title
stringlengths 1
90
| url
stringlengths 31
120
| text
stringlengths 0
504k
|
---|---|---|
ఆగష్టు 17 | https://te.wikipedia.org/wiki/ఆగష్టు_17 | ఆగష్టు 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 229వ రోజు (లీపు సంవత్సరములో 230వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 136 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1860: బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు. పోలీస్ కమిషన్ రిపోర్ట్ 1860 చూడు. దీని ఆధారంగానే, నేటికీ అమలులో ఉన్న పోలీస్ చట్టము 1861 ఏర్పడింది.
1985: పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తలాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీకి భారత ప్రధాని రాజీవ్ గాంధీచేత శంకుస్థాపన.
జననాలు
thumb|మహబూబ్ అలీ ఖాన్, 6వ అసఫ్ ఝా
1866: మహబూబ్ అలీ ఖాన్, హైదరాబాదును పరిపాలించిన అసఫ్జాహీ వంశపు ఆరవ నవాబు (మ.1911).
1908: పి. సత్యనారాయణ రాజు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1966)
1918: గుత్తికొండ నరహరి, తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985).
1939: మోదడుగు విజయ్ గుప్తా, కొరియా శాంతి బహుమతిని అందుకున్న తొలి ఆంధ్రుడు.
1949: తెలుగు గేయ రచయిత భువన చంద్ర .
1950: శరత్ సక్సేనా , హిందీ , తెలుగు,తమిళ, మలయాళ చిత్ర ప్రతి నాయకుడు.
1962: మాకినీడి సూర్య భాస్కర్, ఆంగ్ల ఉపాధ్యాయుడు. సాహితీవేత్త.
1964: ఎస్.శంకర్, సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా దర్శకుడు.
1983: శ్రీకృష్ణ , తెలుగు నేపథ్య గాయకుడు .
1993: నిధి అగర్వాల్ , హిందీ, తెలుగు చిత్రాల నటి.
మరణాలు
1786 : ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (జ.1712).
1817: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, గుంటూరు ప్రాంతమును పరిపాలించిన కమ్మ రాజు, అమరావతి సంస్థాన పాలకుడు (జ.1761).
1955: సాహీతీ వి'శారద', ఆయన 'ప్రజావాణి' అనే వ్రాత పత్రికను ప్రారంభించారు (జ.1924).
1980: కొడవటిగంటి కుటుంబరావు, ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది (జ.1909).
1997: ఎస్.వి.భుజంగరాయశర్మ, కవి, విమర్శకుడు, నాటక రచయిత (జ.1925).
2007: దశరథ్ మాంఝీ, పట్టుదలతో 22 సంవత్సరాలు శ్రమించి కొండను తొలిచి తన గ్రామానికి రహదారిని సుగమం చేసి మౌంటెన్ మ్యాన్గా పేరు పొందిన సామాన్యవ్యక్తి (జ.1934).
పండుగలు , జాతీయ దినాలు
ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం
-
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 17
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చారిత్రక దినములు.
ఆగష్టు 16 - ఆగష్టు 18 - జూలై 17 - సెప్టెంబర్ 17 -- అన్ని తేదీలు
వర్గం:ఆగష్టు
వర్గం:తేదీలు |
ఆగష్టు 18 | https://te.wikipedia.org/wiki/ఆగష్టు_18 | ఆగష్టు 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 230వ రోజు (లీపు సంవత్సరములో 231వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 135 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1274: ఇంగాండ్ రాజుగా ఎడ్వర్డ్- I పట్టాభిషేకం జరిగింది.
1833: కెనడాకు చెందిన రాయల్ విలియం, పేరు గల మొదటి ఓడ (ఆవిరి శక్తితో నడిచే ఓడ) నోవా స్కోటియా నుంచి ది ఐస్ల్ ఆప్ విఘట్ వరకూ, పూర్తిగా తన ఆవిరి శక్తితోనే, ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటింది. ఆ ఓడ, నొవా స్కొటియా నుంచి ప్రయాణం మొదలుపెట్టిన రోజు,
1835: మసాచుసెట్స్ లోని స్ప్రింగ్ఫీల్డ్కి చెందిన సోలిమన్ మెర్రిక్, మనం వాడుతున్న రెంచ్కి పేటెంట్ పొందాడు.
1868:గుంటూరులో సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూస్తూ పియరీ జూల్స్ సీజర్ హాన్సెన్ అనే శాస్త్రవేత్త హీలియం ఉనికిని కనుగొన్నాడు.
1891:న్యూయార్క్ నగరంలో మొట్టమొదటి సారిగా ప్రజల కోసం స్నానాల గది" ని ఏర్పాటు చేసారు.
1903: మొట్టమొదటి పులిట్జర్ బహుమతి ఇచ్చిన రోజు. కొలంబియా విశ్వవిద్యాలయా నికి జోసెఫ్ పులిట్జర్ మిలియన్ డాలర్లు దానం. ఈ డబ్బును పులిట్జర్ బహుమతి కి, నిధిగా వాడుకుంటూ, దానం చేసిన జోసెఫ్ పులిట్జర్ పేరు మీదుగా, ఈ బహుమతికి పులిట్జర్ పేరు మీదుగా బహుమతులు ఇవ్వటం మొదలు పెట్టారు.
1915: టెక్సాస్ లోని గాల్వెస్టన్ నగరాన్ని, హరికేన్ (తుఫాను) తాకి 275 మంది మరణించారు.
1915: డెట్రాయిట్ నగరానికి చెందిన ఛార్లెస్ ఎఫ్. కెట్టెరిన్గ్ ఎలెక్ట్రిక్ ఆటోమొబైల్ సెల్ఫ్-స్టార్టర్ కి పేటెంట్ పొందాడు.
1959: 7.5 మేగ్నిట్యూడ్ మీద జరిగిన భూకంపం వలన క్వేక్ లేక్ ఏర్పడింది. భూకంపం వలన ఏర్పడిన సరస్సు కాబట్టి, "భూకంప సరస్సు" (క్వేక్ లేక్) అని పేరు పెట్టారు.
1960: గాబన్ దేశపు స్వాతంత్ర్య్య దినోత్సవము.
1999: టర్కీలో జరిగిన భూకంపంలో (7.4 మేగ్నిట్యూడ్), 17, 000 మందికి పైగా మరణించారు
2006: నెట్వర్క్ సమస్య మూలంగా, వికిమీడియా సర్వర్లు 3 గంటలపాటు పనిచేయలేదు.
2008: పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ తన రాజీనామాను ప్రకటించాడు.
2011: నేడు, లోక్సభ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు 2011ని ఆమోదించింది. దేశంలో, మరింత మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించటం, ఈ బిల్లు ఉద్దేశం. అలాగే, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే వైద్యులను ప్రోత్సహించటానికి, కావలసిన చర్యలు కూడా తీసుకున్నారు. ప్రైవేటు రంగంలో, వైద్యకళాశాలలు స్థాపించే వారికి, మరిన్ని సౌకర్యాలు, వెసులుబాట్లు కల్పించారు. రాబోయే, 5 ఏళ్ళలో, వైద్య విద్యార్థుల కోసం 15, 000 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతారు.
2011: జిప్మెర్, పుదుచ్చెర్రీ చట్టము 2008కి సవరణగా, ప్రతిపాదించిన, జిప్మెర్ (జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్), పుదుచ్చెర్రీ (సవరణ) బిల్లు 2011 ని, లోక్సభ ఆమోదించింది.
2011: రాజ్యసభ, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్ పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి, అతనిని పదవినుంచి తొలగించమని కోరింది. 1990లో న్యాయవాదిగా ఉండగా 24 లక్షల రూపాయల దుర్వినియోగం చేసాడని నేరారోపణ.
2011: పాఠశాల విద్యార్థులకు ఇచ్చే, నేషనల్ కేడెట్ కోర్ (ఎన్.సి.సి) శిక్షణ కోసం, 2010 సంవత్సరంలో, 707 కోట్లు ఖర్చుపెట్టగా, 79 మంది కేడెట్లు మాత్రమే సైనిక దళాలలో చేరారు.
2011: సాధారణ వర్గానికి (జనరల్ కేటగిరి), సూచించబడినటువంటి, కనీస అర్హత మార్కులలో, 10 శాతం కంటే తక్కువ మార్కులు, పొందకపోతే, ఒ.బి.సి విద్యార్థులు 27 శాతంరిజర్వేషన్లు కోటా కింద ప్రవేశానికి అర్హులు అని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది.
2018: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం చేశాడు.
2018: 18 వ ఆసియా క్రీడలు ఇండొనీషియా రాజధాని జకార్తాలో ప్రారంభమయ్యాయి.
జననాలు
1587: వర్జీనియా డేర్, ఆంగ్లేయ దంపతులకు, అమెరికా నేల మీద, పుట్టిన మొదటి బిడ్డ.
1650: సర్వాయి పాపన్న, గెరిల్ల సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసినవాడు. (మ.1709)
1685: బ్రూక్ టేలర్, గణితంలో టేలర్ థీరమ్ (టేలర్ సిద్ధాంతం) కనుగొన్న గణితమేధావి.
1700: పేష్వా బాజీరావ్ I మరాఠా సామ్రాజ్యానికి చెందిన 6వ పేష్వా. (మ.1740)
1734: రఘునాథరావ్ మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా (మ.1783)
1792: లార్డ్ జాన్ రస్సెల్, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి (1846 నుంచి 1852 వరకు, 1865 నుంచి 1866 వరకు) .
1904: జాన్ విట్నీ, పబ్లిషర్, డిప్లొమాట్.
1920: హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. (మ.2002)
1925: సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (మ.1972)
1941: జయకృష్ణ, భారతీయ సినిమా నిర్మాత. (మ.2016)
1954- VK శశికళ, రాజకీయవేత్తగా మారిన భారతీయ వ్యాపారవేత్త.
1955: పి.ఎన్ రామచంద్ర రావు . చలనచిత్ర దర్శకుడు.
1958: కొత్తకోట దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే (మ. 2023)
1959: నిర్మలా సీతారామన్, భారతీయ రాజకీయ నాయకురాలు, మోడీ మంత్రివర్గంలో సహాయఆర్ధికమంత్రి.
1977: వసుంధరా దాస్, సింగర్, నటి.
1980: ప్రీతీ జింగానియా , మోడల్, సినీనటి
మరణాలు
thumb|నేతాజీ సుభాష్ చంద్రబోస్
1227: చెంఘిజ్ ఖాన్, మంగోలియాకి చెందినవాడు (జ.1162).
1945: సుభాష్ చంద్రబోస్, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897)
1953: మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ, మహబూబ్ నగర్ జిల్లా లోని ఒకనాటి గద్వాల సంస్థానాన్ని పాలించిన మహారాణి.
1998: ప్రొతిమా బేడి, ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి. (జ.1948)
2006: కొండపల్లి పైడితల్లి నాయిడు, 11వ, 12వ, 14వ లోక్సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు (జ.1930) .
2018: చెన్నుపాటి విద్య, లోక్సభ మాజీ సభ్యురాలు (జ. 1934).
2018: కోఫీ అన్నన్, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరణం (జ. 1939).
2018: వేదగిరి రాంబాబు, రచయిత, హైదరాబాదులో మరణం (జ.1952)..
2020: ఎడ్మ కిష్టారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1947)
పండుగలు , జాతీయ దినాలు
ప్రపంచము - ప్రపంచ హీలియం దినము
1960: గాబన్ దేశపు స్వాతంత్ర్య దినోత్సవము.
2011: జొరాస్ట్రియన్లు లేదా పార్శీలు తమ నూతన సంవత్సరాన్ని నవ్రోజ్ని ఈరోజు జరుపుకుంటున్నారు. 3000 సంవత్సరాల క్రితం పెషాడియన్ వంశానికి చెందిన "షా జమ్షెడ్" సింహాసనం ఈ నవ్రోజ్ నాడు ఎక్కాడు. నవ్ అంటే కొత్త, రోజ్ అంటే రోజు అని పార్శీలు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున అగ్నిదేవాలయంకి వెళతారు. బంధు, మిత్రులతో కలిసి, పెద్ద పండుగ, చేసుకుని, విందు, వినోదాలతో గడుపుతారు. నవ్రోజ్ ముందు రోజుని, "పాతేటి అంటారు. గత సంవత్సరం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు "పాతేటి" రోజున. ముంబైలో హోటళ్లు, భోజన ప్రియులైన పార్శీల కోసం, ప్రత్యేక మైన వంటలు చేస్తాయి
అంతర్జాతీయ స్వదేశీ దినం.
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 18
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చారిత్రక దినములు.
ఆగష్టు 17 - ఆగష్టు 19 - జూలై 18 - సెప్టెంబర్ 18 -- అన్ని తేదీలు
వర్గం:ఆగష్టు
వర్గం:తేదీలు |
ఆగష్టు 19 | https://te.wikipedia.org/wiki/ఆగష్టు_19 | ఆగష్టు 19, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 231వ రోజు (లీపు సంవత్సరములో 232వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 134 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1944: రెండవ ప్రపంచ యుద్ధము: పారిస్ విమోచన. మిత్రదళాల సహాయంతో, జర్మనీ ఆక్రమణ నుంచి పారిస్ కి విమోచనం కలిగింది.
1956: కడిదల్ మంజప్ప కర్ణాటక రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం. (1956 ఆగష్టు 19 నుంచి 1956 అక్టోబరు 31 వరకు)
1960: స్పుత్నిక్ ప్రోగ్రాం : స్పుత్నిక్ 5ని సోవియట్ యూనియన్ రోదసి లోకి పంపింది. అందులో, బెల్కా, స్త్రెల్కా (కుక్కల పేర్లు), 40 చుంచులు, 2 ఎలుకలు మరికొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.
2007: ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నారాయణదత్ తివారీ నియమితుడయ్యాడు.
2011: ప్రణాళికా సంఘం, ఏప్రిల్ 2012 నుంచి మొదలయ్యే, 12వ పంచవర్షప్రణాళిక లక్ష్యము 9 శాతం అభివృద్ధిగా పెట్టుకున్నట్లు ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు ప్రకటించాడు. వ్యవసాయం అభివృద్ధి లక్ష్యం 4 శాతం అని చెప్పాడు. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగం లక్ష్యం 4 శాతమైనా, ఆ లక్ష్యాన్ని చేరలేకపోయామని, అయినా, వ్యవసాయరంగం మెరుగు గానే ఉంది అని చెప్పాడు.
2011: దేశీయ పరిఙ్ఞానంతో తయారైన స్టెల్త్ (శత్రువుల రాడార్కు ఆచూకీ దొరకని) యుద్ధనౌక ఐ.ఎన్.ఎస్. సాత్పుర శనివారం, భారత నౌకాదళంలో చేరింది. శివాలిక్ తరగతి కింద నిర్మిస్తున్న ఫ్రిగేట్ యుద్ధనౌకల్లో సాత్పుర రెండవది. ఐ.ఎన్.ఎస్.శివాలిక్ మొదటి యుద్ధనౌక. చూడు
జననాలు
thumb|Shankar Dayal Sharma 36
1918: శంకర్ దయాళ్ శర్మ, భారత మాజీ రాష్ట్రపతి. (మ.1999)
1923: కొత్తపల్లి పున్నయ్య, న్యాయవాది, రాజకీయ నాయకుడు, కవి.
1925: అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. (మ.2012)
1946: బిల్ క్లింటన్, అమెరికా మాజీ (42వ) అధ్యక్షుడు.
1972: మురళీ శర్మ , తెలుగు చలన చిత్ర సహాయ పాత్రల నటుడు.
మరణాలు
0014: ఆగస్టస్, రోమన్ చక్రవర్తి మరణించాడు (జ.63 బి.సి) ఇతని పేరున, ఆగష్టు నెల ఏర్పడింది.
1662: బ్లేజ్ పాస్కల్, పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1623)
1994: లీనుస్ పాలింగ్, అమెరికా రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1901)
2015: పడాల బాలకోటయ్య, రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (జ.1937)
పండుగలు , జాతీయ దినాలు
ప్రపంచ మానవత్వపు దినోత్సవం
ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం
ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యదినోత్సవం. (1919)
-
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 19
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చారిత్రక దినములు.
ఆగష్టు 18 - ఆగష్టు 20 - జూలై 19 - సెప్టెంబర్ 19 -- అన్ని తేదీలు
వర్గం:ఆగష్టు
వర్గం:తేదీలు |
ఆగష్టు 20 | https://te.wikipedia.org/wiki/ఆగష్టు_20 | ఆగష్టు 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 232వ రోజు (లీపు సంవత్సరములో 233వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 133 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1953 -
2015 - తాడేపల్లిగూడెంలో నిట్ (నేషనల్ ఇంస్టిట్యూట్ ఓఫ్ టెక్నాలజీ) సంస్థకు శంకుస్థాపన జరిగింది.
జననాలు
thumb|రాజీవ్ గాంధీ (1987)
1833: బెంజమిన్ హారిసన్, అమెరికా 23వ అధ్యక్షుడు. (మ.1901)
1858: ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (మ.1931)
1920: రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి, ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక గ్రంథ రచయిత.
1927: ఎ.వెంకోబారావు, సైక్రియాట్రిస్ట్. (మ.2005)
1928: పూసపాటి కృష్ణంరాజు, తెలుగు కథా రచయిత. (మ.1994)
1931: బి.పద్మనాభం, తెలుగు సినిమా, రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (మ.2010)
1935: సి. ఆనందారామం, కథా, నవలా రచయిత్రి.
1935: గౌరు తిరుపతిరెడ్డి, వాస్తునిపుణుడు (మ.2016)
1944: రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1991)
1946: ఎన్.ఆర్. నారాయణ మూర్తి, 1981లో ఇన్ఫోసిస్ని స్థాపించినవారు.
1947: వి.రామకృష్ణ, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (మ.2015)
1947: తిలకం గోపాల్, వాలీబాల్ మాజీ ఆటగాడు, కెప్టెన్. (మ. 2012)
1974: ఏమీ ఆడమ్స్, అమెరికా దేశానికి చెందిన నటి, గాయకురాలు.
1984: సింధూర గద్దె , మోడల్ , తెలుగు సినిమా నటి
1995: కావ్య ధాపర్, తమిళ, తెలుగు,హిందీ, చిత్రాల నటి, మోడల్.
మరణాలు
1923: నారదగిరి లక్ష్మణదాసు, పాలమూరు జిల్లాకు చెందిన కవి, వాగ్గేయకారుడు. (జ.1856)
1930: చార్లెస్ బాన్నర్మన్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు, కుడిచేతి బ్యాట్స్మెన్. (జ.1851)
2012: కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (జ.1925)
2014: మహమ్మద్ తాజుద్దీన్ ఖాన్, పౌరహక్కుల ఉద్యమనాయకుడు, విప్లవ రచయిత, అధ్యాపకుడు, పాత్రికేయుడు.
పండుగలు , జాతీయ దినాలు
1828: బ్రహ్మసమాజాన్ని రాజా రామమోహనరాయ్ స్థాపన
1897: మలేరియా వ్యాధి 'ఎనాఫిలాస్' అనే ఆడ దోమ కాటువల్ల సంభవిస్తుందని ప్రముఖక శాస్త్రవేత సర్ రోనాల్డ్ రాస్ చాటిచెప్పిన రోజుని మలేరియా నివారణ/ప్రపంచ దోమల దినోత్సవంగా పాటిస్తారు.
1944: సద్భావనా దినోత్సవం - రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 20
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చారిత్రక దినములు.
ఆగష్టు 19 - ఆగష్టు 21 - జూలై 20 - సెప్టెంబర్ 20 -- అన్ని తేదీలు
వర్గం:ఆగష్టు
వర్గం:తేదీలు |
ఆగష్టు 21 | https://te.wikipedia.org/wiki/ఆగష్టు_21 | ఆగష్టు 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 233వ రోజు (లీపు సంవత్సరములో 234వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 132 రోజులు మిగిలినవి.
