాకి ఫ్రీమేక్ అంటే… కాస్త ఆలోచించదగిన విషయమే. అయితే సేతుపతి కథని రవితేజ పర్సనాలిటి సరిపోయే రీతిలో స్రిప్ట్ రాసుకుని.. ఈ సినిమాని గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. |
https://www.telugupost.com/movie-news/daggubati-rana-follows-rajamouli-103504/ | మొన్నటివరకు టాలీవుడ్ లో కామెడీ హర్రర్స్ ట్రెండ్ అయితే నిన్నటివరకు బయోపిక్స్ ట్రేడ్ గా నడిచాయి. ఇక రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ కూడా మారి కొత్త ట్రేడ్ కు శ్రీకారం చుట్టున్నారు మేకర్స్. అదే పీరియాడిక్ మూవీస్. మనకి ఇవేమి కొత్త కాదు. రీసెంట్ గా #RRR కూడా పీరియాడిక్ కథతోనే తెరకెక్కుతుంది. ఇప్పుడు మరో సినిమా కూడా పీరియాడిక్ కథతో రూపొందనుంది. రానా హీరోగా….. ఇందులో ఎటువంటి అబద్దం లేదు. ఇది నిజం. దగ్గుబాటి రానా హీరో గా ఓ పీరియాడిక్ కథ త్వరలోనే తెరకెక్కనుంది. ఈ విషయాన్ని దర్శకుడు వేణు ఉడుగుల స్పష్టంచేశాడు. ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో పాపులర్ అయిన ఈ డైరక్టర్.. విరాటపర్వం సినిమా 50 ఏళ్ల టైమ్ గ్యాప్ లో జరుగుతుందని చెబుతున్నాడు. శర్వా ఏం చెప్పకపోవడంతో…. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలిసినా అది పీరియాడిక్ మూవీ అని ఎవరికి తెలియదు. ఇప్పటివరకు వచ్చిన పీరియాడిక్ సినిమాలకు భిన్నంగా ఇది ఉంటుందని చెబుతున్నారు. రానా కి జోడిగా సాయి పల్లవి ని సంప్రదిస్తునట్టు సమాచారం. ఆమె ఓకే చెప్పితే త్వరలోనే సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నారు. మొదట ఈసినిమాకి శర్వానంద్ ని అనుకున్నారు. కానీ శర్వా ఏ విషయమూ చెప్పకపోవడంతో ఇప్పుడు ఆ కథ రానా దగ్గరకు వెళ్ళింది. కథ విన్న రానా వెంటనే ఓకే చేసేసాడట. స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు ఫినిష్ అవ్వడంతో త్వరలోనే అధికారంగా అనౌన్స్ చేయనున్నారు అని తెలుస్తుంది. |
https://www.telugupost.com/movie-news/బన్నీ-నెక్ట్స్-సినిమా-ఆ-54279/ | టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఉరఫ్ బన్నీతో సినిమా చేసేందుకు చాలా మంది దర్శకులు కలలు కంటుంటారు. ఈ జాబితాలో చాంతాండంత లిస్ట్ ఉన్నా ఆ ఛాన్స్ మాత్రం తక్కువ మందికే వస్తుంది. డీజే సినిమాతో ఈ యేడాది యావరేజ్ను తన ఖాతాలో వేసుకున్న బన్నీ ప్రస్తుతం స్టార్ స్టోరీ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత బన్నీ సినిమా ఏ డైరెక్టర్తో ఉంటుందా ? అన్నదానిపై ఓ క్లారిటీ వచ్చినట్టే కనపడుతోంది. తాజాగా బన్నీ తమ్ముడు శిరీష్తో ఒక్క క్షణం సినిమా తీసి మంచి మార్కులు వేయించుకున్న వి ఐ.ఆనంద్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందని తెలుస్తోంది.బన్నీతో ఎప్పటి నుంచో సినిమాలు చేయాలనుకుంటున్న ఆనంద్ బన్నీ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో మధ్యలో గ్యాప్లో శిరీష్తో ఒక్క క్షణం సినిమా చేశాడు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా వస్తున్నాయి. సినిమా టాక్ బట్టి బన్నీ కూడా ఆనంద్ పనితీరు పట్ల ఇంప్రెస్ అయ్యాడట. బన్నీతో ముందు నుంచి అనుకున్న కథతోనే ఆనంద్ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు నిర్మాత ఎవరు ? ఇతర సాంకేతిక నిపుణులు ఎవరు అన్నది ? త్వరలోనే వెల్లడయ్యే ఛాన్సులు ఉన్నాయి. |
https://www.telugupost.com/movie-news/ntr-heroine-74761/ | టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కి పెద్దగా పేరుండదనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఎక్కడో ఒకటీ, అర హీరోయిన్స్ మాత్రమే నిలదొక్కుకుని చక్రం తిప్పారు. కానీ, తెలుగమ్మాయిలకు అందం తక్కువో, అభినయం రాదనో తెలియదు గానీ దర్శక నిర్మాతలెప్పుడు పరభాషా హీరోయిన్స్ మీదే మోజుపడతారు. అంతేలే తెలుగు హీరోయిన్స్ ని పెట్టి సినిమాలు చేస్తే తెలుగు ప్రేక్షకులు కనికరించరనేది వారి వాదన. ఇకపోతే తెలుగమ్మాయిగా 'అమీతుమీ, అ' వంటి సినిమాల్లో నటించిన ఈషా రెబ్బకి టాలీవుడ్ లో ఇప్పటివరకు బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలు హిట్ అయినా అమ్మడుకి మాత్రం పేరు రాలేదు.ఎన్టీఆర్ పై ప్రశంసలు....ప్రస్తుతం త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న 'అరవింద సమేత - వీర రాఘవ' సినిమా లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. 'అరవింద సమేత'లో పూజ హెగ్డే మెయిన్ లీడ్ రోల్ నటిస్తుంది. ఇకపోతే 'అరవింద సమేత' షూటింగ్ లో పాల్గొన్న ఈషా రెబ్బ ఆ సినిమా ముచ్చట్లను కథలు కథలు గా చెబుతున్నది. 'అరవింద సామెత'లో తనకు ఒక డిఫరెంట్ రోల్ దొరికిందని, ఇలాంటి పాత్రలు చెయ్యడం తనకి ఛాలెంజ్ అని చెబుతుంది. అలాగే ఈ పాత్రకి తనని ఎంపిక చేసినందుకు గానూ త్రివిక్రమ్ కి థాంక్స్ చెప్పడమే కాదు పనిలోపనిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తెగ పొగిడేస్తోంది. సరదాగా ఉంటారు...'అరవింద సమేత' సెట్స్లో ఎన్టీఆర్తో కలిసి పని చేయడం యాగ్జయింటింగ్గా ఉందని, ఎన్టీఆర్ ని, అతని ఎనర్జీని ‘విద్యుత్ ప్రవహించే ఓ లైవ్ వైర్’ అంటూ ఆకాశానికెత్తేస్తుంది ఈ అమ్మడు. ఎన్టీఆర్ ఎనర్జీతో సమానంగా పని చెయ్యడం అనేది మాటలు కాదని ఎన్టీఆర్ ని పొగడడమే కాదు, ఎన్టీఆర్ 'అరవింద సమేత' సెట్స్ లో అందరితో ఫన్నీ గా ఉంటారని చెబుతుంది. అలాగే చిత్ర యూనిట్ మొత్తం సరదాగా జోకులు వేసుకుంటూ హాయిగా పనిచేస్తుంటామని కూడా చెబుతుంది ఈషా రెబ్బ. |
https://www.telugupost.com/movie-news/megastar-chiranjeevi-to-host-big-boss-season-4-139316/ | తెలుగు బిగ్ బాస్ సీజన్ సీజన్ కి వ్యాఖ్యాతలు మారిపోతూనే ఉన్నారు. సీజన్ 1 కి ఎన్టీఆర్, 2 కి నాని, రీసెంట్ గా ముగిసిన 3 కి నాగార్జున హోస్టింగ్ చేశారు. ఇక అప్పుడే బిగ్ బాస్ సీజన్ 4 హోస్టింగ్ ఎవరు చేస్తే బావుండు అనే దానిమీద అప్పుడే సోషల్ మీడియాలో రకరకాల పేర్లు ప్రచారంలోకొచ్చేశాయి. అయితే అందరిలో ఎక్కువగా చిరంజీకి పేరు వినబడుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద చిరంజీవి ఇచ్చిన స్పీచ్, కామెడీ, హావభావాలు అందరూ ముగ్దులవుతున్నారు. కంటెస్టెంట్స్ తో చిరు ప్రవర్తించిన తీరుకు అందరూ చిరు హోస్టింగ్ మీద మనసు పాడేసుకుంటున్నారు. అంతలా చిరు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో స్పషల్ గెస్ట్ గా మెప్పించాడు. అందుకే సీజన్ 4 కి చిరు పేరే హైలెట్ అవుతుంది. మరి చిరు దానికి ఒప్పుకుంటాడో లేదో అనేది… తెలియలంటే చాలా సమయమే పడుతుంది. అయితే చిరంజీవి ఒప్పుకోకపోవటానికి కూడా కారణాలున్నాయి. ఎన్టీఆర్ ఎంతో హుందాగా హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 కి, సీజన్ 2 విషయానికొచ్చేసరికి…నానిని సోషల్ మీడియా లో తెగ ట్రోల్ చేశారు. ఇక సీజన్ 3 కి నాగార్జున కూడా చివరిలో ట్రోల్ కి గురైయ్యాడు. మరి కాంట్రవర్సీలకు వేదికగా మారిన బిగ్ బాస్ హోస్టింగ్ కి చిరు సై అంటాడా.. లేదంటే నో చెబుతాడో అంటూ వార్తలొస్తున్నాయి |
https://www.telugupost.com/movie-news/vakeel-saab-amazon-prime-189120/ | గత శుక్రవారం థియేటర్స్ లో విడుదలైన వకీల్ సాబ్ థియేటర్స్ దుమ్ముదులుపుతుంది. బాక్సాఫీసుని షేక్ చేస్తుంది. గత మూడు నెలలుగా ఓ మాదిరి సినిమాలే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాయి. ఈ మూడు నెలల్లో ఓ భారీ బడ్జెట్ మూవీ రావడం ఇదే తొలిసారి కావడం, అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో వకీల్ సాబ్ పై అందరిలో క్యూరియాసిటీ, అలాగే ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడ్డాయి. అందులోను రిలీజ్ అయిన ఫస్ట్ షో కే సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, సోషల్ మీడియాలో మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో వకీల్ సాబ్ వసూళ్ల పరంగాను అదరగొట్టేస్తుంది. వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 36 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరోవైపు ఓవర్సీస్ ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్క్ను క్రాస్ చేసింది.ఇక అద్భుతంగా థియేటర్స్ లో దూసుకుపోతున్న వకీల్ సాబ్ ని చూడడానికి ప్రేక్షకులు కరోనని కూడా లెక్క చెయ్యకపోవడం గమనార్హం. కరోనా సెకండ్ వెవ్ ఉధృతంగా ఉన్న టైం లోను వకీల్ సాబ్ థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం గనక వకీల్ సాబ్ సినిమాకి రేట్లు పెంచకుండా ఇబ్బందులకు గురి చేసినా పవర్ స్టార్ ప్రభంజనం ఆగలేదు. ఇకపోతే ఇంత పెద్ద హిట్ అయిన వకీల్ సాబ్ ని అమెజాన్ ప్రైమ్ 30 కోట్లకి దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి లాక్ డౌన్ లోనే అమెజాన్ వారు 100 కోట్ల ఆఫర్ ఇవ్వగా దిల్ రాజు మాత్రం వకీల్ సాబ్ ని ఎట్టి పరిస్తితుల్లో థియేటర్స్ లో విడుదల చేస్తామని పట్టుబట్టి బట్టి హిట్ కొట్టాడు.తాజాగా అమెజాన్ ప్రైమ్ తో డీల్ పూర్తయిన వకీల్ సాబ్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 23న అమెజాన్ ప్రైమ్లో ప్రసారం కానుందని తెలుస్తోంది. |
https://www.telugupost.com/movie-news/mahesh-babu-guntur-kaaram-story-is-first-go-to-ntr-hands-news-viral-1514902 | NTR : మహేష్ బాబుని పక్కా మాస్ రోల్ లో చూపిస్తూ త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం 'గుంటూరు కారం'. ఈరోజు జనవరి 12న భారీ అంచనాలు మధ్య రిలీజైన ఈ సినిమా.. ఆ అంచనాలను అందుకోవడంలో తడబడిందని చెబుతున్నారు. మూవీ మొత్తాన్ని మహేష్ ముందుండి నడిపించినప్పటికీ.. కథలో దమ్ము లేకపోవడంతో థియేటర్ లో నిరాశ కలిగిస్తుంది. దీంతో మహేష్ అభిమానులు త్రివిక్రమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు వేస్తున్నారు.మరో పక్క ఎన్టీఆర్ అభిమానులు సంతోషం పోస్టులు వేస్తున్నారు. అయితే వారు సంతోష పడుతుంది.. మహేష్ సినిమా ప్లాప్ టాక్ ని సొంతం చేసుకున్నందుకు కాదు, ఆ సినిమాని ఎన్టీఆర్ వదులుకున్నందుకు. గుంటూరు కారం సినిమాని ముందుగా ఎన్టీఆర్ తోనే అనుకున్నారట త్రివిక్రమ్. 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సక్సెస్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.త్రివిక్రమ్ 'అల వైకుంఠపురంలో' తెరకెక్కిస్తున్న సమయంలో.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ టైటిల్ కూడా అప్పటిలో బయటకి వచ్చింది. 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ తో ఓ పొలిటికల్ టచ్ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో పట్టాలు ఎక్కలేదు. అయితే ఆ కథనే త్రివిక్రమ్.. అటు ఇటు మార్చి మహేష్ తో గుంటూరు కారం చేశారని ఇప్పుడు గట్టిగా టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా కథ అంతా పొలిటికల్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. అధికారంలోకి రావడం కోసం సొంత కూతురి కొడుకుని, భర్తని దూరం చేసిన తండ్రి. అలా అమ్మకి దూరంగా పెరిగిన కొడుకు.. పొలిటికల్ గేమ్ లో భాగంగా మళ్ళీ ఆ కుటుంబంలోకి ఎలా వచ్చాడు అనే స్టోరీ లైన్ తో సినిమా సాగుతుంది. మహేష్ క్యారెక్టర్ కూడా మాస్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎన్టీఆర్ కోసమే అలా డిజైన్ చేసి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా, గుంటూరు కారం ఒకటేనా అనేది తెలియాల్సి ఉంది. |
https://www.telugupost.com/crime/a-major-fire-broke-out-in-delhi-seven-people-were-burnt-alive-in-an-accident-in-a-slum-1359078 | ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మురికివాడలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఢిల్లీలోని గోకుల్ పురిలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు రేగడంతో పూరి గుడెసెల్లో ఉన్నవారంతా బయటకు పరుగులు తీశారు. 60 గుడెసెలు అగ్నికి ఆహుతయ్యాయి.మంటలు అదుపులోకి...మరికొందరు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు తెలిసింది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శకటాలు ప్రయత్నాలు చేస్తున్ానయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. |
https://www.telugupost.com/andhra-pradesh/pre-election-changes-in-ysr-congress-party-are-now-troubling-the-leaders-leaders-are-waiting-for-partdy-chief-ys-jagans-decision-1547156 | వైఎస్సార్సీపీలో ఎన్నికలకు ముందు జరిగిన మార్పులు ఇప్పుడు నేతలను ఇబ్బంది పెడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా స్పష్టత లేకపోవడంతో వారంతా ఇప్పుడు తాడేపల్లి జగన్ నివాసం వైపు చూస్తున్నారు. ఎవరు ఎక్కడ ఏం చేయాలో తెలియడం లేదు. నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జులుగా ఎవరు ఉండాలన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో అనేక నియోజకవర్గాల్లో పార్టీ నేతలు లేక క్యాడర్ ఇబ్బందులు పడుతుంది. ఎవరికి తమ బాధలు చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. ఇటీవల తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వైసీపీ క్యాడర్ ఈ విషయంపై నేరుగా జగన్ కు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.ఎన్నికలకు ముందు...ఎన్నికలకు ముందు అనేక మంది వైసీపీ నేతలను నియోజకవర్గాలను మార్చారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను మార్చారని అప్పట్లో వైసీపీ అధినేత జగన్ తెలిపారు. దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో ఈ మార్పులు చేర్పులు జరిగాయి. అప్పట్లో మంత్రులుగా ఉన్న వారిని, ఎమ్మెల్యేలను కూడా నియోజకవర్గాలను మార్చారు. దీంతో వారు కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేశారు. అయితే గత ఎన్నికలలో దాదాపు మార్చిన చోటంతా ఓటమి పాలయ్యారు. నియోజకవర్గాలను మార్చిన వారిలో ఏ ఒక్కరూ గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు. అయితే వీరంతా అయిష్టంగా తమ సొంత నియోజకవర్గాలను వదిలి అధినాయకత్వం కేటాయించిన నియోజకవర్గాలకు తాత్కాలికంగా వెళ్లారు.బదిలీ చేసిన చోటుకు...ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ వైపు వైసీపీ నేతలు చూడటం లేదు. ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గానికి యర్రగొండపాలెం లో 2019 ఎన్నికల్లో గెలిచిన ఆదిమూలం సురేష్ ను షిఫ్ట్ చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆయన కొండపికి దూరంగా ఉన్నారు. యర్రగొండపాలెంలో మాత్రం కొత్త అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వడంతో అక్కడ గెలిచారు. ఇక సంతనూతలపాడు నుంచి అప్పటి మంత్రి మేరుగ నాగార్జును ను పోటీ చేయించారు. వాస్తవానికి ఆయన గుంటూరు జిల్లా వేమూరు నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు వేమూరు నాగార్జున సంతనూతలపాడు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. 2019 లో పోటీ చేసి గెలిచిన సుధాకర్ కూడా ఆ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. దీంతో అక్కడ వైసీపీ ఇన్ఛార్జి ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతుంది.ఇన్ఛార్జులు లేక...ఇక గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయిన విడదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. ఆమె ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండటం లేదు. కనిగిరి నియోజకవర్గం నుంచి కందుకూరుకు బదిలీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ పరిస్థితి కూడా అంతే. ఆయన ఇప్పుడు బెంగళూరులో తన వ్యాపారాలను చూసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం నుంచి కంభాల జోగులును పాయకరావుపేటకు పంపారు. అక్కడ ఓడిపోవడంతో ఇటు రాజాం, అటు పాయకరావుపేటలను పట్టించుకునే నేత లేరు. ఇప్పటికైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గాల ఇన్ఛార్జుల విషయంలో స్పష్టత ఇవ్వాలని క్యాడర్ కోరుతుంది. |
https://www.telugupost.com/movie-news/bollywood-model-and-actor-siddhaanth-veer-passed-away-while-doing-workouts-at-gym-1447704 | బాలీవుడ్ లో విషాద ఘటన జరిగింది. జిమ్ చేస్తూ.. ప్రముఖ మోడల్, నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ (46) కన్నుమూశాడు. జిమ్ లో వర్కవుట్ చేస్తూ.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు సిద్ధాంత్. అతని మరణ వార్తతో బాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సిద్ధాంత్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కసౌతి జిందగీ కే సీరియల్ ద్వారా సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ పేరు సంపాదించుకున్నాడు.సీరియల్ లో నటించక ముందు.. అతని పేరు ఆనంద్ కాగా.. ఇటీవలే పేరు మార్చుకున్నాడు. సుఫియానా ఇష్క్ మేరా, జిద్ది దిల్ మానే నా , వారిస్, సాత్ ఫేరే సలోని కా సఫర్ వంటి సీరియల్స్ తో పాటు.. పలు టెలివిజన్ షోలలోనూ కనిపించాడు. చివరిసారిగా సిద్ధాంత్ జీ టీవీ షో కూ రిష్టన్ మే కట్టి బట్టిలో కనిపించాడు. సిద్ధాంత్ మృతి పట్ల బాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా.. గతేడాది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఇదే రీతిలో కన్నుమూశారు. |
https://www.telugupost.com/movie-news/పవన్-క్లాస్-పనిచేస్తుందా-25392/ | శృతి హాసన్ ఒకప్పుడు సౌత్ లో ఐరెన్ లెగ్ గా పేరు మోసింది. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేసిన 'గబ్బర్ సింగ్' తో ఆమెకు సుడి తిరిగి ఒక్కసారే గోల్డెన్ లెగ్ గా అవతారమెత్తింది. టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక అడపా దడపా బాలీవుడ్లోకి వెళ్ళొచ్చినప్పటికీ ఆమెకు సౌత్ లో వున్న క్రేజ్ మరెక్కడా లేదు. ఇప్పటికే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న శృతి హాసన్ ప్రస్తుతానికి టాలీవుడ్ లో పవన్ పక్కన 'కాటమరాయుడు'లో తమిళంలో తన తండ్రి చేస్తున్న 'శభాష్ నాయుడు'లో నటిస్తోంది.అయితే పవన్ తో 'గబ్బర్ సింగ్' సినిమా చేస్తున్నప్పుడే శృతి కి పవన్ అంటే అభిమానం ఏర్పడిపోయిందట. ఇక ఇప్పుడు ఎలాగూ ఇద్దరు కలిసి 'కాటమరాయుడు' చేస్తున్నారు కాబట్టి ఆ స్నేహం ఇంకా గట్టిపడిందని అంటున్నారు. ఇక ఆ స్నేహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ శృతి హాసన్ ఒక హిత బోధ చేసాడట. అదేమిటంటే ఏదో ఒక సందర్భంలో శృతి, పవన్ తో తానూ సౌత్ లో చేసే సినిమాలు మీద ఫోకస్ తగ్గించి బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారించాలని అనుకుంటున్నట్లు పవన్ తో చెప్పిందట. అయితే దానికి పవన్ శృతి కి క్లాస్ పీకినంత పని చేసాడట. బాలీవుడ్ కంటే సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ కాలం కెరీర్ ని కొనసాగించవచ్చని.... అదే బాలీవుడ్ లో అయితే కాంపిటీషన్ తట్టుకుని నిలబడడం మామూలు విషయం కాదని... అందుకే సౌత్ లో కెరీర్ ని బాగా మలచుకుంటే ఇక ఇబ్బంది ఉండదని చెప్పాడట.మరి పవన్ చెప్పిన మాటలు శృతి చెవికి ఎక్కించుకుందా? లేకపోతె ఇంకా బాలీవుడ్ మోజులోనే ఉందా? అనేది మాత్రం క్లారిటీ లేదు. మరి పవన్ ఆమెతో ఉన్న స్నేహం తోనే ఇలా చెప్పాడని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ చెప్పింది అక్షర సత్యం. ఇక్కడ సౌత్ లో దశాబ్ద కాలం పాటు ఏకఛత్రాధిపత్యంగా వెలుగొందేందుకు వీలుంది కానీ.... బాలీవుడ్ లో కేవలం గ్లామర్ షో చేసినంత వరకే కెరీర్ నిలబడుతుంది. |