సంఘటనలు
జననాలు
1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984)
1914: పి.ఆదినారాయణరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత. (మ.1991)
1918: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1994)
1921: భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (మ.2012)
1927:: జీ.అశ్వద్ధామ , సంగీత దర్శకుడు ,(మ.1975
1940: లక్ష్మా గౌడ్, చిత్రకారుడు.
1952: గౌతమ్ రాధాకృష్ణ దేసిరాజు, క్రిస్టల్ ఇంజనీరింగ్, ఉదజని బంధం.
1957: రేకందార్ ప్రేమలత, రంగస్థల నటీమణి.
1949: అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు.
1946: ఆలె నరేంద్ర, రాజకీయనాయకుడు. (మ.2014)
1963: రాధిక తెలుగు, తమిళ చలన చిత్ర కథానాయకి.
1978: భూమిక చావ్లా, సినీనటి.
1988: సనా , హిందీ,కన్నడ, తెలుగు,తమిళ, మలయాళ చిత్రాల నటి.
1998: డింపుల్ హయాతి , తెలుగు సినీ నటి.
మరణాలు
thumb|Malati Chandoor
1978: వినూమన్కడ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (జ.1917)
2013: మాలతీ చందూర్, రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. (జ.1930)
పండుగలు , జాతీయ దినాలు
1999: ప్రపంచ కవితా దినోత్సవం-
జాతీయ వృద్ధుల దినోత్సవం
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 21
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చారిత్రక దినములు.
ఆగష్టు 20 - ఆగష్టు 22 - జూలై 21 - సెప్టెంబర్ 21 -- అన్ని తేదీలు
వర్గం:ఆగష్టు
వర్గం:తేదీలు |
ఆగష్టు 22 | https://te.wikipedia.org/wiki/ఆగష్టు_22 | ఆగష్టు 22, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 234వ రోజు (లీపు సంవత్సరములో 235వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 131 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1864: మొదటి జెనీవా సదస్సులో 12 దేశాలు సంతకం చేసాయి.
1922: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి జరిగింది.
1932: టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని బి.బి.సి నిర్వహించింది.
జననాలు
1860: పాల్ గోటిలిబ్ నిప్కో, నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త (మ.1940).
1869: పింగళి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి (మ.1953).
1869: డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి (మ. 1967)
1924: హరిశంకర్ పరసాయి, హిందీ కవి (మ.1995).
1924: సి.మాధవరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు.
1927: టి.జీ . లింగప్ప ,సంగీత దర్శకుడు ,(మ.2000)
1933: గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (మ.1994)
1935: డి. కామేశ్వరి, కథా, నవలా రచయిత్రి
1955: చిరంజీవి, తెలుగు చలనచిత్ర నటుడు.
1964: రేకందార్ గుణవతి, రంగస్థల నటి
1989: రాహుల్ సింప్లీ గుంజ్.తెలుగుపాటలగాయకుడు, రచయిత
మరణాలు
thumb|యు.ఆర్.అనంతమూర్తి
1948: షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (జ.1920)
1984: బొమ్మకంటి సత్యనారాయణ రావు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1916)
1986: శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1901)
2014: యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1932)
పండుగలు , జాతీయ దినాలు
భారత దేశము - మద్రాసు దినోత్సవం
ప్రపంచ జానపద దినోత్సవం
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 22
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చారిత్రక దినములు.
ఆగష్టు 21 - ఆగష్టు 23 - జూలై 22 - సెప్టెంబర్ 22 -- అన్ని తేదీలు
వర్గం:ఆగష్టు
వర్గం:తేదీలు |
ఆగష్టు 23 | https://te.wikipedia.org/wiki/ఆగష్టు_23 | ఆగష్టు 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 235వ రోజు (లీపు సంవత్సరములో 236వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 130 రోజులు మిగిలినవి.
సంఘటనలు
భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్-3, చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగిన మొదటి వ్యోమనౌకగా నిలిచింది.
జననాలు
thumb|టంగుటూరి ప్రకాశం పంతులు
1872: టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. (మ.1957)
1900: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (మ.1974)
1918: అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001)
1921: కెన్నెత్ ఆరో, ఆర్థికవేత్త (మ. 2017).
1923: బలరామ్ జక్కర్, రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ (మ.2016).
1932: ఉండేల మాలకొండ రెడ్డి, ఇంజనీరు, తెలుగు రచయిత, కవి.
1949: బి.ఎస్.రాములు, నవలాకారుడు, కథకుడు.
1953: అట్టాడ అప్పల్నాయుడు, ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత.
1963: పార్క్ చాన్-వుక్, దక్షిణ కొరియాకు చెందిన సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత.
1963: సురేష్ , తెలుగు,తమిళ, మలయాళ చిత్రాల నటుడు .
1964: ఎస్.ఎ.రాజకుమార్, సంగీత దర్శకుడు.
1968: కె.కె.(కృష్ణ కుమార్ కున్నత్) , తమిళ, హిందీ ,కన్నడ ,మలయాళ, తెలుగు భాషల గాయకుడు.(మ.2022)
1969: వినీత్ , దక్షిణాది చిత్రాలనటుడు.
1988: వాణీ కపూర్., హిందీ, తెలుగు చిత్రాల నటి
మరణాలు
634: అబూబక్ర్, మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతం గురించి ప్రకటించిన తరువాత, ఇస్లాంను స్వీకరించినవారిలో ప్రథముడు.
1890: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (జ.1803)
1971: షామూ, అనేక సీ వరల్డ్ ప్రదర్శనలలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన నీటి జంతువు.
1979: జి.వి.కృష్ణారావు, హేతువాది, రచయిత. (జ.1914)
1987: కందిబండ రంగారావు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1907)
1994: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (జ.1940)
2018: కులదీప్ నయ్యర్, రచయిత, పత్రికారచయిత (జ. 1923).
పండుగలు, జాతీయ దినాలు
అంతర్జాతీయ బానిసత్వ అక్రమ రవాణా నిరోధక దినం
జాతీయ అంతరిక్ష దినోత్సవం, చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ 2023లో ఈ రోజున చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ అయిన రోజు.
అంతర్జాతీయ బానిస వాణిజ్య నిర్మూలన దినోత్సవం
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 23
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చారిత్రక దినములు.
ఆగష్టు 22 - ఆగష్టు 24 - జూలై 23 - సెప్టెంబర్ 23 -- అన్ని తేదీలు
వర్గం:ఆగష్టు
వర్గం:తేదీలు |
ఆగష్టు 24 | https://te.wikipedia.org/wiki/ఆగష్టు_24 | ఆగష్టు 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 236వ రోజు (లీపు సంవత్సరములో 237వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 129 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1875: ఇంగ్లీష్ చానల్ ఈదిన తోలి వ్యక్తిగా మ్యాథ్యు వెబ్ రికార్డు.
1962: నాలుగవ ఆసియా క్రీడలు ఇండోనేషియా రాజధాని నగరం జకర్తాలో ప్రారంభమయ్యాయి.
1970: ఆరవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమయ్యాయి.
జననాలు
thumb|Jorge Luis Borges 1951, by Grete Stern
1899 : అర్జెంటీనా రచయిత జార్జ్ లూయిస్ బోర్గర్స్
1908: రాజ్ గురు, స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (మ.1931)
1918: సికిందర్ భక్త్, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
1923: హోమీ సేత్నా, భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (మ.2010)
1927: అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. (మ.2014)
1928: దాశరథి రంగాచార్యులు, సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2015)
1945 : అమెరికాకు చెందిన చలనచిత్ర నిర్మాత విన్స్ మెక్మాన్
1970: రామజోగయ్య శాస్ర్తి, సినీ గీత రచయిత
1985: గీతా మాధురి, తెలుగు సినీ గాయని.
మరణాలు
1993: వెంపటి సూర్యనారాయణ, ప్రజావైద్యుడు, గాంధేయవాది. (జ.1904)
2009: కన్నెగంటి వేంకటేశ్వరరావు, మట్టి ప్రేమికుడు. వ్యవసాయరంగంలో వినూత్న ప్రయోగాలతో రైతులకు ఆదర్శప్రాయుడయ్యరు.
2011: బండి రాజన్ బాబు, ఛాయాచిత్రకారుడు. (జ.1939)
2015: ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, ఉర్దూ అకాడమీ ఛైర్మన్.
2019: అరుణ్ జైట్లీ, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. కేంద్ర మాజీ మంత్రి (జ.1952)
పండుగలు , జాతీయ దినాలు
- ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం
సంస్కృత దినోత్సవం.
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 24
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చారిత్రక దినములు.
ఆగష్టు 23 - ఆగష్టు 25 - జూలై 24 - సెప్టెంబర్ 24 -- అన్ని తేదీలు
వర్గం:ఆగష్టు
వర్గం:తేదీలు |
ఐ పీ అడ్రసు | https://te.wikipedia.org/wiki/ఐ_పీ_అడ్రసు | thumb| right|Ipv4 అడ్రస్ నొటేషన్
ఐ పి అడ్రసు (ఇంటర్నెట్ ప్రోటోకోల్ అడ్రసు) అనేది టెలిఫోను నంబరు లాంటి ఒక ప్రత్యేక సంఖ్య. ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని పంపేటపుడు కంపూటర్ల వంటి యంత్రాలు ఒకదాన్నొకటి గుర్తించే అడ్రసు ఇది. పంపేవారి తరఫున సమాచారాన్ని ఎక్కడికి పంపాలో తెలియాటానికి, ఆ సమాచారాన్ని అందుకునే మిషనుకు తానే
నమూనా ఐ పి అడ్రసు ఇలా వుంటుంది - 207.142.131.236. మనుష్యులు చదివే విధంగా వుండే www.wikipedia.org వంటి అడ్రసును డోమైన్ నేమ్ సిస్టమ్ ఇటువంటి సంఖ్యా రూపం లోకి మారుస్తుంది. ఈ మార్చే ప్రక్రియను డోమైన్ నేమ్ పరిష్కరణ (resolution of the domain name) అని అంటారు.
మరిన్ని వివరాలు
ఇంటర్నెట్ ప్రోటోకోల్ (IP) ప్రతి లాజికల్ హోస్ట్ ఇంటర్ఫేస్ను ఈ ఐ పి అడ్రసు ద్వారా గుర్తిస్తుంది. ఏ నెట్వర్కును తీసుకున్నా సరే, దానితో సంపర్కం కలిగివున్న హోస్ట్ ఇంటర్ఫేస్ లన్నిటిలోనూ ఈ సంఖ్య విలక్షణంగా, ప్రత్యేకంగా (unique) వుంటుంది. ఇంటర్నెట్ వినియోగదారులకు ఐ పి అడ్రసుతో పాటు ఒక్కోసారి హోస్ట్ నేమ్ను కూడా వాళ్ళ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇస్తారు.
World wide webను గాలించే వినియొగదారుల ఐ పి అడ్రసులే ఆయా వెబ్ సైట్ లకు సంబంధించిన సర్వర్లతో సంభాషిస్తాయి. మనం పంపే ఈ-మెయిల్ యొక్క శీర్షం (Header) లో కూడా ఇది వుంటుంది. వాస్తవానికి TCP/IP ప్రోటోకోల్ వాడే అన్ని ప్రోగ్రాములకు వివిధ కంప్యూటర్లతో సంభాషించాలన్నా, సమాచారాన్ని పంపాలన్నా విధిగా పంపే వారిది, అందుకునేవారిది ఐ పి అడ్రసులు వుండాలి.
వాడే ఇంటర్నెట్ కనెక్షను ననుసరించి, ఐ పి అడ్రసు ఎప్పుడు కనెక్టయినా ఒ4కటే వుండటం గానీ (స్థిర ఐ పి అడ్రసు అంటాము), లేదా కనెక్టయిన ప్రతిసారీ మారటం గానీ (గతిశీల ఐ పి అడ్రసు అంటాము) జరుగుతుంది. గతిశీల ఐ పి అడ్రసు వాడాలంటే, ఆ అడ్రసు ఇవ్వడానికి ఒక సర్వరు తప్పనిసరిగా వుండి తీరాలి. సాధారణంగా DHCP లేదా Dynamic Host Configuration Protocol అనే సర్వరు ద్వారా ఐ పి అడ్రసులను ఇస్తారు.
ఇంటర్నెట్ అడ్రసులు మాట్లాడుకునే వివిధ వర్గాల కొరకే కాక, సమాచార రవాణా కొరకు కూడా అవసరం. అందుచేతనే చాలా భాగం అడ్రసులు వాడకుండానో లేక ఒక పక్కన పెట్టబడో (reserved) వుంటాయి.
ఈ ఐ పి అడ్రసుల విలక్షణత, ప్రత్యేకత ల వలన ఏ కంప్యూటరైనా - తద్వారా ఏ మనిషైనా - ఇంటర్నెట్లో ఏం సమాచారాన్ని పంపారు, అసలేం చేసారు అనేది చాలా సందర్భాల్లో తెలిసిపోతుంది. నేరగాళ్ళను, అనుమానితుల్నీ పట్టుకోవటానికి ఇది చట్టానికి ఉపయోగపదుతుంది. కాకపోతే గతిశీల ఐ పి అడ్రసుల వలన ఇది కాస్త కష్టమవుతుంది.
ఐ పి కూర్పు (వెర్షన్) 4
అడ్రసులు ఇవ్వటం ఎలా
ప్రస్తుత ప్రామాణికమైన ఇంటర్నెట్ ప్రోటోకోల్ యొక్క కూర్పు 4 (IPv4) లో ఐ పి అడ్రసు 32 బిట్లు కలిగివుంది. ఈ లెక్క ప్రకారం 4,294,967,296 (400 కోట్లకు పైగా) విలక్షణ అడ్రసులు వున్నా, ఆచరణలోకి వచ్చేసరికి, అడ్రసుల్ని గంప గుత్తగా కేటాయించటం వలన, చాలా ఎక్కువ అడ్రసులు నిరుపయోగంగా పడివుంటాయి (పెద్దగా జనాభా లేని చోట్ల ఫోను నంబర్లు ఖాళీగా వున్నట్లు). అందుచేత ఐ పి కూర్పు 6 ద్వారా అడ్రసుల విస్తీర్ణాన్ని పెంచాలని వత్తిడి వున్నది (కింద చూడండి).
మామూలుగా IP4 లోని అడ్రసులను చుక్కల చదర (dotted quad) లుగా, అనగా ఒకదాన్నొకటి చుక్క ద్వారా విడిపోయిన నాలుగు అష్టంలు (8 బిట్లు) గా చూపిస్తారు. www.wikipedia.org అనే ఒక హోస్టుకు ప్రస్తుతం 3482223596 అనే నుంబరు ఉంది. దాన్ని బేస్-256 లో ఇలా రాస్తారు - 207.142.131.236: 3482223596 అంటే 207×2563 + 142×2562 + 131×2561 + 236×2560. ("www.wikipedia.org" అనే పేరుకు సంబంధించిన నంబరు ఏదో పరిష్కరించే పని డోమైన్ నేమ్ సిస్టమ్ సర్వర్లు చూసుకుంటాయి.)
వర్గం:కంప్యూటరు నెట్వర్క్ |
ఏనుకూరు మండలం | https://te.wikipedia.org/wiki/ఏనుకూరు_మండలం | ఏనుకూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం కల్లూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కొత్తగూడెం డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 33 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం ఏనుకూరు.
గణాంకాలు
thumb|2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం జిల్లా పటంలో మండల స్థానం
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 35,342 - పురుషులు 17,982 - స్త్రీలు 17,360
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 189 చ.కి.మీ. కాగా, జనాభా 35,342. జనాభాలో పురుషులు 17,982 కాగా, స్త్రీల సంఖ్య 17,360. మండలంలో 9,694 గృహాలున్నాయి.
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
రాయమాదారం
తిమ్మారావుపేట
బురద రాఘవాపురం
కేసుపల్లి
నాచారం
మేడేపల్లి
ఏనుకూరు
తూతక లింగన్నపేట
ఆరికాయలపాడు
జన్నారం
నూకులంపాడు
పంచాయతీలు
ఆరికాయలపాడు
బద్రుతండ
భగవాన్ నాయక్ తండ
బురద రాఘవాపురం
ఏనుకూరు
గంగుల నాచారం
గార్ల ఒడ్డు
హిమామ్ నగర్(ఈస్ట్)
జన్నారం
జన్నారం ఎస్టి కాలనీ
కేసుపల్లి
కోదండరామపురం
మేడిపల్లి
మూలపోచారం
నాచారం
నూకులంపాడు
పీ.కే.బంజర
రాజలింగాల
రాయమాదారం
రేపల్లెవాడ
శ్రీరామగిరి
సూర్యతండ
తిమ్మారావుపేట
టీ.ఎల్.పేట
ఎర్రబోడుతండా
మూలాలు
వెలుపలి లింకులు
new:एनुकूरु मण्डल, खम्मम जिल्ला |
కల్లూరు (ఖమ్మం) | https://te.wikipedia.org/wiki/కల్లూరు_(ఖమ్మం) | కల్లూరు, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా,కల్లూరు మండలానికి చెందిన ఒక చిన్న పట్టణం.
ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 50 కి. మీ. దూరంలో ఖమ్మం నుండి సత్తుపల్లి లేదా తిరువూరు వెళ్ళేదారిలో ఉంది.ఆ రెండు మార్గాలు ఇక్కడ చీలిపోతాయి. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4254 ఇళ్లతో, 15807 జనాభాతో 2864 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7947, ఆడవారి సంఖ్య 7860. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4156 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1571. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 579799..పిన్ కోడ్: 507209.
కొత్త రెవెన్యూ డివిజను కేంద్రంగా ఏర్పాటు
right|thumb|200px|కల్లూరులో మెయిన్ రోడ్
లోగడ ఖమ్మం జిల్లా, కొత్తగూడెం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కల్లూరు పట్టణాన్ని రెవెన్యూ డివిజనుగా కల్లూరుతో కలుపుకొని ఆరు మండలాలుతో కొత్త రెవెన్యూ డివిజనుగా ప్రకటించి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 236 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
విద్యా సౌకర్యాలు
right|thumb|200px|కల్లూరు హైవే జంక్షన్
గ్రామంలో ఐదుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 10, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఏడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ పాఠశాలఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల కుప్పెనకుంట్లలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
కల్లూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.ఈ ఊరిలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో10 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఆరుగురు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. 15 మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
కల్లూరులో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
కల్లూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
అడవి: 16 హెక్టార్లు
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 646 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 115 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 48 హెక్టార్లు
తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 20 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 48 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 91 హెక్టార్లు
బంజరు భూమి: 1081 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 799 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 1484 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 487 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
కల్లూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
కాలువలు: 293 హెక్టార్లు
చెరువులు: 194 హెక్టార్లు
ఉత్పత్తి
కల్లూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, మిరప, పొగాకు
గ్రామ ప్రత్యేకతలు
thumb|కల్లూరు పట్టణంలో సుగర్ ప్యాక్టరీ
ఇక్కడ ఓ చక్కర కర్మాగారం ఉంది.
ఈ ప్రాంతము గుండా నాగార్జున సాగర్ ఎడమ కాలువ వెళ్తూ భూమిని సస్యశ్యామలం చేస్తుంది.
ఈ పట్టాణములో మూడు "సి" క్లాసు సినిమా హాళ్ళు ఉన్నాయి. (ఇప్పుడు ఒక్కటి కూడా ఆడటం లేదు) ఒకటి తీసివేసి ఇళ్ళ స్తలాలుగా అమ్మేశారు, మరొ రెండింటిని వ్యాపారులు ధాన్యపు గొడవున్లకు ఉపయోగిస్తున్నారు.
దగ్గరలోని చాలా గ్రామాలకు ఇది ఓ విద్యాకేంద్రముగా, వ్యాపార కూడలిగా ఉంది.
ఈ ఊరిలో ఎక్కువగా రైస్ మిల్లులు ఉన్నాయి.
పంచాయితి ఆఫీసు ఊరి సెంటర్ లోను, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు యన్.యస్.పి. క్యాంప్ లోను ఉంటాయి.
కల్లూరులో ప్రభుత్వ కళాశాల ఉంది.
ఆర్.టి.సి. బస్ స్టాండ్ ఊరికి కొంచెం దూరంలో ఉండటం వల్ల దీనిని ఎవరు ఉపయోగించటం లేదు.
విశేషాలు
ఇక్కడ కల్లూరు పెద్దచెరువు అనే ఒక చెరువు ఉంది. ఇది ఈ మండలం చుట్టుపక్కల గల గ్రామాలకు తాగునీటి అవసరాలను తీరుస్తుంది.ఈ చెరువు నాగార్జునసాగర్ కెనాల్ ద్వారా నిండుతుంది..
ప్రతి శనివారం ఇక్కడ సంత జరుగుతుంది. ఇందులో ఎక్కువగా పశువులు అమ్మకం జరుగుతుంది.
ఈ గ్రామములో, శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి, గోపాలదేవబోయినపల్లి గ్రామంలో, 217.11 ఎకరాల మాన్యం భూములున్నవి. సారవంతమైన ఈ భూములలో నాగార్జునసాగరు కాలువల ద్వారా ఏడాదికి రెండు పంటలు పండుతాయి.
కల్లూరు గ్రామ సరిహద్దులో కాకతీయుల కాలం నాటి కాశ్మీర దేవ క్షేత్రం (కల్లూరు అప్పయ్య దేవాలయం) ప్రసిద్ధ శైవ క్షేత్రం గా ఆ ప్రాంతంలో ప్రసిద్ది పొందినది.
మూలాలు
వెలుపలి లింకులు
(ఇదే పేరుతో మరి కొన్ని గ్రామాలున్నాయి. వాటి లింకులకొరకు అయోమయ నివృత్తి పేజీ కల్లూరు చూడండి.) |
ఎర్రుపాలెం | https://te.wikipedia.org/wiki/ఎర్రుపాలెం | ఎర్రుపాలెం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలానికి చెందిన గ్రామం.
ఇది సమీప పట్టణమైన విజయవాడ నుండి 52 కి. మీ. దూరంలో ఉంది.విజయవాడ - ఖమ్మం రైలు మార్గంలో ఇది ఉంది. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని పాత మండలంలో ఉండేది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1468 ఇళ్లతో, 5218 జనాభాతో 906 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2624, ఆడవారి సంఖ్య 2594. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1176 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 33. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579893..పిన్ కోడ్: 507201., ఎస్.టి.డి.కోడ్ = 08749.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల మధిరలో ఉంది. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్ మధిరలోను, మేనేజిమెంటు కళాశాల మైలవరంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మం లో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
ఎర్రుపాలెంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
ఎర్రుపాలెంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
ఎర్రుపాలెంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 120 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 104 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 7 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 17 హెక్టార్లు
బంజరు భూమి: 253 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 405 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 584 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 91 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
ఎర్రుపాలెంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
కాలువలు: 5 హెక్టార్లు
బావులు/బోరు బావులు: 86 హెక్టార్లు
ఉత్పత్తి
ఎర్రుపాలెంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, మిరప, పొగాకు
గ్రామ ముఖ్యులు నాడు/నేడు
మాడపాటి హనుమంతరావు
జమలాపురం కేశవరావు
గ్రామ విశేషాలు
ఎర్రుపాలెంలో 130 సంవత్సరాల పురాతమైన బాలాత్రిపురసుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయం ఉంది. ఈ దేవాలయం కింద 47 ఎకరాల భూమి ఉండేది. కాలక్రమంలో 5 ఎకరాల భూమి ఆక్రమణలకు గురవ్వగా ప్రస్తుతం 42 ఎకరాల భూమి దేవాదాయ & ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఇది తెలంగాణ & ఆంధ్రా ప్రాంతాలకు సరిహద్దు ప్రాంతం.
ఎర్రుపాలెం పంచాయతీ పరిధిలోని తెల్లపాలెం గ్రామానికి చెందిన వేమిరెడ్డి మల్లారెడ్డి అను రైతు, 15 సం.ల నుండి వ్యవసాయంలో నూతన పద్ధతులను ఆచరించి, బోరుబావుల ద్వారా బిందు సేద్యం చేసి, వైవిధ్యమైన పంటలు పండించి, అధిక లాభాలు గడించుచున్నాడు.ఇతను 2009లో జిల్లాలో "ఆదర్శరైతు" పురస్కారాన్ని అప్పటి కేంద్రమంత్రి రేణుకా చౌదరి, కలెక్టరు శశిభూషణ్ లద్వారా అందుకున్నాడు
ఇక్కడికి దగ్గరలోని జమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధి.
మూలాలు
వెలుపలి లంకెలు
[1] ఈనాడు ఖమ్మం/మధిర, డిసెంబరు,19-2013,2వ పేజీ
వర్గం:ఖమ్మం జిల్లా రైల్వేస్టేషన్లు |
అశ్వారావుపేట | https://te.wikipedia.org/wiki/అశ్వారావుపేట | అశ్వారావుపేట, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలానికి చెందిన గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.
ఇది సమీప పట్టణమైన సత్తుపల్లి నుండి 40 కి. మీ. దూరంలో ఉంది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6320 ఇళ్లతో, 24405 జనాభాతో 10379 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 12201, ఆడవారి సంఖ్య 12204. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4127 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 3092. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 579537.పిన్ కోడ్: 507301. పిన్ కోడ్: 507301.
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 20, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఐదు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప బాలబడి అశ్వారావుపేటలో ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల గంగారంలో ఉంది. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్ కొత్తగూడెంలోను, మేనేజిమెంటు కళాశాల VEGAVARAM లోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం కొత్తగూడెంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్య
ప్రభుత్వ వైద్య సౌకర్యం
అశ్వారావుపేటలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు డాక్టర్లు, 11 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రిలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో12 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ముగ్గురు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు 8 మంది, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. 11 మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
అశ్వారావుపేటలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
అశ్వారావుపేటలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
అడవి: 4244 హెక్టార్లు
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 111 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 17 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 1824 హెక్టార్లు
బంజరు భూమి: 155 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 4027 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 4631 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1375 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
అశ్వారావుపేటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
కాలువలు: 750 హెక్టార్లు
బావులు/బోరు బావులు: 610 హెక్టార్లు
చెరువులు: 15 హెక్టార్లు
ఉత్పత్తి
అశ్వారావుపేటలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, మొక్కజొన్న, పొగాకు
పారిశ్రామిక ఉత్పత్తులు
పామాయిల్, HERBAL పొడి, CRAFT కాగితం
విశేషాలు
సా.శ.1700 ప్రాంతంలో పాల్వంచ సంస్థానానికి చెందిన శ్రీనాధుని వెంకటరామయ్య అనే కవి స్వస్థలం అశ్వారావుపేట. ఈ కవి వ్రాసిన "అశ్వారాయ చరిత్రము" అవే గ్రంథానికి "శ్రీరామ పట్టాభిషేకం" అనే నామాంతరం కూడా ఉంది. ఇది చరిత్రాంశాలతో కూడుకొన్న గ్రంథమట. ఈ గ్రంథంలో పాల్వంచ సంస్థానాధీశులకు, జాఫరుద్దౌలాకు ధంసాలో జరిగిన యుద్ధం వర్ణింపబడిందట. ప్రస్తుతం ఈ గ్రంథం లభించడంలేదు.తెలుగు సాహిత్య కోశము. - తెలుగు అకాడమీ, హైదరాబాదు వారి ప్రచురణ http://www.archive.org/details/TeluguSahityaKosham
మూలాలు
వెలుపలి లంకెలు
వర్గం:తెలంగాణ బౌద్ధమత క్షేత్రాలు |
అశ్వాపురం | https://te.wikipedia.org/wiki/అశ్వాపురం | అశ్వాపురం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలానికి చెందిన గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.
ఇది గొల్లగూడెం గ్రామ పంచాయితీలొని ఒక గ్రామం.ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.
గణాంకాలు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4944 ఇళ్లతో, 18182 జనాభాతో 3198 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9290, ఆడవారి సంఖ్య 8892. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2144 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2625. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 578925.పిన్ కోడ్: 507116.
గ్రామ విశేషాలు
అశ్వాపురంలో భారజల ఉత్పత్తి కేంద్రం ఉంది. ఈ ఉత్పత్తి కేంద్రానికి బొగ్గు సింగరేణి ఒపెన్ కాస్ట్ గనుల నుండి బొగ్గు వస్తుంధి. బొగ్గును రొప్వే ద్వారా రవాణా చేస్తారు. భారజల కర్మాగారంలోని ఉద్యోగులకు ఒక కాలనీ ఉంధి. ఆఫీసు నుండి ఆ కాలనీ 5 కి.మీ దూరంలో ఉంధి. అ కాలనీలో సి.ఐ.స్.ఎఫ్ భద్రత కలిగిస్తోంది. కాలనీలో "అణుశక్తి కేంద్రీయ విద్యాలయం" ఉంది.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మణుగూరులోను, ఇంజనీరింగ్ కళాశాల భద్రాచలంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్ కొత్తగూడెంలోను, మేనేజిమెంటు కళాశాల పాల్వంచలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం పాల్వంచలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
అశ్వాపురంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. నాలుగు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. 8 మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఆరుగురు నాటు వైద్యులు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
అశ్వాపురంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
అశ్వాపురంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
అడవి: 514 హెక్టార్లు
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 813 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 216 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 60 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 283 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 342 హెక్టార్లు
బంజరు భూమి: 345 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 622 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 1100 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 209 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
అశ్వాపురంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
చెరువులు: 209 హెక్టార్లు
ఉత్పత్తి
అశ్వాపురంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
ప్రత్తి, వరి, మొక్కజొన్న
మూలాలు
వెలుపలి లంకెలు |
బయ్యారం (మహబూబాబాద్ జిల్లా) | https://te.wikipedia.org/wiki/బయ్యారం_(మహబూబాబాద్_జిల్లా) | బయ్యారం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా, బయ్యారం మండలానికి చెందిన గ్రామం.
ఇది సమీప పట్టణమైన ఇల్లెందు నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.
గ్రామ జనాభా
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4211 ఇళ్లతో, 14721 జనాభాతో 4183 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7238, ఆడవారి సంఖ్య 7483. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 811 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 4775. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 579436.
ఖమ్మం జిల్లా నుండి మార్పు
లోగడ బయ్యారం మండలం ఖమ్మం జిల్లా, కొత్తగూడెం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా బయ్యారం మండలాన్ని వరంగల్ జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి ఈ (బయ్యారం) మండలాన్ని చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
విద్యా సౌకర్యాలు
గ్రామంలో మూడుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 17, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఎల్లందులోను, ఇంజనీరింగ్ కళాశాల కారేపల్లిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్ మహబూబాబాదులోనూ ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం ఎల్లందులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
బయ్యారంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో13 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు 9 మంది ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
బయ్యారంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
బయ్యారంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
అడవి: 1032 హెక్టార్లు
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 355 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 289 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 119 హెక్టార్లు
తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 6 హెక్టార్లు
బంజరు భూమి: 741 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 1638 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 2089 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 289 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
బయ్యారంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
బావులు/బోరు బావులు: 289 హెక్టార్లు
ఉత్పత్తి
బయ్యారంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, ప్రత్తి, మొక్కజొన్న
బయ్యారం మైన్స్
ఈ గ్రామంలో బయ్యారం మైన్స్ ఉన్నాయి.
మూలాలు
వెలుపలి లింకులు |
బోనకల్ | https://te.wikipedia.org/wiki/బోనకల్ | బోనకల్, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, బోనకల్ మండలానికి చెందిన గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 236 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1186 ఇళ్లతో, 4467 జనాభాతో 839 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2167, ఆడవారి సంఖ్య 2300. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1104 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 883. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579844.పిన్ కోడ్: 507204.ఎస్.టి.కోడ్ = 08749.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల ఖమ్మంలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మం లో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
బోనకల్లులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
బోనకల్లులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
బోనకల్లులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 107 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 19 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 107 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 34 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 109 హెక్టార్లు
బంజరు భూమి: 15 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 448 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 490 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 82 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
బోనకల్లులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
కాలువలు: 44 హెక్టార్లు
బావులు/బోరు బావులు: 10 హెక్టార్లు
చెరువులు: 28 హెక్టార్లు
ఉత్పత్తి
బోనకల్లులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, ప్రత్తి, మొక్కజొన్న
గ్రామ పంచాయితీ
2018 జనవరి లో ఈగ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో భూక్యా సైదా నాయక్ అఖండ మెజారిటీ తో సర్పంచిగా ఎన్నికైనాడు. యార్లగడ్డ రాఘవరావు ఉపసర్పంచిగా ఎన్నికైనాడు.
గ్రామ ప్రముఖులు
బొమ్మకంటి సత్యనారాయణ రావు: తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యుడు.
మూలాలు
వెలుపలి లంకెలు
వర్గం:ఖమ్మం జిల్లా రైల్వేస్టేషన్లు |
బూర్గంపాడు | https://te.wikipedia.org/wiki/బూర్గంపాడు | బూర్గంపాడు, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలానికి చెందిన గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016ఇది సమీప పట్టణమైన పాల్వంచ నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.దీనిని బూర్గంపహడ్ అనే మరో పేరు ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2750 ఇళ్లతో, 10235 జనాభాతో 2883 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5078, ఆడవారి సంఖ్య 5157. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2021 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1118. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579345.పిన్ కోడ్: 507128.
మండలంలోని విశేషాలు
మండలంలో సారపాక చిన్న పట్టణం.సారపాకలో ప్రసిద్ధి పొందిన ఐ.టి.సి.వారి పేపరు మిల్లు ఉంది.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప బాలబడి భద్రాచలంలో ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల భద్రాచలంలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్ భద్రాచలంలోనూ ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం పాల్వంచలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
బూర్గంపాడులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఆరుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
బూర్గంపాడులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
బూర్గంపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
అడవి: 102 హెక్టార్లు
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 161 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 790 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 74 హెక్టార్లు
తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 228 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 40 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 301 హెక్టార్లు
బంజరు భూమి: 297 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 889 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 943 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 544 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
బూర్గంపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
కాలువలు: 156 హెక్టార్లు
బావులు/బోరు బావులు: 65 హెక్టార్లు
చెరువులు: 123 హెక్టార్లు
ఇతర వనరుల ద్వారా: 200 హెక్టార్లు
ఉత్పత్తి
బూర్గంపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, ప్రత్తి, మిరప
పారిశ్రామిక ఉత్పత్తులు
బియ్యం
మూలాలు
వెలుపలి లింకులు |
చర్ల మండలం | https://te.wikipedia.org/wiki/చర్ల_మండలం | చర్ల మండలం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండల కేంద్రం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016.
ఈ మండల కేంద్రం గోదావరి నది ఒడ్డున, పర్ణశాలకు దగ్గరలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 74 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 13 నిర్జన గ్రామాలు.మండల కేంద్రం చెర్ల గ్రామం.
ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు
thumb|2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం జిల్లా పటంలో మండల స్థానం
లోగడ చర్ల మండలం, ఖమ్మం జిల్లా,భద్రాచలం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చర్ల మండలాన్ని 74 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా, భద్రాచలం రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 42,947- పురుషులు 21,167 - స్త్రీలు 21,780.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 479 చ.కి.మీ. కాగా, జనాభా 42,947. జనాభాలో పురుషులు 21,167 కాగా, స్త్రీల సంఖ్య 21,780. మండలంలో 11,091 గృహాలున్నాయి.
భౌగోళికం
చర్ల గోదావరి నదీ తీరాన ఈ ప్రాంతంలో ఉంది..Falling Rain Genomics, Inc - Cherla ఇది సగటు సముద్రమట్టానికి సుమారు 78 మీటర్లు అనగా 259 అడుగుల ఎత్తులో ఉంది.
విశేషాలు
తాలిపేరు ప్రాజెక్టు: ఇది తాలిపేరు నదిపై నిర్మించిన మధ్య తరహా నీటి పారుదల పధకం. ఇది పెద మిడిసిలేరు గ్రామం వద్ద నిర్మించబడి, సుమారు 26,000 ఎకరాల పంట భూములకు సాగునీరు అందిస్తుంది.
రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
సుబ్బంపేట (జి)
కొయ్యూరు (జెడ్)
సుబ్బంపేట (జెడ్)
రామానుజపురం
చీమలపాడు
గన్నవరం (జెడ్)
సింగసముద్రం
రేగుంట (జెడ్)
రేగుంట (జి)
ఉప్పెరగూడెం
కొటూరు
సీ. కతిగూడెం
గొమ్ముపుల్లిబోయినపల్లి
చింతకుంట (జెడ్)
పులిబోయినపల్లి
మొగుల్లపల్లి (జి)
లింగాపురం (జెడ్)
గంపల్లి (జెడ్)
కొత్తపల్లి (జెడ్)
రిచెపేట
కేశవపురం
దండుపేట (జెడ్)
చెర్ల (జి)
దోసిల్లపల్లి
భూముల్లంక
పూసుగుప్ప (పాచ్-1)
పూసుగుప్ప (పాచ్-2)
పూసుగుప్ప (జి)
వద్దిపేట్ (జెడ్)
ఉంజుపల్లి
చెర్ల (జెడ్)
తిప్పాపురం
ఉయ్యాలమడుగు (జి)
చలమల (జెడ్)
పెద మిడిసిలెరు (జెడ్)
పెద మిడిసిలెరు చల్క్-ఈ
పెద మిడిసిలెరు చల్క్-ఇ
బత్తినపల్లి
కుర్నాపల్లి
బొదనల్లి (జెడ్)
బొదనల్లి (జి)
చిన మిడిసిలెరు (జి)
తెగద (జెడ్)
జంగాలపల్లి
తెగద (జి)
గొమ్ముగూడెం (జెడ్)
లింగాల (జెడ్)
కలివేరు (జెడ్)
పెద్దిపల్లి
జెట్టిగూడెం (జెడ్)
ముమ్మిడారం (జెడ్)
ఆర్. కొత్తగూడెం
చింతగుప్ప
కుదునూరు (జి)
కుదునూరు (జెడ్)
దేవరపల్లి (జెడ్)
మామిడిగూడెం చల్క్
మామిడిగూడెం (జెడ్)
పులిగుండల
గోగుబాక (జెడ్)
రల్లగూడెం
గమనిక:నిర్జన గ్రామాలు పదమూడు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
వెలుపలి లంకెలు |
చండ్రుగొండ | https://te.wikipedia.org/wiki/చండ్రుగొండ | చండ్రుగొండ, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలానికి చెందిన గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.