https://www.telugupost.com/movie-news/నాగ్-వర్మ-మూవీ-టైటిల్-51550/ | సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ - నాగార్జున కలయికలో రూపొందుతున్న యాక్షన్ ఫిలిం పది రోజుల మొదటి షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ కోసం ముంబై చెక్కెయ్యడానికి హీరో నాగార్జున కోసం వెయిట్ చేస్తుంది. నాగ్ అఖిల్ హలో ఫిలిం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో వర్మ సినిమా షూటింగ్ కి కొంతమేర బ్రేక్ ఇచ్చాడు. శివ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇండస్ట్రీకి అందించిన ఈ కాంబినేషన్ మరలా రిపీట్ అవడంతో ఈ మూవీ కూడా ఒక క్రేజీ ప్రాజెక్ట్ అయ్యింది. మాఫియా బ్యాక్డ్రోప్ తో తెరకెక్కించనున్న ఈ మూవీలో నాగార్జున సరసన మైరా సరీన్ అనే కొత్తహీరోయిన్ ని ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించాడు వర్మ.ఇకపోతే వర్మ - నాగ్ సినిమాకి ఇప్పటివరకు టైటిల్ ని ఎనౌన్స్ చెయ్యలేదు. అయితే ఇప్పడు ఈ మూవీకి వర్మ రెండు టైటిల్స్ ని అనుకుంటున్నట్టుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే ఈ రెండు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ని వర్మ ఇప్పటికే రిజిస్టర్ చేయించాడు కూడా. అయితే ఆ ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ఏమిటంటే.. ఒకటి గన్, రెండు సిస్టమ్ అనే టైటిల్స్ ని వర్మ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. అయితే చిత్ర బృందం నుండి అందుతున్న సమాచారం ప్రకారం వర్మ - నాగ్ మూవీకి సిస్టమ్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లుగా చెబుతున్నారు. చిత్ర కథకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యే టైటిల్ సిస్టమ్ అని.. అందుకే వర్మ కూడా ఆ టైటిల్ కె మొగ్గు చూపుతున్నాడని టాక్. చూద్దాం ఫైనల్ గా నాగార్జున సినిమాకి వర్మ ఏ టైటిల్ ని తీసుకుంటాడో? |
https://www.telugupost.com/movie-news/pawan-political-movies-167844/ | పవన్ కళ్యాణ్ మూడు సినిమాల్తోనే ముగించేస్తాడనుకుంటే.. కొత్తగా సురేందర్ రెడ్డి మూవీని ప్రకటించి షాకిచ్చాడు. పవన్ బర్త్ డే రోజున పవన్ సినిమాలపై పక్కా క్లారిటీ వచ్చేసింది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటే సినిమాల షూటింగ్ చేయబోతున్నాడని ఫిక్స్ అయ్యింది. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వకీల్ సాబ్ తో సమాజానికి ఓ మెస్సేజ్ తో రాబోతుంటే.. క్రిష్ సినిమాలో చరిత్రత్మక కథని టచ్ చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో చెయ్యబోయే సినిమాని పొలిటికల్ బ్యాగ్రౌండ్ లో చేయ్యబోతున్నాడనే అనుమానం హరీష్ వదిలిన పవన్ బర్త్ డే పోస్టర్ తో అర్ధమైంది. ఇక నెక్స్ట్ మూవీ సురేందర్ రెడ్డి తో పవన్ కమిట్ అయిన మూవీ కూడా పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లోనే ఉండబోతుంది అనే టాక్ మొదలైంది. తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు చెయ్యాలి అనుకున్నది, ప్రభుత్వం మీద పవన్ పోరాటం, వచ్చే ఎన్నికల్లో పవన్ గెలుపుకు కావాల్సిన కమర్షియల్, పొలిటికల్ అంశాలతో అటు హరీష్ శంకర్ ఇటు సురేందర్ రెడ్డి మూవీస్ ఉండబోతున్నాయనేది ఫిలింనగర్ టాక్. ఈ పొలిటికల్ మూవీస్ వలన పవన్ రాజకీయ ఎత్తుగడ ఫలించేలా ఈ దర్శకులు ప్లాన్ చేస్తున్నారని వినికిడి. |
https://www.telugupost.com/movie-news/చెర్రీ-అన్నఎవరో-తెలుసా-56829/ | రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం విడుదల కాకమునుపే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక మాస్ ఎంటెర్టైనెర్ కి శ్రీకారం చుట్టాడు. బోయపాటి డైరెక్షన్ లో సినిమా మొదలవ్వడమే కాదు అధికారికంగా సెట్స్ మీదకెళ్ళి రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలెట్టేసింది. రంగస్థలం వంటి ఒక విభిన్న కథ తర్వాత చేస్తున్న ఈ సినిమా పక్కా మాస్ గా ఉండబోతుంది. ఇక ఈ సినిమాని డి వి వి దానయ్య నిర్మిస్తుండగా మహేష్ తో భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కైరా అద్వానీ చరణ్ కి హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఇప్పుడు బోయపాటి - రామ్ చరణ్ సినిమాకి సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో చెర్రీ కి అన్నగా ఒక తమిళ సీనియర్ హీరో నటిస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు జీన్స్ చిత్రంతో అమ్మాయిల మదులు దోచేసిన ప్రశాంత్. ఈ సినిమాలో రామ్ చరణ్ అన్నయ్యగా ప్రశాంత్ నటిస్తున్నాడని న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. మరి బోయపాటి మార్క్ తో ఈ మాస్ ఎంటెర్టైనెర్ లో రామ్ చరణ్ అన్న ప్రశాంత్ తో కలిసి ఎలాంటి బీభత్సాలు సృష్టిస్తాడో చూద్దాం. |
https://www.telugupost.com/movie-news/vishwak-about-ntr-154621/ | ఎన్టీఆర్ నట విశ్వరూపం అంటే ఏ దర్శకుడికైనా, అభిమానికైనా పిచ్చ ఇంట్రెస్ట్. ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా డైలాగ్ చెప్పాడంటే థియేటర్స్ లో విజిల్స్. ఇక సెట్స్ లోను ఎన్టీఆర్ సింగల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ అందరూ కితాబునిచ్చినట్టే… టాలీవుడ్ ఓ కుర్ర హీరో కూడా ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్ అంటూ చెబుతున్నాడు హిట్ తో హిట్ కొట్టిన కుర్ర హీరో విశ్వక్ సేన్. ఏ సీన్ అయినా ఎన్టీఆర్ సింగల్ టేక్ లో చెయ్యడం ఎన్టీఆర్ ప్రత్యేకత. ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే బెస్ట్ డాన్సర్. నేను తెలుగులో ఎక్కువగా ఇష్టపడే హీరో ఎన్టీఆర్ అంటున్నాడు. ఇక మహేష్ అంటే హ్యాండ్సమ్ హీరో అని, అల్లు అర్జున్ స్టైలిష్ హీరో అని చెబుతున్న విశ్వక్ సేన్ కి మల్టీస్టారర్ అవకాశం వస్తే.. మాత్రం తన ఫెవరెట్ నిర్మాత నాని తో చెయ్యాలని ఉందని చెబుతున్నాడు. ఇక దర్శకుల్లో తనకిష్టమైన దర్శకుడు తరుణ్ భాస్కర్ అని చెబుతున్నాడు. తనని హీరోగా నిలబెట్టిన తరుణ్ భాస్కర్ ఎప్పటికి తన ఫెవరెట్ అని చెబుతున్నాడు విశ్వక్. |
https://www.telugupost.com/movie-news/allu-arjun-next-movie-2-86583/ | నా పేరు సూర్య ఫ్లాప్ తో అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యడానికి బాగా టైం తీసుకుంటున్నాడు. దాదాపుగా ఐదు నెలలు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పటికి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అనే వార్తలు మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ... అల్లు అర్జున్ నుండి మాత్రం క్లారిటీ రావడం లేదు. తాజాగా అల్లు అర్జున్ బై లింగ్యువల్ మూవీ ఒకటి తెర మీదకొచ్చింది.డైరెక్టర్ ను మార్చేసి...నా పేరు సూర్య కన్నా ముందు అల్లు అర్జున్ తెలుగు, తమిళంలో కలిపి లింగు స్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఒక బై లింగువల్ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేసాడు. కానీ ఏళ్లుగా అర్జున్ ఆ సినిమాని హోల్డ్ లో పెట్టి నా పేరు సూర్య సినిమా చేసాడు. కొన్ని అనుకోని కారణాలతో ఆ బై లింగ్యువల్ మూవీని వదిలేసిన అల్లు అర్జున్ ఇప్పుడు స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఆ మూవీని మొదలెట్టా బోతున్నాడని, కానీ డైరెక్టర్ గా లింగుస్వామిని తప్పిస్తున్నారనే న్యూస్ వినబడుతుంది.వేసవిలో పట్టాలపైకి...లింగు స్వామి ప్లేస్ లో తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఈ మూవీ చేయబోతున్నాడనే టాక్ కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. వీరం, వేదాళం చిత్రాల దర్శకుడు శివతో అల్లు అర్జున్ తో కలిసి ప్రాజెక్ట్ ను తెరకెక్కించనున్నారని సమాచారం. కాకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇంకా ఈ శివ - అల్లు అర్జున్ కాంబో మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. |
https://www.telugupost.com/crime/11-year-old-allegedly-gang-raped-by-seniors-in-delhi-school-washroom-1442199 | దేశ రాజధానిలోని కేంద్రీయ విద్యాలయం బాత్రూమ్ లో 11 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు సీనియర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు గురువారం తెలిపారు. కేంద్రీయ విద్యాలయ సంగతన్ ప్రాంతీయ కార్యాలయం కూడా ఈ అంశంపై విచారణకు ఆదేశించింది. అయితే ఈ సంఘటన జూలైలో జరిగింది, ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) దృష్టికి వచ్చిన తర్వాత బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనను "తీవ్రమైన విషయం"గా పేర్కొన్న DCW, ఈ అంశంపై ఢిల్లీ పోలీసులకు, పాఠశాల ప్రిన్సిపాల్కు నోటీసు జారీ చేసింది. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో తెలియజేయాలని పాఠశాల అధికారులను కోరారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) అధికారులు ఈ సంఘటనను బాధితురాలు లేదా ఆమె తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్కు నివేదించలేదని, పోలీసుల విచారణ తర్వాత మాత్రమే వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు.బాలిక తన క్లాస్ రూములోకి వెళ్తుండగా పొరపాటున ఇద్దరు సీనియర్లను ఢీకొట్టింది. ఆమె వారికి క్షమాపణలు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా బలవంతంగా టాయిలెట్లోకి తీసుకెళ్లి గడియపెట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఈ విషయాన్ని టీచర్ దృష్టికి తీసుకెళ్లగా, నిందితులైన ఇద్దరినీ స్కూలు నుంచి బహిష్కరించామని, ఈ విషయం గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని చెప్పినట్లుగా ఆరోపణలు వచ్చాయి. తానీ విషయాన్ని టీచర్కు చెప్పానని బాధిత బాలిక చెబుతుండగా, బాలిక కానీ, ఆమె తల్లిదండ్రులు కానీ తమకు ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్కూలు యాజమాన్యం పేర్కొంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ KVS అనేది విద్యా మంత్రిత్వ శాఖ కింద ఒక స్వయంప్రతిపత్త సంస్థ.. ఇది దేశంలోని 25 ప్రాంతాలలో విస్తరించి ఉన్న 1,200 కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లను పర్యవేక్షిస్తుంది. అత్యాచారానికి పాల్పడ్డ అబ్బాయిలు 11, 12వ తరగతులకు చెందిన వారని తెలుస్తోంది. |
https://www.telugupost.com/movie-news/pranita-subs-hot-yoga-photos-139464/ | రకుల్ ప్రీత్ ఈ మధ్యన సినిమాల విషయం కన్నా జిమ్ లో వర్కౌట్స్ చేసే హాట్ వీడియోస్ తోనూ, హాట్ హాట్ యోగాసనాలతోను తెగ హైలెట్ అవడమే కాదు.. సోషల్ మీడియాలో యూత్ ని ఓ ఊపు ఊపుతుంది. రకుల్ యోగ వీడియో నిమిషాల్లో వైరల్ అవడమే కాదు… భీభత్సమైన లైక్స్ తో సోషల్ మీడియా ఊగిపోతోంది. అయితే ఇప్పుడు రకుల్ హాట్ యోగాసనాలు మరో హీరోయిన్ పోటికొస్తుంది. స్టార్స్ సినిమాలలో నటించినా పెద్దగా క్రేజ్ సంపాదించుకోలేక.. ప్రస్తుతం ఫెడవుట్ లిస్ట్ లో ఉన్న ప్రణీత సుభాష్ హాట్ యోగాసనాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. Flying start to the week ! #acroyoga అంటూ యాష్ టాగ్ తో ప్రణీత పోస్ట్ చేసిన హాట్ యోగ భంగిమలున్న ఫొటోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. మరి ప్రణీత అలా వివిధ భంగిమల్లో వేసిన యోగాసనాలు చూస్తుంటే.. ఈమధ్యన రకుల్ ప్రీత్ చేసిన హాట్ అండ్ స్పైసి యోగాసనాలు టక్కున గుర్తొస్తున్నాయి. ప్రణీత వేస్తున్న ఈ సెక్సీ, హాట్ యోగాలు చూస్తుంటే… బాపుగారి బొమ్మ హొట్నెస్ అందాలు అదరహో అన్న రేంజ్ లో ఉన్నాయి. మరి హాట్ హీరోయిన్స్ ఇలా యోగాసనాలతో పోటీ పడుతూ.. యూత్ కి నిద్ర లేకుండా చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/మహానుభావుడు-కాపీనా-44095/ | మారుతీ ఏ గ్రేడ్ సినిమాలతోనే డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ చిత్రంతో మారుతి ట్రాక్ మార్చేశాడు. మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించి బంపర్ హిట్ కొట్టాడు. నాని హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో మారుతి ఏ గ్రేడ్ దర్శకుడు అనే పదం నుండి తప్పించుకున్నాడు. అయితే ఆ సినిమా వచ్చిన కొత్తలోనే ఈ సినిమాని మారుతీ తెరకేక్కిన్చాడంటే ఎవ్వరూ నమ్మలేదు. ఆయన ఇంతమంచి కథతో ఇంత మంచి కామెడీ సినిమాని తెరకెక్కించడమా అంటూ దీర్ఘాలు తీశారు. ఇక తర్వాత వెంకటేష్ హీరోగా బాబు బంగారం తెరకెక్కించగా ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఇప్పుడు తాజాగా శర్వానంద్ హీరోగా మహానుభావుడు చిత్రంని తెరకెక్కించిన మారుతీ ఈ చిత్ర షూటింగ్ ని చడీ చప్పుడు లేకుండా కానిచ్చేశాడు. ఈ చిత్రం ఈ నెల 29 న దసరా కానుకగా విడుదల కాబోతుంది. భలే భలే మగాడివోయ్ చిత్రం వలె ఈ మహానుభావుడు చిత్రం కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. అయితే మహానుభావుడు ట్రైలర్ నిన్న రాత్రి అలా యూట్యూబ్ లో విడుదల చేశారో లేదో ఈ మహానుభావుడు సినిమాని మారుతి ఒక మలయాళం సినిమా నుండి కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం మొదలయ్యింది. ఈ మహానుభావుడు చిత్రాన్ని మారుతీ మలయాళం సినిమా నార్త్ 24 కాథం అనే సినిమా స్పూర్తిగానో..... లేకపొతే అదే సినిమాను యాజిటీజ్ గా కాపీ కొట్టాడో... అంటూ ఫిలింనగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నార్త్ 24 కాథం అనే మలయాళం సినిమా ట్రైలర్స్, క్లిప్పింగ్స్ యూట్యూబ్ లో చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసే మారుతీ ఇలా మహానుభావుడు చిత్రాన్ని తెరకెక్కించాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మారుతీ మాత్రం ఈ మహానుభావుడు లాంటి సినిమాలు అంటే ఓసిడి మీద ప్రపంచవ్యాప్తంగా అయితే సినిమాలు చాలానే వచ్చాయి.... కానీ వాటితో ఈ మహానుభావుడు సినిమాకి పోలిక ఉండదు అని చెప్బుతున్నాడు. చూద్దాం మహానుభావుడు సినిమా విడుదలయ్యాక ఆ సినిమాకి కాపీనా... లేదా అనేది. |
https://www.telugupost.com/gossip/nagarjuna-is-not-hosting-bigg-boss-telugu-ott--1355958 | బిగ్ బాస్.. హిందీ మొదలైన ఈ బుల్లితెర షో.. క్రమంగా పలు భారతీయ భాషల్లోనూ ప్రారంభమై బాగా పాపులర్ అయింది. హిందీ బిగ్ బాస్ ఇప్పటికే ఓటీటీ లో ప్రసారం చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు అదేబాటలో తెలుగు బిగ్ బాస్ కూడా పయనిస్తోంది. టీవీలో తెలుగు బిగ్ బాస్ ఐదు సీజన్లు పూర్తి చేసుకోగా ఫిబ్రవరి 26 నుండి 24 గంటలు ప్రసారమయ్యే బిగ్ బాస్ షో తెలుగు ఓటీటీ షో కూడా మొదలు కానుంది. ఈ సీజన్ కు సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలు వదిలారు మేకర్స్.Also Read : ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులురెండు ప్రోమోల్లోనూ నాగార్జునే బిగ్ బాస్ ను ప్రమోట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో ను కూడా ఆయనే హోస్ట్ చేస్తారని అందరూ భావించారు. భావించడమేంటి.. స్వయంగా నాగార్జునే ఈ విషయాన్ని చెప్పారు. అయితే 24 గంటల టెలీకాస్ట్ కావడంతో.. ఈ షో కోసం కాస్త ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. అక్కడే అనుమానం మొదలైంది నెటిజన్లకు. ఇంకేముంది బిగ్ బాస్ ఓటీటీ షో ను నాగార్జున హోస్ట్ చేయడం లేదా ? అంటూ చర్చ మొదలు పెట్టేశారు. Also Read : సమంతా నువ్వు ప్రెగ్నెంటా ? కాకపోతే నిన్ను ప్రెగ్నెంట్ చేస్తా!ఆ చర్చ అంతటితో ఆగలేదు.. బుల్లితెర స్టార్ యాంకర్ అయిన రవి.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో ను హోస్ట్ చేయనున్నాడంటూ ప్రచారం చేశారు. ఇప్పుడీ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. అంతపెద్ద రియాలిటీ షో ను హోస్ట్ చేసేందుకు.. స్టార్ స్టేటస్ తో పాటు క్రేజ్ ఉన్న హీరోలనే హోస్ట్ గా తీసుకుంటారని రవి హోస్ట్ అనేది వాస్తవం కాదని కూడా బిగ్ బాస్ అభిమానులు వాదిస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఫిబ్రవరి 26 వరకూ ఆగాల్సిందే. |
https://www.telugupost.com/movie-news/అంత-బలమేముందో-34388/ | టాలీవుడ్ లో సుకుమార్ కి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ఆయనగారు స్వతాహాగా లెక్కల మాస్టర్ కావడం వలన లెక్కలు కొందరికి అర్ధం కానట్టే... ఆయన తెరకెక్కించిన సినిమాలు సామాన్యుడికి కొన్నిసార్లు అర్ధం కాదు. ఎంతో మేధాశక్తితో కొన్ని సినిమాలను తెరకెక్కిస్తాడు సుకుమార్. అలాంటి సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా ఒక చిత్రం రూపుదిద్దుకుంటుంది. రామ్ చరణ్ 'ధ్రువ' వంటి హిట్ చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం మొదలు పెట్టినప్పటినుండి మంచి అంచనాలే వున్నాయి. ఇక రామ్ చరణ్ ఇంతకుముందు నటించిన చిత్రాలకంటే కాస్త భిన్నంగా ఈ చిత్రం ఉండబోతుందని ఈరోజు శుక్రవారం విడుదలచేసిన టైటిల్ ని బట్టి చెప్పొచ్చు.సుకుమార్ - రామ చరణ్ కాంబోలో తెరకెక్కే చిత్రానికి టైటిల్ 'రంగస్థలం 1985' గా ఫిక్స్ చేశారు. వినడానికే ఆసక్తికరంగా ఉన్న ఈ టైటిల్ సినిమాపై అంచనాలను మరింత పెంచిందని చెప్పాలి. చాలా రోజులనుండి ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కి ఈ టైటిల్ ఎంతగానో నచ్చిందని అంటున్నారు. వినడానికి ఈ రంగస్థలం అనే పదం పాతగా ఉన్నప్పటికీ కూడా ఎంతో కొత్తగా అనిపిస్తుందని అంటున్నారు.మరి 1985 లో సాగే పల్లెటూరి ప్రేమకథని సుకుమార్ కొత్తగా విభిన్నంగా అందరిమన్సులు దోచుకునేలా తెరకెక్కిస్తున్నాడట. ప్రతి సినిమాని ఎంతో రియలిస్టిక్ గా తీసే సుకుమార్ ఇంత బలమైన 'రంగస్థలం' టైటిల్ పెట్టాడంటే సినిమాలో కూడా బలమైన విషయమే ఏదో ఉంటుందనే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. మరి ఈ 'రంగస్థలం 1985 ' చిత్రాన్ని వచ్చే సంక్రాతి బరిలో నిలుపుతున్నట్టు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించేసింది. |
https://www.telugupost.com/andhra-pradesh/ycp-chief-ys-jagan-has-been-staying-in-bengaluru-for-the-past-few-days-1546818 | వైసీపీ అధినేత జగన్ గత కొద్ది రోజుల నుంచి బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నారు. గతంలో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉండే జగన్ ఇప్పుడు మాత్రం దాదాపు పదేళ్ల తర్వాత బెంగళూరును ఎంచుకున్నారు. తనకు అదే సురక్షిత ప్రాంతమని ఆయన నమ్ముతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ అయినా, తాడేపల్లి అయినా తనకు సురక్షితం కాదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు అంటున్నారు. అందుకే తాడేపల్లికి అలా వచ్చి ఇలా బెంగళూరుకు వెళ్లి అక్కడ గడుపుతున్నారు. ఫ్యామిలీతో సహా అక్కడే ఎక్కువ కాలం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారంటే ఆయనకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.దాడులు జరుగుతాయని...వైఎస్ జగన్ కు తాడేపల్లిలో పెద్ద నివాసం ఉంది. ప్రభుత్వం ఎన్నికల తర్వాత సెక్యూరిటీని తొలగించింది. అంతే కాదు. ఆయన ఇంటికి వెళ్లే దారిని కూడా ఓపెన్ చేసింది. దీంతో ఆయన ప్రయివేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. తనపై దాడులు జరిగే అవకాశముందని ఆయనకు తెలియడం వల్లనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని వైసీపీ సీనియర్ నేత ఒకరు తెలుగు పోస్టుకు చెప్పారు. తనను అడ్డుతొలగించుకునే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానం ఆయనలో బలంగా ఉండటం కారణంగానే జగన్ బెంగళూరును సేఫ్ ప్లేస్ గా ఎంచుకున్నారని, అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి వెళుతుంటారని పార్టీనేతలు చెబుతున్నారు.లోటస్ పాండ్ కు కూడా...మరో వైపు హైదరాబాద్ లో లోటస్ పాండ్ నివాసం కూడా సురక్షితం కాదని ఆయన గుర్తించారని అంటున్నారు. అక్కడ తన ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశముందని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా లోటస్ పాండ్ లో పక్కనే తన చెల్లెలు వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మ కూడా ఉండటం ఆయనకు కొంత ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. అందుకే లోటస్ పాండ్ వైపు ఆయన ఓటమి చెందిన తర్వాత కన్నెత్తి చూడలేదు. అంతా బెంగళూరు వైపు చూస్తున్నారు. బెంగళూరులో ప్రయివేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని కొంత ప్రశాంతంగా ఉండవచ్చన్న నమ్మకంతో జగన్ ఉన్నారని పార్టీనేతలు అంటున్నారు. అవసరమైతే తప్ప తాడేపల్లికి ఆయన రారు అని కూడా చెబుతున్నారు. కార్యకర్తల ముసుగులో...తాడేపల్లిలో ఉంటే పార్టీ కార్యకర్తల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కార్యకర్తల ముసుగులో తనపై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన భావించి ఆంధ్రప్రదేశ్ కు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన తాజాగా తనకు ప్రాణహాని ఉందని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు సెక్యూరిటీని పెంచాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు తగినంత సెక్యూరిటీనీ ప్రభుత్వం కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. మొత్తం మీద జగన్ మాత్రం తనకు ప్రాణహాని ఉందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఏపీకి దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నారని పార్టీనేతలు చెబుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/wonder-woman-actress-gal-gadot-blessed-with-a-baby-girl-1524321 | Gal Gadot : 'వండర్ ఉమెన్' సినిమాతో వరల్డ్ వైడ్గా ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్న హాలీవుడ్ నటి 'గాల్ గాడోట్'.. నాలుగోసారి కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను ఒక ఫొటో ద్వారా తెలియజేస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్టు వేశారు. ఇక ఆ పోస్టు కింద.. 'జన్మనివ్వడం అంత ఈజీ ఏం కాదంటూ' ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చారు."హౌస్ ఆఫ్ గర్ల్స్ లోకి మా చిన్ని పాపకు స్వాగతం పలుకుతున్నాను. మా జీవితాల్లోకి నువ్వు కొత్త వెలుగుని తీసుకొచ్చావు. అందుకనే నీకు 'ఓరి' అనే పేరుని పెడుతున్నాము. హీబ్రూ భాషలో ఓరి అంటే వెలుగు అనే అర్ధం వస్తుంది" అంటూ గాడోట్ రాసుకొచ్చారు. ఇక ఈ పోస్టు చూసిన అభిమానులు, సెలబ్రిటీస్.. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Gal Gadot (@gal_gadot) కాగా గాడోట్ 'జారోన్ వర్సనో' అనే వ్యక్తిని 2008లో వివాహం చేసుకోగా.. 2011లో 'అల్మా', 2017లో 'మాయ', 2021లో 'డానియెల్లా' ఆడబిడ్డలకు జన్మనిచ్చారు. ఇప్పుడు మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చి.. మరో వండర్ ఉమెన్ ని సిద్ధం చేయబోతున్నారు. ఇక గాడోట్ సినిమాల విషయాలకు వస్తే.. గత ఏడాది 'హార్ట్ ఆఫ్ స్టోన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్ట్రెస్ 'అలియా భట్' కూడా ఓ ముఖ్య పాత్ర చేసారు. నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. స్పై థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికీ ఈ చిత్రం బాగా నచ్చుతుంది చూసేయండి |
https://www.telugupost.com/movie-news/payal-rajpoot-in-venky-mama-110342/ | కెరీర్ అవసాన దశకు చేరుకున్న టైం లో శ్రియ శరణ్ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లయినా కానీ గ్లామర్ ని వదిలిపెట్టనని… సినిమాల్లో నటిస్తానని బోల్డ్ స్టేట్మెంట్స్ చాలానే ఇచ్చింది. అలాగే పెళ్లయ్యాక కూడా శ్రియ హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోనే ఉంది. ఇక సీనియర్ హీరోలకు శ్రియ ఒక్కటే బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది. కానీ తాజాగా సీనియర్ హీరోలు కూడా శ్రియ ని పక్కనబెడుతున్నారు. ఇక పెళ్లయ్యాక బాబీ దర్శకత్వంలో వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమా చేసే అవకాశం శ్రియ ని వరించిందనే టాక్ మాములుగా నడవలేదు. తాజాగా శ్రియ అవకాశాన్ని మరో యంగ్ హీరోయిన్ తన్నుకుపోయిందనే న్యూస్ వినబడుతుంది. శ్రియ కి వచ్చిన అవకాశాన్ని బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజపుట్ చెంతకు చేరిందని చెబుతున్నారు. RX 100 తర్వాత సీత సినిమాలో బెల్లంకొండ సరసన ఐటెం సాంగ్ ఒప్పుకున్నా పాయల్ రాజపుట్… రవితేజకి జోడిగా డిస్కో రాజాలోను ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తాజాగా నాగార్జున సరసన మన్మధుడు 2 లోను పాయల్ పేరు వినబడుతుండగా….. లేటెస్ట్ గా వెంకటేష్ సరసన పాయల్ రాజపుట్ వెంకిమామలో నటించబోతుందని అంటున్నారు. ఫిబ్రవరి 22 న షూటింగ్ మొదలుపెట్టుకోనున్న వెంకిమామ సినిమా పక్కా కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనుంది. ఇకఈ సినిమాలో నాగ చైతన్య కి జోడిగా రకు ప్రీత్ నటిస్తుండగా… వెంకటేష్ సరసన హాట్ గర్ల్ పాయల్ పేరు వినబడుతుంది. ఇక వెంకీ మామలో పాయల్ రాజపుట్ హీరోయిన్ గా నటించడం ఖాయమని.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/ఇప్పటికి-బుద్దొచ్చిందా-25303/ | నాగార్జున చాలా విషయాలలో చాలా డిసిప్లెయిన్గా ఉంటారు. ఇంత అనుభవం ఉన్నా కూడా స్క్రిప్ట్ను లాక్ చేసిన తర్వాత ఆయన ఇక దర్శకులకు పూర్తి స్వేఛ్చనిస్తారు. ఆయన తన అనుభవంలో సినిమాల షూటింగ్ సమయంలోనే ఆ దర్శకుడు చెప్పినట్లు తీస్తున్నాడా? సినిమా ఆడుతుందా? లేదా? వంటి విషయాలపై కూడా ఓ అవగాహనకు రాగల సమర్దుడు. కాగా ఆయన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ బలవంతం మీద అతని మొదటి చిత్రం 'అఖిల్' విషయంలో నాగ్ పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఆ చిత్రం పరాజయం పాలైన తర్వాత కూడా తన కొడుకు... ప్రపంచాన్ని కాపాడే భారీ బాధ్యత ఇంకా తీసుకొనే వయసులేదని చెప్పి తన హుందాతనాన్ని చాటుకున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన అఖిల్ రెండో చిత్రం విషయంలో తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. 'మనం' వంటి క్లాసిక్నిచ్చిన విక్రమ్ కె.కుమార్ మొదట చెప్పిన కథ బాగా నచ్చినప్పటికీ ఈ కథ సెకండాఫ్ వింటుంటే తనకే పలు సందేహాలు వచ్చాయని, మరి రేపు ప్రేక్షకులకు మరెన్ని సందేహాలు వచ్చే అవకాశం ఉందని భావించి, మొదటి కథను పక్కనపెట్టించి మరో కథపై కూర్చొనేలా విక్రమ్ని ప్రోత్సహించాడు. ఈ కథ బాగా రావడంతో స్క్రిప్ట్ను లాక్ చేయించి త్వరలో సినిమా ప్రారంభించడానికి ముహూర్తం చూసుకుంటున్నాడు.ఈ చిత్రం విషయంలో ఆయన దర్శకుడు విక్రమ్ కె.కుమార్పై ఎంతగానో నమ్మకం ఉంచి, ఈ చిత్రం షూటింగ్ సమయంలో కేవలం దర్శకుడు చెప్పినట్లు వినాలని, మిగిలిన విషయాలను తాను, విక్రమ్ జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి అఖిల్ను ఈ చిత్రం విషయంలో వేలు పెట్టవద్దని ఆదేశించాడట. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చి, సినిమాలో ఏదీ ఓవర్గా చేయకుండా, దర్శకుని వ్యూలోనే ఆలోచించమని అఖిల్కు సూచించాడని సమాచారం. ఈ విషయంలో నాగ్ నిర్ణయాన్ని సినీ విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/balakrishna-raviteja-fight-at-box-office-with-bhagavanth-kesari-tiger-nageswara-rao-1498370 | ఈ దసరాకి నటసింహ బాలకృష్ణ 'భగవంత్ కేసరి' సినిమాతో, మాస్ మహారాజ్ రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో పోటీ పడబోతున్నారు. ఈ రెండు చిత్రాలు ఏంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నాయి. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస సక్సెస్ లో ఉన్న బాలయ్య.. భగవంత్ కేసరితో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక రవితేజ.. టైగర్ నాగేశ్వరరావుతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఇద్దరికీ ఈ రెండు సినిమాల విజయం చాలా ముఖ్యం అయ్యింది.కాగా వీరిద్దరూ కలిసి పోటీ పడడం.. ఇదేమి మొదటిసారి కాదు. ఇప్పటికే వీరిద్దరూ మూడుసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డారు. అయితే ప్రతిసారి బాలయ్య పైన రవితేజనే విజయం సాధిస్తూ వచ్చాడు. దీంతో రవితేజ అభిమానులు.. ఈసారి కూడా విజయం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ వీరిద్దరూ కలిసి ఎప్పుడెప్పుడు, ఏయే సినిమాలతో పోటీ పడ్డారు. మీరుకూడా వాటిపై ఒక లుక్ వేసేయండి.మొదటిసారి 2008లో బాలయ్య 'ఒక్కమగాడు', రవితేజ 'కృష్ణ' సినిమాలతో ఇద్దరు పోటీ పడ్డారు. ఇక వాటి ఫలితాలు చెప్పనవసరం లేదు అనుకుంటా. ఆ తరువాత 2009లో మిత్రుడు, కిక్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. అభిమానులకు రవితేజ కిక్ని, బాలయ్య షాక్ని కలిగించాడు. ఈ పోటీ తరువాత 2011లో బాలయ్య ‘పరమవీరచక్ర’, రవితేజ ‘మిరపకాయ్’ వచ్చాయి. ఈసారి కూడా రవితేజనే విజయం సాధించాడు.ఇక్కడ గుర్తించాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. పోటీలో హిట్ అందుకున్న ప్రతి సినిమా రవితేజ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. ప్లాప్ అయిన ప్రతి సినిమా బాలయ్య కెరీర్ లో మర్చిపోలేని డిజాస్టర్స్ గా నిలిచింది. మరి ఈసారి ఎలాంటి రిజల్ట్స్ ని అందుకుంటారో చూడాలి. ఇక సోషల్ మీడియాలో దీని గురించి పోస్టులు వేస్తూ.. బాలయ్య ఈసారైనా రవితేజపై గెలుస్తాడా..? కామెంట్స్ చేస్తున్నారు. కాగా 'భగవంత్ కేసరి' అక్టోబర్ 19న, 'టైగర్ నాగేశ్వరరావు' అక్టోబర్ 20న రిలీజ్ కానున్నాయి. |
https://www.telugupost.com/movie-news/mahesh-babu-maharshi-run-time-113293/ | మహేష్ బాబు – వంశి పైడిపల్లి కాంబోలో దిల్ రాజు – అశ్వినీదత్ – పీవీపీ అనే మూడు దిగ్గజాలు నిర్మిస్తున్న క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ మహర్షి సినిమా ఇంకా షూటింగ్ లోనే ఉంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ చిత్రీకరిస్తున్న మహర్షి టీం.. ప్రమోషన్స్ మీద దృష్టి సారించింది. అయితే మహర్షి సినిమా ని రేపు ఏప్రిల్ మొదట్లోనే విడుదల చేద్దామని ముందుగా మేకర్స్ ప్లాన్ చేసిన.. తర్వాత అది కాస్తా ఏప్రిల్ చివరికి పోస్ట్ పోన్ అయ్యి… తర్వాత మే తొమ్మిదికి వెళ్ళింది. అయితే సినిమా మాటిమాటికి పోస్ట్ పోన్ అయితే ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి తగ్గకుండా మహర్షి మూవీ వర్కింగ్ స్టిల్స్… అంటూ హడావిడి చేస్తూ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇక తాజాగా మహేష్ మహర్షి విషయంలో ఇప్పుడొక న్యూస్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. అదేమిటంటే మహర్షి సినిమా నిడివి దాదాపుగా నాలుగు గంటలు వచ్చిందట. మరి ఈమధ్యన సినిమాని మూడు గంటలు థియేటర్స్ లో కూర్చుని చూసే ప్రేక్షకులంతా ఎంత బోర్ ఫీల్ అవుతున్నారో చూస్తూనే ఉన్నాం. అయితే అటు ఇటుగా ఎడిటింగ్ లో రెండున్నర గంటల నిడివి అయితే వస్తుంది కానీ.. మూడు గంటల కు దగ్గరగా మహర్షి రన్ టైం తేవడం ఇప్పుడు మహర్షి టీం కి సవాల్ గా మారిందట. ఏది ఎడిటింగ్ లో తీసేయాలన్నా… కాస్త ఇబ్బందిగా ఉందనే టాక్ వినబడుతుంది. మరి ఎడిటింగ్ టీం షార్ప్ గా పనిచేసి మహర్షి రన్ టైం ని ఓ కొలిక్కి తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారట. మరి ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా వున్న వంశి పైడిపల్లి మహర్షి రన్ టైం మీద దృష్టి పెట్టి.. దాన్ని ఒక కొలిక్కి తెచ్చే బాధ్యత తీసుకోబోతున్నాడట. |
https://www.telugupost.com/movie-news/స్పీడుతో-పిచ్చెక్కిచ్చే-40178/ | ఏడాది కి రెండు మూడు సినిమాలతో దూసుకుపోతున్న హీరో నాని వరుసగా సినిమాలు లైన్ లో పెట్టేస్తూ స్టార్ హీరోలకు పిచ్చెక్కించేస్తున్నాడు. నాని అలా సినిమాలు చేసుకుంటూ హిట్స్ కొట్టేస్తుంటే మాత్రం స్టార్ హీరోలు పైకి ఏడవలేక నవ్వుతున్నారు. వారైతే భారీ బడ్జెట్ తో ఏడాదికి ఒక సినిమానే విడుదల చెయ్యడానికి నానా తంటాలు పడుతూ... ఆ సినిమా హిట్ అవుతుందో? లేదో అనే టెన్షన్ తో కొట్టుమిట్టాడే వారికి, నాని వరుస సినిమాలు, వరుస హిట్స్ గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. కానీ నాని మాత్రం రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు.ఒక చిత్రాన్ని విడుదలచేయకముందే మరో చిత్రాన్ని లైన్ లో పెట్టేస్తున్న నాని 'నిను కోరి' చిత్రం అలా విడుదలైందో లేదో ఇలా 'ఎంసీఏ' షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం నాని, దిల్ రాజు నిర్మాణంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేసుకుని డిసెంబర్ మొదటి వారంలో థియేటర్స్ లోకి దిగిపోనుంది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే... మేర్లపాక గాంధీ డైరెక్టన్ లో 'కృష్ణార్జున' చిత్రాన్ని ఫైనల్ చెయ్యడమే కాదు... 'కృష్ణార్జున' షూటింగ్ ని ఆఫిసియల్ గా అనౌన్స్ చేసేసాడు. నాని ఈ 'కృష్ణార్జున' చిత్రం కోసం ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక బైక్ మీద కృష్ణుడి ఫ్లూట్ పెట్టుకుని వెళ్తున్న ఫోటోను ఒకటి షేర్ చేస్తూ.. ఈ సినిమా షూటింగ్ మొదలైందని చెప్పకనే చెప్పాడు నాని. ఇక ఈ చిత్రంలో 'అ... ఆ' ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందని టాక్ బాగా వినబడుతుంది. ఇక అనుపమ ఒక హీరోయిన్ గా 'కృష్ణార్జున' లో ఫైనల్ అయితే మరో హీరోయిన్ ని కూడా ఈ సినిమా కోసం ఫైనల్ చెయ్యాల్సి ఉంటుంది. |
https://www.telugupost.com/movie-news/actor-prakash-raj-was-angry-with-the-ap-government-he-tweeted-what-is-this-dominant-trend-on-the-film-industry-1356829 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నటుడు ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమారంగంపై ఈ ఆధిపత్య ధోరణి ఏంటని ఆయన ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం పేరు ఎత్తకుండానే ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. సృజన, సాంకేతిక మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం ఏంటని నిలదీశారు. క్షోభ పెడుతూ ప్రోత్సహిస్తున్నామని చెప్పడమేంటని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.పరోక్షంగా ఏపీ సర్కార్ పై.....ప్రకాష్ రాజ్ ఇటు భీమ్లా నాయక్ సినిమా పేరును, అటు ఏపీ ప్రభుత్వం పేరును నేరుగా ప్రస్తావించకుండా ఈ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. భీమ్లా నాయక్ సినిమాను ప్రభుత్వం తొక్కేస్తుందని, తెలంగాణ ప్రభుత్వం చిత్రసీమను ప్రోత్సహిస్తుంటే ఏపీ సర్కార్ మాత్రం వెనక్కు లాగుతుందని పలువురు ఆరోపణలు చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం టిక్కెట్ ధరల నిర్ణయం ఇంకా జరగలేదని, పుష్ప, అఖండ, బంగర్రాజు సినిమాల షరతులే భీమ్లా నాయక్ కు వర్తించాయని చెబుతుంది. మొత్తం మీద ప్రకాష్ రాజ్ ట్వీట్ ఏపీలో హాట్ టాపిక్ గా మరింది. |
https://www.telugupost.com/movie-news/నటసింహ-నందమూరి-బాలకృష్ణ-31790/ | నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్గా గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సంచలన చిత్రంతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రాన్ని రజనీకాంత్తో నరసింహ వంటి సూపర్హిట్ చిత్రాన్ని రూపొందించిన కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తొలిసారి చేస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సంబంధించిన వివరాలు నిర్మాత సి.కళ్యాణ్ తెలియజేస్తూ - ''నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నరసింహ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి ఎం.రత్నం అద్భుతమైన కథ, మాటలు అందిస్తున్నారు. బాలకృష్ణగారి కెరీర్లోనే ఇది మరో సంచలన చిత్రం అవుతుంది. జూన్ నెలాఖరులో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. జూలై 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నటసింహ బాలకృష్ణతోపాటు భారీ తారాగణం నటించే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము. నటసింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్గా గౌతమి పుత్ర శాతకర్ణితో చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. రజనీకాంత్తో నరసింహ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని రూపొందించిన కె.ఎస్.రవికుమార్, నటసింహ బాలకృష్ణ ఫస్ట్ కాంబినేషన్లో మా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం'' అన్నారు. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నిర్మాణం జరుపుకోనున్న ఈ భారీ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కో-ప్రొడ్యూసర్: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సి.తేజ, సి.వరుణ్కుమార్, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్. |
https://www.telugupost.com/movie-news/ntr-teaser-sunil-84600/ | నిన్న విడుదలైన 'అరవింద సమేత వీరరాఘవ’ టీజర్ రికార్డు లైక్స్, వ్యూస్ తో దూసుకుపోతుంది. త్రివిక్రమ్ నుండి ఇటువంటి టీజర్ ఎక్స్ పెక్ట్ చేయలేదు తన ఫ్యాన్స్. త్రివిక్రమ్ టేకింగ్ కానీ..ఎన్టీఆర్ చెప్పే స్టైలిష్ డైలాగ్స్ కానీ టీజర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక ఎన్టీఆర్ ఒక్కడినే చూపించి తనపైనే జనాల దృష్టి పడేలా చేశాడు త్రివిక్రమ్. కానీ మీరు టీజర్ మొత్తం ఫ్రేమ్ టూ ఫ్రేమ్ చూస్తే నటుడు సునీల్ కనిపిస్తాడు. ఏంటీ నమ్మట్లేదా? ఒకసారి టీజర్ చూడండి.మళ్లీ రీఎంట్రీ...!టీజర్ లో ఎన్టీఆర్ ‘కంటబడ్డావా… కనికరిస్తానేమో! యెంటబడ్డానా… నరికేస్తా’ అని ఎన్టీఆర్ డైలాగ్ చెప్పడానికి ముందు కుర్చీ గాల్లోకి లేచిన సమయంలో జాగ్రత్తగా గమనిస్తే సునీల్ కనిపిస్తాడు. కావాలంటే పై ఫోటో ను సరిగా చూడండి. ఇంతకాలం దాకా సునీల్ హీరోగా నటించాడు. స్టార్టింగ్ లో పర్లేదు అనిపించుకున్నా ఆ తర్వాత అన్ని సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో మళ్లీ తిరిగి కమెడియన్ వేషం వేసుకోవటానికి రెడీ అయ్యాడు.హీరో స్నేహితుడిగా..?ఆలా అనుకున్నాడో లేడో..తన స్నేహితుడైన త్రివిక్రమ్ తొలి అవకాశం ‘అరవింద సమేత వీరరాఘవ’లో ఇచ్చాడు. టీజర్ బట్టి చూస్తుంటే సునీల్ ఇందులో ఎన్టీఆర్ కి స్నేహితుడిగా నటించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఎంత మంది ఆర్టిస్ట్స్ ఉన్న టీజర్ లో వాళ్లెవరినీ చూపించకుండా ఎన్టీఆర్ ఒక్కడినే చూపించి తనతో పాటు సునీల్ కూడా కనపడలేలా చేశాడు త్రివిక్రమ్. దీంతో ఈ సినిమాతో సునీల్ హాస్య నటుడిగా ఈ సినిమా గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చినట్టే. గతంలో వీరి కాంబినేషన్ ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. |