ఇది సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 22 కి. మీ. దూరంలో ఉంది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1803 ఇళ్లతో, 6822 జనాభాతో 1980 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3382, ఆడవారి సంఖ్య 3440. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1879 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 352. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 579499. పిన్ కోడ్: 507116.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప బాలబడి కొత్తగూడెంలో ఉంది.సమీప జూనియర్ కళాశాల అన్నపురెడ్డిపల్లిలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు కొత్తగూడెంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్లు కొత్తగూడెంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం కొత్తగూడెంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
చంద్రుగొండలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
చంద్రుగొండలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, ఆటో సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
జాతీయ రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
చంద్రుగొండలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
అడవి: 4 హెక్టార్లు
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 210 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 166 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 18 హెక్టార్లు
తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 1074 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 6 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 100 హెక్టార్లు
బంజరు భూమి: 100 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 300 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 334 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 165 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
చంద్రుగొండలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
చెరువులు: 165 హెక్టార్లు
ఉత్పత్తి
చంద్రుగొండలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, ప్రత్తి, మిరప
మూలాలు
వెలుపలి లింకులు |
చింతకాని | https://te.wikipedia.org/wiki/చింతకాని | చింతకాని (ఆంగ్లం: Chintakani), తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, చింతకాని మండలానికి చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 22 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1007 ఇళ్లతో, 3702 జనాభాతో 1573 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1826, ఆడవారి సంఖ్య 1876. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 784 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 78. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579739..పిన్ కోడ్: 507208.విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప జూనియర్ కళాశాల నాగులవంచలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు ఖమ్మంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మం లో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
చింతకానిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
చింతకానిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
గ్రామంలో జన్మించిన ప్రముఖులు
అఫ్సర్ - ఇతని అసలు పేరు ముహమ్మద్''' మహబూబ్ అలీ.కవి, విమర్శకుడు, రచయిత, సీనియర్ ఉపన్యాసకుడు.1964, ఏప్రిల్ 11 న మునవర్ బేగం, షంషుద్దీన్ దంపతులకు జన్మించాడు. తండ్రి షంషుద్దీన్ అభ్యుదయ రచయితల సంఘం ఖమ్మం జిల్లాశాఖకు అధ్యక్షుడు
కుందా సత్యనారాయణ - యాదాద్రికి సమీపంలోని సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
చింతకానిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 195 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 197 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 90 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 1 హెక్టార్లు
బంజరు భూమి: 82 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 1008 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 54 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1037 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
చింతకానిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
కాలువలు: 352 హెక్టార్లు
బావులు/బోరు బావులు: 299 హెక్టార్లు
చెరువులు: 137 హెక్టార్లు
ఇతర వనరుల ద్వారా: 249 హెక్టార్లు
ఉత్పత్తి
చింతకానిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
ప్రత్తి, వరి, మొక్కజొన్న
మూలాలు
బయటి లింకులు |
చింతూరు | https://te.wikipedia.org/wiki/చింతూరు | చింతూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం.ఇది సమీప పట్టణమైన పాల్వంచ నుండి 95 కి. మీ. దూరంలో ఉంది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1150 ఇళ్లతో, 3818 జనాభాతో 246 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1876, ఆడవారి సంఖ్య 1942. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 302 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1155. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579197.పిన్ కోడ్: 507126.
2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు, ఈ గ్రామాన్ని ఈ మండలంతో సహా ఖమ్మం జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో చేర్చారు. ఆ తరువాత 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇది మండలంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిసింది.
గ్రామ భౌగోళికం
ఇది పూర్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం, కాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురికాబోయే ఈ మండలం జూన్ 2014 న ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు. చింతూరు మండల కేంద్రం కాగా, జిల్లా కేంద్రం కాకినాడ, డివిజను కేంద్రం రంపచోడవరం.
చింతూరు శబరి నదీతీరాన గలదు. చింతూరు మండలం శబరి నదికి ఇరువైపులా ఆవరించి ఉంది. చత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుల నుండి ప్రవహిస్తున్న శబరి నది ఈ మండల సరిహద్దున ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశించు తుంది. శబరి నదికి సీలేరు ఉపనది. సీలేరు నది రాష్ట్రానికి అత్యధిక విద్యుత్తును అందించే జలవిద్యుత్ కేంద్రాలైన మోతుగూడెం, సీలేరు, డొంకరాయిలు ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలను వేరుచేయుచూ శబరితో కలసి కూనవరం వద్ద భారతదేశంలో రెండవ అతిపెద్ద నది, దక్షిణ గంగగా పిలువబడే గోదావరి నదిలో కలుస్తుంది.
సామాజిక భౌగోళిక స్థితిగతులు
thumb|సమీప అటవీ ప్రాంతలో స్థిరపడి నివసిస్తున్న కుటుంబాలు
ఈ మండలంలో అత్యధికులు ఆదివాసీ గిరిజన తెగలు కాగా కొద్ది మంది ఇతర ప్రాంతముల నుండి వచ్చి సమీపంలోని అటవీ ప్రాంతంలో స్థిరపడిన వారు కూడా నివాసముంటున్నారు. ఈ ప్రాంతంలో కోయదొర, కొండ దొర, కొండ రెడ్లు, కొండ కాపు, వాల్మీకి మొదలగు షెడ్యుల్డ్ జాతుల వారు, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాల నుండి వచ్చి స్థిరపడిన సగాలీలు తదితరులు ఉన్నారు. ఇక్కడ ప్రజలు తెలుగు, కోయ, ఉర్దూ.భాషలు మాట్లాతారు.
సరిహద్దులు
చింతూరు ఆంధ్ర, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా రాష్ట్రాలను కలుపు జాతీయ రహదారులు ఎన్హెచ్ 221, ఎన్హెచ్ 41 లకు జంక్షన్ గా ఉంది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, భద్రాచలం, విజయవాడ, హైదరాబాద్ లే కాక ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా లలోని జగదల్ పూర్, జైపూర్ లకు పోవు రహదారులు కలిగియుండి ఆయా ప్రదేశములకు డైరెక్ట్ బస్సు సౌకర్యం కలిగిఉంది.
పర్యాటక కేంద్రాలు
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రములైన భద్రాచలం, రాజమహేంద్రవరం, ప్రముఖ విహార, పర్యటక కేంద్రములైన పాపికొండలు, కోనసీమ, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, హైదరాబాద్, మణుగూరు, కొత్తగూడెం, మల్కనగిరిలు చింతూరుకు అందుబాటులో ఉన్నాయి. అంతేగాక మండలానికి అతి సమీపములో అందమైన చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డు, టైగర్ క్యాంపు, పాములేరు, పాలధార, జలతరంగిణి, పాపి కొండలు జాతీయ అభయారణ్యము, అల్లూరి సీతారామరాజు రక్షిత అటవీ ప్రాంతము, పొల్లూరు, కల్లేరు, సుకుమామిడి జలపాతములు, మోతుగూడెం, ఎగువ సీలేరు, దిగువ సీలేరు, డొంకరాయి, కొంట, మూడు రాష్ట్రముల కూడలి (Tri State Junction) ప్రాంతములు పర్యాటక కేంద్రములుగా భాసిల్లుతున్నాయి.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల భద్రాచలంలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్ ఎటపాక లోను, మేనేజిమెంటు కళాశాల పాల్వంచలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం పాల్వంచలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
చింతూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
చింతూరులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
చింతూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 8 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 8 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 27 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 202 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 170 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 32 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
చింతూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
ఇతర వనరుల ద్వారా: 32 హెక్టార్లు
ఉత్పత్తి
చింతూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, ప్రత్తి, పొగాకు
మూలాలు
వెలుపలి లింకులు |
దమ్మపేట | https://te.wikipedia.org/wiki/దమ్మపేట | దమ్మపేట, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండలానికి చెందిన గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-20162016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.
ఇది సమీప పట్టణమైన సత్తుపల్లి నుండి 22 కి. మీ. దూరంలో ఉంది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3129 ఇళ్లతో, 11629 జనాభాతో 4456 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5716, ఆడవారి సంఖ్య 5913. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 572 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 4456. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579547. పిన్ కోడ్: 507306.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో మూడుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల సత్తుపల్లిలోను, ఇంజనీరింగ్ కళాశాల గంగారంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్ కొత్తగూడెం లోనూ ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం కొత్తగూడెంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
దమ్మపేటలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
దమ్మపేటలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. మొబైల్ ఫోన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
దమ్మపేటలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
అడవి: 516 హెక్టార్లు
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 420 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 1181 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 190 హెక్టార్లు
తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 108 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 267 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 180 హెక్టార్లు
బంజరు భూమి: 38 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 1555 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 709 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1064 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
దమ్మపేటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
బావులు/బోరు బావులు: 1064 హెక్టార్లు
ఉత్పత్తి
దమ్మపేటలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, మామిడి , మొక్కజొన్న, చెరకు
ప్రముఖ వ్యక్తులు
సోయం గంగులు - ఆదివాసీ యోధుడు
మూలాలు
వెలుపలి లంకెలు |
దుమ్ముగూడెం | https://te.wikipedia.org/wiki/దుమ్ముగూడెం | దుమ్ముగూడెం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దుమ్ముగూడెం మండలానికి చెందిన గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 64 కి. మీ. దూరంలో ఉంది
గణాంకాలు
thumb|right|గోదావరి నదిపై దుమ్ముగూడెం బ్యారేజీ
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 806 ఇళ్లతో, 2589 జనాభాతో 1036 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1227, ఆడవారి సంఖ్య 1362. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 644 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 408. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578964.పిన్ కోడ్: 507137.'''
విద్యా సౌకర్యాలు
thumb|right|గోదావరి నదిపై పర్ణశాల వద్ద సూర్యాస్తమయం
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల భద్రాచలంలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్ ఎటపాకలోను, మేనేజిమెంటు కళాశాల పాల్వంచలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం పాల్వంచలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
దుమ్ముగూడెంలో ఉన్న ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
దుమ్ముగూడెంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ఆటో సౌకర్యం మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
దుమ్ముగూడెంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 253 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 488 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 295 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 121 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 174 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
దుమ్ముగూడెంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించే రెండో భారీ నీటి పారుదల ప్రాజెక్టైన రాజీవ్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం గోదావరి నదిపై ఈ గ్రామంలో నిర్మించడానికి ప్రతిపాదించారు.
కాలువలు: 162 హెక్టార్లు
చెరువులు: 11 హెక్టార్లు
ఉత్పత్తి
దుమ్ముగూడెంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, మిరప, పొగాకు
మూలాలు
వెలుపలి లింకులు |
జూలూరుపాడు | https://te.wikipedia.org/wiki/జూలూరుపాడు | జూలూరుపాడు (ఆంగ్లం: Julurpad or Julurpadu), తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,జూలూరుపాడు మండలానికి చెందిన గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.
ఇది సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 780 ఇళ్లతో, 2901 జనాభాతో 1177 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1486, ఆడవారి సంఖ్య 1415. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1084 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 268. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579477.పిన్ కోడ్: 507166.
మండల కేంద్రంను, గ్రామాన్నివేరు చేసిన రోడ్డు.
వెంగన్నపాలెం ఈ మండలంలోని ఒక విభాగం. ఈ రెండింటిని వేరు చేసేది కేవలం ఒక రోడ్డు మాత్రమే. ఐనా సరే అధికార గుర్తింపు జూలూరుపాడుకే. అందువల్ల ప్రభుత్వం శాంక్షన్ చేసే నిధులన్నీ కూడా జూలూరుపాడుకే. మంచినీటి పైపులు,ఇళ్ళూ,మొదలైనవన్నీ జూలూరుపాడుకే సంక్రమిస్తున్నాయి. దీని వల్ల వెంగన్నపాలెం ప్రజలు అందరూ మంచినీటి కోసం జూలూరుపాడులోనికి వెళ్ళవలసి వస్తుంది. కనుక, ప్రభుత్వం కాస్త ఆలోచించి వెంగన్నపాలెంకి కూడా అధికారిక గుర్తింపు తెస్తే బాగుంటుంది.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కొత్తగూడెంలోను, ఇంజనీరింగ్ కళాశాల సుజాతానగర్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్ కొత్తగూడెంలోను, మేనేజిమెంటు కళాశాల సుజాతానగర్లోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం కొత్తగూడెంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
జూలూరుపాడులో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
జూలూరుపాడులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
జూలూరుపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 82 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 121 హెక్టార్లు
తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 89 హెక్టార్లు
బంజరు భూమి: 17 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 866 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 610 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 273 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
జూలూరుపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
బావులు/బోరు బావులు: 203 హెక్టార్లు
చెరువులు: 70 హెక్టార్లు
ఉత్పత్తి
జూలూరుపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, ప్రత్తి, మిరప
పారిశ్రామిక ఉత్పత్తులు
బియ్యం
మూలాలు
వెలుపలి లింకులు |
గార్ల | https://te.wikipedia.org/wiki/గార్ల | గార్ల, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలానికి చెందిన గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 40 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.
గ్రామ జనాభా
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3542 ఇళ్లతో, 13576 జనాభాతో 2688 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6377, ఆడవారి సంఖ్య 7199. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1369 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 5952. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 579446.పిన్ కోడ్: 507210.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 18, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఐదు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప బాలబడి కొత్తపేటలో ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల కారేపల్లిలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం ఎల్లందులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
గార్లలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో10 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు నలుగురు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
గార్లలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది.
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
గార్లలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 832 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 100 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 125 హెక్టార్లు
తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 23 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 1608 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1608 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
గార్లలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
బావులు/బోరు బావులు: 355 హెక్టార్లు
చెరువులు: 1242 హెక్టార్లు
ఇతర వనరుల ద్వారా: 11 హెక్టార్లు
ఉత్పత్తి
గార్లలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, కంది, పెసర
మూలాలు
వెలుపలి లింకులు |
గుండాల (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) | https://te.wikipedia.org/wiki/గుండాల_(భద్రాద్రి_కొత్తగూడెం_జిల్లా) | గుండాల, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,గుండాల మండలానికి చెందిన గ్రామం. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 మండల కేంద్రం 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.
ఇది సమీప పట్టణమైన ఎల్లందు నుండి 60 కి. మీ. దూరంలో ఉంది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 870 ఇళ్లతో, 3612 జనాభాతో 4203 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2015, ఆడవారి సంఖ్య 1597. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 233 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2054. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579417.
ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గుండాల మండలాన్ని (1+12) 13 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది..
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఎల్లందులోను, ఇంజనీరింగ్ కళాశాల కారేపల్లిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం ఎల్లందులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
గుండాలలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
గుండాలలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
గుండాలలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
అడవి: 3750 హెక్టార్లు
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 35 హెక్టార్లు
బంజరు భూమి: 162 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 255 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 407 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 10 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
గుండాలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
బావులు/బోరు బావులు: 10 హెక్టార్లు
ఉత్పత్తి
గుండాలలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, కూరగాయలు, జొన్న
మూలాలు
వెలుపలి లంకెలు |
కామేపల్లి (ఖమ్మం జిల్లా) | https://te.wikipedia.org/wiki/కామేపల్లి_(ఖమ్మం_జిల్లా) | కామేపల్లి, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలానికి చెందిన గ్రామం.
ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1496 ఇళ్లతో, 5464 జనాభాతో 1380 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2563, ఆడవారి సంఖ్య 2901. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1087 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2105. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 579469. పిన్ కోడ్: 507182.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఖమ్మంలోను, ఇంజనీరింగ్ కళాశాల సింగరేణిలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల సింగరేణిలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్లు ఖమ్మంలోనూ ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
కామేపల్లిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
కామేపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
కామేపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 294 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 140 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 946 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 555 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 391 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
కామేపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
బావులు/బోరు బావులు: 99 హెక్టార్లు
చెరువులు: 215 హెక్టార్లు
ఇతర వనరుల ద్వారా: 77 హెక్టార్లు
ఉత్పత్తి
కామేపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, ప్రత్తి, మిరప
మూలాలు
వెలుపలి లింకులు |
ఖమ్మం మండలం (అర్బన్) | https://te.wikipedia.org/wiki/ఖమ్మం_మండలం_(అర్బన్) | ఖమ్మం మండలం (అర్బన్), తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం..
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం ఖమ్మం.
గణాంకాలు
2011 జనాభా లెక్కల ప్రకారం ఖమ్మం పట్టణ మండలం మొత్తం జనాభా 313,504. వీరిలో 155,461 మంది పురుషులు, 158,043 మంది స్త్రీలు. మండలంలో మొత్తం 82,743 కుటుంబాలు ఉన్నాయి. ఖమ్మం మండలం సగటు లింగ నిష్పత్తి 1,017. మొత్తం జనాభాలో 79.8% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 20.2% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 84.2% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 60.1%గా ఉంది. అలాగే మండలంలోని పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 1,021 కాగా గ్రామీణ ప్రాంతాల్లో 999గా ఉంది. మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 32172, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల మగ పిల్లలు 16725, ఆడ పిల్లలు 15447 మంది ఉన్నారు. మండలం లోని బాలల లింగ నిష్పత్తి 924, ఇది మండల సగటు లింగ నిష్పత్తి (1,017) కంటే తక్కువ.మండలం మొత్తం అక్షరాస్యత రేటు 79.4%. ఖమ్మం మండలంలో పురుషుల అక్షరాస్యత రేటు 76.31%, స్త్రీల అక్షరాస్యత రేటు 66.28%.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 93 చ.కి.మీ. కాగా, జనాభా 280,500. జనాభాలో పురుషులు 138,909 కాగా, స్త్రీల సంఖ్య 141,591. మండలంలో 73,772 గృహాలున్నాయి.
ప్రముఖులు
మహమ్మద్ రజబ్ అలీ
మండలం లోని పట్టణాలు
ఖమ్మం -మునిసిపల్ టౌన్
ఖానాపురం హవేలి - సెన్సస్ టౌన్
బల్లేపల్లి - సెన్సస్ టౌన్
మండలం లోని గ్రామాలు
thumb|2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం జిల్లా పటంలో మండల స్థానం
రెవెన్యూ గ్రామాలు
బల్లేపల్లి
ఖానాపురం హవేలీ
వెలుగుమట్ల
ధంసలాపురం
ఖమ్మం
బుర్హాన్పురం
దానవాయిగూడెం
మల్లెమడుగు
ఎటువంటి డేటా లేని గ్రామాలు
ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఇది రెవెన్యూ గ్రామం, కానీ దీనికి ఎటువంటి డేటా లేనందున పేజీలు సృష్టించలేదు.
పాపకబంద
మూలాలు
బయటి లింకులు |
కూసుమంచి | https://te.wikipedia.org/wiki/కూసుమంచి | కూసుమంచి (ఆంగ్లం: Kusumanchi), తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా,కూసుమంచి మండలానికి చెందిన గ్రామం.
ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 22 కి. మీ. దూరంలో ఉంది.2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. ఈ గ్రామం హైద్రాబాదు నుండి భద్రాచలం రాష్ట్రీయ రహదారి పై హైద్రాబాదు నుండి 180 కి మీ దూరంలో ఉంది.
గణాంక వివరాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2947 ఇళ్లతో, 11563 జనాభాతో 3696 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5923, ఆడవారి సంఖ్య 5640. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2061 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2508. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579636. పిన్ కోడ్: 507159.'''
విద్యా సౌకర్యాలు
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 10, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.
2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఖమ్మంలో ఉన్నాయి.సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మం లో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
కూసుమంచిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో13 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు 10 మంది, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది.
గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.
చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
కూసుమంచిలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.
రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
కూసుమంచిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 510 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 50 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 50 హెక్టార్లు
తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 100 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 55 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 50 హెక్టార్లు
బంజరు భూమి: 60 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 2821 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 2171 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 760 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
కూసుమంచిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
బావులు/బోరు బావులు: 680 హెక్టార్లు
చెరువులు: 80 హెక్టార్లు
ఉత్పత్తి
కూసుమంచిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, ప్రత్తి, మిరప
విశేషాలు
కూసుమంచి గ్రామంలో కాకతీయులనాటిదని ప్రసిద్ధిగాంచిన గణపేశ్వరాలయం (శివాలయం) ఉంది. దీనిని కాకతీయ చక్రవర్తి అయిన గణపతి దేవుడు నిర్మింపచేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని శివలింగం వరంగల్ వేయి స్తంభాలగుడిలోని లింగం అంత పరిమాణంలో ఉంటుంది.
ఆకర్షణలు
కూసుమంచిలోని ప్రాచీన గణపేశ్వరాలయంకూసుమంచిలో ఉన్న ఈ ఆలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయ ప్రభువైన గణపతిదేవుడు..... తనకు అనేక విజయాలను కట్టబెట్టిన సదాశివుడి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా వెయ్యి శివాలయాల నిర్మాణం చేపట్టాడట . అందులో భాగంగానే క్రీస్తుశకం 1162 ప్రాంతంలో కూసుమంచిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆయన కాలంలో ‘రామలింగేశ్వరస్వామి’గా పూజలందుకున్న శివుడు కాలం గడుస్తున్నకొద్దీ గణపేశ్వరస్వామిగా ప్రసిద్ధిచెందాడు.
ఈ దేవాలయ శిల్ప నిర్మాణం అద్భుతంగా వుంటుంది. ఉత్తర, దక్షిణ, తూర్పు ద్వారాలను పెద్దపెద్ద రాతి మెట్లతో, మధ్య పన్నెండు అడుగుల వృత్తాకార వైశాల్యంలో కళ్యాణమండపాన్ని నిర్మించారు. లోపలి గోడ తర్వాత 15 అడుగుల పొడవు ఐదడుగుల వెడల్పు గల రాతి దిమ్మెలు పేర్చి గర్భాలయం, ముఖమంటపం నిర్మించారు. గర్భాలయంలోని శివలింగం 12 అడుగుల ఎత్తు, 6.3 కైవారంతో ఏకశిలా రూపంగా నిర్మించారు. దీనికింద మూడు అడుగుల విస్తీర్ణంతో పానవట్టం నిర్మించారు. పైకప్పును చక్రం ఆకారంలో నిర్మించారు. బయట నుంచి చూస్తే ఈ దేవాలయం లింగాకారంగా, నక్షత్రాకారంగా కన్పిస్తుంది.(1)
నాగన్న హోటల్
దగ్గరలోని పాలేరు జలాశయం
మూలాలు
వెలుపలి లింకులు
(1).https://sarasabharati-vuyyuru.com/2014/02/28] |
ఖమ్మం మండలం (రూరల్) | https://te.wikipedia.org/wiki/ఖమ్మం_మండలం_(రూరల్) | ఖమ్మం మండలం (రూరల్), తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన మండలం..
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం ఖమ్మం
గణాంకాలు
thumb|2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం జిల్లా పటంలో మండల స్థానం
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 93,211 - పురుషులు 46,700 - స్త్రీలు 46,511
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 194 చ.కి.మీ. కాగా, జనాభా 76,357. జనాభాలో పురుషులు 38,222 కాగా, స్త్రీల సంఖ్య 38,135. మండలంలో 21,001 గృహాలున్నాయి.
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
కాచిరాజుగూడెం
తనగంపాడు
తీర్థాల
గొల్లపాడు
యమ్.వెంకటాయపాలెం
అరెకోడు
ఆరెంపల
ముతగూడెం
పల్లిగూడెం
పోలెపల్లి
ఏదులాపురం (గ్రామీణ)
బరుగూడెం
కొండాపురం
తల్లంపాడు
మద్దులపల్లి
తెల్దరుపల్లి
గుర్రాలపాడు
గుదిమల్ల
గుదురుపాడు
మండలంలోని పంచాయతీలు
అరెకోడు
అరెకొడు తండ
ఆరెంపల
బరుగూడెం
చింతపల్లి
దరీడు
గొల్లగూడెం
గొల్లపాడు
గుదురుపాడు
కాచిరాజుగూడెం
కామంచికల్
కాసనాథ్ తండ
కొండాపురం
మద్దులపల్లి
మంగళగూడెం
ముత్తగూడెం
ఎం.వెంకటాయపాలెం
పడమటితండ
పల్లిగూడెం
పోలెపల్లి
పోలిశెట్టిగూడెం
పొన్నెకల్లు
తల్లంపాడు
తనగంపాడు
తెల్లదేవరపల్లి
తీర్థాల
మూలాలు
వెలుపలి లింకులు |
కొణిజర్ల | https://te.wikipedia.org/wiki/కొణిజర్ల | దారిమార్పు కొణిజర్ల (ఖమ్మం జిల్లా) |
కుక్కునూరు | https://te.wikipedia.org/wiki/కుక్కునూరు | కుక్కునూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు చెందిన ఒక గ్రామం. 2014 జూన్ 2, న తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ఆర్డినెన్స్ వలన ఈ మండలం ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో కలుపబడింది.హిందూ లో ఆర్టికల్ ఇదే పేరుతో ఉన్న మండలానికి ప్రాధాన కేంద్రం. ఇది సమీప పట్టణమైన పాల్వంచ నుండి 68 కి. మీ. దూరంలో, భద్రాచలంకి 49 కి. మీ దూరంలో ఉంది . కుక్కునూరు మండలానికి కేంద్రంగా ఉంది. కుక్కునూరు 1947 వరకు నిజాం పాలనలో ఉంది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1825 ఇళ్లతో, 6380 జనాభాతో 3966 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3176, ఆడవారి సంఖ్య 3204. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1409 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1542. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 579329.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల భద్రాచలంలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్ భద్రాచలంలోనూ ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం పాల్వంచలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
కుక్కునూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక అలోపతి ఆసుపత్రిలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
కుక్కునూరులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
కుక్కునూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
అడవి: 1649 హెక్టార్లు
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 354 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 715 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 98 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 58 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 1089 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 832 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 257 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
కుక్కునూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
బావులు/బోరు బావులు: 29 హెక్టార్లు
చెరువులు: 4 హెక్టార్లు
ఇతర వనరుల ద్వారా: 224 హెక్టార్లు
ఉత్పత్తి
కుక్కునూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, ప్రత్తి, మిరప
మూలాలు
వెలుపలి లంకెలు |
కూనవరం | https://te.wikipedia.org/wiki/కూనవరం | కూనవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అల్లూరి సీతారామరాజు జిల్లా, కూనవరం మండలం లోని చెందిన ఒక మండలం. పిన్ కోడ్: 507121. ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ మండలం ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిసింది. ఇది సమీప పట్టణమైన పాల్వంచ నుండి 100 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1500 ఇళ్లతో, 4798 జనాభాతో 590 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2252, ఆడవారి సంఖ్య 2546. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1459 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 568. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 579138.పిన్ కోడ్: 507121.
గ్రామ చరిత్ర
thumb|కూనవరం సమీపంలోని వరి పొలాలు|250x250px
2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు, ఈ గ్రామాన్ని ఈ మండలంతో సహా ఖమ్మం జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో చేర్చారు. ఆ తరువాత 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇది మండలంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు ఈ గ్రామాన్ని ఈ మండలంతో సహా ఖమ్మం జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో చేర్చారు. ఆ తరువాత 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇది మండలంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం, మండలాలతోపాటు ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేసారు. ఆంధ్రప్రదేశ్- జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల భద్రాచలంలో ఉంది. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్లు భద్రాచలంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం పాల్వంచలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
thumb|240px|కూనవరం వద్ద శబరి నది
ప్రభుత్వ వైద్య సౌకర్యం
కూనవరంలో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక అలోపతి ఆసుపత్రిలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో9 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టరు ఒకరు, నలుగురు నాటు వైద్యులు ఉన్నారు.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
కూనవరంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, ఆటో సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది.
భూమి వినియోగం
కూనవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 65 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 2 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 522 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 522 హెక్టార్లు
ఉత్పత్తి
కూనవరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
మొక్కజొన్న, శనగ, మినుము
మూలాలు |
మణుగూరు | https://te.wikipedia.org/wiki/మణుగూరు | మణుగూరు (Manuguru), తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలానికి చెందిన పట్టణం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 2005, జూన్ 15న పురపాలక సంఘంగా ఏర్పాటుచేయబడింది. 2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.
సింగరేణి కాలరీస్
thumb|బొగ్గు గనులు, మణుగూరు
బొగ్గు గనుల సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు చెందిన ఒక విభాగం మణుగూరులో ఉంది. కాలరీస్ కు కొద్ది దూరంలో కల బండారుగూడెం సింగరేణి ఉద్యోగుల నివాస స్థలం. ఇక్కడ పి.వి.కాలనీ, పైలెట్ కాలనీలలో సింగరేణి సంస్థ ఉద్యోగుల నివాస సముదాయాలు ఉన్నాయి. ప్రస్తుతం బండారుగూడెంను కూడా ప్రజలు మణుగూరు గానే పరిగణిస్తున్నారు.
విశేషాలు
మణుగూరులో కాకతీయుల కాలం నాటి శివాలయం ఉంది. కాకతీయులనాటి శివలింగాన్ని అలాగే వుంచి గుడిని నిర్మించారు. రెండు శివలింగములు రెండు అంతస్తులలో వలే ఒక దాని పై ఒకటి వుంటాయు. నేటికీ ఇక్కడ ఆ పరమేశ్వరునకు పూజలు నిర్వహిస్తున్నారు.మణుగూరు దగ్గరలో గోదావరి నదీ తీరం ఆహ్లాదకరంగా ఉంటుంది. సింగరేణి సంస్థ నుండి భారజల కర్మాగారానికి 8 కిలో మీటర్ల పొడవున రోప్వే ఉంది. ఇక్కడి బొగ్గును ఆ భారజల కర్మాగారానికి సరఫరా చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రోప్వే వంతెన, రైల్వే ట్రాక్, బై పాస్ రోడ్ ఒక చోట ప్రక్క ప్రక్కనే వుండడంవలన ఆ ప్రదేశం చూడ ముచ్చటగా వుంటుంది. చుట్టూ వున్న కొండలలో ఒకదానిపై ఫిల్టర్ బెడ్ నిర్మించారు. నీటిని శుద్ధి చేయు విధానం ఇక్కడ చూడవచ్చు. అంజనేయ మందిరం పి.వి.కాలనీ క్రాసు రోడ్డు వద్ద ఉంది. పి.వి.కాలనీ వెళ్ళు వారు ఇక్కడ తమ దారిని మార్చుకోవాలి. హనుమాన్ మందిరం వద్ద నున్న కొండపై జలపాతం ఉంది. కాని ఈ కొండ కాస్త ప్రమాదకరమైనది, సరైన దారి లేదు, పోలీసు ఫైరింగ్ రేంజి కూడా ఉంది. ఈ ప్రదేశానికి దగ్గరలో సమ్మక్క సారలమ్మల గుడి ఉంది. ప్రక్కనే వున్న తోగ్గూడెంలో సంవత్సరం పొడవునా నీటి ప్రవాహం చూడవచ్చు. పి.వి.కాలనీకి ఒకప్పుడు నీటిని రేగులగండి అను చిన్న చెరువు నుండి సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఈ రేగులగండిని కూడా ఎవరూ సందర్శిడం లేదు. కాలనీలన్నింటినీ పార్కులతో సింగరేణి వారు అందంగా తిర్చిదిద్దినారు. బండారిగూడెం ప్రజలు నిజాయతీకి మారుపేరని ప్రతీతి. నేరాలు ఇక్కడ చాల తక్కువ.
ప్రయాణ సౌకర్యాలు
మణుగూరు రైల్వే స్టేషను ఊరి పొలిమేరలలో వుంటుంది (6 కి.మీ.), ప్యాసింజెరు రైలు బయలుదేరే సమయానికి ఆటోలు అందుబాటులో వుంటాయి.మణుగూరు నుండి సూపర్ ఫాస్ట్ రైలు రాత్రి 9:30 కు సికింద్రాబాదుకు బయలు దేరుతుంది., రాత్రి 11:45 కు కాకతీయ పాసింజర్ బయలుదేరుతుంది.
04:30 22:15 17 hours 45 min 0340 మణుగూరు - సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ప్యాస్టు ప్యాసింజరు. 21:15 13 hours 45 min 357 మణుగూరు - కాజీపేట ప్యాసింజరు. 06.30am మణుగూరు - సికింద్రాబాద్ సూపర్ ప్యాస్టు ఎక్స్ప్రెస్ 21:30 -12753.
మూలాలు
బయటి లింకులు
భారజల కర్మాగారం
భారజల కర్మాగారం
న్యూక్లియర్ నాలెడ్జి మేనేజిమెంటు - భారజల కర్మాగారం
== వెలుపలి లంకెలు ==
వర్గం:తెలంగాణ నగరాలు, పట్టణాలు |
ముదిగొండ (ఖమ్మం జిల్లా) | https://te.wikipedia.org/wiki/ముదిగొండ_(ఖమ్మం_జిల్లా) | ముదిగొండ,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా,ముదిగొండ మండలానికి చెందిన ఒక గ్రామం.
ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 14 కి. మీ. దూరంలో ఉంది.ముదిగొండ గ్రామం ఖమ్మం - కోదాడ మెయిన్ రోడ్పై ఉంది. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1657 ఇళ్లతో, 6031 జనాభాతో 1102 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3032, ఆడవారి సంఖ్య 2999. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1445 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 175. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 579692. పిన్ కోడ్: 507 158., ఎస్.టి.డి.కోడ్ = 08742.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఖమ్మంలో ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల గుర్రాలపాడులోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్లు ఖమ్మంలోనూ ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మం లో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
ముదిగొండలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఏడుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో8 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు, నలుగురు నాటు వైద్యులు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
ముదిగొండలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆప్ హైదరాబాద్, గ్రామీణ వికాస్ బ్యాంక్, కో-ఆపరేటివ్ బ్యాంక్వ్య,వ్వయసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
ముదిగొండలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 212 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 16 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 180 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 46 హెక్టార్లు
బంజరు భూమి: 96 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 552 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 448 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 246 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
ముదిగొండలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
కాలువలు: 185 హెక్టార్లు
బావులు/బోరు బావులు: 61 హెక్టార్లు
ఉత్పత్తి
ముదిగొండలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, ప్రత్తి, మిరప
ప్రధాన వృత్తులు
* వ్యవసాయం ఇక్కడి ప్రజల ముఖ్య వృత్తి. గ్రానైట్ రాయి డిపాజిట్లు, గ్రానైట్ మిల్లులు, స్టోన్ క్రషర్ మిల్లులు అధికంగా ఉన్నాయి
గ్రామ పంచాయతీ
ముదిగొండ, వెంకటాపురం జంట గ్రామాలు.
2019, జనవరి లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మందారపు లక్ష్మి, సర్పంచిగా ఉపసర్పంచ్ గా తాళ్ళ శ్రీను ఎన్నికయ్యారు.
ముదిగొండ ఎంపిటీసి సభ్యులుగా మంకెల దామోదర్, బానోత్ జయమ్మ ఎన్నిక అయ్యారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
నరసింహస్వామి మందిరం
వీరభద్ర స్వామి మందిరం
పెద్దగుట్ట దగ్గర లింగమహేశ్వర స్వామి దేవస్థానం
ఆంజనేయస్వామి దేవస్థానం.
గ్రామ విశేషాలు
చైనా కంపెనీ సంబంధించి కారం మిల్లు ముదిగొండ-ఖమ్మం రహదారి ప్రక్కన ఉంది.
న్యూ లక్ష్మీపురం గ్రామంలో జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి.
మూలాలు
వెలుపలి లింకులు |
ములకలపల్లి (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) | https://te.wikipedia.org/wiki/ములకలపల్లి_(భద్రాద్రి_కొత్తగూడెం_జిల్లా) | ములకలపల్లి, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలానికి చెందిన గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది..
ఇది సమీప పట్టణమైన పాల్వంచ నుండి 19 కి. మీ. దూరంలో ఉంది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1623 ఇళ్లతో, 6679 జనాభాతో 3570 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3246, ఆడవారి సంఖ్య 3433. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1178 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2400. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579509. పిన్ కోడ్: 507117.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప బాలబడి పాల్వంచలో ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల పాల్వంచలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్లు పాల్వంచలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం పాల్వంచలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
ముల్కలపల్లిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు 9 మంది ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
ముల్కలపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
ముల్కలపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
అడవి: 1642 హెక్టార్లు
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 109 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 149 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 97 హెక్టార్లు
తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 125 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 27 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 323 హెక్టార్లు
బంజరు భూమి: 5 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 1092 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 851 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 569 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
ముల్కలపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
కాలువలు: 97 హెక్టార్లు
బావులు/బోరు బావులు: 325 హెక్టార్లు
చెరువులు: 21 హెక్టార్లు
ఇతర వనరుల ద్వారా: 126 హెక్టార్లు
ఉత్పత్తి
ముల్కలపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, పొగాకు, జొన్న
మూలాలు
వెలుపలి లింకులు |
పెనుబల్లి (ఖమ్మం జిల్లా) | https://te.wikipedia.org/wiki/పెనుబల్లి_(ఖమ్మం_జిల్లా) | పెనుబల్లి, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలానికి చెందిన గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 236 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ఇది సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 45 కి. మీ. దూరంలో ఉంది.2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2337 ఇళ్లతో, 8915 జనాభాతో 1403 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4401, ఆడవారి సంఖ్య 4514. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2024 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1043. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 579582..పిన్ కోడ్: 507302.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఆరుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల2 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల కుప్పెనకుంట్లలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం కొత్తగూడెంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
పెనుబల్లిలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
పెనుబల్లిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
పెనుబల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 194 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 23 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 183 హెక్టార్లు
తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 8 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 15 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 208 హెక్టార్లు
బంజరు భూమి: 48 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 724 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 952 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 28 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
పెనుబల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
బావులు/బోరు బావులు: 20 హెక్టార్లు
చెరువులు: 8 హెక్టార్లు
ఉత్పత్తి
పెనుబల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, ప్రత్తి, మిరప
మూలాలు
వెలుపలి లింకులు |
పినపాక (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) | https://te.wikipedia.org/wiki/పినపాక_(భద్రాద్రి_కొత్తగూడెం_జిల్లా) | ఇతర ప్రాంతాలకొరకు పినపాక (అయోమయ నివృత్తి) చూడండి.
పినపాక, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలానికి చెందిన గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 742 ఇళ్లతో, 2817 జనాభాతో 1825 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1417, ఆడవారి సంఖ్య 1400. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 591 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 525. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578835..పిన్ కోడ్: 507117.
శాసనసభ నియోజకవర్గం
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 3 (శ్రీవిద్య, రాధిక, ఎక్స్లెంట్ హైస్కూల్) , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మణుగూరులోను, ఇంజనీరింగ్ కళాశాల భద్రాచలంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్ భద్రాచలంలోను, మేనేజిమెంటు కళాశాల పాల్వంచలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం పాల్వంచలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
పినపాకలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
పినపాకలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
పినపాకలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
అడవి: 973 హెక్టార్లు
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 83 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 34 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 94 హెక్టార్లు
బంజరు భూమి: 140 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 498 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 249 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 483 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
పినపాకలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
బావులు/బోరు బావులు: 15 హెక్టార్లు
చెరువులు: 388 హెక్టార్లు
ఇతర వనరుల ద్వారా: 80 హెక్టార్లు
ఉత్పత్తి
పినపాకలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, ప్రత్తి, మిరప
మూలాలు
బయటి లింకులు |
సత్తుపల్లి | https://te.wikipedia.org/wiki/సత్తుపల్లి | సత్తుపల్లి, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలానికి చెందిన ఒక గ్రామం. చిన్న పట్టణం.అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.
శాసనసభ నియోజకవర్గం
సత్తుపల్లి పురపాలక సంఘం
విశేషాలు
ఈ గ్రామంలోని శ్రీ జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి ఆలయం త్రిశక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ అమ్మవారు లలితగా, గాయత్రిగా, సరస్వతిగా పూజలు అందుకోవడం విశేషం. ఈ ఆలయానికి సమీపంలో 40 ఏళ్ళక్రితం చింతపల్లి లింగయ్య అనే భక్తుడు ప్రతిష్ఠించిన శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయం గూడ ఉంది.
ఇక్కడి శ్రీ సాయిబాబా ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.
ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు ఈ శాసనసభ నియోజకవర్గానికి చెందినవారు.
సత్తుపల్లికి సుమారు 3కి.మీ దూరంలో కాకర్లపల్లి గ్రామంలో
శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది. గ్రామానికి కొంత దూరంగా బిల్వవృక్షాలతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో నవగ్రహాల మంటపం కూడా ఉంది.
ఆరోగ్యం
1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు 30 పడకల సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పూర్తయిన ఆసుపత్రిని ప్రారంభించాడు. తెలంగాణ ప్రభుత్వం 2020లో 30 పడకలుగా ఉన్న ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ఆధునీకరించింది. అయితే ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి, వర్షానికి కురుస్తూ రోగులు, ఆసుపత్రి సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతండడంతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 34 కోట్ల రూపాయల (రూ. 29 కోట్లు నూతన భవన నిర్మాణానికి, రూ. 5 కోట్లు ఆధునిక పరికరాల కొనుగోలు) నిధులు మంజూరు చేసింది. 2022, జనవరి 29న రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు నూతన ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశాడు.