https://www.telugupost.com/crime/police-seized-huge-amount-of-drugs-in-hyderabad-accused-who-was-selling-drugs-was-arrested-1465655 | హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను విక్రయిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబయి నుంచి డగ్ర్స్ తీసుకు వచ్చి విక్రయిస్తున్నానని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించారు. రాజేంద్ర నగర్ లోని హిమాయత్ సాగర్ వద్ద ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తుండగా ఎన్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.ఆడి కారులో వచ్చి...ఆడి కారులో వచ్చిన పాతబస్తీకి చెందిన మహ్మద్ హమీద్ ఆలీ కొందరికి డ్రగ్స్ విక్రయిస్తుండగా ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అందిన సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న దానిపై సమాచారం సేకరిస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/ramcharan-twitter-record-173665/ | రామ్ చరణ్ ని ఒకప్పుడు ఇతనేం హీరో అన్నవాళ్ళే.. ఇతను స్టార్ హీరో అన్న రేంజ్ కి చేరాడు చరణ్. బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. చరణ్ కష్టపడి పై కోచ్చిన హీరోనే. లక్కు, క్రేజ్ ఉండాలి కానీ.. బ్యాగ్రౌండ్ ఉంటేనే హీరో అవరు అనేది చరణ్ నిరూపించాడు. చరణ్ కెరీర్ లో మగధీర, ధ్రువ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రకున్నాయి. ఇక వినయ విధేయరామ ప్లాప్ అయినా చరణ్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఆ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ RRR లో నటిస్తున్న రామ్ చరణ్ క్రేజ్ సోషల్ మీడియాలో పైపై కి పోతుంది. ఎప్పుడూ ఫేస్ బుక్ లో యాక్టీవ్ గా ఉండే చరణ్ గత మార్చ్ లో ట్విట్టర్ లోకి అడుగుపెట్టాడు. ట్విట్టర్ లోకి అడుగుపెట్టినప్పటినుండి రామ్ చరణ్ క్రేజ్ ని ఆయన అభిమానులు మరింత పెంచేశారు. కాబట్టే రామ్ చరణ్ ట్విట్టర్ లో ఇప్పుడు ఓ రికార్డుని సెట్ చేసాడు. మెగా అభిమానుల పుణ్యమా అని.. రామ్ చరణ్ ట్విట్టర్ లో 233 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1 మిలియన్ ఫాలోవర్స్ ను రాబట్టుకొని టాలీవుడ్ హీరోల్లో ఏ హీరో సెట్ చెయ్యలేని రికార్డుని చరణ్ సొంతం చేసుకున్నాడు. ట్విట్టర్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న చరణ్ ఫాస్టెస్ట్ రికార్డుని నెలకొల్పాడు. మరి మెగా హీరో రికార్డు ని సెట్ చేసాడంటే మెగా ఫాన్స్ ఊరుకుంటారా. అప్పుడే సెలెబ్రేషన్స్ స్టార్ట్ కూడా చేసేసారు. ఒకపక్క చిరు కరోనా నుండి కోలుకోవాలని పూజలు చేస్తున్న మెగా ఫాన్స్.. ఇప్పుడు చరణ్ ఫాస్టెస్ట్ రికార్డుని పార్టీలతో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/hit-remake-in-hindi-163028/ | రాజ్కుమార్ రావ్ హీరోగా దిల్రాజు నిర్మాణంలో.. హిందీలో రీమేక్ అవుతున్నతెలుగు సెన్సేషనల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై, ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచిన చిత్రం ‘హిట్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు మరింత చేరువ కానుంది. ‘హిట్’ చిత్రం హిందీలో రీమేక్ అవుతుంది. పోలీస్ డ్రామాగా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ హిందీ రీమేక్లో రాజ్కుమార్ రావు హీరోగా నటిస్తున్నారు. హిట్..హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్లో పనిచేసే ఓ పోలీస్ ఆఫీసర్ అనుమానాస్పదంగా మిస్ అవుతున్న అమ్మాయిల గురించి అన్వేషిస్తుంటాడు. ఈ కేసులను ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదిస్తాడు? అనేదే సినిమా కథాంశం. డైరెక్టర్ శైలేష్ కొలను ఈ యాక్షన్ థ్రిల్లర్ను అద్భుతంగా తెరకెక్కించారు. హిందీ రీమేక్ను కూడా శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2021లో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ – ‘‘హిట్ సినిమాకు సంబంధించి ఫస్ట్ కేస్ అనే క్యాప్షన్ పెట్టాం. ఈ ఫస్ట్ కేస్లో హీరో తన గతం, వర్తమానానికి సంబంధించి ఏదో మానసిక సంఘర్షణను అనుభవిస్తుంటాడు. ఇలాంటి ఓ సంఘర్షణతో కూడిన పాత్రను ప్రేక్షకులను కన్విన్స్ చేసేలా ఓ మెచ్యూర్డ్ యాక్టర్ చేస్తే బావుటుందని ఆలోచిస్తున్న తరుణంలో రాజ్ కుమార్ రావ్ ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నటించిన ‘సైతాన్’ సినిమా నుండి ఆయన సినిమాలను ఫాలో అవుతున్నాను. ఆయనొక అద్భుతమైన నటుడు. ప్రతి సందర్భంలో నటుడిగా నన్ను ఆశ్చర్యపరుస్తూనే వచ్చారు. రాజ్కుమార్ రావ్, దిల్రాజుగారితో కలిసి పనిచేయనుండటం ఎగ్జయిటింగ్గా అనిపిస్తుంది. హిట్ సినిమా ఫ్రాంచైజీ మన దక్షిణాది ప్రేక్షకులనే కాదు ఉత్తరాది ప్రేక్షకులను కూడా కచ్చితంగా ఆకట్టుకుంది. యూనివర్సల్ పాయింట్తో తెరకెక్కిన చిత్రమిది. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి, నెటివిటీకి తగినట్లు చిన్న చిన్న మార్పులను చేస్తాను’’ అన్నారు. హీరో రాజ్కుమార్ రావ్ మాట్లాడుతూ – ‘‘నేను హిట్ సినిమాను చూడగానే కనెక్ట్ అయిపోయాను. ప్రస్తుతం మన సమాజానికి అవసరమైన కథాంశంతో తెరకెక్కిన ఎంగేజింగ్ మూవీ. ఓ నటుడిగా ఇలాంటి ఓ పాత్ర కోసం ఎదురుచూస్తున్న తరుణంలో హిట్ సినిమా చేసే అవకాశం వచ్చింది. దిల్రాజుగారు, శైలేష్ కొలనుగారితో కలిసి ఈ సినిమాకు పనిచేయనుండటం హ్యాపీగా ఫీలవుతున్నాను’’ అన్నారు. దిల్రాజు ప్రొడక్షన్ బ్యానర్పై నాని ‘జెర్సీ’ చిత్రాన్నిషాహిద్ కపూర్తో హిందీలో రీమేక్ చేస్తున్న టాలీవుడ్ నిర్మాత దిల్రాజు. . బాలీవుడ్ నిర్మాత కుల్దీప్ రాథోర్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. |
https://www.telugupost.com/movie-news/ప్రభుత్వంపై-వ్యతిరేఖ-డైల-67244/ | కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు సీఎం గా నటించిన భరత్ అనే నేను సినిమా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాలున్న భరత్ కి సెన్సార్ వారు కూడా యు/ఏ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలతో పాటు ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ కూడా ప్లస్ అయ్యింది. సెన్సార్ బోర్డు వారు భరత్ అనే నేను సినిమా చూసి .... సినిమాపై పాజిటివ్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా చెబుతున్నప్పటికీ... ఈ సినిమాలో ప్రస్తుత ప్రభత్వాలమీద ఏడెనిమిది సెటైరికల్ డైలాగ్స్ ఉన్నాయని... వాటికి కట్స్ ఇచ్చి మరీ సెన్సార్ వారు ఈ సినిమాకి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా టాక్ బయటికి వచ్చింది.ప్రభుత్వానికి వ్యతిరేఖంగా డైలాగ్స్ ఉండడంతో వాటికి కట్స్ చెప్పాల్సి వచ్చిందని సెన్సార్ సభ్యుడొకరు తెలిపారు. కానీ కొరటాల ఈ సినిమా ద్వారా ఒక మెస్సేజ్ ని పాస్ చేయబోతున్నాడని... ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ సినిమాలో చాలా సామాజిక సందేశాల్ని అందించాడని అంటున్నారు. ఇక కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థ మీద పట్టా పొందిన ఒక విద్యార్థి ఎలా పోరాడన్నదే ఈ భరత్ అనే నేను.. అని చెప్పిన వారు కొంతమంది రాజకీయనాయకుల మీద భారీ సెటైరికల్ డైలాగ్స్ కూడా భరత్ లో ఉండబోతున్నాయంటున్నారు.ఇక సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా కొరటాల తీర్చి దిద్దాడని... సినిమాలో 80 శాతం రాజకీయ నేపథ్యంలోనే సినిమా ఉందంటున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. మరి ప్రేక్షకుల అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా కొరటాల శివ ఈ సినిమా రన్ టైం ని ఫిక్స్ చేసాడట.. అయితే భరత్ అనే నేను రన్ టైం ఏకంగా 2.53 నిముషాలు అన్నట్లుగా తెలుస్తుంది. అయితే సినిమాలోని అద్భుతమైన ట్విస్టులు సినిమా రన్ టైం ని తినేస్తాయనే టాక్ మాత్రం బాగా వినబడుతుంది. |
https://www.telugupost.com/movie-news/కీర్తి-ఆఫర్-కొట్టేసిన-సీ-145605/ | మహానటి తర్వాత కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి అజయ్ దేవగన్ మైదాన్ సినిమాతో ఎంట్రీకి ఏర్పాట్లు జరిగాయి. ఒక్కసారిగా తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాల్తో బిజీ తారగా మారిన కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్ ని వదులుకుంది . కారణం ఆమె అజయ్ దేవగన్ భార్య పాత్రలో మైదాన్ లో కనిపించాలి. అయితే అంత సీయర్ హీరో ముందు కీర్తి సురేష్ మరీ యంగ్ గా సన్నగా కనిపించడంతో.. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ రషెస్ చూసిన కీర్తి సురేష్.. అతను అజయ్ పక్కన మరీ తేలిపోయానని..అందుకే కీర్తి సురేష్ నిర్మాత బోని తో సంప్రదించి మరీ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా బాలీవుడ్ మీడియా కథనం. మహానటి తర్వాత బాగా సన్నగా నాజూగ్గా మారిన కీర్తికి ఇప్పుడు ఆమె బరువు తగ్గడం శాపంగా మారింది. అయితే కీర్తి సురేష్ మైదాన్ నుండి బయటికి రావడంతో.. అజయ్ దేవగన్ భర్య రోల్ కి ఇప్పుడు సీనియర్ హీరోయిన్ ప్రియమణి చెంతకి చేరింది. ఇప్పటికే బాలీవుడ్ లో ఒకటి అరా పాత్రలతో కెరీర్ లో ముందుకెళుతున్న ప్రియమణి తాజాగా ద ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ తో ఇరగదీసింది. ఇక కీర్తి సురేష్ మైదాన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో అజయ్ సరసన ప్రియమణి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని.. చిత్ర బృందము ఆమెని సంప్రదించడం ప్రియమణి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగాయనే టాక్ బాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. |
https://www.telugupost.com/movie-news/rajinikanth-stopped-his-upcoming-movie-shooting-177311/ | హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నా రజినీకాంత్ – శివ కాంబోలో తెరకెక్కుతున్న అణ్ణాతే షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. రజినీకాంత్ ఒక్కసారిగా రాజకీయాల గురించి క్లారిటీ ఇచ్చెయ్యడంతో మీడియా అటెన్షన్ అంతా రజినీ మీదే ఉంది. ఈ నెల 31 న తన పార్టీ పేరు, గుర్తు పై వివరణ ఇస్తానని చెప్పిన రజినీకాంత్ తాను ఒప్పుకున్న సినిమాను త్వరగా పూర్తి చెయ్యాలనే కసితో ఈమధ్యనే ఆయన నటిస్తున్న అణ్ణాతే షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చారు. రామోజీ ఫిలిం సిటీలో శివ దర్శకత్వంలో అణ్ణాతే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే సినిమాని త్వరగా పూర్తి చెయ్యాలని రజినికాంత్ రోజులో మొత్తంగా 14 గంటల పాటు షూటింగ్ కోసం కష్టపడుతున్నాడనే టాక్ నడుస్తుంది. మరి రజినీకాంత్ అంత స్పీడుగా షూటింగ్ చేసుకుంటుంటే.. కరోనా ఎందుకు ఊరుకుంటుంది. రజిని స్పీడుకి కరోనా బ్రేకులు వేసింది. కరోనా కి భయపడకుండా రంగంలోకి దిగిన రజినీకాంత్ ని కరోనా భయపెట్టేసింది. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న రజిని అణ్ణాత షూటింగ్ స్పాట్ లోని 8 మందికి కరోనా సోకింది. దీంతో ఎంటైర్ యూనిట్ హైదరాబాద్ నుండి చెన్నై కి తిరిగొచ్చేశారు. రజినీకాంత్ కోవిడ్ టెస్ట్ చేయించుకోగా ఆయనకి నెగెటివ్ అని తేలడంతో ప్రస్తుతం రజినీ హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. దీనితో అణ్ణాతే షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. |
https://www.telugupost.com/movie-news/bunny-party-to-geetha-team-84716/ | గీత గోవిందం సినిమా విడుదలకు మరో పది రోజులు టైం ఉంది అనుకున్న సమయంలో ఆ సినిమాలోని కొన్ని సీన్స్, ఫొటోస్ లీక్ అవడంతో.. ఆ గందరగోళంలో గీత గోవిందం సినిమా ట్రైలర్ ని కానీ... సినిమాకి ప్రి రిలీజ్ ఈవెంట్ ని కానీ చేయలేకపోయారు. సినిమా విడుదలకు ముందు భారీ క్రేజ్ తో బరిలోకి దిగిన గీత గోవిందం ట్రైలర్ విషయమై అందరూ మరిచిపోయారు. టీజర్, సాంగ్స్ ని వదిలారు కానీ గీత ట్రైలర్ మాత్రం కొన్ని కారణాల వలన వదలలేదు. కానీ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో అదరగొట్టే కలెక్షన్స్ తో ఒక రేంజ్లో థియేటర్స్ లో దూసుకుపోతుంది. మే నెలలో.. మహానటి హిట్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ గీత గోవిందం అందుకుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి బన్నీ వాష్ నిర్మాతగా పరశురామ్ కేవలం 13 నుండి 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు మొదటి రోజుకే ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల షేర్ కోల్లగొట్టింది.ఘనంగా సక్సెస్ మీట్...అలాగే శాటిలైట్స్ హక్కుల ద్వారా వచ్చిన మొత్తం, మొదటి రోజు వచ్చిన మొత్తానికే గీత గోవిందానికి పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. మరి రెండో రోజు నుండి గీత గోవిందం నిర్మాతలు లాభాల బాట పట్టారు. విజయ్ దేవరకొండ క్రేజ్, రష్మిక అందం తో సినిమా సూపర్ హిట్ అవడం.. పరశురామ్ డైరెక్షన్ స్కిల్స్ వావ్ అనిపించేలా ఉండడం.. వెరసి గీత ఆర్ట్స్ వారు అదరగొట్టే హిట్ అందుకున్నారు. అందుకే మెగాస్టార్ చిరు కూడా సినిమా విడుదలైన రోజే గీత గోవిందం సినిమా చూసి యూనిట్ సభ్యులను అభినందించారు. ఇక అల్లు అర్జున్ తన మిత్రుడు బన్నీ వాస్ గీత గోవిందం తో హిట్ అందుకోవడంతో.. ఇప్పుడు గీత గోవిందం బృందానికి మంచి పార్టీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. గీత గోవిందం సినిమాకి పనిచేసిన దర్శకనిర్మాతలు, టెక్నీషియన్స్, హీరో హీరోయిన్ ఇలా గీత గోవిందంకి పనిచేసిన ప్రతి ఒక్కరికి అల్లు అర్జున్ తన ఫామ్ హౌస్ లో ఈ గ్రాండ్ పార్టీ ప్లాన్ చేసాడు. హైదరాబాద్ శివారులో ఉన్న బన్నీ ఫామ్ హౌస్ లో ఈ పార్టీని అరేంజ్ చేసాడు.సినిమా నచ్చితే పార్టీ...ఇక గీతగోవిందం సినిమా కి ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యకపోయినా.. ఇప్పుడు సక్సెస్ మీట్ ని మాత్రం ఓ రేంజ్ లో చేపడుతున్నారు. మెగాస్టార్ చిరు ముఖ్యఅతిథిగా గీత గోవిందం సక్సెస్ సెలెబ్రేషన్స్ ని ఆదివారం నిర్వహించబోతున్నారు. మరి సినిమాని ఆల్రెడీ వీక్షించిన చిరు ఈ సక్సెస్ మీట్ లో గీత గోవిందం గురించి ఎలాంటి విషయాలు చెప్పి సినిమాపై మరింత క్రేజ్ పెంచుతాడో అనే ఆసక్తి ప్రస్తుతం అందరిలో బయలుదేరింది. ఇకపోతే బన్నీకి సినిమా నచ్చితే ఆ సినిమా బృందానికి పార్టీ ఇవ్వడమనేది మహానటి మూవీ నుండి మొదలు పెట్టాడు. తాజాగా గీత గోవిందం బృందానికి ఇప్పుడు ఇలా పార్టీ ఇస్తున్నాడన్నమాట. ఇక గీత గోవిందం సినిమా కేరళలో కొల్లగొట్టే కలెక్షన్స్ ని అక్కడ కేరళలో వరద బాధిత సహాయార్థం విరాళంగా ఇచ్చేస్తున్నటుగా ఆ సినిమా నిర్మాత బన్నీ వాస్ ప్రకటించాడు. |
https://www.telugupost.com/crime/anantapur-police-have-arrested-the-hawala-gang-189-crore-cash-was-recovered-from-them-1465961 | అనంతపురం పోలీసులు హవాలా గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 1.89 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో కేరళ గ్యాంగ్ ఈ డబ్బును తరలిస్తుండగా అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు కేరళకు చెందిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.హవాలా రూపంలో...హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హవాలా మార్గంలో పెద్దయెత్తున నగదు తరలి వెళుతుందన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ నగదుకు సంబంధించి వారివద్ద ఎలాంటి ఆధారాలు, రశీదులు లేకపోవడంతో హవాలా సొమ్ముగా అనుమానిస్తున్నారు. పోలీసులు నలుగురిని విచారిస్తున్నారు. వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. |
https://www.telugupost.com/movie-news/keerthi-lady-oriented-movies-173523/ | అజ్ఞాతవాసి తర్వాత మహానటి తో కీర్తి సురేష్ ఒక్కసారిగా ఫెమస్ అయ్యింది. మహానటి క్రేజ్ అంతా ఇంతా కాదు… ఆ మైకంలోనే కీర్తి సురేష్ కథ గురించి, కేరెక్టర్ గురించి ఆలోచించకుండా తన పాత్రకి ప్రాధాన్యం లేని స్టార్ హీరోల సినిమాలు చేసి చేతులు కాల్చుకుంది. ఇక మహానటితో తనకి వచ్చిన క్రేజ్ తో లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రెస్స్ గా మరింది. అందుకే అటు పెంగ్విన్, ఇటు మిస్ ఇండియా, మరో వైపు గుడ్ లాక్ సఖి సినిమాలు ఒప్పుకుంది. లేడి ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ నయనతార స్టార్ హీరోలే కాదు… చిన్న హీరోల సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. ఎదుకంటే నయనతార చేసిన ఏ సినిమా అయినా కంటెంట్ పరంగాను, తన కేరక్టర్ పరంగాను కీలకంగా ఉన్నాయి కాబట్టి. ఇక అనుష్క కూడా అరుంధతి తర్వాత చాలా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అవకాశాలు వచ్చినా జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుని గ్లామర్ షో చేస్తూ స్టార్ హీరోల ఛాన్సెస్ కొట్టేసింది. కానీ కీర్తి సురేష్ మహానటి దెబ్బకి తన మీద తనకి బాగా నమ్మకం పెరిగిపోయి వరసగా లేడి ఓరియెంటెడ్ మూవీస్ ఒప్పేసుకుని పప్పులో కాలేసింది. మరి ఇప్పటికైనా కీర్తి సురేష్ అటు గ్లామర్ ఇటు కమర్షియల్ మూవీస్ ఒప్పుకుంటే బెటర్. కానీ ట్రెడిషనల్ గాను, పద్దతిగా కాకుండా గ్లామర్ కి ఓకె చెప్పాలి.. ఇక ఓ పాత్ర కోసం సన్నగా మారిన కీర్తి లుక్స్ పై వస్తున్న విమర్శలకు కీర్తి సురేష్ చెక్ పెట్టింది. తాను మళ్ళి బరువు పెరగబోతున్నట్లుగా కూడా చెప్పింది. |
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-number-one-163188/ | “ఇన్ స్టా గ్రామ్” లో 8 మిలియన్ ఫాలోయర్స్. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్ర్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అనతి కాలంలోనే తన స్టైల్,డిఫరెంట్ అటిట్యూడ్ తో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విజయ్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.రీసెంట్ గా ఇన్ స్టా గ్రామ్ లో కొత్త రికార్డు క్రియేట్చేశాడు.8 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకొని సౌత్ ఇండియాలోనే ఫస్ట్ హీరోగా నిలిచాడు.80 లక్షల మార్కు దాటటం తో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేట్చేసుకుంటున్నారు. విజయ్ కు ఇంత మంది పాలోవర్స్ ఉండటానికి రీజన్ ఆయననుదేశవ్యాప్తంగా అందరూ అభిమానించటమే.విజయ్ నటించిన తెలుగు సినిమాలు అర్జున్రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రేడ్ హిందీలో డబ్ కావడం తో అక్కడ కూడా ఫ్యాన్స్ అయ్యారు.ఇక ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో విజయ్ చేస్తున్న సినిమా ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది.ఈ సినిమాతో డైరెక్ట్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు విజయ్ దేవరకొండ. |
https://www.telugupost.com/movie-news/ala-vaikunrapuramlo-two-weeks-collections-146342/ | ఏరియా: 2 వీక్స్ షేర్ (కోట్లలో) నైజాం 35.10 సీడెడ్ 17.16 నెల్లూరు 3.86 కృష్ణ 8.40 గుంటూరు 9.06 వైజాగ్ 17.80 ఈస్ట్ గోదావరి 9.50 వెస్ట్ గోదావరి 7.22 2 వీక్స్ ఏపీ & టీస్ షేర్: 108.10 కర్ణాటక 9.15 కేరళ 1.18 ఇతర ప్రాంతాలు 3.55 ఓవర్సీస్ 12.15 2 వీక్స్ వరల్డ్ వైడ్ షేర్: 134.13 |
https://www.telugupost.com/movie-news/rangasthalam-collections-created-a-record-in-us-66300/ | సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా రోజురోజుకి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ నటీనటుల కెరీర్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్ గా నిలించింది. లేటెస్ట్ గా ఓవర్సీస్ లో ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి సినిమా తర్వాతి స్తానంలో ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించింది.ఓవర్సీస్ లో రంగస్థలం ఇప్పటివరకు 3 మిలియన్ల డాలర్లను రాబట్టింది. బాహుబలి 2 ($ 11.8M) అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా మొదటి రెండు స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమాకు యూఎస్ లో ప్రమియర్స్ కు పాజిటివ్ టాక్ రావడంతో ఒక్కసారిగా కలెక్షన్స్ ఊపందుకున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఈ సినిమా త్వరలో 3.5 మిలియన్ మార్క్ ను ఈజీగా అందుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వచ్చే వారం అక్కడ నాని కృష్ణార్జున యుద్ధం రిలీజ్ కాబోతోంది. మరి ఆ సినిమా ప్రభావం ఉంటె రంగస్థలం కలెక్షన్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది |
https://www.telugupost.com/movie-news/జనవరి-13న-అభిమన్యుడు-49365/ | పందెం కోడి నుంచి డిటెక్టివ్ వరకు ఎన్నో సూపర్హిట్ చిత్రాలు చేసిన మాస్ హీరో విశాల్ 'డిటెక్టివ్' పెద్ద హిట్ అయిన ఆనందంలో వున్నారు. డిటెక్టివ్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్ హీరో విశాల్, సమంత జంటగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి 'అభిమన్యుడు' టైటిల్ని ఖరారు చేశారు. హరి వెంకటేశ్వర పిక్చర్స్ అధినేత హరి గుజ్జలపూడి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్లుక్ను నవంబర్ 18న విడుదల చేయనున్నారు.హై బడ్జెట్ తో....ఈ చిత్రం గురించి మాస్ హీరో విశాల్ తెలియజేస్తూ ''ఇంతకుముందు నేను చేసిన అన్ని సినిమాలకంటే హై రేంజ్ సినిమా ఇది. హీరోగా, నిర్మాతగా నాకు బాగా నచ్చిన సినిమా. డెఫినెట్గా ఈ సంక్రాంతికి నాకు మరో పెద్ద హిట్ సినిమా అవుతుంది. దర్శకుడు మిత్రన్ సబ్జెక్ట్ని చాలా బాగా డీల్ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఎంతో లావిష్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది'' అన్నారు. నిర్మాత జి.హరి మాట్లాడుతూ ''షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నవంబర్ 18 ఉదయం ఈ చిత్రం ఫస్లుక్ని విడుదల చేసి, సాయంత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తాం. డిసెంబర్ 27న ఈ చిత్రం ఆడియోను చాలా గ్రాండ్గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేశాం. జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తాం. విశాల్ కెరీర్లోనే హై బడ్జెట్తో, హై టెక్నికల్ వేల్యూస్తో రూపొందుతున్న సినిమా ఇది'' అన్నారు. మాస్ హీరో విశాల్, సమంత, యాక్షన్ కింగ్ అర్జున్తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్, ఎడిటింగ్: రూబెన్, ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: ఉమేష్ జె.కుమార్, మాటలు: రాజేష్ ఎ.మూర్తి, దర్శకత్వం: పి.ఎస్.మిత్రన్. |