మూలాలు
వెలుపలి లింకులు
[1] ఈనాడు జిల్లా 2013 ఆగస్టు 2. 13వ పేజీ. |
తిరుమలాయపాలెం (ఖమ్మం జిల్లా) | https://te.wikipedia.org/wiki/తిరుమలాయపాలెం_(ఖమ్మం_జిల్లా) | తిరుమలాయపాలెం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలానికి చెందిన గ్రామం.
ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 17 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 850 ఇళ్లతో, 3496 జనాభాతో 943 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1549, ఆడవారి సంఖ్య 1947. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 700 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 390. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579629. పిన్ కోడ్: 507163.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఖమ్మంలోను, ఇంజనీరింగ్ కళాశాల ఆరెంపలలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మం లో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
తిరుమలాయపాలెంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
తిరుమలాయపాలెంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామంలో జన్మించిన ప్రముఖులు
thumb|దెంచనాల విజయకుమారి : జ్వలిత అనే కలం పేరుతో కవిత్వం వెలువరిస్తున్న కవయిత్రి
దెంచనాల విజయకుమారి : జ్వలిత అనే కలం పేరుతో కవిత్వం వెలువరిస్తున్న కవయిత్రి . ఈమె దెంచనాల ఈశ్వరమ్మ, బ్రహ్మయ్య దంపతులకు 1959 మార్చి 11వ తేదీన ఖమ్మం జిల్లా తిరుమలాయపాళెంలో జన్మించింది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
తిరుమలాయపాలెంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 83 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 218 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 73 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 105 హెక్టార్లు
బంజరు భూమి: 139 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 325 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 233 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 336 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
తిరుమలాయపాలెంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
బావులు/బోరు బావులు: 328 హెక్టార్లు
చెరువులు: 8 హెక్టార్లు
ఉత్పత్తి
తిరుమలాయపాలెంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
ప్రత్తి, మిరప, వరి
మూలాలు
వెలుపలి లింకులు
తిరుమలాయపాలెం పేరుతో గల ఇతర పేజీల కొరకు తిరుమలాయపాలెం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి. |
వేలేరుపాడు | https://te.wikipedia.org/wiki/వేలేరుపాడు | వేలేరుపాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా, వేలేరుపాడు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం, వేలేరుపాడు మండలానికి ప్రధాన కేంద్రం.ఇది ప్రసిద్డ పుణ్యక్షేత్రం. భద్రాచలం నుండి 60 కి.మీ దూరంలో ఉంది.
చరిత్ర
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం (భద్రాచలం మినహా మండలంలోని అన్ని గ్రామాలు), కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం, మండలాలతోపాటు ఆరు గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్- జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.
మూలాలు
వెలుపలి లింకులు
వర్గం:రెవెన్యూ గ్రామాలు కాని మండల కేంద్రాలు
వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా |
సింగరేణి | https://te.wikipedia.org/wiki/సింగరేణి | సింగరేణి, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, సింగరేణి మండలానికి చెందిన గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 236 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ఇది సమీప పట్టణమైన ఇల్లందు నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1440 ఇళ్లతో, 5505 జనాభాతో 1334 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2682, ఆడవారి సంఖ్య 2823. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1327 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1138. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579455. పిన్ కోడ్: 507122.
ప్రముఖ సంస్థలు
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
సింగరేణి బొగ్గుగనులు
గ్రామ పంచాయితీ
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మండేపుడి రాణి సర్పంచిగా ఎన్నికైంది.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. 2 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప బాలబడి ఇల్లందులో ఉంది.సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం ఎల్లందులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
సింగరేణిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.people ప్రభుత్వ ఉద్యోగాల నుండి మైనింగ్ పరిశ్రమకు అవసరమైన వ్యక్తులు....
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
సింగరేణిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
సింగరేణిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 208 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 85 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 253 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 14 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 771 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 455 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 315 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
సింగరేణిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
బావులు/బోరు బావులు: 159 హెక్టార్లు
చెరువులు: 146 హెక్టార్లు
ఇతర వనరుల ద్వారా: 9 హెక్టార్లు
ఉత్పత్తి
సింగరేణిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, మిరప, ప్రత్తి
మూలాలు
వెలుపలి లింకులు
new:सिंगरेणि मण्डल, खम्मम जिल्ला |
తల్లాడ | https://te.wikipedia.org/wiki/తల్లాడ | తల్లాడ, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, తల్లాడ మండలానికి చెందిన ఒక గ్రామం.
ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.
గణాంకాలు
thumb|220x220px|తల్లాడ సెంటర్|alt=
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3248 ఇళ్లతో, 11802 జనాభాతో 2161 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5908, ఆడవారి సంఖ్య 5894. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2259 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 652. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579774..పిన్ కోడ్: 507167.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప బాలబడి వైరాలో ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల ఖమ్మంలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మం లో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
thumb|220x220px|తల్లాడ సెంటర్|alt=
తల్లాడలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
thumb|220x220px|తల్లాడ సెంటర్|alt=
గ్రామంలో10 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు 10 మంది ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
thumb|220x220px|తల్లాడ సెంటర్|alt=
తల్లాడలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
తల్లాడలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 452 హెక్టార్లు
వ్యవసాయం సాగని, బంజరు భూమి: 31 హెక్టార్లు
శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 38 హెక్టార్లు
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 10 హెక్టార్లు
బంజరు భూమి: 739 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 891 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 1050 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 590 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
తల్లాడలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
కాలువలు: 240 హెక్టార్లు
బావులు/బోరు బావులు: 200 హెక్టార్లు
చెరువులు: 150 హెక్టార్లు
ఉత్పత్తి
తల్లాడలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, ప్రత్తి, మిరప
పారిశ్రామిక ఉత్పత్తులు
బియ్యం
మూలాలు
వెలుపలి లింకులు |
టేకులపల్లి మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) | https://te.wikipedia.org/wiki/టేకులపల్లి_మండలం_(భద్రాద్రి_కొత్తగూడెం_జిల్లా) | టేకులపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016.
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లా లో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 6 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం టేకులపల్లి
గణాంకాలు
thumb|2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం జిల్లా పటంలో మండల స్థానం
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 47,879 - పురుషులు 24,029 - స్త్రీలు 23,850
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 469 చ.కి.మీ. కాగా, జనాభా 47,879. జనాభాలో పురుషులు 24,029 కాగా, స్త్రీల సంఖ్య 23,850. మండలంలో 12,445 గృహాలున్నాయి.
ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా టేకులపల్లి మండల కేంద్రంగా (0+6) ఆరు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
బోడు
కొప్పురాయి
గంగారం
బేతంపూడి
పెగల్లపాడు
గొల్లపల్లి
మూలాలు
వెలుపలి లింకులు |
వరరామచంద్రపురం | https://te.wikipedia.org/wiki/వరరామచంద్రపురం | వరరామచంద్రపురం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, వరరామచంద్రపురం మండల లోని రెవెన్యూయేతర గ్రామం. ఇది వరరామచంద్రపురం మండల కేంద్రం.రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను.ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతరు, వరరామచంద్రాపురం, మండలాలతోపాటు ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్- జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.
గ్రామంలో జన్మించిన ప్రముఖులు
thumb|కుంజా సత్యవతి: మాజీ శాసన సభ్యురాలు
కుంజా సత్యవతి: ఈమె శూలం కృష్ణ, సీతమ్మ దంపతులకు వరరామచంద్రపురంలో 1971, ఆగస్టు 1న జన్మించింది.మాజీ శాసన సభ్యురాలు
మూలాలు
వెలుపలి లింకులు
వర్గం:రెవెన్యూ గ్రామాలు కాని మండల కేంద్రాలు |
వేంసూరు | https://te.wikipedia.org/wiki/వేంసూరు | వేంసూరు, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు వేంసూరు మండలానికి చెందిన గ్రామం..
ఇది సమీప పట్టణమైన సత్తుపల్లి నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3768 ఇళ్లతో, 13485 జనాభాతో 3732 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6817, ఆడవారి సంఖ్య 6668. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3503 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 220. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579901. పిన్ కోడ్: 507164.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో మూడుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల సత్తుపల్లిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్ కొత్తగూడెంలోను, మేనేజిమెంటు కళాశాల సత్తుపల్లిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల వేంసూరులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
వేంసూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు , 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో13 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు 11 మంది ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.
సమాచార, రవాణా సౌకర్యాలు
వేంసూరులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
వేంసూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 531 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 462 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 2739 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 1433 హెక్టార్లు
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1306 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
వేంసూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
బావులు/బోరు బావులు: 374 హెక్టార్లు
చెరువులు: 932 హెక్టార్లు
ఉత్పత్తి
వేంసూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, మొక్కజొన్న, జొన్న
పారిశ్రామిక ఉత్పత్తులు
సిమెంటు ఇటుకలు
చేతివృత్తులవారి ఉత్పత్తులు
కుండలు
మూలాలు
వెలుపలి లింకులు |
వెంకటాపురం (ములుగు జిల్లా) | https://te.wikipedia.org/wiki/వెంకటాపురం_(ములుగు_జిల్లా) | దారిమార్పు వెంకటాపురం (జెడ్) |
ఇల్లెందు | https://te.wikipedia.org/wiki/ఇల్లెందు | ఇల్లెందు, (పాత పేరు ఇల్లందుపాడు), తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లెందు మండలానికి చెందిన నగర పంచాయితి.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ఇది 1986, సెప్టెంబరు 23న 3వ గ్రేడ్ పురపాలక సంఘంగా ఏర్పడింది.
గ్రామజనాభా
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 95,394 - పురుషులు 46,626 - స్త్రీలు 48,768. పిన్ కోడ్: 507123.
ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా లోగడ ఖమ్మం జిల్లా, కొత్తగూడెం రెవెన్యూ డివిజను పరిధిలో ఉన్న ఇల్లందు (యల్లెందు/Yellandu) మండలాన్ని (1+6) గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
పట్టణ విశేషాలు
ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100 పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.భౌగోళికంగా ఇల్లందు స్థానం .Falling Rain Genomics, Inc - Yellandu సగటు ఎత్తు 205 మీటర్లు (672 అడుగులు). ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ సింగరేణి.
విద్యా సంస్థలు
సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల - 1977లో ప్రారంభమైంది.
సింగరేణి కాలరీస్ ప్రాథమికోన్నత పాఠశాల - 1979/80లో ప్రారంభమైంది.
కాకతీయ కాన్సెప్త్ పాఠశాల - 2010 లో ప్రారంభమైంది
మాంటిసొరి ఉన్నత పాఠశాల
సాహితి,, చైతన్య జూనియర్ కాలేజీలు
ప్రభుత్వ జూనియర్ కాలేజీ
ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1991 లో ప్రారంభమైంది.
శాసనసభ నియోజకవర్గం
మూలాలు
వెలుపలి లింకులు |
వైరా | https://te.wikipedia.org/wiki/వైరా | వైరా, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన పట్టణం.ఇది వైరా మండలానికి ప్రధాన కేంద్రం. ఇది ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, జగ్గయ్యపేట పట్టణాల రహదారులకు కూడలిగా ఉంది. కనుక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉంది. ఇది వైరా పురపాలకసంఘంగా ఏర్పడింది.
ఆలయాలు
వైరాలో అయ్యప్ప మందిరం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఖమ్మం నుండి వైరా వచ్చు దారిలో ఉంది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాలమధ్య నెలకొని, భక్తులకు మానసికానందాన్నిస్తోంది. వివిధ దేవతల ఆలయాలతో నెలకొని ఉన్న ఈ ఆలయ దర్శనం సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. ఇంకా, పాత బస్ స్టాండు వద్ద రామాలయం ఉంది. మధు విద్యాలయం వద్దషిర్డీ సాయిబాబా గుడి ఉంది. శివాలయం ఉంది.
వైరా జలాశయం
వైరా చెరువు అనునది వైరా నది నుండి వచ్చింది. ఈ చెరువులో 19 బావులువున్నవి. దీనిని నిజాం నవాబు 1929లో తవ్వించాడు. దీని ద్వారా చుట్టుప్రక్కల 8 మండలాలకు త్రాగు నీరు, సుమారు ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి ఛెందుతోంది. ఇక్కడ బోటు షికారు, గెస్ట్ హౌస్, పిల్లలు ఆడుకునే స్థలం మొదలగునవి ఉన్నాయి. చేపల పెంపకం కూడా జరుగుతున్నది.
విద్యా సంస్థలు
కె.వి.సి.ఎమ్. డిగ్రీ కాలేజి
మధు విద్యాలయం, జూనియర్ కాలేజి,డిగ్రీ కాలేజీ
టాగోర్ విద్యాలయం
ప్రభుత్వ ఉన్నత పాఠశాల
క్రాంతి జూనియర్ కాలేజి
న్యూ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ & జూనియర్ కళాశాల
మేరీ ఇమ్మాక్యులేట్ స్కూల్
వాణి విద్యాలయం
బ్యాంకులు
నాగార్జున గ్రామీణ బ్యాంక్.
ఆంధ్రా బ్యాంక్.
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ( పెట్రోల్ బంక్ సమీపంలో ).
హెచ్ డి ఫ్ సి బ్యాంక్ (కోటయ్య హాస్పిటల్ ఎదురుగా)
వ్యవసాయం
వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి, వైరా చెరువు వల్ల ఇక్కడ జాలర్లు కూడా ఉన్నారు. జాలర్ల నివసించే వీధిని ఫిషరీష్ కాలని అని అంటారు. ఇది చెరువు పక్కనే ఉంది.
రవాణా సౌకర్యాలు
ఇక్కడ నుంచి జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలకు, హైదరాబాదుకూ రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రం అయిన ఖమ్మంకు సర్వీసు ఆటోలు ఉంటాయి, మధిర నుంఛి ఆర్డినరి, ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి.హైదరాబాద్కు మధిర నుంచి బస్సులు ఉన్నాయి.
శాసనసభ నియోజకవర్గం
మూలాలు
బయటి లింకులు
వికిమాపియాలో వైరా చెఱువు
వెలుపలి లంకెలు
వర్గం:తెలంగాణ నగరాలు, పట్టణాలు
వర్గం:రెవెన్యూ గ్రామాలు కాని మండల కేంద్రాలు |
వాజేడు | https://te.wikipedia.org/wiki/వాజేడు | వాజేడు (జి), తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, వాజేడు మండలంలోని గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016.https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/MULUGU.PDF
ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 105 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన జయశంకర్ జిల్లా లోకి చేర్చారు. ఆ తరువాత 2019 లో, కొత్తగా ములుగు జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 244 ఇళ్లతో, 941 జనాభాతో 96 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 506, ఆడవారి సంఖ్య 435. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 209 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 374. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 578719. పిన్ కోడ్: 507136.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ పాఠశాలఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల భద్రాచలంలో ఉంది. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్లు భద్రాచలంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం పాల్వంచలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
వాజేడు (జి) లో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
వాజేడు (జి) లో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
వాజేడు (జి) లో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 39 హెక్టార్లు
వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 17 హెక్టార్లు
నికరంగా విత్తిన భూమి: 39 హెక్టార్లు
నీటి సౌకర్యం లేని భూమి: 39 హెక్టార్లు
ఉత్పత్తి
వాజేడు (జి) లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
వరి, మిరప, పొగాకు
మూలాలు
వెలుపలి లంకెలు |
ఛందస్సు | https://te.wikipedia.org/wiki/ఛందస్సు | thumb|బ్రహ్మ మహేశ్వర విష్ణులు
పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి. వేదత్రయాన్ని ఛందస్సు అని కూడా అంటారు. ఋగ్వేదము, సామవేదము సంపూర్ణముగా పద్య (శ్లోక) రూపములో నున్నవి. యజుర్వేదములో గద్యము కూడా ఉంది. సామవేదమంతయూ ఛందస్సేనని పండితుల అభిప్రాయము. బ్రహ్మవిష్ణుశివులలాగా ప్రతి మంత్రానికీ ఋషి, ఛందస్సు, దేవత త్రిమూర్తులని భావిస్తారు. కావ్య నిర్మాణానికి వాడబడునది ఛందస్సు.
వేద ఛందస్సు
వేదాలలో ముఖ్యంగా అనుష్టుప్ (8 అక్షరములు), బృహతి (9), పంక్తి (10), త్రిష్టుప్ (11), జగతి (12) అనబడు ఛందములను ఉపయోగించారు. మిక్కిలి ప్రఖ్యాతి గడించిన ఛందస్సు త్రిపద గాయత్రీ ఛందస్సు. అది తత్సవితుర్వరేణియం భర్గోదేవస్య ధీమహీ ధియో యోనః ప్రచోదయాత్. కొందరు మొదటి పాదములో వరేణ్యం అంటారు. అప్పుడు గాయత్రి ఛందస్సుకు 23 అక్షరాలే. ఇది గాయత్రిలో ఒక ప్రత్యేకత.
ఛందస్సు వేదాంగమైనప్పటికీ, వేద ఛందస్సును వివరించే గ్రంథాలేవీ ప్రస్తుతము లభ్యము కావట్లేదు. ఛందో శాస్త్రముపై ప్రస్తుతం లభ్యమవుతున్న అత్యంత పురాతనమైన గ్రంథము ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడైన పింగళుడు రచించిన ఛందస్ శాస్త్ర. ఇది వేద సంస్కృతము, పురాణ సంస్కృతముల సంధికాలమునకు చెందినది. హిందూ పౌరాణికంలో ఈశ్వరుడు పార్వతికి ఛందస్సును బోధిస్తుండగా దానిని విని పింగళాచార్యుడు ఛందస్సు శాస్త్రమును వ్రాసినాడని అంటారు. పింగళుడు ఇప్పటి కర్ణాటక దేశ వాసుడని ప్రతీతి.
ఆ తరువాత మధ్యయుగపు తొలినాళ్లలోని ఛందస్ శాస్త్రపై ఆధారితమైన అగ్ని పురాణము, భారతీయ నాట్య శాస్త్రంలోని 15వ అధ్యాయము, బృహత్సంహిత యొక్క 104 అధ్యాయములు ఛందస్సుపై లభ్యమవుతున్న వనరులు. 14వ శతాబ్దములో కేదారభట్టు రాసిన వ్రిత్తరత్నాకర ఛందస్సుపై ప్రసిద్ధి చెందిన గ్రంథమైనప్పటికీ వేద ఛందస్సును చర్చించదు.
తెలుగు ఛందస్సు
పాదాది నియమములు గలిగిన పద్య లక్షణములను తెలుపునది ఛందస్సు అనబడును. తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధారపడి అభివృద్ధి చెందినది. సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులోని ప్రత్యేకతలు. ఆధునిక పాఠకులు, లేఖకులు, నవ కవులు, విప్లవ కవులు ఛందస్సు పురాతనమైనదని, ప్రగతి నిరోధకమని భావించినా కొన్ని చలన చిత్ర పాటలలో, శ్రీ శ్రీ గేయాలలో మాత్రా ఛందస్సును చూడవచ్చు.
గురువులు, లఘువులు
ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు, లఘువు. గురువుని U తోటి, లఘువుని l తోటి సూచిస్తారు
గురువు, లఘువు, విభజించడము
ఈ గురు, లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ" ఇందులో మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలు ఒక్కొక్కటి ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము "అమ్మ" ఇందులో మొదటి అక్షరము అమ్ రెండు లిప్తల కాలము, ఆ తరువాతి మ ఒక లిప్త అక్షరము కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, వ, లలు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటారు.
కొన్ని నియమాలు
దీర్ఘాలున్న అక్షరాలన్నీ గురువులు. ఉదాహరణకు ఆట = U I
"ఐ" "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)
ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడిలో సం గురువు, అంత:పురములో త: అనునది గురువు )
సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మలో అ గురువు, భర్తలో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. ఒక వాక్యంలో రెండు పదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవ్వదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క" గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. (ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న" గురువు అవుతుంది)
ఋ అచ్చుతో ఉన్న అక్షరాలు, వాటి ముందరి అక్షరాలు (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.