https://www.telugupost.com/movie-news/boney-kapoor-reveals-sridevi-demise-main-reason-1497835 | భారతీయ సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాలు పాటు మహారాణిగా వెలిగిన నటి 'శ్రీదేవి'. సౌత్ టు నార్త్ ఎన్నో వందల సినిమాల్లో నటించింది. తన అందం, అభినయంతో ఆడియన్స్ ని మాత్రమే కాదు తన తోటి యాక్టర్స్, టెక్నీషియన్స్ ని కూడా తన అభిమానులుగా మార్చుకుంది. కలలరాణిగా ఫ్యాన్స్ గుండెల్లో సుస్థిర స్థానం దక్కించుకున్న శ్రీదేవి.. 54 ఏళ్ళ వయసులో సడన్ గా మరణించడం అందర్నీ షాక్ కి గురిచేసింది.2018లో తన భర్త బోనీ కపూర్ తో కలిసి దుబాయ్ లో జరిగే ఓ పెళ్ళికి వెళ్లిన శ్రీదేవి.. అక్కడ హోటల్ లోని బాత్ రూమ్ టబ్ లో పడి యాక్సిడెంటల్ గా మరణించింది. ఐదు పదుల వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా, అందంగా కనిపించే శ్రీదేవి.. ఎక్కడో విదేశాల్లో మరణించడం చాలామందిలో సందేహాలు రేకితించాయి. ఈక్రమంలోనే భర్త బోనీ కపూర్ పై అనుమానాలు వచ్చాయి. దుబాయ్ పోలీసులు కూడా బోనీ కపూర్ ని అదుపులోకి తీసుకోని విచారించడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది.అయితే అసలు అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి బోనీ కపూర్ ఎప్పుడు బయట మాట్లాడలేదు. దీంతో శ్రీదేవి మరణం ఒక రహస్యంగా ఉండిపోయింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు గురించి బోనీ కపూర్ మొదటిసారి మాట్లాడాడు. బోని కపూర్ మాట్లాడుతూ.. "శ్రీదేవి చనిపోయిన తరువాత ప్రతి ఒక్కరు నన్నే అనుమానించారు. భారత్ ఎంబసీ నుంచి కూడా దుబాయ్ పోలీసుల పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో చేసేది లేక నన్ను వారు అదుపులోకి తీసుకోని సుమారు 24 గంటలు పాటు విచారించారు" అని చెప్పుకొచ్చాడు.ఈ విచారణలో పలు రకాల టెస్టులు చేశారట. లై డిటెక్టర్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు పేర్కొన్నాడు. తను ఏ తప్పు చేయలేదని తెలిసిన తరువాతే బోనీ కపూర్ ని దుబాయ్ పోలీసులు విడిచిపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇక శ్రీదేవి మరణ వెనుకున్న ఉన్న కారణం ఏంటనేది కూడా తెలియజేశాడు. అందంగా కనిపించేందుకు శ్రీదేవి కఠినమైన డైట్ ఫాలో అయ్యేదట. ఈ క్రమంలోనే ఉప్పు లేని ఆహారం తినేదట. దీని వల్ల 'లో బిపి' వచ్చి పడిపోయేదట.అయితే ఈ విషయం పెళ్ళైన కొన్నాళ్ల వరకు బోనీ కపూర్ కి కూడా తెలియదట. ఇక ఈ విషయం గురించి డాక్టర్లు శ్రీదేవిని చాలా సార్లు హెచ్చరించినట్లు కూడా చెప్పుకొచ్చాడు. దీని వల్లే శ్రీదేవి బాత్ రూమ్ లో పడి చనిపోయినట్లు వెల్లడించాడు. శ్రీదేవి చనిపోయిన తరువాత బోనీ కపూర్ ని కలిసిన నాగార్జున.. శ్రీదేవి స్ట్రిక్ట్ డైట్ గురించి, దాని వల్ల షూటింగ్స్ లో కళ్ళు తిరిగి పడిపోయిన సందర్బాలు గురించి చెప్పినట్లు కూడా ఈ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక శ్రీదేవి మరణం వెనుక రహస్యం బయట పెట్టడంతో ఇప్పుడు బోనీ కపూర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. |
https://www.telugupost.com/movie-news/venky-mama-movie-updates-113383/ | నాగ చైతన్య – వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ గోదావరి పరిసరాల్లోని లొకేషన్స్ లో జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో చైతు సరసన రాశీ ఖన్నా నటిస్తుండగా.. వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది. ఇప్పటికే రాశీ ఖన్నా ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అవ్వగా.. పాయల్ రాజ్ పుత్ కూడా లేటెస్ట్ గా జాయిన్ అయింది. మామాఅల్లుళ్ల కామెడీతో… కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్య, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా బాగా అలరిస్తాయని సమాచారం. ఇందులో వెంకీ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సురేష్ బాబుతో కలిసి కోన వెంకట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకీ మామ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. |
https://www.telugupost.com/movie-news/several-bollywood-movies-to-release-on-august-15-and-oct-2-127311/ | బాహుబలి లాంటి కళా ఖండాన్ని చూసి… ఆ సినిమా కొల్లగొట్టిన భారీ కలెక్షన్స్ ని చూసి కూడా కనీసం టాలీవుడ్ డైరెక్టర్స్ ని కానీ, హీరోలను కానీ అభినందించలేని బాలీవుడ్ హీరోలు… ఇప్పుడు టాలీవుడ్ హీరోలంటే లెక్కలేదంటున్నారు. టాలీవుడ్ హీరోలు మెల్లగా ఇండియా వైడ్ గా తమ సత్తా చాటుతున్నారు. ఇటు టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యి కోట్లు కొల్లగొడుతున్నాయి.. దీనికి చిన్న ఉదాహరణ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్. ఇక బాహబలితో బాలీవుడ్ హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ప్రభాస్.. తన సాహో సినిమాని ఆగష్టు 15 న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా భారీ అంచనాలతో ఆగష్టు 15 న ఇండియా వైడ్ గా విడుదలకు సిద్ధమవుతుంటే… అక్కడ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ సినిమాని ఆగష్టు 15 కే విడుదలకు డేట్ లాక్ చేసాడు. మరి బాహుబలి ప్రభాస్ ని చూసి కూడా అక్షయ్ అదరడం లేదు, బెదరడం లేదు. ఇక తాజాగా మెగా స్టార్ చిరంజీవి కూడా తన సై రా నరసింహారెడ్డి సినిమాని అక్టోబర్ 2 న గాంధీ జయంతి రోజున వరల్డ్ వైడ్ గా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈసినిమాలో మెగాస్టార్ చిరు తో పాటుగా తమిళ, కన్నడ, బాలీవుడ్ ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ నుండి అమితాబ్ లాంటి నటుడు, తమిళంనుండి నయనతార , విజయ్ సేతుపతి, కన్నడ నుండి కిచ్చ సుదీప్ లాంటి నటులతో తెరకెక్కుతున్న సై రా సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. అయితే అక్టోబర్ 2 న విడుదల కాబోతున్న సై రా సినిమాకి ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పోటీ కోస్తున్నాడు. తాజాగా సూపర్ 30 తో భారీ హిట్ అందుకున్న హృతిక్ రోషన్… టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించిన హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా అక్టోబర్ 2న విడుదలకు డేట్ లాక్ చేసాడు. చెయ్యడమే కాదు… ప్రమోషన్స్ కూడా మొదలెట్టేసాడు. మరి బాలీవుడ్ హీరోల తీరు చూస్తుంటే… టాలీవుడ్ హీరోలంటే మాకేం లెక్కలేదు అన్నట్టుగా లేదూ. అందుకే భారీ అంచనాలున్న టాలీవుడ్ సినిమాల మీద తమ సినిమాలు విడుదల చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/పవన్-వీరాభిమాని-ఈసారి-ఇల-39702/ | కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ లేరు..... తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులం అని చెప్పుకునే హీరో, హీరోయిన్స్ చాలామందే ఉన్నారు ఇండస్ట్రీలో. పవన్ కళ్యాణ్ స్టైల్ ని వారు తమ సీన్లలో వాడుకుంటూ.... పవన్ తనకు దేవుడంటూ లెక్చర్లిస్తుంటారు. ఇలాంటి వారిలో టాలీవుడ్ లో ముందుండే వ్యక్తి మాత్రం నితిన్,. నితిన్ కి గతంలో సినిమాల్లో చాలా ఎదురు దెబ్బలే తగిలాయి. కానీ మళ్ళీ పవన్ కి నేను వీరాభిమానినంటూ మొదలుపెట్టి సినిమాల్లో హిట్స్ కొట్టుకుంటూ పోతున్నాడు. ఇక తన సినిమాల వేడుకలకి పవన్ కళ్యాణ్ ని తీసుకువచ్చి మరీ తన సినిమాకి పబ్లిసిటీ చేయించుకునే నితిన్ ఇప్పుడు మాత్రం పవన్ ని పక్కన పెట్టేసాడంటున్నారు కొందరు. ఎందుకంటే నితిన్ - హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన 'లై' చిత్రం ఈ నెల 11 న విదుడవుతున్న సందర్భంగా ఈ సినిమా కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. అయితే 'లై' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సూపర్ మహేష్ గెస్ట్ గా వస్తున్నాడనే టాక్ వినబడుతుంది.మరి నితిన్ దేవుడు పవన్ ఉండగా... మహేష్ ని ఎందుకు పిలిచాడా అనుకుంటున్నారా? అదేనండి 'లై' సినిమాని నిర్మించిన 14 రీల్స్ వారికీ సూపర్ స్టార్ మహేష్ కి ఉన్న అనుబంధం మూలంగానే మహేష్ ఈ ఈవెంటుకి వస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. అంటే ఇందులో హీరో నితిన్ గారి తప్పేం లేదు. ఆయన పవన్ కళ్యాణ్ ని మర్చిపోలేదు. కానీ నిర్మాతల డెసిషన్ తో ఏకీభవించాడు కాబట్టే నితిన్ ని ఇలా తప్పుగా అనుకుంటున్నారట. |
https://www.telugupost.com/movie-news/ఇది-రివర్స్-లో-వుందే-31642/ | టాలీవుడ్, కోలీవుడ్ లో కీర్తి సురేష్ హవా మాములుగా నడవడంలేదు. కీర్తి సురేష్ సినిమా ఇండస్ట్రీలోకి కాలు పెట్టి చాలా తక్కువ రోజులే అయినప్పటికీ ఆమె నటించిన సినిమాలన్నీ హిట్ అవడంతో ఆమెకు ఎనలేని కీర్తిప్రతిష్టలు వచ్చేసాయి. అందుకే ఇప్పుడు రాబోయే సినిమాలో కీర్తి సురేష్ ని మాత్రమే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు స్టార్ హీరోలందరూ. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కి డేట్స్ లేకపోయినా కూడా ఆమె కోసం ఒక హీరోగారి తన డేట్స్ ని అడ్జెస్ట్ చేసాడనే విషయం అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో హైలెట్ అయ్యింది.ఆ హీరో మరెవరో కాదు 'అపరిచితుడు, నాన్న' వంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన చియాన్ విక్రమ్. చియాన్ విక్రమ్ హీరోగా డైరెక్టర్ హరి డైరెక్షన్ లో 'సామి 2 ' చిత్రం త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లబోతుంది. ఈ సినిమాకి హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఫైనల్ చెయ్యగా ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేసే పరిస్థితుల్లో లేకపోవడంతో విక్రమ్ స్వయంగా కీర్తి కోసం తన డేట్స్ అడ్జెస్ట్ చేసుకున్నాడట. మరి కీర్తికున్న క్రేజ్ చూసి 'సామి' టీమ్ సభ్యులు ఇలా ఆమె కోసం అంతలా వెయిట్ చేస్తున్నారన్నమాట. ఇకపోతే మరోవైపు విక్రమ్ కి ఈ మధ్యన సరైన హిట్స్ లేక అటు తెలుగులో ఇటు తమిళంలో డీలా పడ్డాడు. ఇక ఇప్పుడు 'సామి 2 ' చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు తమిళంలో విడుదల చేద్దామని సామీ టీమ్ భావించ బట్టే కీర్తిని హీరోయిన్ గా ఎంపిక చేశారని చెబుతున్నారు.ఇప్పుడు కీర్తికి తెలుగులో మంచి డిమాండ్ వుంది. అటు తమిళ్ కూడా సూపర్ స్పీడ్ తో దూసుకుపోతుంది. అందుకే కీర్తిని హీరోయిన్ గా తీసుకుంటే రెండు భాషల్లో 'సామి 2 ' కి మంచి క్రేజ్ వస్తుందని భావించి కీర్తి కోసం విక్రమ్ తన డేట్స్ అడ్జెస్ట్ చేసుకున్నాడని అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/gani-movie-new-release-date-1357432 | హైదరాబాద్ : బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన సినిమా "గని". అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. మొదట ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయాలని భావించారు. కానీ.. ఆ రోజు భీమ్లా నాయక్ విడుదల ఉండటంతో మార్చి 4కి వాయిదా వేశారు. 25న విడుదల కావాల్సిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా మార్చి 4న రిలీజ్ అయ్యేందుకు ఫిక్స్ అయింది. దానితో పాటు సెబాస్టియన్ కూడా విడుదలవుతోంది.Also Read : బ్రేకింగ్ : ఉక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి దుర్మరణం"గని" సినిమాను ఎప్పుడు విడుదల చేయాలన్నా ఏదొక ఆటంకం వస్తోంది. ఈ సారి మరో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చెప్తూ.. అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. గని లో వరుణ్ సరసన సయీ మంజ్రేకర్ పరిచయం కానుంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కనిపించనున్నారు. తమన్ అందిస్తున్న సంగీతం.. సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.The Bell rings for the Final Round on April 8th.Coming to theatres near you. #ghani #ghanifromapril8th pic.twitter.com/SoY1krBOMY— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) March 2, 2022 |
https://www.telugupost.com/movie-news/సచ్చిందిరా-గొర్రెలో-కథా-43740/ | శ్రీనివాసరెడ్డి, టిల్లు వేణు, జబర్దస్త్ రాకేష్, శివారెడ్డి, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "సచ్చింది రా గొర్రె". శ్రీధర్ రెడ్డి యార్వ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపక్ ముకుత్, యన్.యమ్.పాషాలు అపర్ణ కిటే తో కలిసి సోహామ్ రాక్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ స్టూడియో బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంలో కథానాయికగా పాపులర్ యాంకర్ అనసూయ నటించనుంది. త్వరలోనే షూటింగ్ లో పాలుపంచుకోనున్న అనసూయ ఈ క్రేజీ ప్రోజెక్ట్ కి అదనపు ఆకర్షణగా నిలవనుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. "ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం నవ్వులు పండిస్తుంది. దర్శకుడిగా ఇదే నా తొలి చిత్రమైనప్పటికీ.. డిఫరెంట్ జోనర్ లో డార్క్ కామెడీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. అనసూయ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది" అన్నారు. అనసూయ మాట్లాడుతూ.. "పర్టీక్యులర్ గా హీరో-హీరోయిన్ అనేది కాకుండా కేవలం కథే హీరోగా నడిచే సినిమా ఇది. అందులోనూ ఈ సినిమాలో తెలంగాణా సాంస్కృతిక గీతం అయిన ఒగ్గు కథ ఉండడం నన్ను అమితంగా ఆకట్టుకుంది. సినిమాటిక్ గా ఉంటూనే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగేలా "సచ్చిందిరా గొర్రె" ఉండబోతోంది" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్కుమార్, ఛాయాగ్రహణం: రమణ సాల్వ. |
https://www.telugupost.com/movie-news/అప్పుడు-తండ్రి-ఇప్పుడు-బ-34303/ | సౌందర్య రజనీకాంత్.. ఈమె పేరు చెబితే హీరోలకు, నిర్మాతలకు, బయ్యర్లకు కూడా వణుకు. 'రోబో' వంటి పెద్ద హిట్ తర్వాత తన తండ్రి రజనీకాంత్ని పట్టుబట్టి, తనకున్న గ్రాఫిక్ డిజైనింగ్ అనుభవంతో రజనీ, దీపికా పదుకొనె వంటి వారితో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఓ కార్టూన్ ఫిల్మ్ వంటి చిత్రం తీసింది. అదే 'కొచ్చాడయాన్' (విక్రమసింహ). ఇక ఈ చిత్రం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. రజనీని నిలువునా ముంచిన చిత్రం ఇది. మరలా పాపం ఖాళీగా ఉంది. ఈసారి తన సోదరి భర్త ధనుష్ని హీరోగా పెట్టుకుని, ధనుష్ కెరీర్లోనే పెద్ద హిట్టయి, అతి తక్కువ బడ్జెట్తో కోట్లు కొల్లగొట్టిన 'విఐపి'కి సీక్వెల్కి దర్శకత్వ బాధ్యతలను చేపట్టింది. 'విఐపి' తెలుగులో ధనుష్కు ఉన్న ఏకైక హిట్ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం 'రఘువరన్ బిటెక్'గా వచ్చి ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఇక 'విఐపి2'లో మొదటి పార్ట్లో ఉన్న క్యారెక్టర్లకే కొనసాగింపు ఉంటుంది. అందునా ఇందులో బాలీవుడ్ నిన్నటితరం స్టార్ హీరోయిన్ కాజోల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. పూర్తిగా విలన్ కాకపోయినా ధనుష్ను దెబ్బకొట్టడానికి చూసే బడా పారిశ్రామికవేత్తగా కనిపిస్తోంది. వి.క్రియేషన్స్ బేనర్లో కళైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ మాత్రం అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని జులై 28న విడుదల చేయాలని భావిస్తున్నారు. మొదటి భాగంలో బిటెక్ స్టూడెంట్ ఉద్యోగం లేని బాధలను, తల్లి సెంటిమెంట్ను రంగరించారు. మరి రెండో భాగంలో కథ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి. ఇక తన తండ్రిని ముంచిన సౌందర్య, కనీసం తన బావనైనా గట్టున పడేస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది....! |
https://www.telugupost.com/movie-news/government-has-given-permission-for-bhimla-naiks-fifth-show-in-telangana-1356129 | తెలంగాణలో భీమ్లా నాయక్ ఐదో షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు వారాల పాటు ఐదు షోలు వేసుకునే అవకాశాన్ని కల్పించింది. పవన్ కల్యాణ్ భీమ్లఃా నాయక్ ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. మరికాసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా జరుపుకోనుంది.రెండు వారాల పాటు...అయితే భీమ్లానాయక్ కు ఐదో షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు వారాల పాటు స్పెషల్ షో తెలంగాణలో భీమ్లా నాయక్ నడుస్తుడటంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భీమ్లానాయక్ కు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శిస్తారు. |
https://www.telugupost.com/crime/bodhan-mla-shakeel-said-he-had-nothing-to-do-with-the-car-accident-he-said-he-was-currently-in-dubai-1360174 | ఆ కారు ప్రమాదంతో తనకు సంబంధం లేదని బోధన ఎమ్మెల్యే షకీల్ చెప్పారు. తాను ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నానని చెప్పారు. తాను తన స్నేహితుడు మీర్జాకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఇచ్చానని చెప్పారు. ఆ వాహనం ఒక ప్రయివేటు సంస్థ పేరు మీద ఉందన్నారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నంత మాత్రాన ఆ ప్రమాదానికి, తనకు ఏమాత్రం సంబంధం లేదని షకీల్ వివరించారు. తాను ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలిపానని చెప్పారు.బాలుడి మృతికి....జూబ్లీహిల్స్ లో ఒక కారు బీభత్సం సృష్టించి రెండేళ్ల బాలుడు మృతికి కారణమయింది. ఆ కారుపై ఎమ్మెల్యే స్టికర్ ఉండటంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/devara-movie-trailer-launch-big-day-for-ntr-and-korata-siva-1550856 | ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ను నేడు ముంబైలో గ్రాండ్గా విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ ముంబై చేరుకున్నారు. సాయంత్రం 5:04 గంటలకు ట్రైలర్ను లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు మంచి హైప్ ను సొంతం చేసుకున్నాయి. ట్రైలర్ కూడా అదిరిపోయేలా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా దేవర సినిమాను పాన్ ఇండియా రేంజిలో హిట్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది. దేవర పార్ట్-1 ట్రైలర్ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నాడా అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఆ విషయంలో ట్రైలర్ ద్వారా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ట్రైలర్ కిక్ ఇస్తే సినిమాకి భారీ ఓపెనింగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అన్నీ కుదిరితే తొలిరోజునే దేవర 150 కోట్ల గ్రాస్ని టచ్ చేసే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో సినిమా 800 కోట్లు కూడా టచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. |