ర వత్తు ఉన్నప్పటికి దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.
పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూసెన్ గలువలు"లో "సెన్" గురువు)
గణాలు-రకాలు .
అక్షరాల గుంపును గణము అని అంటారు. ఇవి నాలుగు రకాలు
ఏకాక్షర గణాలు
ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది. అది గురువు లేదా లఘువు కావచ్చు.
U, U, U
ఉదా: శ్రీ, శై, లం
ద్వయక్షర గణాలు
రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .౧. లలము ౨. లగము ( వ గణం ) ౩. గలము ( హ గణం ) ౪.గగము.
లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ లేదా వ IU ఉదా: రమా
గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్
త్ర్యక్షర గణాలు
ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ ౦, ౧, తీసుకున్న ౦౦౦, ౦౦౧, ౦౧౦, ౦౧౧, ౧౦౦, ౧౦౧, ౧౧౦, ౧౧౧)
కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు.
య మా తా రా జ భా న స ల గం
యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు,, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు
అన్ని గణాలు:
ఆది గురువు భ గణము UII
మధ్య గురువు జ గణము IUI
అంత్య గురువు స గణము IIU
సర్వ లఘువులు న గణము III
ఆది లఘువు య గణము IUU
మధ్య లఘువు ర గణము UIU
అంత్య లఘువు త గణము UUI
సర్వ గురువులు మ గణము UUU
ఇవి మూడక్షరముల గణములు
ఉపగణాలు
ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు
సూర్య గణములు. ఇవి రెండు.
న = న = III
హ = గల = UI
ఇంద్ర గణములు. ఇవి ఆరు.
నగ = IIIU
సల = IIUI
నల = IIII
భ = UII
ర = UIU
త = UUI
చంద్ర గణములు. ఇవి పద్నాలుగు.
భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIUUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII
పద్య లక్షణాలు
వృత్తాలు
గణాలతో శోభిల్లుతూ, యతి ప్రాస లక్షణాలను కలిగి ఉన్నటువంటివి వృత్తాలు. ఇందు చాలా రకాలు ఉన్నాయి.
చంపకమాల
ఉత్పలమాల
శార్దూల విక్రీడితము
మత్తేభ విక్రీడితము
తరళం
తరలము
తరలి
మాలిని
మత్తకోకిల
ఇంద్రవజ్రము
ఉపేంద్రవజ్రము
కవిరాజవిరాజితము
తోటకము
పంచచామరము
భుజంగప్రయాతము
మంగళమహశ్రీ
మానిని
మహాస్రగ్ధర
లయగ్రాహి
లయవిభాతి
వనమయూరము
స్రగ్ధర
జాతులు
జాతులు మాత్రాగణములతో, ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమములు ఉన్నాయి.
కందం
ద్విపద
తరువోజ
అక్కరలు (మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర అల్పాక్కర)
ఉత్సాహము
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము (పద్యం)
పలు విధములైన ఛందములు
యధా-ఆర్యా చందము- ప్రథమ తృతీయ పాదములందు ద్వాదశ మాత్రలును ద్వితీయపాదమందు 18 మాత్రలు చతుర్దశపాదమందు 15 మాత్రలను కలిగి యుండు చందమును యద్ధా ఆర్యా చందము అంటారు. ఇందు పూర్వార్ధ సదృశమై ఉత్తరార్ధమునుండి ఉన్నచో అది గీతి ఉత్తరార్ధ సదృశమై పూర్వార్ధముండినచో అది ఉపగీతి అనబడును. ఆర్యాది ఛంధములో 4 మాత్రలు గల 5 గణములుండును. సర్వగురు, అంత్యగురు,మధ్యగురు, ఆదిగురు, చతుర్లఘువులు ఈ భేదములకు వరుసగా కర్ణ, కరతల, పయోధర, వసుచరణ,విష్ఠములని నామములు.
పరిగణితాక్షర సిద్ధమగు చందములను వర్ణిక లందురు.
శిఖరిణి అను ఛంధములో ప్రతిపాదమునందు సమానములైన హ్రస్వదీర్ఘములైన 17 యక్షరములు ఉండును.
పుష్పితాగ్ర ఛంధము- దీని ప్రథమ తృతీయ చరణములు సమాన లక్షణములతో 12 అక్షరములు- రెండు నగణములు 1 రగణము 1 యగణముతో ఉండును. ద్వితీయ చతుర్ధ చరణములలో ఒకే లక్షణముతో కూడిన 13 అక్షరములు- 1నగణము 2 జగణములు 1 రగణము 1 గురువు ఉండును.
చండవృష్టి ఛంధము- 20 అక్షరములు గల దండమునకు చండవృష్టి ప్రపాతమని పేరు. ఇందు రెండు నగణములు 7 రగణములు ఉన్నాయి.పదాంతమున విరామము.
పేరుక్త ఛంధము - ప్రతిపాదమునందును ఒక్కొక్క అక్షరము ఉండును.దీనికి రెండు భేదములు కలవు మొదటిది గురువు అగునది- దీనికి శ్రీ అని పేరు- ఉదా: విష్ణుం వందే, రెండవది లఘువు అక్షరముతో అగునది- ఉదా: హరి హర.
రత్యుక్త ఛంధము - ప్రతిచరణమునందును 2 అక్షరములు గలవు. ప్రసారముచే దీనికి 4 భేదములు. ప్రధం భేదము స్త్రీ; రెండు గురువులుగల నాల్గుపాదముల ఛంధము స్త్రీ.
మధ్య ఛంధము- మూడు అక్షరములు గల ఛంధము. దీనికి 8 భేదములు ఉన్నాయి. మూడు అక్షరములు గురువుగా నున్న మొదటి భేదము పేరు వారి.
ప్రతిష్ఠ ఛంధము- 4 అక్షరములు గల ఛంధము.ప్రస్తారమున దీనికి 16 భేదములు ఉన్నాయి.ప్రథమభేదము పేరు కన్య. ఉదా: భాస్వత్క న్యా సైకా ధన్యా. యస్యాః కూలే కృష్ణో ఖేలత్||
సుప్రతిష్ఠ ఛంధము- ప్రస్తారమున దీనికి 32 భేదములు ఉన్నాయి. దీని 9 వ భేదముపేరు పంక్తి 1 భగణము 2 గురువులు.
గాయత్రి ఛంధము- దీనికి ప్రస్తారమున 64 భేదములు ఉన్నాయి. దీని మొదటి భేదము పేరు విద్యుల్లేఖ- 2 మగణములు 13 వ భేదము పేరు తనుమధ్య-తగనము, యగణము 16 భేదము పేరు శశివదన -నగనము, యగణము 19వ భేదము వసుమతి తగణము, సగణము.
అనుష్టుపు ఛంధము - ప్రస్తారమున దీనికి 256 భేదములు ఉన్నాయి. దీనిన విద్యున్మాల మాణవకాక్రీడ, చిత్ర పద, హంసరుత, ప్రమాణిక, సమానిక, శ్లోక, భేద ప్రబేధములు ఉన్నాయి. శ్లోక ఛంధమున ప్రతి చరణము నందును 6వ అక్షరము గురువై 5వ అక్షరము లఘువు. ప్రధం, తృతీయ చరణములందును 7 అక్షరము దీర్షముగాను ద్వితీయ,చతుర్ధ చరణములందును హ్రస్వముగాను ఉండును.
బృహతి ఛంధము- ప్రస్తారమున దీనికి 512 భేదములు ఉన్నాయి. 251వ భేదము హలముఖి- ర, న, సగణములు. 64 వ భేదము భుజ్మగ శిశుభృతము- 2నగణములు 1మగణము.
పంక్తి ఛంధము- ప్రస్తారమున దీనికి 1024 భేదములు ఉన్నాయి. దీనిలో శుద్ధవిరాట్, పణవ, రుక్మవతి, మయూర సారిణి, మత్తా, మనోరమా, హంసీ, ఉపసిత్థా, చంపకమాలా అనేక అవాంతర భేదములు ఉన్నాయి.
త్రిస్టుపు ఛంధము - ప్రస్తారమున దీనికి 2048 భేదములు ఉన్నాయి.దీనికే అనేకావాంతర భేదములు కలవు - ఇంద్రవ్రజ- 2 తగణములు 1 జగణము 2 గురువులు, ఉపేంద్రవ్రజ-1 జగణము 1 తగణము 1 జగణము 2 గురువులు, ఉపజాతి- ఇంద్రవ్రజ ఉపేంద్రవ్రజ కలయిక, దోధక- 3 భగణములు 2 గురువులు, శాలిని రథోద్దత- మ,త గణములు 2 గురువులు, స్వాగత -ర,న,భ గణములు 2 గురువులు- మొదలగు నామములతో ప్రసిద్ధమైనవి.
జగతి ఛంధము -ప్రస్తారమున దీనికి 4096 భేదములు ఉన్నాయి. అందులో వంశస్థము- జ,త,జ,ర గణములు పాదాంతరమున యతి, ఇంద్రవంశము-త,త,జ,రగణములు పాదాంతమున యతి, ద్రుత విలంబిత,తోటక, భుజంగ ప్రయూత, స్రగ్విణి, మొదలైనవి ప్రసిద్ధములు.
అతి జగతి ఛంధము - ప్రస్తారమున దీనికి 8192 భేదములు ఉన్నాయి. ఇందులో ప్రహర్షిణి-మ,న,జ,రగణములు 1 గురువు 2-10 యక్షరములపై యతి- ప్రసిద్ధమైనది.
శక్వరి ఛంధము - ప్రస్తారమున దీనికి 16384 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి వసంతలతిక- త,భ గణములు 2 జగణములు 2 గురువులు. పాదాంతరమున విరామము. దీనినే కొందరు సింహోన్నత, ఉద్ధరిణి అని కూడా అంటారు.
అతిశక్వరి ఛంధము- ప్రస్తారమున దీనికి 32768 భేదములు ఉన్నాయి. చంద్రావర్త- 4 న, 1 సగణము 7-8 అక్షరములపై విరామము, మాలిని-2 న, 1 మ, 2 భగణములు 7-8 అక్షరములపై యతి, చంద్రావర్తకం - 7-8 అక్షరములపై విరామము 6-9 అక్షరములపై విరామము.
అష్టి ఛంధము- ప్రస్తారమున దీనికి 65536 భేదములు ఉన్నాయి. ఇందులో వృషభజగ విలసితము- భ,ర 3 న, 1 గురువు 7-9 అక్షరములపై యతి.
అత్యష్టి ఛంధము- ప్రస్తారమున దీనికి 131072 భేదములు ఉన్నాయి. ఇందు హరిణి, పృధ్వి, వంశపత్రపతితము, మందాక్రాంత, శిఖరిణి వృతములు ఉన్నాయి.
ధృతి ఛంధము- ప్రస్తారమున దీనికి 262144 భేదములు ఉన్నాయి.అందు భేదము కుసుమితాలతావేల్లితము- మ,త,న, 3 య గణములు 5-6-7 అక్షరములపై యతి.
విధృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 524288 భేదములు ఉన్నాయి.ఇందలి భేదమే శార్దూల విక్రీడితము- మ,స,జ,స,త,త,గ ములు.12-7 వ అక్షరములపై యతి.
కృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 1048576 భేదములు ఉన్నాయి.ప్రతి చరణము నందును 20, 20 అక్షరములు ఉన్నాయి.
ప్రకృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 2097152 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి స్రగ్ధర-మ,ర,భ,న,య,య,య,గణములు ఏడేసి అక్షరములపై యతి.
ఆకృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 4194304 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి భద్రకము- భ,ర,న,ర,న, గములు 10-12 అక్షరములపై యతి.
వికృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 8388608 భేదములు ఉన్నాయి. ఇందులో అశ్వలలిత- న,జ,భ,జ,భ ల గములు, మత్తాక్రీడ- మ,మ,త,న,న,న,ల గములు.8-15 అక్షరములపై విరామము.
సంకృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 16777216 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి తన్వి -భ,త,న,స,భ,భ,న,య గణములు.5-7-12అక్షరములపై విరామము.
అతికృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 33553432 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి క్రౌంచపదము- భ,మ,స,భ,న,న,న,న గములు.5-8-7 అక్షరములపై విరామము.
ఉదాయము ఛంధము-ప్రస్తారమున దీనికి 67108864 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి భుజంగ విజృంభితము - 2 మ, 1త, 3 నగణములు, 1ర, 1 స, 1ల, 1 గు 8-11-7 అక్షరములపై విరామము.
ఇవీ చూడండి
తెలుగు సాహిత్యము
అలంకారములు
మూలములు
1957- భారతి మాస పత్రిక వ్యాసము-ఛందశ్శాస్త్రము- శ్రీ తటవర్తి సూర్యనారాయణమూర్తి.
బయటి లింకులు
రచ్చబండ సాహితి సముదాయములో జెజ్జాల కృష్ణ మోహన రావు వ్యాసం (RTS లిపితో)
తెలుగు ఛందస్సుకు పూర్తిస్థాయి సాఫ్ట్వేర్
తెలుగు చందస్సు- యూట్యూబ్ లో పాఠాలు
తెలుగు ఛందస్సు - 101(RTS లిపిలో)
ఛందస్సు యాహూ కూటమి
వర్గం:పద్యము
వర్గం:ఛందస్సు
వర్గం:తెలుగు వ్యాకరణం
వర్గం:ఈ వారం వ్యాసాలు |
ఆగష్టు 25 | https://te.wikipedia.org/wiki/ఆగష్టు_25 | ఆగష్టు 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 237వ రోజు (లీపు సంవత్సరములో 238వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 128 రోజులు మిగిలినవి.
సంఘటనలు
ఉరుగ్వే జాతీయదినోత్సవం
1945: వరంగల్లు జిల్లా బైరాన్పల్లి పై, పోలీసులు, మిలటరీ సాయంతో, భువనగిరి డిప్యూటీ కలెక్టరు ఇక్బాల్ హుస్సేన్ నాయకత్వంలో 500 మందికి పైగా రజాకార్లు దాడి చేసారు. హైదరాబాద్ సంస్థానం మిలిటరీ 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ప్రక్కనే ఉన్న కూటికల్లు గ్రామంపై కూడా దాడి చేసారు.
1960: 17వ వేసవి ఒలింపిక్ క్రీడలు రోంలో ప్రారంభమయ్యాయి.
2003: బొంబాయి నగరములో కారు బాంబులు పేలి విధ్వంసం సృష్టించబడింది.
2007: హైదరాబాద్లో లుంబినీ పార్క్, కోఠి (గోకుల్ ఛాట్) బాంబు పేలుళ్ళ వల్ల 42 మందికి పైగా మృతిచెందారు.
జననాలు
1694: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధుడు. (మ.1756)
1724: జార్జ్ స్టబ్స్, ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు. (మ.1806)
1865: రాయచోటి గిరిరావు, సంఘ సేవకులు, విద్యావేత్త. (మ.1918)
1893: కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (మ.1967)
1917: దేవులపల్లి రామానుజరావు, రచయిత.
1920: ఏల్చూరి సుబ్రహ్మణ్యం , కవి,రచయిత,పాత్రికేయుడు .
1926: మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము, కవి, రచయిత, చిత్రకారుడు. (మ.2010)
1938: చిత్తరంజన్ , లలిత గీతాల రచయిత , గాయకుడు, సంగీత దర్శకుడు .(మ.2023)
1952: దులీప్ మెండిస్, శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1952: విజయ కాంత్ , తమిళ సినిమా నాయకుడు, రాజకీయ నాయకుడు(మ.2023)
1955 : సోమరాజు సదారాం, తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్
1961: బిల్లీ రే సైరస్, అమెరికా సంగీత గాయకుడు, గీత రచయిత, నటుడు.
1962: తస్లీమా నస్రీన్, బెంగాలీ రచయిత్రి.
1973: నిత్యశ్రీ మహదేవన్, కర్ణాటకసంగీత విద్వాంసురాలు, ప్లే బ్యాక్ సింగర్.
1987: బ్లెక్ లైవ్లీ, అమెరికా టీ.వీ., సినిమా నటి.
1987: మోనికా , దక్షిణ భారత చలన చిత్ర నటి.
మరణాలు
thumb|William Herschel01
1822: విలియం హెర్షెల్, వరుణ (యురేనస్) గ్రహాన్ని కనుగొన్న ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త. (జ.1738)
1867: మైకేల్ ఫెరడే, ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త. (జ.1791)
1908: హెన్రీ బెక్వెరెల్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
1953: సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (జ.1896)
1960: చింతా దీక్షితులు, రచయిత. (జ.1891)
1969: మఖ్దూం మొహియుద్దీన్, కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (జ.1908)
1999: సూర్యదేవర సంజీవదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (జ.1924)
2012: నీల్ ఆర్మ్స్ట్రాంగ్, చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930)
2015: పటోళ్ల కృష్ణారెడ్డి, ఆంధ్రపదేశ్ శాసన సభలో నాలుగు పర్యాయాలు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత.
పండుగలు , జాతీయ దినాలు
-
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 25
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చారిత్రక దినములు.
ఆగష్టు 24 - ఆగష్టు 26 - జూలై 25 - సెప్టెంబర్ 25 -- అన్ని తేదీలు
వర్గం:ఆగష్టు
వర్గం:తేదీలు |
ఆగష్టు 26 | https://te.wikipedia.org/wiki/ఆగష్టు_26 | ఆగష్టు 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 238వ రోజు (లీపు సంవత్సరములో 239వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 127 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1972: 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్ లో ప్రారంభమయ్యాయి.
1982: భారతదేశములోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము, డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు లో ప్రారంభించబడింది.
2008: తెలుగు సినిమా నటుడు చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు.
జననాలు
thumb|Lee De Forest|173x173px
1451: క్రిష్టొఫర్ కొలంబస్, అమెరికా ఖండాన్ని కనుగొన్న వ్యక్తి. (మ.1506)
1743: ఆంటోనీ లెవోషియర్, ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త. (మ.1794)
1873: లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (మ.1961)
1906: ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్, పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న వైద్యుడు. (మ.1993)
1910: మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (మ.1997)
1920: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు. (మ.1955)
1956: మేనకా గాంధీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రిణి.
1963: వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (మ.2008)
1964: సురేష్, తెలుగు సినీ నటుడు.
1965: వాసిరెడ్డి వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయుడు, రచయిత.
1968 : సౌందర్య రాజేష్, మహిళా పారిశ్రామికవేత్త
1977: మహేశ్వరి , తెలుగు చలనచిత్ర నటి.
1977:మధు ప్రియ , తెలంగాణ కు చెందిన గాయని.
1989: ప్రియదర్శి పులికొండ , తెలుగు సినీ నటుడు .
మరణాలు
పండుగలు , జాతీయ దినాలు
మహిళా సమానత్వ దినోత్సవము-
Muliki savitHri vadati
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 26
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చారిత్రక దినములు.
ఆగష్టు 25 - ఆగష్టు 27 - జూలై 26 - సెప్టెంబర్ 26 -- అన్ని తేదీలు
వర్గం:ఆగష్టు
వర్గం:తేదీలు |
ఆగష్టు 27 | https://te.wikipedia.org/wiki/ఆగష్టు_27 | ఆగష్టు 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 239వ రోజు (లీపు సంవత్సరములో 240వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 126 రోజులు మిగిలినవి.
బొద్దు పాఠ్యం
సంఘటనలు
thumb|Mars Hubble
1995 : ఈటీవీ తెలుగు ప్రసారాలు (టి.వి. ఛానెల్) ప్రారంభమయ్యాయి.
1955: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది.
2003: దాదాపు గత 60, 000 సంవత్సరాలలో, అంగారక గ్రహం, భూమికి అతి దగ్గరగా వచ్చింది.