https://www.telugupost.com/andhra-pradesh/ycp-chief-ys-jagan-needs-to-learn-from-the-experienced-on-how-to-survive-the-defeat-and-manage-some-governance-1542354 | వైసీపీ అధినేత జగన్ ఓటమి నుంచి బయటపడి కొంత పాలన ఎలా చేయాలన్న దాని గురించి అనుభవజ్ఞులైన వారి నుంచి నేర్చుకోవాల్సి ఉంది. తన తండ్రి వైఎస్సార్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆయన పాలన ఎలా సాగించారో? ఎలా ప్రజలకు చేరువగా ఉండే వాళ్లో జగన్ కు తెలియనిది కాదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను జగన్ దగ్గరుండి చూశారు. ఆయన నిత్యం ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి పాటుపడే వారు. అందుకే వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని రెండోసారి కూడా అధికారాన్ని అప్పగించారు జనం. ఇటు సంక్షేమంతో పాటు అటు అభివృద్ధిని కూడా పరుగులు తీయించడమే కాకుండా, వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించేందుకు వైఎస్సార్ చేసిన కృషి వల్లనే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004, 2009 లో అధికారంలోకి రాగలిగింది.నేడు జరిగిన పింఛన్ల పంపిణీ...ఇక ప్రత్యర్థి అయినా.. చంద్రబాబు ను చూసి జగన్ పాలన విషయంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఈరోజు చూస్తే రాష్ట్రమంతటా పింఛన్ల పంపిణీ జరిగింది. ఇది ఇంటికి వెళ్లి ఇవ్వడం కొత్తగాదు. జగన్ హయాంలో వాలంటీర్లు ఇంటికి వెళ్లి ఇచ్చిందే. అయితే తాను అధికారంలోకి రాగానే చంద్రబాబు నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లారు. వారికి స్వయంగా పంపిణీ చేశారు. రాష్ట్రమంతటా ఎమ్మెల్యేలను పింఛన్ల పంపిణీలో భాగస్వామ్యులను చేశారు. అంటే ఎమ్మెల్యేలకు పని అప్పచెప్పడమే కాదు.. వారిని ప్రజలకు చేరువయ్యేలా చంద్రబాబు తాను కూడా రంగంలోకి దిగి అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు ఏపీలో అధికార పార్టీ ఒకరకమైన సానుకూల వాతావరణం ఏర్పరచుకుంది. సచివాలయం సిబ్బందిని మాత్రమే పింఛన్లకు పంపలేదు. వారితో పాటు ఎమ్మెల్యేలను కూడా పంపారు. సంక్షేమ పథకాలను అమలు చేశానని...కానీ 136 సార్లు బటన్ నొక్కానన్నావు. 2.75 లక్షల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశానని చెప్పావు. నిజమే కావచ్చు. కానీ పబ్లిసిటీ ఏదీ? తాడేపల్లి కార్యాలయంలో కూర్చుని బటన్ నొక్కినంత మాత్రాన సరిపోతుందా? లేక ఏదో ఒక జిల్లాకు వెళ్లి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినంత మాత్రాన ఒరిగేదుందా? వైఎస్సార్, చంద్రబాబుల కంటే సంక్షేమ పథకాలను ఎక్కువగా అమలు చేసినా జగన్ కు అంత మైలేజీ రాకపోవడానికి, పాజిటివిటీ జనంలో కనిపించకపోవడానికి కారణం జగన్ మాత్రమే. ఎవరినీ భాగస్వామ్యుల్ని చేయకపోవడం, అంతా తానే అయి వ్యవహరించడం, కూర్చున్న చోట నుంచి కదలకపోవడంతోనే మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి సంభవించిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. జనానికి దూరంగా ఉండాలనుకునే సీఎంను ఎవరు మాత్రం కోరుకుంటారన్న ప్రశ్నకు సమాధానం ఇప్పటికే దొరికి ఉంటుంది. చిన్న వయసులో...చంద్రబాబు ఏడుపదుల వయసు దాటినా ఈరోజు ఉదయం ఆరు గంటలకే లబ్దిదారుల ఇంటికి వెళ్లి మరీ పింఛను ఇచ్చారంటే .. అది కేవలం ఆయనకే కాదు.. పార్టీకి, ప్రభుత్వానికి ఎంత పాజిటివ్ టాక్ వస్తుంది. ప్రజలకు కావాల్సింది కేవలం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయడమే కాదు.. వారికి స్వాంతన చెప్పే మాటలు ఎప్పటికప్పుడు చెప్పాలి. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చుని మీడియాకు దూరంగా ఉండి కనీసం ఏం చేస్తున్నారో కూడా ప్రజలకు తెలియకపోతే వాళ్లు ఖచ్చితంగా విపక్షాలు చేసే విమర్శలు నమ్మక ఏమవుతుంది? అన్న విషయం ఆలోచించాలి. చిన్న వయసులో వచ్చిన ముఖ్యమంత్రి పదవీకాలాన్ని ఎక్కువ సమయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితం చేయడం కూడా ఓటమికి ఒక కారణంగా ఖచ్చితంగా చెప్పాలి. అందుకే వైఎస్సార్, చంద్రబాబుల నుంచి పాలన ఎలా చేయాలన్న దానిపై ఇప్పటికైనా కొంత తెలుసుకుంటే.. భవిష్యత్ లో ఇలాంటి తప్పులు దొర్లవన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. |
https://www.telugupost.com/movie-news/no-option-for-tollywood-heros-110220/ | టాలీవుడ్ హీరోలకు హీరోయిన్స్ కరువయ్యారా… అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్ హీరోలకు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ కనబడం లేదు. కాజల్, సమంత, తమన్నా,అనుష్క, నయనతార వంటి హీరోయిన్స్ సీనియర్స్ లిస్ట్ లోకి చేరిపోవడంతో.. ప్రస్తుతం స్టార్ హీరోలకు హీరోయిన్స్ కొరత ఏర్పడింది. ఏదో ఒక హీరోయిన్ ఒక హిట్ కొట్టాక ఆమె వెనుక పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ హీరోయిన్ కి మళ్లీ ఫ్లాప్ పడితే మరో ఆప్షన్ వెతుక్కోవడం. గత ఏడాది అను ఇమ్మాన్యువల్ కాస్త స్టార్ హీరోల సినిమాల్లో కనబడితే… రెండు మూడు ఫ్లాప్స్ పడేసరికి అనుని పక్కన పడేసారు. కైరా అద్వానీ పరిస్థితీ అదే. భరత్ అనే నేనుతో పర్వాలేదనిపించే హిట్ తో ఉంటే.. రామ్ చరణ్ తో వినయ విధేయ రామతో ఫ్లాప్ పడేసరికి కైరాకు అవకాశాలు మొహం చాటేశాయి. అందరూ ఆమె చుట్టే… ఇక డీజేతో యావరేజ్ హిట్ కొట్టిన పూజా హెగ్డే వెనకాలే స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు పడుతున్నారు. ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరి సరసన పూజా హెగ్డేనే హీరోయిన్. మరి పూజా హెగ్డే లో గ్లామర్ ఉంది కానీ.. ఆమెకి నటన ఓ అన్నంత రాదు. కానీ హీరోలకు వేరే ఆప్షన్ లేక పూజా కోసం వెంటపడుతున్నారు. క్రేజ్ ఉన్న మరే హీరోయిన్ దొరకక ఆమె చుట్టూనే తిరగాల్సిన పరిస్థితి. ఇప్పటివరకు పూజ హెగ్డేకి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. డీజే దువ్వాడ జగన్నాధం యావరేజ్ హిట్ అయితే.. అరవింద సమేత కూడా యావరేజే అయ్యింది. కానీ పూజా డిమాండ్ తగ్గలేదు. మళ్లీ అల్లు అర్జున్ తో… ఇప్పటికే పూజా నటిస్తున్న మహేష్ మహర్షి సినిమా విడుదలకు రెడీ అవుతుంటే.. ప్రభాస్ సినిమా సెట్స్ మీదుంది. ఇక తాజాగా త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమాలోనూ పూజానే ఫైనల్ చేశారు అని అంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ తో డీజే దువ్వాడ జగన్నాధం సినిమాతో ఒక ఊపు ఊపిన పూజా హెగ్డే ఇప్పుడు మరోమారు జతకడుతుంది. మరి పూజా హెగ్డే లాక్కో. హీరోలకు వేరే దిక్కులేకో… ఆమెనే అందరికీ బెస్ట్ ఆప్షన్ అయ్యింది. |
https://www.telugupost.com/movie-news/tollywood-actress-kalpika-ganesh-allegations-on-comedian-abhinav-gomatam-1445427 | అమ్మాయిని 'ఐటెమ్' అని పిలిచిన ఓ యువకుడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధించిన వార్త తెలిసిందే..! 25 ఏళ్ల యువకుడు తనను లైంగికంగా వేధించాడంటూ 16 ఏళ్ల బాలిక 2015లో కేసు పెట్టింది. 14 జులై 2015న తాను స్కూలు నుంచి ఇంటికెళ్తున్న సమయంలో యువకుడు తనను బైక్పై వెంబడించాడని, ఆ తర్వాత జుట్టు పట్టుకుని లాగుతూ.. ఏం ఐటెమ్.. ఎక్కడికెళ్తున్నావ్? అని వేధించాడని ఆరోపించింది. విచారణ చేపట్టిన పోక్సో కోర్టు.. అమ్మాయిలను లైంగికంగా వేధించేందుకు అబ్బాయిలు ఉద్దేశపూర్వకంగానే అలా పిలుస్తారని పేర్కొంది. నిందితుడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది.అయితే ఇప్పుడు టాలీవుడ్ లో కమెడియన్ పై కూడా ఇదే విషయంలో నటి ఆరోపణలు చేస్తోంది. కల్పిక గణేశ్ టాలీవుడ్ యువ కమెడియన్ అభినవ్ గోమటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభినవ్ గోమటం తనను ఐటెం అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించాడని కల్పిక మండిపడుతోంది. అభినవ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఆమె తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ట్యాగ్ చేస్తూ, అభినవ్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. అభినవ్ గోమటం మాత్రం కల్పిక ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నాడు.ఇటీవల కల్పికకి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక అవార్డు వచ్చింది. దీనిపై అభినవ్ సెటైర్లు వేస్తూ తనని కించపరిచే విధంగా కామెంట్స్ చేశాడని కల్పిక ఆరోపిస్తోంది. అభినవ్ ఆమెని 'ఐటెం' అంటూ కించపరిచినట్లు తెలుస్తోంది. దీనితో అతడిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వాళ్లకు బుద్ది చెప్పాలని కల్పిక వరుసగా పోస్ట్ లు చేస్తోంది. తనని అసభ్యంగా మాట్లాడిన చాట్స్ ని కూడా షేర్ చేస్తోంది. అభినవ్ తనకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కల్పిక డిమాండ్ చేస్తోంది. కానీ అభినవ్ మాత్రం సారీ చెప్పనని అంటున్నాడు. |
https://www.telugupost.com/movie-news/is-it-true-ntr-168347/ | హీరోలంతా ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో అభిమానులకి కిక్ ఇస్తుంటే.. ఎన్టీఆర్ మాత్రం గత ఐదునెలలుగా అభిమానులకు కనిపించిన పాపన పోలేదు. కరోనా టైం లో ఎంత మాత్రం ఇంటి పట్టున ఎంజాయ్ చేస్తుంటే.. కనీసం సోషల్ మీడియాలో అయినా అభిమానులకు దర్శనమిస్తే అది అభిమానులకు హ్యాపీ. కానీ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ట్వీట్స్ వెయ్యడం తప్ప మనిషి మాత్రం కనిపించడం లేదు. చరణ్ అయినా అక్కడక్కడా వీడియోస్ తోనో ఫొటోస్ తోనో సందడి చేసాడు. ఇక అల్లు అర్జున్ వాకింగ్ తో ఎప్పటికప్పుడు ఫాన్స్ కి షాకిస్తున్నాడు. ఆఖరుకి ప్రబస్ కూడా జనాల్లోకి వస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం అబ్బో చాలా సీక్రెట్ మైంటైన్ చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ RRR తర్వాత త్రివిక్రమ్ తో ఓ మూవీ అలాగే ప్రశాంత్ నీల్ తో మరో మూవీ చెయ్యబోతున్నాడు. త్రివిక్రమ్ తో అయితే పక్క కానీ ప్రశాంత్ నీల్ తో క్లారిటీ రావడం లేదు. ఈలోపు ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ విషయంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. RRR పాన్ ఇండియా మూవీతో బాలీవుడ్ కి వెళుతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తర్వాత స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ చేయబోతున్నాడని.. అది కూడా స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో చేయబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు బాక్సింగ్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనున్న చిత్రంలో ఎన్టీఆర్ కిక్ బాక్సర్గా కనిపిస్తాడని ప్రచారము జరుగుతుంది. మరి ఎన్టీఆర్ నిజంగా బాలీవుడ్ స్ట్రయిట్ ఫిలిం కోసం ప్లాన్ చేస్తున్నాడా? అది నిజమా? అంటుంటే.. ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం నిజమే.. నమ్మాలి అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/pushpa-urvashi-routela-154435/ | అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో మూవీ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. కానీ కరోనా మహమ్మారి.. అల్లు అర్జున్ కాళ్ళకి అడ్డం పడింది. త్రివిక్రమ్ తో అల వైకుంఠపురములో సినిమా చెయ్యడానికి ఓ ఏడాది గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ కి ఈ సారి సుక్కు సినిమా కోసం అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది. అయితే పుష్ప సినిమాని పాన్ ఇండియా మూవీ గా ఎనౌన్స్ చేసి షాకిచ్చిన సుక్కు – బన్నీ లు ఈ సినిమాపై అందరిలో అంచనాలు పెంచేశారు. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ పేర్లు తప్ప మరే ఇతర పేర్లు బయట పెట్టలేదు. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ని తీసుకున్న సుక్కు బృందం… మిగతా టెక్నీకల్ మెంబెర్స్ విషయాలను రివీల్ చెయ్యలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కకముందే.. ఈ సినిమాపై రోజుకో న్యూస్ ప్రచారంలోకొసిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కనిపిస్తాడని అన్నారు. తాజాగా విజయ్ సేతుపతి పుష్ప సిఎంమా నుండి బయటికెళ్లిపోయాడంటున్నారు. అలాగే దేవిశ్రీ – సుక్కు కాంబోలో హిట్ అయ్యేలా మాస్ సాంగ్స్ ఉన్నట్టుగానే పుష్ప లోను అదిరిపోయే మాస్ ఐటెం సాంగ్ ఉండబోతుంది అని.. ఆ సాంగ్ కోసమా బాలీవుడ్ హీరోయిన్ కియారా ని సంప్రదించగా ఆమె ఐటమ్స్ కి నో చెప్పడంతో.. బాలీవుడ్ అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న ఊర్వశి రౌతేల్ల ని సంప్రదించినట్టుగా టాక్. మరి బాలీవుడ్ ఊర్వశి రౌతేల్ల అల్లు అర్జున్ పక్కన ఐటెం లో అందాలు ఆరబోస్తూ మాస్ స్టెప్స్ వేసింది అంటే… మాస్ ప్రేక్షకులకు మోత మోగిపోవాల్సిందే అంటుంటే… పుష్ప పట్టాలెక్కకముందే.. ఇన్ని న్యూస్ లు వింటుంటే.. పట్టాలెక్కేక ఇంకెన్ని వినాలో అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/ఆయన-కోరికలు-నెరవేరుస్తాన-57483/ | స్వర్గీయ నందమూరి తారకరామారావు చలన చిత్ర రంగంలో కథానాయకుడు ఐన నాటి నుంచి ఎన్నో మరపురాని పాత్రలకి కేర్ ఆఫ్ అడ్రెస్స్ అయ్యారు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలు అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలని పోషించేవారు ఆయన. అయితే ఆయన చేయదలచి రప్పించుకున్న పాత్రలు, మోజుపడి ప్రకటించిన పాత్రలు కూడా కొన్ని వెండితెరపైకి ఆయన రూపంలో రాకుండానే అనివార్య కారణాల వలన నిలిచిపోయాయి. రామారావు చేయాలనుకున్న అల్లూరి సీతారామరాజు వంటి సమరయోధుడి పాత్ర ఆయన చేసేలోపే సూపర్ స్టార్ కృష్ణ గారు చేసి విజయం పొందిన సంగతి అందరికి జ్ఞాపకమే.తన తండ్రి ఆశపడి చేయలేని పాత్రలు అన్ని తనకి గుర్తు ఉన్నాయని, ఒక్కొక్కటిగా ఆ పాత్రలన్నీ పోషించి ఆయన కోరిక నెరవేరుస్తానని చెప్తున్నారు నట సింహం నందమూరి బాల కృష్ణ. గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రని కూడా రామారావు చేయాలనుకుని చేయలేకపోయారని, తన 100 వ చిత్రంగా ఆ పాత్ర పోషించటం తనకి గర్వంగా ఉంటుందని చెప్పిన బాలయ్య తన తండ్రి కోరుకుని చేయలేని మరి కొన్ని పాత్రలలో అల్లూరి సీతారామరాజు, రామానుజాచార్య తదితర పాత్రలు ఉన్నాయని, త్వరలోనే ఒక్కొక్కటిగా ఆ పాత్రలలో ప్రేక్షకులని మెప్పిస్తానని చెప్తున్నారు బాలయ్య. |
https://www.telugupost.com/crime/man-held-with-gold-wires-worth-over-rs-1-crore-at-jaipur-airport-1379458 | జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 2170.3 గ్రాముల బంగారు తీగలను స్వాధీనం చేసుకున్నారు. 99.50 స్వచ్ఛత కలిగిన ఈ బంగారం విలువ 1,12,20,451 రూపాయలు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. ప్రయాణికుడు షార్జా నుండి ఎయిర్ అరేబియా విమానంలో వచ్చాడు. విమానాశ్రయంలో ప్రయాణీకుల చెక్-ఇన్ బ్యాగేజీని (రెండు ట్రాలీ బ్యాగ్లు) స్కాన్ చేస్తున్నప్పుడు, గుండ్రని వైర్లు ఉన్నట్లు గుర్తించబడింది. అతడిని ప్రశ్నించగా.. తన వద్ద అలాంటి వస్తువులు లేవని ఖండించాడు.అయితే, అధికారులు బ్యాగ్లను తెరిచారు. ఆ తర్వాత రెండు బ్యాగేజీల మధ్య ఇనుప కేసింగ్ వెనుక తెల్లటి రోడియం పాలిష్తో దాచిన బంగారంతో తయారు చేసిన నాలుగు రౌండ్ వైర్లు కనుగొనబడ్డాయి. ప్రయాణికుడిని అరెస్టు చేయగా, కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం బంగారు వైర్లను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశంలోకి బంగారం తీసుకుని రావడానికి ఒక్కొక్కరు.. ఒక్కో రకమైన ప్లాన్ లు వేస్తూ ఉన్నారు. కానీ అధికారులు ఎప్పటికప్పుడు.. ఇలాంటి వాళ్లకు చెక్ పెడుతూ ఉన్నారు. |
https://www.telugupost.com/movie-news/rajanikanth-pettta-trailar-review-103619/ | తలైవా రజనీకాంత్ ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ‘పేట’ సినిమా త్వరలోనే తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. సిమ్రాన్, త్రిష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రజనీ చాలా కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. జనవరి 10న తమిళంలో పాటు తెలుగులో కూడా పేట రిలీజ్ కానుంది. ఈ రోజు ఉదయం తమిళ వర్షన్ ట్రైలర్ ను విడుదల చేసారు. రజనీ, సిమ్రాన్, త్రిష, నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా.. ఇలా ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ స్టార్టింగ్ నుండి నాలుగైదు షాట్స్ రజనీని బ్యాక్ నుండి చూపించడం.. స్లోగా అతని లుక్ రివీల్ చేయటం చేసారు. యాక్షన్, కామెడీ ప్రధానంగా సాగే సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మాస్… క్లాస్ ని ఆకట్టుకునేలా ఫైట్స్ కూడా చాలా స్టైలిష్ గా తీసినట్టు అర్ధం అవుతుంది. ట్రైలర్ మొత్తం రజనీ మరింత యంగ్ గా.. మరింత స్టైల్ గా కనిపించారు. ఈ ట్రైలర్ చివరిలో మాస్ లుక్ తో .. మాస్ బీట్ కి ఆయన వేసిన స్టెప్పులు చూసి తీరవలసిందే. ఈ సంక్రాంతికి తమిళంలో ఈ సినిమా ఒక ఊపు ఊపేస్తుందని ట్రైలర్ బట్టి అర్ధం అవుతుంది. మాస్ తో పాటు క్లాస్ ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ట్రైలర్ ఉంది. విడుదలైన గంటలోనే 5 లక్షల వ్యూస్ వచ్చాయి. తెలుగు వర్షన్ ట్రైలర్ ని త్వరలోనే విడుదల చేయనున్నారు. |
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-geetha-govindham-movie-86694/ | ఆగష్టు 15 న విజయ్ గీత గోవిందం విడుదలై సూపర్ హిట్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తెచ్చుకుంది గత వారం విడుదలైన ఆటగాళ్లు తో సహా ఏ సినిమా మెప్పించలేకపోవడం గీత గోవిందానికి కలిసొచ్చింది. ఇక ఈ వారం రెండు తెలుగు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అందులో ఒకటి నాగ శౌర్య నటించిన @నర్తనశాల ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక శుక్రవారం సంతోష్ శోభన్ నటించిన పేపర్ బాయ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరికొన్ని గంటల్లోనే పేపర్ బాయ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఇక ఈ గురువారం విడుదలైన నాగ శౌర్య @నర్తనశాల సినిమాకి యావరేజ్ టాక్ కూడా రాలేదు. అంటే @నాగ శౌర్య నర్తనశాల కు ప్లాప్ టాక్ వచ్చినట్లే. ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ను మెప్పించలేకపోయింది. @నర్తనశాల సినిమాలో దర్శకుడి పనితీరు ఆకట్టుకున్నప్పటికీ... కొన్నిచోట్ల దర్శకుడు చేసిన పొరపాట్లు ప్రేక్షకుడు కి బాగా బోర్ కొట్టించాయి. ఇంట్రెస్టింగ్ లేని స్క్రీన్ ప్లే, కామెడీ లేకపోవడం.. ఉన్న కామెడీ కూడా బోర్ కొట్టిస్తూ గందరగోళంగా ఉండడం... మ్యూజిక్ లో పస లేకపోవడం... ఏదో అలా అలా సాగిన ఫస్ట్ హాఫ్. ఇక నెమ్మదిగా సాగె కథనంతో కొంత సాధారణ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టె సెకండ్ హాఫ్.... ఇవన్నీ @నర్తనశాల కు మైనస్ గా నిలిచాయి. ఇక కొన్ని సన్నివేశాలు అసహజంగా అనిపించడంతో అవి ఎందుకు పెట్టారా అనిపిస్తుంది. కెమెరా మాన్ విజయ్ సి కుమార్ కెమెరా పనితనం బాగుంది, సినిమాలో ఎడిటింగ్ బాగున్నా..... మరింత శ్రద్ధ పెడితే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ చలో వంటి హిట్ సాంగ్స్ ఇవ్వలేకపోయాడు. మరి @నర్తనశాల టాక్ విజయ్ గీత గోవిందానికి మరింత కలిసొచ్చేలా కనబడుతుంది. ఇప్పటికే 15 రోజులనుండి మంచి కలెక్షన్స్ తో అదరగొడుతున్న గీత గోవిందం సినిమా ఇప్పుడు @నర్తనశాలకొచ్చిన టాక్ తో మరింతగా రెచ్చిపోయేలా ఉంది. ఇక ఈ రోజు పేపర్ బాయ్ అనే చిన్న సినిమా ప్రేక్షకులముందుకు వచ్చినప్పటికీ.. ఆ సినిమా హిట్ అయినా కూడా ఓ అన్నంతగా ప్రేక్షకుల్లోకి వెళ్లడం అంత సులభం కాదు. మహేష్, ప్రభాస్ వంటి స్టార్లు సపోర్ట్ ఉన్నప్పటికీ.. ఆ సినిమాకి హీరో క్రేజ్ లేకపోవడం, డైరెక్టర్ గా అతనికి అనుభవం లేకపోవడంతో పేపర్ బాయ్ పరిస్థితి కూడా సోసోగానే కనబడుతుంది. మరి ఈ లెక్కన ఈ వారం కూడా విజయ్ దేవరకొండ చెలరేగిపోవడం ఖాయంగానే కనబడుతుంది. ఇక ఇప్పటికే 100 కోట్ల క్లబ్బులో సంచలనాలు నమోదు చేస్తున్న విజయ్ కి ఈ నర్తనశాల టాక్ మాత్రం బాగా కలిసొస్తుందని చెప్పాలి. |
https://www.telugupost.com/crime/brother-kills-his-brother-in-uttar-pradesh-1444076 | తన భార్యతో అన్నకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన సోదరుడు.. అన్నను కొట్టి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పరిధిలోని ముకింపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బబ్లూ కుమార్, అర్జున్ కుమార్ అన్నదమ్ములు. బబ్లూ కుమార్ కూలీ పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, ఏడాది వయసున్న కొడుకు ఉన్నారు. కాగా.. ఆదివారం రాత్రి అన్నదమ్ములిద్దరూ కలిసి మద్యం సేవించారు.ఇంటికెళ్లిన బబ్లూ.. తన సోదరుడితో వివాహేతర సంబంధం గురించి భార్యను ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య మాటలయుద్ధం జరుగుతుండగా.. అక్కడికి వెళ్లిన అర్జున్ కూడా ఈ విషయంపై బబ్లూతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. గొడవ పెద్దదైంది. ఒకరినొకరు కొట్టుకుంటూ ఇంట్లో ఉన్న కిచెన్ లోకి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడున్న ఫ్రయింగ్ పాన్తో అన్న బబ్లూ కుమార్ తలపై గట్టిగా కొట్టాడు అర్జున్ కుమార్. బబ్లూ స్పృహతప్పిపడిపోయే వరకు బాదుతూనే ఉన్నాడు. దీంతో బబ్లూ అక్కడే కూలిపోయాడు. వెంటనే అర్జున్ కుమార్ అక్కడ్నుంచి పారిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి వెళ్లి.. బబ్లూని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బబ్లూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అర్జున్ కుమార్ను అరెస్టు చేశారు. |
https://www.telugupost.com/movie-news/kaala-day-2-collections-74648/ | రెండు రోజుల షేర్స్(కోట్లలో)నైజాం 1.70సీడెడ్ 0.60నెల్లూరు 0.17కృష్ణ 0.34గుంటూరు 0.49వైజాగ్ 0.42ఈస్ట్ గోదావరి 0.33వెస్ట్ గోదావరి 0.26రెండు రోజుల రెండు రాష్ట్రాల షేర్స్:4.31 |
https://www.telugupost.com/movie-news/banny-look-has-changed-156756/ | సుకుమార్ – బన్నీ కాంబినేషన్ లో వస్తున్నా పుష్ప పై అంచనాలు బాగానే ఉన్నాయి ప్రేక్షకుల్లో. పైగా సుకుమార్ – బన్నీ కాంబినేషన్ కాబట్టి మరింత అంచనాలు ఉన్నాయి. ఇక బన్నీ తన లుక్ కోసం చాలానే కష్టపడుతున్నాడు. ఇందుకోసం నాచురాలిటీ కోసం కత్తెర పడకుండా అలాగే చింపిరి జుట్టు, చింపిరి గడ్డం ఉంచేద్దాం అనుకున్నారు. పుష్ప కు సంబంధించి ఫోటోషూట్ నాటికి బన్నీకి పర్ఫెక్ట్ మేకోవర్ అయింది. ఇక షూటింగ్ కి వెళ్తున్న టైములో కరోనా వచ్చింది దాంతో షూటింగ్ కి బాగా గ్యాప్ రావడంతో బన్నీ కి జుట్టు, గడ్డం ఇంకా పెరిగింది. దాంతో ఇప్పుడు బన్నీ కు కత్తెర వేయక తప్పడం లేదట. షూటింగ్ స్టార్ట్ ఆయేనాటికి పాత లుక్ ని తీసుకుని రావాలని చూస్తున్నారు. ఈ లాక్ డౌన్ సమయం లో సుకుమార్ కథను మరింత చేంజెస్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటె పుష్ప కాస్ట్యూమ్స్ కోసం అల్లు అర్జున్ వేసుకునే బట్టలని టీలో నానబెట్టి ఒక రెండు రోజుల తర్వాత ఉతుకుతున్నారట. కేవలం నాచురల్ లుక్ కోసమే సుకుమార్ , బన్నీ ఇలా చేస్తున్నారు అని సమాచారం. లాక్ డౌన్ వెత్తివేయగానే షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశముంది. హీరోయిన్ గా రష్మిక నటించనుంది. |
https://www.telugupost.com/movie-news/abhishek-ishwarya-film-82477/ | హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లాడింది. అమితాబ్ ఇంటి కోడలిగా... అభిషేక్ కి భార్యగా.. ఆరాధ్యకి తల్లిగా ఐశ్వర్య తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మల్లి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఐశ్వర్య సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వకముందు అభిషేక్, ఐశ్వర్య గురించిన వార్తలేమి మీడియాలో వచ్చేవి కావు. కానీ ఐష్ సినిమాల్లోకి తిరిగొచ్చాక అమితాబ్, అభిషేక్ కి ఐశ్వర్య పద్ధతులు నచ్చడం లేదని, జయ బచ్చన్ కూడా కోడలితో కాస్త అంటీముట్టనట్లుగా వుంటుందనే న్యూస్ హల్చల్ చేసింది. ఇక ఈ మధ్య కాలంలో అభిషేక్, ఐశ్వర్య కి గొడవలు జరుగుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా కోడలిపై ప్రేమ చూపడం లేదని.. కూతురు శ్వేతా బచ్చన్ పై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నాడంటూ.. ఇలా అమితాబ్ ఫ్యామిలీ మీద రోజుకో వార్త బయలు దేరింది.భర్త అభిషేక్ సినిమా ఉంటుందన్న ఐష్ఇక కొన్ని సందర్భాల్లో అభిషేక్ బచ్చన్ తమ ఇంటి గొడవలపై హుందాగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నవారికి ఘాటు రిప్లై ఇస్తూనే ఉన్నాడు. ఇక ఇలా అభిషేక్ కి, ఐష్ కి గొడవల మూలాన వారిద్దరూ ఇక సినిమాల్లో కలిసి కనిపించే అవకాశం లేదని చాలా మందే ఫిక్స్ అయ్యారు. అయితే వారిద్దరూ కలిసి నటించే విషయమై ఐశ్వర్య రాయ్ ఇప్పుడు పూర్తి క్లారిటీ ఇచ్చింది. తాను తన భర్త అభిషేక్ త్వరలోనే ఒక సినిమాలో కలిసి నటించబోతున్నట్టుగా చెప్పింది. ప్రస్తుతం తాను ఫన్నేఖాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఐశ్వర్య రాయ్ తాను తన భర్త ఒక సినిమాలో నటించబోతున్నామని... అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో ఈ సినిమా ఉంటుందని తెలిపింది.ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీఅనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆ సినిమా టైటిల్ ని కూడా రివీల్ చేసింది ఐష్. గులాబ్ జామున్ అనే టైటిల్ తో ఆ సినిమా తెరకెక్కబోతుంది.. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్గా ఉండబోతుందని... ఇక ఈ సినిమా లో ఐశ్వర్య , అభిషేక్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా సమాచారం. మరి ఐశ్వర్య మరియు అభిషేక్ దాదాపుగా ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు వెండితెర మీద కనిపిస్తున్నారు. గతంలో ధూమ్ 2, గురు, రావణ్ ఇలా చాలా సినిమాల్లో కలిసి నటించారు. |
https://www.telugupost.com/movie-news/prabhas-shradha-kapoor-saaho-review-and-collections-131764/ | రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా నేషన్ వైడ్ గా కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా విడుదలైనా.. ఆ సినిమా క్రేజ్ వేరు. మొదటి నుండి దర్శకుడు రాజమౌళి బాహుబలి ప్రమోషన్స్ విషయంలో ఓ స్ట్రాటజీని మైంటైన్ చేసాడు. అందుకే బాహుబలి సినిమా లుక్స్ రివీల్ అయినదగ్గరనుండి సినిమా మీద విపరీతమైన హైప్ వచ్చింది. అలాగే సినిమాలోని పాత్రలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. రాజమౌళి బాహుబలి ని హిందీలో దింపేటప్పుడు.. చాలా ప్లానింగ్ తో అక్కడి మార్కెట్ ని సెట్ చేసాడు. అందుకే సినిమాకి ఎక్కడా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. హీరో ప్రభాస్ తో పాటుగా రాజమౌళి బాహుబలి ప్రమోషన్స్ ని పక్కా గా ప్లానింగ్ తో నిర్వహించాడు. ఇక సినిమా భారీగా తెరెకెక్కినా.. బాహుబలి అద్భుతమైన కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రభాస్ కూడా ఆరడుగుల ఆజానుబాహుడిలా.. యుద్దాలు చెయ్యడం, అనుష్క తో రొమాంటిక్ లవ్ ట్రాక్, తల్లి తో, భార్య తో ఎమోషనల్ ట్రాక్ లో ఇరగదీసాడు. ఇక బాహుబలి పాటల విషయము అంతే.. ఒక్కో పాట ఒక్కో అద్భుతం. కానీ ప్రభాస్ సాహో చిత్రాన్ని ఓ కుర్ర దర్శకుడు తీస్తున్నాడు అంటే అతని స్టామినా మీద మొదటి నుండి డౌట్. అలాగే కేవలం యాక్షన్ నే నమ్ముకుని సినిమా చెయ్యడం అంటే.. ఈ కాలంలో రిస్క్ తో కూడుకున్నదే. కథ లేకపోయినా.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాని నడిపెయ్యోచ్చు. కానీ సాహో స్క్రీన్ ప్లే చాలా గందరగోళంగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ చాలా డల్ గా కనిపిస్తాడు. చాలా లేజీ గా కనిపిస్తాడు. హీరోయిన్ తో లవ్ ట్రాక్ లో ప్రభాస్ తేలిపోయాడు. బాహుబలి లో ప్రభాస్ నటనతో పోలిస్తే.. సాహో లో ప్రభాస్ నటన 70 పెర్సెంట్ కూడా లేదు. ఇక యాక్షన్ మీద పెట్టిన శ్రద్ద పాత్రల మీద పెట్టలేదు. చిన్న చిన్న విషయాలకు డబ్బు నీళ్లలా వెదజల్లారు. ఆ విషం సినిమాలోని ప్రతి సీన్ లో తెలుస్తుంది. ఇక ప్రమోషన్స్ ని కూడా చాలా లేట్ గా మొదలెట్టడం, సుజిత్ ని హైప్ చెయ్యకుండా ప్రభాస్, శ్రద్ద కపూర్ లే హైలెట్ కావడం, ఇక బాలీవుడ్ నుండి పెద్ద నటులను తీసుకున్నారు కానీ.. సినిమాలో వాళ్ళనెందుకు తీసుకున్నారో ఎక్కడా ఓ పట్టాన అర్ధం కాదు. ఇక పాటలు విషయంలోనూ రాంగ్ స్టెప్ వేశారు. ఒక్కో పాటకి ఒక్కో సంగీత దర్శకుడు. ఒక్క పాట ఆకట్టుకోలేదు. మరి సాహో కి 300 కోట్ల పెట్టుబడి పెట్టారు.. కానీ ఈ టాక్ తో ఇప్పుడు అంత రికవరీ చెయ్యడం కష్టం సుమీ అనే గుసగుసలు ఫిలింనగర్ లో వినబడుతున్నాయి.. |
https://www.telugupost.com/movie-news/mahesh-babu-daughter-sitara-birthday-celeberations-80703/ | ఫ్యాన్స్ కు తమ హీరోస్ బర్త్ డేస్ అంటే వాళ్లకి పండగలాగా. వారి పుట్టినరోజున ఎదోకరకంగా సెలెబ్రేట్ చేసుకోవడం ఎన్టీఆర్..ఏఎన్ఆర్ టైం నుండే చూస్తున్నాం. ప్రస్తుతం ఆ ఫీవర్ మరింత ఎక్కువైందనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ లో మహేష్ బాబు ఒకడు. ప్రిన్స్ అని ముద్దుగా పిలుచుకునే ఫ్యాన్స్ మహేష్ బర్త్ డేని ఎంతలా సెలెబ్రేట్ చేసుకుంటారో వేరే చెప్పనవసరంలేదు.అదే విధంగా స్టార్ హీరోల పిల్లలు బర్త్ డేలు కూడా ఇంచుమించు అదేవిధంగా జరుపుకుంటుంటారు. మహేష్ కూడా సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా చిన్నప్పటినుండే స్టార్ కిడ్ ఇమేజ్ ని ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. అసలు విషయం ఏంటంటే..ఈరోజు మహేష్ బాబు గారాలపట్టి అయిన సితార పుట్టినరోజు. ఈ పాపా పుట్టినరోజు మహేష్ ఫ్యామిలీయే కాదు తమ ఫ్యాన్స్ కూడా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.ఇక మహేష్ ఫ్యామిలీకి అయితే ఇది ఒక పెద్ద సెలబ్రేషనే కదా.. దాంతో కేక్ కట్ చేసి బర్త్ డే హంగామా చేశారు. దానికి సంబందించిన ఫొటోస్ కూడా బయటికి వచ్చాయి. ఆ కేక్ మీద మహేష్ ఫామిలీతో ఉన్న ఫోటో ఉంది. ఆ కేక్ కట్ చేసుకుని ఒకరిఒక్కరు తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. |
https://www.telugupost.com/crime/son-attacks-father-with-knife-in-telangana-father-attacks-son-with-knife-in-andhra-pradesh-1478276 | తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ క్రైం రేటు పెరుగుతోంది. ఇటీవల పరువు హత్యలు, ఆత్మహత్యలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు జరుగుతున్నాయి. ఇటీవల ఏపీలో ఓ తండ్రి మద్యానికి డబ్బు ఇవ్వడం లేదని కొడుకు తల నరికి దానితో గ్రామ వీధుల్లో తిరిగిన ఘటన కలకలం రేపింది. తాజాగా ఏపీ, తెలంగాణల్లో మరో రెండు ఘటనలు జరిగాయి. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం మావిళ్ళపాడు గ్రామంలో మద్యానికి బానిసైన తండ్రి సుబ్రమణ్యం.. మద్యం మత్తులో 10 ఏళ్ల కొడుకుపై కత్తితో దాడిచేశాడు. అడ్డుకోబోయిన బంధువులపై కూడా సుబ్రమణ్యం దాడి చేయగా వారంతా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తండ్రిపై కొడుకు కత్తితో దాడి చేశాడు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం టీక్యా తండాకు చెందిన బానోతు రాములు తొర్రూరుకు వచ్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి రాములుపై కొడుకు స్వామి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. రాములును 108 వాహనం ద్వారా వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని స్వామిని అదుపులోకి తీసుకున్నారు. |
https://www.telugupost.com/top-stories/it-will-be-three-years-since-ys-jagan-came-to-power-jagan-has-focused-on-governance-for-three-years-1351718 | జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతుంది. మూడేళ్లు పాలనపైనే జగన్ దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంపైనే జగన్ ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేశారు. తాను పాదయాత్రలో ఇచ్చిన హామీలు, మ్యానిఫేస్టోలో పెట్టిన అంశాలు అమలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందులో తప్పులేదు. ఇప్పటికే 90 శాతం హామీలను నెరవేర్చానని చెప్పుకునే వీలు జగన్ కు కలిగింది. ఏదో పథకం ద్వారా లబ్దిదారులకు నగదును అందచేస్తూనే ఉన్నారు.పార్టీని పూర్తిగా....కానీ మూడేళ్ల నుంచి పార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారు. జిల్లాల్లో అసలు కార్యవర్గం ఉందా? అన్న సందేహం కలుగుతుంది. పార్టీ కార్యవర్గాన్ని మూడేళ్లవుతున్నా ఇంతవరకూ ప్రక్షాళన చేయలేదు. 2019 ఎన్నికలకు ముందు ఏ కార్యవర్గం ఉందో అదే నేటికీ కంటిన్యూ అవుతుంది. పోనీ పార్టీ నేతలు జగన్ జిల్లాల పర్యటనకు వస్తే తప్పించి ఎక్కడా వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. ఆ తీరికే లేదా?మూడేళ్ల నుంచి కనీసం పార్టీని పట్టించుకునేంత సమయం లేదా? అన్న ప్రశ్న ఆ పార్టీ నేతల నుంచే వినపడుతుంది. పోనీ నియోజకవర్గాలు, జిల్లాల్లో పార్టీ నేతలు ఐక్యతగా ముందుకు సాగుతున్నారా? అంటే లేదనే చెప్పాలి. దాదాపు వంద నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ప్రభుత్వ పదవులు కొందరికి లభించడం, మరికొందరికి దక్కకపోవడంతో సహజంగా అసంతృప్తి తలెత్తుతోంది. మూడేళ్ల నుంచి ప్లీనరీని కూడా వైసీపీ నిర్వహించడం లేదు. దీంతో జగన్ పార్టీ క్యాడర్ కు మూడేళ్ల నుంచి కన్పించడం లేదు.కొత్త జిల్లాలు ఏర్పడినా...?ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయి. ఈ జిల్లాలతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా నియమించాల్సి ఉంది. ఇదేమీ పట్టనట్లువ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్షలు చేసుకుంటున్నారు. కనీసం పార్టీ పరిస్థితిపై ఒక్కసారి సమీక్ష చేసి ఉంటే బాగుండేదని పలువురు సీనియర్ నేతలు సయితం అభిప్రాయపడుతున్నారు. పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సయితం పార్టీపై దృష్టి పెట్టిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా పార్టీని, క్యాడర్ ను జగన్ పట్టించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో లెక్కలు మారతాయన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. |
https://www.telugupost.com/movie-news/aravinda-sametha-collections-3-96111/ | ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత - వీర రాఘవ విడుదలై 25 రోజులైంది. గత నెల 11న దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా.. మొదట్లో నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మెళ్లిగా పుంజుకుంది. పూజ హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో బసిరెడ్డిగా జగపతి బాబు విలనిజం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ అరవింద సమేత ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన వసూళ్లు చూస్తే బయ్యర్లు కొద్దిగా నష్టాల బారిన పడినట్లే కనబడుతుంది. కోట్లలో కాకపోయినా లక్షల్లో బయ్యర్లు నష్టపోయే ఉంటారు. మరి అరవింద సమేత వరల్డ్ వైడ్ గా ఫైనల్ రన్ లో ఎంత వసూలు చేసింది అంటే...ఏరియా షేర్స్(కోట్లలో)నైజాం 19.40సీడెడ్ 13.50వైజాగ్ 7.70కృష్ణా 4.69గుంటూరు 7.18ఈస్ట్ గోదావరి 5.10వెస్ట్ గోదావరి 4.50నెల్లూరు 2.77కర్ణాటక 8.00ఓవర్సీస్ 8.00ఇతర ప్రాంతాలు 4.50ప్రపంచవ్యాప్త షేర్ 85.34కోట్ల |
https://www.telugupost.com/movie-news/హీరోయిన్-రేంజ్-నుండి-కేర-28487/ | ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలగకపోయినా... దాదాపు పెద్ద స్టార్స్ అందరితో నటించింది హీరోయిన్ భూమిక. కెరీర్ పీక్ స్టేజి లో ఉండగానే యోగా గురువుని పెళ్లి చేసుకుని రీల్ లైఫ్ ని వదిలేసి రియల్ లైఫ్ లో సెటిల్ అయ్యింది. ఇక పెళ్లి చేసుకున్నాక భూమిక హీరోయిన్ గా కంటే సినిమాలు నిర్మించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఒక్క సినిమాతోనే చాలా నష్టపోయింది. ఇక అప్పటినుండి సైలెంట్ అయిన భూమిక కి ఈ మధ్యన ఆర్ధిక కష్టాలు ఎక్కువయ్యాయని అంటున్నారు. ఆ కారణంగానే ఇప్పుడు భూమిక మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిందని అంటున్నారు. భూమిక సెకెండ్ ఇన్నింగ్స్ లో ధోని చిత్రంలో హీరోకి అక్కగా నటించింది. ధోని చిత్రం హిట్ అయినప్పటికీ కూడా భూమిక అనుకున్న క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. ఇక ఇప్పుడు అలాగే కేరెక్టర్ పాత్రలు చెయ్యడానికి సిద్ధపడిపోయింది. అందులో భాగంగానే ఇప్పుడు నాని హీరోగా వస్తున్న ఒక చిత్రంలో నానికి అక్కగా నటించేందుకు భూమిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. అయితే ఇలా భూమిక కేరెక్టర్ పాత్రలు ఒప్పుకోవడానికి కారణం మాత్రం కేవలం ఆర్ధిక సమస్యలు ఉండడం వలెనే అని అంటున్నారు. ఇక ఇప్పుడు అక్కా. చెల్లి పాత్రలకు మంచి పేరు గనక వస్తే భూమిక ఇక ఇలానే సినిమాల్లో కంటిన్యూ అవుతుందని అంటున్నారు. చూద్దాం భూమిక సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో...!! |
https://www.telugupost.com/movie-news/బెల్లంకొండ-హీరోతో-గౌతమ్-10791/ | బెల్లం కొండ సురేష్ తన కొడుకు ని ఎలాగైనా హీరో చెయ్యాలని కంకణం కట్టుకుని మొదటి సినిమానే భారీ లెవల్లో నిర్మించాడు. ఇక బెల్లంకొండ సురేష్ తన కొడుకు శ్రీనివాస్ కోసం మొదటి సినిమాకే సమంత, తమన్నా వంటి స్టార్ హీరోయిన్స్ తో జోడి కట్టించాడు. మొదటి సినిమానే స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ తో డైరెక్ట్ చేయించాడు బెల్లంకొండ. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తో నిలబడింది. ఇక రెండో సినిమాని భారీ లెవల్లో తెరకెక్కించాడు. ఈ సినిమాకి రీమేక్ సినిమాలకు పేరొందిన భీమినేని దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో సోనారిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే మూడవ సినిమాతోనైనా తన కొడుక్కి హిట్ ఇవ్వాలనే ఉద్దేశ్యం తో మాస్ డైరెక్టర్ బోయపాటిని లైన్ లో కి తెచ్చాడు. కానీ బోయపాటికి బెల్లంకొండ ఆఫర్ అయితే నచ్చింది కానీ ఆయన కొడుకు శ్రీనివాస్ సరిగా నచ్చలేదేమో ఈ సినిమా చెయ్యడానికి పెద్దగా ఆశక్తి చూపించడం లేదనే టాక్ మొదలైంది.అందుకే బెల్లంకొండ మరో డైరెక్టర్ ని లైన్ లో పెట్టాడని అంటున్నారు. ఈ విషయాన్ని బెల్లంకొండ స్వయం గా ఒక ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ కి, బెల్లంకొండకి పాత పరిచయాల కారణం గా గౌతమ్ మీనన్ ని తన కొడుకుతో ఒక సినిమా చెయ్యమని కోరాడట. ఇక దీనికి గౌతమ్ కూడా ఒప్పుకున్నాడట. అయితే ఈ విషయాలన్ని బెల్లంకొండ సాహసం శ్వాసగా సాగిపో సినిమా ప్రెస్ మీట్ లో బయటపెట్టాడు. సాహసం శ్వాసగా సాగిపో చిత్రం నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ డైరెక్టన్ లో తెరకెక్కింది. ఈ చిత్రం నవంబర్ 11 న విడుదలకి సిద్ధమైంది. ఇక ఈ సినిమా తర్వాత గౌతమ్ బెల్లంకోండ శ్రీనివాస్ ని డైరెక్ట్ చేస్తాడన్న మాట. ఇక ఈ ప్రాజెక్ట్ ని బెల్లంకొండ సురేష్ ఏ లెవెల్లో తెరకెక్కిస్తాడో చూద్దాం. |
https://www.telugupost.com/movie-news/కత్రినా-అందాల-విందు-45795/ | బాలీవుడ్ లో కత్రినా కైఫ్ ని హీరోయిన్ అనే కంటే అదిరిపోయే ఐటెం భామ అంటే బావుంటుందేమో. ఎందుకంటే కత్రినా కైఫ్ కి బాలీవుడ్ లో హీరోయిన్ కంటే ఐటెం భామగానే మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ టాప్ మూవీస్ లో ఐటెం సాంగ్స్ లో చిందులేసి అదరహో అనిపించినా కత్రినా మరోపక్క రణబీర్ కపూర్ తో ఉన్న ప్రేమ వ్యవహారంతో కూడా ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూనే ఉండేది. వారు ప్రేమలో ఉన్నప్పుడు ఎంత హైలెట్ అయ్యారో... చివరికి బ్రేకప్ తర్వాత కూడా కత్రినా, రణబీర్ కపూర్ల జంట అంతే హైలెట్ అయ్యింది. సినిమాల్లోని అందాలతోనే కాకుండా బయట కూడా మెరిసిపోయే కత్రినా కైఫ్ ఇప్పుడొక ఎర్ర ఎర్రమందారం లాంటి ఫోజులతో హీటెక్కిస్తోంది.ఫోటో షూట్స్ తో అందాల ఆరబోతతో ఎప్పటికప్పుడు చెలరేగిపోయే కత్రినా ఇప్పుడు కూడా హార్పర్స్ బజార్ బ్రైడ్ మ్యాగజైన్ కోసం సూపర్ స్పెషల్ ఫోటో షూట్ లో మెరిసింది. ఎప్పటికప్పుడు మోడ్రెన్ అందాలతో రెచ్చిపోయే కత్రినా కైఫ్ ఇప్పుడు ఇలా బ్రైడల్ వేర్ డ్రెస్ లో అదిరిపోయే అందాలతో ఆ మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చేసింది. ఎర్ర మందారంలా.. రెడ్ కలర్ డ్రెస్సుతో కనబడి కనబడని అందాలతో... మత్తెక్కించే చూపులతో... ముక్కుకు ముక్కుపుడక, వేలుకి స్పెషల్ డిజైన్ రింగ్ తో, నుదిటిపీమీద బొట్టుతో అందానికే అసూయ పుడుతుందా అనే రేంజ్ లో కనబడుతుంది.ఇక పైన చెప్పిన కత్రినా అందాలకు సరిపడా ఆ ఫోటో పైన హార్పర్స్ బజార్ బ్రైడ్ మ్యాగజైన్ వారు హీట్ పెంచుతున్న కత్రినా కైఫ్ అంటూ ట్యాగ్ లైన్ పెట్టేసారు. మరి కత్రినా ఒక్క చూపుతో కొన్ని కోట్లమంది కుర్రాళ్ళ గుండెల్లో కొలువైపోతుందా అనిపిస్తుంది. |
https://www.telugupost.com/movie-news/sai-dharan-tej-సాయి-ధరమ్-తేజ్-director-maruthi-upcoming-movie-124631/ | మారుతీ దర్శకుడిగా తెరకెక్కిన చాలా సినిమాల్లో హీరోకి ఏదో ఒక లోపం పెట్టి దాని నుండి కామెడీని బయటికి తీసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవాడు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల్లో హీరోలకు మతిమరుపు, అతి శుభ్రమనే రెండు కేరెక్టర్స్ తో సినిమా మొత్తం హాస్యం పండించాడు. ఇక తాజాగా మారుతీ దర్శకుడిగా సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమా అతి త్వరలోనే మొదలు కాబోతుంది. అయితే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెట్టుకింద ప్లీడరు అంటే లాయర్ గా హాస్యం పండిస్తాడని అన్నారు. కానీ తాజాగా మారుతీ – సాయి ధరమ్ తేజ్ ల కాంబో మూవీ అంతా కుటుంబాలతో కళకళలాడుతూ… అందరూ నవ్వుతూ తుళ్ళుతూ పండగలా ఉంటుందట. అందుకే ఈ సినిమాకి ప్రతి రోజు పండగ అయినా.. లేదంటే భోగి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఇకపోతే ఈసారి మారుతీ ఎప్పటిలాగా హీరోకి ఏదో ఒక ఒంక పెట్టకుండా.. ఈసారి హీరోయిన్ పై ట్రై చేస్తున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ కి మంచి ప్రాధాన్యత ఉండడమే కాదు.. హీరోయిన్ కి గ్లామర్ మాత్రమే కాకుండా ఆ పాత్ర ద్వారా కావాల్సినంత కామెడీని పండించడానికి చూస్తున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కి టిక్ టాక్ వీడియోస్ చేసే అలవాటు ఉంటుందట. మరి చాలా తక్కువ కాలంలో టిక్ టాక్ వీడియోస్ ఎంతగా పాపులర్ అయ్యాయో చూస్తున్నాం. మరి హీరోయిన్ టిక్ టాక్ వీడియోస్ హాబీస్ తో ఈసారి మారుతీ కామెడీని పండించబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో నడుస్తుంది. అయితే మారుతీ ఇంకా సాయి తేజ్ కోసం హీరోయిన్ ని సెట్ చెయ్యలేదు. నిన్నమొన్నటివరకు అనేక రకాల పేర్లు వినబడినా.. తాజాగా మెహ్రీన్ కౌర్ అయితే బావుంటుందని మారుతీ అనుకుంటున్నాడట. కానీ సాయి ధరమ్ మాత్రం మెహ్రీన్ వద్దని అడ్డుపడుతున్నాడని టాక్. ఇక నిర్మాతలు అయితే మెహ్రీన్ కి అయితే గట్టిగా ఇవ్వాలి గనక అల్లు శిరీష్ తో కలిసి ఎబిసిడి లో నటించిన రుస్కర్ ని సాయి తేజ్ కి జోడిగా తీసుకోబోతున్నారని అంటున్నారు. మరి రుస్కర్ టిక్ టాక్ వీడియోస్ తో మారుతీ సినిమాలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యబోతుందన్నమాట. |
https://www.telugupost.com/movie-news/తమ్ముడి-తర్వాతే-నా-పెళ్ల-4495/ | అక్కినేని వారి ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నాగార్జున కొడుకులు ఇద్దరూ పెళ్లికి సిద్ధమైపోయారు. వీరిద్దరూ తమ కాబోయే భాగస్వాములను వారే ఎంచుకున్నారు. నాగార్జున జస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. అక్కడితో ఆనందించారు. కాకపోతే అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగబోయేది ఎప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరొకవైపు గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్థం పూర్తిచేసినట్లు కొన్ని పుకార్లు కూడా వచ్చాయి.అయితే నాగచైతన్య ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ ఈ విషయాల్లో కాస్త క్లారిటీ ఇచ్చాడు. ముందుగా తమ్ముడు అఖిల్ పెళ్లి అయిన తర్వాతే తన పెళ్లి ఉంటుందని చైతూ చెప్పాడు. అయితే అన్నయ్య పెళ్లిని ఆలస్యంగా ఎందుకు షెడ్యూలు చేశారనేందుకు ఆయన కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాకపోతే తమ పెళ్లి వచ్చే ఏడాది ఉంటుందని మాత్రం చెప్పాడుఅయితే సమంత గురించి వ్యాపిస్తున్న మరో రకం పుకార్లకు కూడా నాగచైతన్య ఈ టీవీ ఛానెల్ వారి ఇంటర్వ్యూ ద్వారా ఫుల్స్టాప్ పెట్టాడు. పెళ్లి అయిన తర్వాత సమంత సినిమాలు మానేస్తున్నదని, అందుకే ఇప్పుడు చేతిలో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేస్తోందని, కొత్తవి ఒప్పుకోవడం లేదని కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే .. సమంత పెళ్లయిన తర్వాత కూడా యధావిధిగా సినిమాలు చేస్తుందని చైతూ వెల్లడించాడు.సో, అభిమానులకు సస్పెన్స్ తీరిపోయినట్లే. పెళ్లి తేదీలు వెల్లడించలేదు గానీ.. ముందుగా తమ్ముడి పెళ్లి ఉంటుందని తేలింది. |
https://www.telugupost.com/movie-news/మెగాస్టార్స్-ఇద్దరిని-అం-42412/ | బాలకృష్ణ తన 'పైసా వసూల్' కోసం పిచ్చగా, ఎనర్జిటిక్ గా ప్రమోషన్ లో పాల్గొంటూ ఫ్యాన్స్ కి మత్తెక్కిస్తున్నాడు. పబ్లిసిటీ లో భాగంగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలకృష్ణ ఇండియాలో నటీనటులు రాజకీయ రంగ ప్రవేశంపై, వారికి రాజకీయాల్లో ఉన్న మనుగడపై సంచలనంగా మాట్లాడాడు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి, బాలీవుడ్ మెగాస్టర్ అమితాబచ్చన్ రాజకీయాల్లోకి రావడంపైనా మాట్లాడి టాక్ అఫ్ ద టౌన్ అయ్యాడు.రాజకీయాల్లోకి వచ్చేసి ఏదో పీకేద్దామంటే అది అంత సులభంగా జరగదని... సినిమాల్లో చూపించినట్టు రాజకీల్లోకి ఈజీగా వచ్చేసి చక్రం తిప్పేసినట్టు నిజ జీవితంలో రాజకీయాల్లో రాణించడం అంటే అంత సులభం కాదంటూసెలవిచ్చాడు. సినిమా నటుల్లో రాజకీయాల్లో చక్రం తిప్పడం అనేది కేవలం రామారావు గారి వల్లే అయ్యిందని... బాలీవుడ్ లో అమితాబచ్చన్ ఉన్నాడు, ఆయన రాజకీయాల్లో ఏం ఒరగబెట్టాడు. పార్లమెంట్ కి వెళ్లి ఆటో గ్రాఫ్ లు ఇవ్వడం తప్ప... అంటూనే టాలీవుడ్ లో చిరంజీవి ఉన్నాడు, ఆయన రాజకీయాల్లో ఏం చేయగలిగాడు... రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదన్నాడు. ఆ విషయం తాను రాత పూర్వకంగా రాసిస్తానని మరి చెబుతున్నాడు.అసలు సినిమా నటులెవరు రాజకీయాల్లోకి రావొద్దంటూ ఒక సలహా కూడా పారేసాడు. అలాగే మరి మీరు ఇటు సినిమాల్లో అటు రాజకీయాలను ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు... అలాగే మీరు ఎమ్మెల్యే గా హిందూపురానికి చేసిందేమిటి అని సదరు యాంకర్ ప్రశ్నించగా.. దానికి బాలయ్య మా వంశం వేరు.... మా బ్లడ్ వేరు... దేనికైనా క్రెడిబిలిటీ ఉండాలి. సినిమా స్టార్ అనే టాగ్ ఒకటే సరిపోదు. అలాగే వేరే హీరోలు సినిమాల్లో చెబితే అది డైలాగ్.. కానీ నేను మాట్లాడేది మాత్రం సినిమాల్లోని డైలాగ్ కాదు. అసలు నేనేం మాట్లాడాలనుకున్నానో అది స్పష్టంగా మాట్లాడతా. అంతెందుకు నాకు ఎవరైనా నచ్చితే నమస్కారం పెడతా.. లేదంటే వాడు ఎలాంటి వాడైనా సరే కేర్ కూడా చేయను. నా నేచర్ అలాంటిది. మా నాన్న బ్లడ్.. నా సినిమాల క్యారెక్టర్ల ప్రభావం నా నేచర్కు కారణాలు అంటూ ఊదరగొట్టేసి సదరు యాంకర్ కి పిచ్చెక్కించేసాడు. |
https://www.telugupost.com/movie-news/ram-charan-boyapati-vinaya-vidheya-rama-review-105288/ | ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాతి పండగేమో కానీ.. సినిమాల పండగ మాత్రం మొదలైంది. మొన్న బుధవారం నుండి థియేటర్స్ లో సినిమాల మీద విడుదలవుతానే ఉన్నాయి. ప్రేక్షకుడికి ఏ సినిమా చూడాలో కూడా ఆలోచించడానికి గ్యాప్ ఇవ్వనన్నీ సినిమాలు రోజుకొకటి చొప్పున థియేటర్స్ లో హడావిడి మొదలు పెట్టాయి. బుధవారం మొట్టమొదటిగా బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ కథానాయకుడిని ప్రేక్షకులు ముందు తేవడం.. పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం జరిగాయి. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో కథానాయకుడిగా ఇరగదీశాడని ప్రేక్షకులు చెబుతున్నమాట. నిడివి ఎక్కువ లాగింగ్ సీన్స్ వలన కాస్త నెగటివ్ పడింది కానీ.. సినిమా సూపర్ అంటున్నారు. ఇక ప్రేక్షకులే కాదు.. రివ్యూ రైటర్స్ కూడా ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడి కి ఓవరాల్ గా త్రీ రేటింగ్స్ ఇచ్చేసి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చేసారు. మరి ఈ సంక్రాంతికి మొదటిగా బోణీకొట్టిన బాలయ్య థియేటర్స్ లో ఉండగానే.. నిన్న గురువారం కోలీవుడ్ నుండి రజినీకాంత్ పెటా రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. పెటా సినిమాలో రజినీకాంత్ స్టయిల్ కి ఆయన అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకుడు కూడా ఫిదా అవుతున్నాడు. కాకపోతే పెటా సినిమా రజిని అభిమానులకే అన్నటుగా ఉందని.. ప్రేక్షకుల తీర్పు ఇవ్వడమే కాదు.. రివ్యూ రైటర్స్ కూడా పేట కి మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు. ఇక వీక్ ప్రమోషన్స్ కూడా పేట కలెక్షన్స్ కి దెబ్బపడేలా కబడుతున్నాయి… అసలే థియేటర్స్ కొరతతో, పేట నిర్మాత.. ఇటు ప్రమోషన్స్ ని పట్టించుకోలేదు. ఇక ఆ రెండు సినిమాల పరిస్థితి అలా ఉంటే.. ఇక ఈరోజు ముచ్చటగా మూడో సినిమాగా బరిలోకి దిగబోతున్న రామ్ చరణ్ వినయ విధేయరామ మీద భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ – కైరా అద్వానీ జంటగా వివేక్ ఒబెరాయ్ విలన్ గా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయరామ టాక్ మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. ఇక రేపు శనివారం మరో ఫ్యామిలీ, కామెడీ ఎంటెర్టైనెర్ కూడా బరిలోకి చివరి సినిమాగా రాబోతుంది. వెంకటేష్, వరుణ్ తేజ ల ఎఫ్ టు మల్టీస్టారర్ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే ప్రమోషన్స్ మాత్రం కాస్త వీక్ అన్నట్టుగా ఉన్నాయి. ఈ రోజు, రేపు విడుదలకాబోయే సినిమాలకు ప్రేక్షకులిచ్చే తీర్పు ఎలా ఉండబోతుంది అనేది చాలా తక్కువ సమయంలోనే తెలిసిపోతుంది. |
https://www.telugupost.com/movie-news/అర్జున్-రెడ్డి-హిందీ-హీర-53404/ | ఈ సంవత్సరం తెలుగులో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ అంతే భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటన, అతడి మాటలు యువతను కట్టిపడేశాయి. కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం వసూళ్లు కురిపించింది. ఈ చిత్రం రీమేక్ హక్కులు సైతం భారీ రేట్లకు అమ్ముడుపోయాయని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం తమిళ రీమేక్ ‘వర్మ’ అని తెరకెక్కుతుంది. ఈ చిత్రంతో చియాన్ విక్రమ్ తనయుడు ‘ధృవ్’ తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే..అయితే ఈ చిత్రం హిందీ రీమేక్ లో తొలుత రణ్వీర్ సింగ్ నటిస్తాడని అందరూ అనుకున్నారు.. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఆ పాత్ర మరో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ కు వెళ్లిందనే టాక్ వినబడుతుంది. ఇప్పటికే పద్మావతి చిత్రంలో అలావుద్దీన్ ఖిల్జీ వంటి నెగటివ్ పాత్రను పోషించిన రణ్వీర్ వెంటనే మరోసారి నెగటివ్ ఛాయలున్న పాత్రను చేయడానికి సిద్ధంగా లేడట. దాంతో ఈ చిత్రం షాహిద్ కపూర్ వద్దకు వెళ్లిందని సమాచారం. ఇప్పటికే ‘ఊడ్త పంజాబ్’ చిత్రంలో డ్రగ్స్ కు బానిసైన రాక్ స్టార్ గా షాహిద్ నటన విమర్శకులను మెప్పించింది. అందుకే ఈ అర్జున్ రెడ్డి పాత్ర కూడా షాహిద్ కి నప్పుతుందని భావిస్తున్నారట చిత్ర నిర్మాతలు. అలాగే ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే హిందీలో కూడా దర్శకత్వం వహించే అవకాశముంది. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. |
https://www.telugupost.com/movie-news/some-are-targeting-samantha-as-a-social-media-platform-after-her-divorce-from-nagachaitanya-203789/ | నాగచైత్యన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతను సోషల్ మీడియా వేదికగా కొందరు టార్గెట్ చేస్తున్నారు. వీరందరికీ సమంత సమాధానం చెప్పారు. తనకు ఎవరితోనూ ఎఫైర్స్ లేవన్నారు. తాను పిల్లలు వద్దన్నానని అనడం కూడా అవాస్తవమని సమంత తెలిపారు. తాను అవకాశవాదిని కానని, అబార్షన్ లు చేయించుకోలేని కూడా సమంత స్పష్టత నిచ్చారు. తనపై ఇలాంటి ప్రచారం చేయడం బాధాకరమన్ానరు. తాను ఆందోళనలో ఉన్న సమయంలో ఇలాంటి ప్రచారాలను చేస్తేఊరుకోనని కూడా సమంత హెచ్చరించారు. |
https://www.telugupost.com/movie-news/భరత్-అనే-నేను-సినిమా-మూల-క-68601/ | 'భరత్ అనే నేను' సినిమాకి మూల కథ అందించింది శ్రీహరి నాను అని అందరికి తెలిసిన విషయమే. ఇతను డైరెక్టర్ కొరటాల శివకి ఫ్రెండ్. అతను చెప్పిన లైన్ నచ్చడంతో కొరటాల అతని దగ్గర నుండి ఆ లైన్ తీసుకుని మహేష్ బాబు తగ్గట్టు స్క్రిప్ట్ డెవెలప్ చేసాడు. శ్రీహరి నాను అనే వ్యక్తి రెండు మూడు సినిమాలు దర్శకత్వం కూడా చేసాడు. భూమిక హీరోయిన్ గా ‘సత్యభామ’ అనే సినిమా రూపొందించిన దర్శకుడు ఇతనే. ఆ సినిమా అంతగా ఆడలేదు. కానీ శ్రీహరి పనితీరు నచ్చి అతడి దర్శకత్వంలో భూమిక ‘తకిట తకిట’ అనే సినిమా కూడా నిర్మించింది. అది కూడా అంతగా ఆడలేదు. ఆ తర్వాత అతను కొన్ని సినిమాలకి రైటర్ గా పని చేసాడు. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. మళ్లీ ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత అతడి పేరు వార్తల్లోకి వచ్చింది. నిన్న జరిగిన భరత్ అనే నేను సక్సెస్ సెలెబ్రేషన్స్ డైరెక్టర్ కొరటాల మాట్లాడుతూ...తెలుగు పరిశ్రమలో ఉన్న అత్యుత్తమ రచయితల్లో శ్రీహరి నాను ఒకడని కొరటాల కితాబిచ్చాడు. అతను ఏ కథ రాసుకున్న మహేష్ బాబుని ద్రుష్టిలో పెట్టుకునే కథ రాస్తాడని... అలాంటి గొప్ప నటుడి కోసం కథ అంటే ఇన్స్పిరేషన్ వచ్చి మరింత బాగా రాస్తానని అతడి నమ్మకమని కొరటాల చెప్పాడు. శ్రీహరితో కలిసి పని చేయటం చాలా ఆనందంగా ఉందని... మా ఇద్దరి కాంబినేషన్లో మున్ముందు మరిన్ని మంచి కథలు వస్తాయని ఆశిస్తున్నానని చెప్పాడు కొరటాల. |
https://www.telugupost.com/top-stories/in-175-constituencies-there-are-strong-leaders-in-ycp-also-in-all-25-parliamentary-seats-there-is-no-difficulty-1348534 | ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి తిరుగులేకుండా ఉంది. మొన్నటి ఎన్నికల్లో 151 శాసనసభ స్థానాలను, 22 పార్లమెంటు స్థానాలను గెలుచుకుని ఊపు మీద ఉంది. వచ్చే ఎన్నికల్లో అంత కాకపోయినా విజయానికి తగినన్ని సీట్లు వచ్చే అవకాశాలు వైసీపీకి ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మరోసారి వైసీపీ విజయం ఖాయమని రాజీకీయ పండితులు కూడా అంటున్నారు. ఎన్ని పొత్తులతో కూటమి ఏర్పడినా మరోసారి జగన్ కు గెలుపు ఖాయమంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కాబట్టి పరిస్థితులు మారతాయేమో చెప్పలేం.బలమైన నేతలున్నా....అయితే 175 నియోజకర్గాల్లో వైసీపీకి బలమైన నేతలున్నారు. క్యాడర్ ఉంది. అలాగే 25 పార్లమెంటు స్థానాల్లోనూ వైసీపీకి ఇబ్బంది లేదు. కానీ ఒక చోట మాత్రం అభ్యర్థిని కొత్తగా వెతుక్కోవాల్సిన పరిస్థితి. అదే విజయవాడ పార్లమెంటు స్థానం. విజయవాడ పార్లమెంటు స్థానం గత ఎన్నికల్లోనూ వైసీపీకి దక్కలేదు. ఇది కమ్మ సామాజికవర్గానికి రిజర్వ్ అయిన సీటుగానే చూడాలి. విజయవాడ పార్లమెంటు ఆవిర్భావం నాటి నుంచి ఎక్కువ మంది ఆ సామాజికవర్గానికి చెందిన వారే ఎంపీగా ఎన్నికయ్యారు.గత ఎన్నికల్లో....జగన్ కూడా గత ఎన్నికల్లో అదే ప్రయోగం చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ ను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. కానీ ఆయన టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చేతిలో ఓటమి పాలయ్యారు.పార్లమెంటు పరిధిలోని అధిక శాతం నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచినా ఎంపీ అభ్యర్థి మాత్రం గెలవలేదు. సరే.. ఎన్నికల తర్వాత వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఆయన జాడ మాత్రం లేదు.ఈసారి మారుస్తారా?పార్టీలో యాక్టివ్ గా లేరు. తన వ్యాపారాలకే పరిమితమయ్యారు. పొట్లూరి వరప్రసాద్ పేరు వైసీపీ పేజీ నుంచి డిలీట్ చేసేశారు. ఇప్పుడు కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి కమ్మేతర అభ్యర్థిని జగన్ ఎంపిక చేస్తారని తెలిసింది. బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి టిక్కెట్ ఇచ్చే అవకాశముందంటున్నారు. కమ్మ సామాజికవర్గంలో వైసీపీకి సరైన అభ్యర్థి దొరకకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీకి విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎవరన్న చర్చ పార్టీలో ఇప్పటి నుంచే మొదలయింది. |
https://www.telugupost.com/movie-news/raviteja-kalyankrishna-nag-71432/ | అక్కినేని సినీ ఇన్స్టిట్యూట్ లో కోర్సు నేర్చుకున్న డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ అక్కినేని నాగార్జున తో ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా తీసి సక్సెస్ అయ్యాడు. దాంతో నాగార్జునకి తన వర్క్ నచ్చడంతో వెంటనే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.రెండు హిట్ లిచ్చినా నిరీక్షణ తప్పలేదు...రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇచ్చినా మరో సినిమా చేయడానికి బాగా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన మాస్ రాజా రవితేజతో చేసిన ‘నేలటికెట్’ వచ్చేవారం విడుదలకి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రొమోషన్స్ లో ఉన్న కళ్యాణ్ కృష్ణ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ...‘‘ ‘రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా సక్సెస్ తర్వాతే ఈ సినిమా కథ రాసా. ఈ కథ రాసుకునేటపుడే వేరే పెద్ద హీరోను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నా. కానీ ఆ హీరోతో ఈ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ అవ్వలేదు. దాంతో పక్కన పెట్టేశా. అనుకోకుండా ఓసారి రవితేజని కలిసినప్పుడు కథ వినిపించాను, నిముషాల్లోనే ఆయన కథ నచ్చి ఓకే చెప్పేశారు.’’ అని చెప్పారు.రవితేజ ఇమేజ్ కు సెట్టయ్యేనా..?‘‘రవితేజ ఇమేజ్ తగ్గట్టు ఈ కథలో చాలా మార్పులు చేశా. ఫస్ట్ కాపీ చూసాక ఈ సినిమాకు రవితేజయే కరెక్ట్ అనిపించింది’’ అని కళ్యాణ్ కృష్ణ అన్నాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ నాగ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అది క్యాన్సిల్ అయింది. ఆ కథే ఇప్పుడు రవితేజ చేసాడు. అయితే అప్పుడు నాగ్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన ఈ కథ రవి తేజ ఇమేజ్ కి సెట్ అవుతుందా? మరి ఈ సినిమాకు నాగ్ కరెక్టా! రవితేజ కరెక్టా? అని తెలియాలంటే వచ్చే వారం దాకా ఆగాల్సిందే. |
https://www.telugupost.com/top-stories/prasanth-kishore-team-is-set-to-launch-surveyfirst-phase-of-the-survey-will-be-conducted-in-175-constituencies-1349006 | ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత్ కిషోర్ ఒక గోల్ కీపర్ గా మారారు. రాజకీయ క్రీడలో ప్రత్యర్థులు గోల్ చేయనివ్వకుండా ఆపగలరన్న పేరుంది. మరోసారి ఏపీలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఉంటారని సాక్షాత్తూ జగన్ చెప్పారు. ఈ విషయం మంత్రి వర్గ సమావేశంలో చెప్పి దాదాపు మూడు నెలలకు పైగానే అవుతుంది. ఆయన టీమ్ కూడా ఇంతవరకూ ఏపీలోకి అడుగు పెట్టలేదంటున్నారు.ఈ ఏడాదిలోనే...ఈ ఏడాదిలో పీకే టీం కార్యక్రమాలను ప్రారంభించబోతుంది. మరో రెండు నెలల్లో ఏపీలోని 175 నియోజకవర్గాల్లో తొలి దఫా సర్వే జరుగుతుందంటున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ ను కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టేవాడిగా చిత్రీకరిస్తున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని పీకే గత ఎన్నికల్లోనూ కులాలు, మతాల మధ్య తేడాలు తేవడంతోనే చంద్రబాబు అధికారానికి దూరమయ్యారని, జగన్ కు సీఎం కుర్చీ దక్కిందని కొందరు గట్టిగా విశ్వసిస్తున్నారు.వ్యతిరేక ప్రచారం...అందుకే ప్రశాంత్ కిషోర్ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చే ముందే ఆయన పై ఒకవర్గం మీడియా బురద జల్లే కార్యక్రమం మొదలు పెట్టింది. బీహార్ తరహా రాజకీయాలు చేయడంతో ప్రశాంత్ కిషోర్ దిట్ట అని, ఇటీవల చిరంజీవి, జగన్ భేటీ, ఆయనకు రాజ్యసభ స్థానం ఇవ్వాలన్నది కూడా ప్రశాంత్ కిషోర్ ఐడియానేనంటూ కొన్ని గంటల పాటు కొన్ని ఛానెళ్లు ఊదరగొట్టాయి. కానీ చిరంజీవి తాను అసలు చట్ట సభల్లోకే అడుగు పెట్టనని చెప్పడంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టాయి.గత ఎన్నికల్లో దెబ్బతో..ప్రశాంత్ కిషోర్ ను టీడీపీతో పాటు దాని అనుకూల మీడియా గత ఎన్నికల సమయంలో లైట్ గా తీసుకుంది. బీహార్ నుంచి వచ్చి ఏపీ రాజకీయాల్లో ఆయన ఏం చేయలేడని నమ్మారు. అంతేకాదు చంద్రబాబు రాజకీయ అనుభవం ముందు ప్రశాంత్ కిషోర్ ఎంత? అని కూడా తలలు ఎగురవేశారు. ఎవరి మాట వినని జగన్ పీకే సలహాలు పాటించడని కూడా అనుకున్నారు. కానీ ఫలితాలు దారుణంగా రావడంతో ఈసారి పీకే ఎంట్రీకి ముందే ఆయనపై బురద చల్లే కార్యక్రమం ప్రారంభమయింది. అసత్యాలను ప్రచారం చేస్తారని, కులాలు, మాతాలను చీల్చి లబ్ది పొందేలా పీకే వ్యవహరిస్తారని ఒక వర్గం మీడియా ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/mahanati-9days-71160/ | మహానటి తెలుగు సినీ ప్రపంచంలో ఎంత క్రేజ్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. మహానటి 9 రోజుల ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. (కోట్లలో)నైజాం 5.85 సీడెడ్ 1.20 వైజాగ్ 1.65 కృష్ణ 1.25 గుంటూరు 0.98 తూర్పు గోదావరి 0.92 పశ్చిమ గోదావరి 0.64 నెల్లూరు 0.31ఏపీ అండ్ తెలంగాణ 12.80 కోట్లుయుఎస్ఏ 7.98 కర్ణాటక 1.00 రెస్ట్ అఫ్ ఇండియా 0.84 తమిళనాడు 0.63 ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల కలెక్షన్స్ 23 .25 కోట్లు |
Subsets and Splits