జననాలు
1898: టి.ఎన్.రాజరత్నం పిళ్ళై, నాదస్వర విద్వాంసుడు. (మ.1956)
1908: డోనాల్డ్ బ్రాడ్మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్మన్గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (మ.2001)
1908: లిండన్ బి జాన్సన్, రాజకీయవేత్త, రచయిత. (మ.1973)
1909: దాడి గోవిందరాజులు నాయుడు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (మ.1970)
1914: కె ఎస్ ప్రకాశరావు, ప్రముఖ చలనచిత్ర దర్శకుడు (మ.1996)
1928: వోలేటి వెంకటేశ్వర్లు, సంగీత విద్వాంసుడు. (మ.1989)
1933: నాన్సీ ఫ్రైడే, స్త్రీ లైంగిక తత్వం, స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి (మ.2017).
1955: వల్లూరు శివప్రసాద్, నాటకకర్త.
1957: నూతలపాటి వెంకటరమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి.
1963: సుమలత, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమా నటి.
1972: ఖలీ, భారతీయ మల్లయోధ నిపుణుడు, నటుడు.
మరణాలు
1534: ఇస్మాయిల్ ఆదిల్షా, బీజాపూరు (1510 నుండి 1534 వరకు) సుల్తాను. (జ.1498)
1976: ముకేష్, భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (జ.1923)
2002: సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (జ.1911) .
2006: హృషికేష్ ముఖర్జీ, భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1922)
2010: కంభంపాటి స్వయంప్రకాష్, ఆయుర్వేద వైద్యుడు, లైంగిక వ్యాధుల నిపుణుడు. (జ.1962)
పండుగలు , జాతీయ దినాలు
-
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 27
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చారిత్రక దినములు.
ఆగష్టు 26 - ఆగష్టు 28 - జూలై 27 - సెప్టెంబర్ 27 -- అన్ని తేదీలు
వర్గం:ఆగష్టు
వర్గం:తేదీలు |
ఆగష్టు 28 | https://te.wikipedia.org/wiki/ఆగష్టు_28 | ఆగష్టు 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 240వ రోజు (లీపు సంవత్సరములో 241వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 125 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1709: మీడింగు పంహెబా మణిపూర్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.
2000: హైదరాబాద్ బషీర్ బాగ్ లో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వామపక్ష పార్టీలు చలో అసెంబ్లీకి పిలుపునిస్తూ వేయిలాది మందితో నిరసన చేయగా ఆ ఆందోళనలో పోలీసులు కాల్పులు జరుపగా రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి లు మరణించారు, అనేక మంది గాయపడ్డారు.
2017: ఆగష్టు 28 న భారత సుప్రీం కోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు.
జననాలు
thumb|Goethe (Stieler 1828)
1749: గేథే, జర్మనీ రచయిత. (మ.1832)
1904: దాట్ల సత్యనారాయణ రాజు, స్వతంత్ర సమరయోధుడు, భారత పార్లమెంట్ సభ్యుడు.
1928: విలాయత్ ఖాన్, భారతీయ సితార్ వాదకుడు. (మ. 2004)
1928: ఆర్.బాల సరస్వతి , తెలుగు చలనచిత్ర నటి , నేపథ్య గాయని .
1934: ఎ.పి. కోమల, తెలుగు, తమిళం, మలయాళ గాయని. రేడియో కళాకారిణి.
1949: డబ్బింగ్ జానకి, దక్షిణభారత చలన చిత్ర నటి.
1959: సుమన్, తెలుగు సినిమా నటుడు.
1964: నళిని , దక్షిణ భారత చలన చిత్ర నటి.
1967: ఫాదర్ రవి శేఖర్, కళాదర్శిని డైరెక్టరు అయిన ఫా. జో సేబాస్టియన్, ఎస్.జె. గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు
1969 : ఒక అమెరికన్ సాంకేతిక అధికారి, ఉద్యమకర్త, రచయిత షెరిల్ శాండ్బర్గ్
1976: కుసుమ జగదీశ్, తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు (మ. 2023)
1993 : బ్రిటిష్ పాప్ గాయని చెర్ల లాయిడ్
మరణాలు
1958: భమిడిపాటి కామేశ్వరరావు, రచయిత, నటుడు, నాటక కర్త. (జ.1897)
1988: చీకటి పరశురామనాయుడు, రాజకీయ నాయకుడు. (జ.1910)
2006: డి.వి.నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (జ.1920)
2015: బి.సత్యనారాయణ, తెలుగు సినిమా నిర్మాత.
పండుగలు , జాతీయ దినాలు
-
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 28
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చారిత్రక దినములు.
ఆగష్టు 27 - ఆగష్టు 29 - జూలై 28 - సెప్టెంబర్ 28 -- అన్ని తేదీలు
వర్గం:ఆగష్టు
వర్గం:తేదీలు |
ఆగష్టు 29 | https://te.wikipedia.org/wiki/ఆగష్టు_29 | ఆగష్టు 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 241వ రోజు (లీపు సంవత్సరములో 242వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 124 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1842: నాన్కింగ్ సంధి జరిగి నల్లమందు యుద్ధాలు (ఓపియం వార్స్) ఆగిపోయాయి. నాన్కింగ్ సంధి ప్రకారం హాంగ్ కాంగ్ దీవిని బ్రిటన్ కి దత్తత ఇచ్చారు.
1885: గోట్లీబ్ డైమ్లెర్ ప్రపంచంలోని మొట్టమొదటి మోటారు సైకిల్ కి పేటెంట్ తీసుకున్నాడు.
1898: గుడ్ ఇయర్ టైర్ల కంపెనీని స్థాపించారు.
1910: జపాన్ కొరియా పేరును ఛోసెన్ గా మార్చీ, ఆ కొత్త వలసను పాలించటానికి ఒక గవర్నర్ జనరల్ ను నియమించింది.
1915: యు.ఎస్. నేవీ గజ ఈతగాళ్ళు ప్రమాదంలో మొదటిసారిగా ములిగిపోయిన ఎఫ్-4 అనే జలాంతర్గామిని బయటికి తీసారు.
1916: ఫిలిప్పైన్స్ అటానమీ చట్టాన్ని (స్వయంగా పాలించుకోవటం) అమెరికా ఆమోదించింది.
1930: సెయింట్ కిల్డాలో వివసిస్తున్న చివరి 36 మంది ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి, స్కాట్లాండులోని ఇతర ప్రదేశాలకు తరలిపోయారు.
1944: స్లొవేకియాలోని స్లొవాక్ దళాలు 60, 000 మంది నాజీలకు వ్యతిరేంగా ఉద్యమింఛటంతో స్లొవాక్ లో జాతీయతా భావం ఉప్పొంగింది. ఆనాటినుంచి, 29 ఆగస్టుని జాతీయతా భావం ఉప్పొంగిన దినంగా జరుపుకుంటున్నారు స్లొవేకియా లో.
1949: సోవియట్ యూనియన్ తన మొట్ట మొదటి అణుబాంబును (పేరు : ఫస్ట్ లైట్నింగ్ (లేక) జోయ్ 1) కజకిస్తాన్ లోని సెమిపలతిస్స్క్ అనే చోట పరీక్షించింది.
1957: స్ట్రామ్ థర్మాండ్, అమెరికన్ సెనేట్ లో 24 గంటలకు పైగా సివిల్ రైట్స్ బిల్లు పై వ్యతిరేకంగా మాట్లాడి రికార్డు సృష్టించాడు. ఆ బిల్లు పాస్ అయ్యింది.
1958: యునైటెడ్ స్టేట్స్ఏయిర్ ఫోర్స్ అకాడెమీని, కొలరాడో లోని కొలరాడొ స్ప్రింగ్స్ అనే చోట ప్రారంభించారు.
1965: అమెరికన్ రోదసి నౌక జెమిని-5 భూమికి తిరిగి వచ్చింది
1966: బీటిల్స్ (గాయకుల బృందం] తమ చివరి కచేరిని అమెరికాలోని, సాన్ఫ్రాన్సిస్కో లోని కేండిల్స్టిక్ పార్క్ దగ్గర చేసారు.
1982: కృత్రిమంగా తయారుచేసిన రసాయన మూల్లకం మీట్నెరియం (అటామిక్ నెంబరు 109) ని మొట్టమొదటిసారిగా జర్మనీ లోని, డార్మ్స్టాడ్ దగ్గర గెసెల్స్చాఫ్హ్ట్ ఫర్ స్చెరిఒనెన్ఫొర్స్కంగ్
1984: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా శంకర్ దయాళ్ శర్మ నియమితులయ్యాడు.
1986: బ్రిటన్ లోని కవలలు తమ 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. 70 కోట్లమందిలో ఒక్కరికే ఇటువంటి అవకాశం ఉంటుంది. వీడియో చూడటానికి ఇక్కడ నొక్కు
1991: సుప్రీం సోవియెట్ (రష్యా పార్లమెంటు) కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలను ఆపి వేసి, కమ్యూనిస్ట్ పార్టీకి చరమ గీతం పాడింది.
2005: హరికేన్ కత్రినా అమెరికాలోని గల్ఫ్ తీరాన్ని తాకి, మిసిసిపి, లూసియానా ల లోని సముద్ర తీర పట్టణాలను నాశనంచేసి 10లక్షల మందిని నిరాశ్రయులను చేసి, 1, 000 మంది మరణానికి కారణమయ్యింది.
జననాలు
thumb|Dhyan Chand closeup
1863: గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (మ.1940)
1902 : వెరియర్ ఎల్విన్, రాజనీతి పండితుడు, భారతీయ గిరజన జాతుల సమర్థకుడు.
1905: ధ్యాన్ చంద్, భారత హాకీ క్రీడాకారుడు. (మ.1979)
1926: రామకృష్ణ హెగ్డే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి .
1928: రావు బాలసరస్వతీ దేవి, పాతతరం తెలుగు చలనచిత్ర నటి, నేపథ్యగాయని.
1943: విజయ కుమార్ , తమిళ మలయాళ, హిందీ,తెలుగు చిత్రాల నటుడు , రాజకీయ నాయకుడు .
1958: మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (మ.2009)
1959: అక్కినేని నాగార్జున, తెలుగు చలనచిత్ర నటుడు, అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు.
1961: నాగబాబు, తెలుగు చిత్రసీమ నటుడు , నిర్మాత
1974: దామరకొండ ప్రవీణ్ కుమార్, రైతు సమితి మండల కో-ఆర్డినేటర్, మాజీ సర్పంచ్, అమీనాపురం గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
1975: విశాల్ కృష్ణ, తమిళ, తెలుగు , చిత్రాల నటుడు , నిర్మాత .
1981: ప్రత్యూష , తెలుగు ,తమిళ, చిత్రాల నటి(మ.2002).
1991: హరిప్రియ, సినీనటి, భరత నాట్య కళాకారిణి ,మోడల్ .
మరణాలు
1950: వేటూరి ప్రభాకరశాస్త్రి, రచయిత. (జ.1888)
1976: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు, పద్మ భూషణ పురస్కార గ్రహీత. (జ.1899)
2018: నందమూరి హరికృష్ణ, సినిమా నటుడు, ఎన్. టి.రామారావు కుమారుడు, కారు ప్రమాదంలో గాయపడి మరణం. (జ.1956)
2022: అభిజిత్ సేన్ ఆర్థికవేత్త. ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు. (జ.1950)
పండుగలు, జాతీయ దినాలు
తెలుగు భాషా దినోత్సవము - గిడుగు రామమూర్తి జయంతినే తెలుగు భాషా దినోత్సవముగా జరుపుతున్నారు.
జాతీయ క్రీడా దినోత్సవం - ధ్యాన్ చంద్ జయంతినే జాతీయ క్రీడా దినోత్సవముగా జరుపుతున్నారు.
అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 29
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చారిత్రక దినములు.
ఆగష్టు 28 - ఆగష్టు 30 - జూలై 29 - సెప్టెంబర్ 29 -- అన్ని తేదీలు
వర్గం:ఆగష్టు
వర్గం:తేదీలు |
ఆగష్టు 31 | https://te.wikipedia.org/wiki/ఆగష్టు_31 | ఆగష్టు 31, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 243వ రోజు (లీపు సంవత్సరములో 244వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 122 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1857: భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది.
జననాలు
thumb|Ajjada Adibhatla Narayana Dasu
1864: ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు. (మ.1945).
1923: చెన్నమనేని రాజేశ్వరరావు, విద్యార్థి దశలోనే జాతీయోద్యమంలోనూ, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు (మ.2016).
1925: ఆరుద్ర, కవి, గేయరచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు (మ.1998).
1932: రావిపల్లి నారాయణరావు, 80 కథలు రాశారు. 'పెళ్ళాడి ప్రేమించు' అనే కథా సంపుటి తెలుగు వారికందించారు.
1934: రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (మ.1994)
1936: తురగా జానకీరాణి, రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు. (మ.2014).
1944 : వెస్ట్ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు క్లైవ్ లాయిడ్ జననం
1949 : అమెరికా నటుడు రిచర్డ్ గేర్ జననం.
1960: హసన్ నస్రల్లా, లెబనాన్ దేశానికి చెందిన షియా ఇస్లామిక్ నాయకుడు.
1962: మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు, 14వ లోక్సభ సభ్యుడు.
1969: జవగళ్ శ్రీనాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1975 : ఉడతా రామకృష్ణ, సదా మీకోసం పత్రిక సంపాదకులు జననం.
1979: యువన్ శంకర్ రాజా, తమిళ, తెలుగు చిత్రాల సంగీత దర్శకుడు
మరణాలు
1984: పెండ్యాల నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు (జ .1917)
1997: ప్రిన్సెస్ డయానా, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ మాజీ భార్య (జ.1961).
2014: బాపు, చిత్రకారుడు, సినీ దర్శకుడు (జ.1933).
పండుగలు , జాతీయ దినాలు
-
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 31
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చారిత్రక దినములు.
ఆగష్టు 30 - సెప్టెంబర్ 1 - జూలై 31 - సెప్టెంబర్ 30 -- అన్ని తేదీలు
వర్గం:ఆగష్టు
వర్గం:తేదీలు |
నవంబర్ 13 | https://te.wikipedia.org/wiki/నవంబర్_13 | నవంబర్ 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 317వ రోజు (లీపు సంవత్సరములో 318వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 48 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1930: మొదటి రౌండు టేబులు సమావేశాన్ని ఐదవ జార్జి చక్రవర్తి లండనులో లాంఛనంగా ప్రారంభించాడు.
జననాలు
1899: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (మ.1982)
1904: పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు. (మ.1982)
1914: హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (మ.1977)
1917: వసంత్దాదా పాటిల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
1920: కె.జి.రామనాథన్, భారతీయ గణిత శాస్త్రవేత్త. (మ.1992)
1925: టంగుటూరి సూర్యకుమారి, గాయని, నటీమణి. (మ.2005)
1926: ఎ.ఆర్.కృష్ణ, నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1992)
1935: పి.సుశీల, భారతీయ సినీ గాయని.
1957: ఇ.జి.సుగవనం, తమిళనాడులోని డి.ఎం.కె.పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు.
1967: జుహీ చావ్లా, భారత సినీనటి.
1969: రాజీవ్ కనకాల , తెలుగు చలనచిత్ర నటుడు, దర్శకుడు.
1991: అభినయ, మోడల్ , తెలుగు, కన్నడ, చిత్రాల నటి
మరణాలు
thumb|బారు అలివేలమ్మ
1973: బారు అలివేలమ్మ, స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు.
1974: విట్టొరియో డి సికా, ఇటాలియన్ దర్శకుడు, నటుడు. (జ.1901)
1976: పండితారాధ్యుల నాగేశ్వరరావు, పత్రికారచయిత, ఎడిటర్, సంపాదకుడు.
1993: గురజాడ కృష్ణ దాసు వెంకటేష్ ,సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు (జ.1927)
2002: కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (జ.1914)
2010: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు. (జ.1928)
పండుగలు , జాతీయ దినాలు
ప్రపంచ దయ దినోత్సవం
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : నవంబర్ 13
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చరిత్రలోని రోజులు
నవంబర్ 12 - నవంబర్ 14 - అక్టోబర్ 13 - డిసెంబర్ 13 -- అన్ని తేదీలు
వర్గం:నవంబర్
వర్గం:తేదీలు |
నవంబర్ 12 | https://te.wikipedia.org/wiki/నవంబర్_12 | నవంబర్ 12, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 318వ రోజు (లీపు సంవత్సరములో 319వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 49 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1766: సలాబత్ జంగును అతని సోదరుడు నిజాం ఆలీ ఖాను కూలదోసి, రాజమండ్రిని, శ్రీకాకుళాన్ని హసన్ ఆలీ ఖానుకు లీజు కిచ్చాడు. రాబర్టు క్లైవు మొగలు చక్రవర్తి షా ఆలంతో సంప్రదించి, ఉత్తర సర్కారులను ఈస్ట్ ఇండియా కంపెనీకి ధారాదత్తం చేసినట్లుగా ఆగస్టు 1765లో ఫర్మానా తెప్పించాడు. కాని దానిని మార్చి 1766 వరకు రహస్యంగా ఉంచాడు. బ్రిటిషు వారు కొండపల్లి దుర్గాన్ని ఆక్రమించారు. అవసరమైతే సైనిక చర్య చేపట్టడానికై జనరలు సిల్లాడ్ను మచిలీపట్నం పంపించారు. నిజాము కూడా శీఘ్రంగా యుద్ధ సన్నాహాలు చేసాడు. నవంబర్ 12, 1766 న కుదిరిన ఒక ఒప్పందం వలన యుద్ధం తప్పింది. ఉత్తర సర్కారులకు ప్రతిఫలంగా, కంపెనీ, నిజాము సహాయార్థం సైన్యాన్ని పోషిస్తుంది తూర్పు గోదావరి జిల్లా చరిత్ర
1969: రాష్ట్రపతి ఎన్నికలో స్వంత పార్టీ యొక్క అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా వి.వి.గిరిని గెలిపించిన ఇందిరా గాంధీని పార్టీ నుండి బహిష్కరించగా, కొత్తపార్టీ, కాంగ్రెస్ (ఐ) ని ఏర్పాటు చేసింది. తరువాతి కాలంలో ఇదే భారత జాతీయ కాంగ్రెసుగా గుర్తింపు పొందింది.
1996: హర్యానా లోని భివాని వద్ద ఆకాశంలో రెండు విమానాలు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో 350 మంది మరణించారు.
జననాలు
1885: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (మ.1932])
1920: పెరుగు శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని నేత్రవైద్య నిపుణుడు., ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహాదారుగా, దేశ ప్రథమ పౌరుడి (రాష్ట్రపతి) కి గౌరవ నేత్ర చికిత్సకులుగా నియమితులయ్యారు,
1925: పసుమర్తి కృష్ణమూర్తి, చలనచిత్ర నృత్యదర్శకుడు. (మ.2004)
1929: సి.వి.సుబ్బన్న, శతావధాని (మ.2017)
1940: అంజాద్ ఖాన్ , భారతీయ నటుడు, దర్శకుడు,(మ1992)
1977: ప్రియాంక త్రివేది, కన్నడ, తెలుగు, తమిళ, హిందీ,చిత్రాల నటి.
1985: సనంశెట్టి , మోడల్, తమిళ, తెలుగు, మలయాళ నటి
1992:ప్రియాంక జవాల్కర్ , తెలుగు సినీ నటి.
మరణాలు
thumb|మదన్ మోహన్ మాలవీయ
1946: మదన్ మోహన్ మాలవ్యా, భారత స్వాతంత్ర్యయోధుడు. (జ.1861)
1986: భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, భారతదేశ సుప్రీంకోర్టు ఆరవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1899)
1994: విల్మా రుడాల్ఫ్, ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (జ.1940)
2012: చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు, స్వాతంత్ర్యసమరయోధులు. 1800 ఎకరాలు దానం చేసిన దాత
2018: అనంతకుమార్, కేంద్ర మంత్రి, కేన్సరు కారణంగా చనిపోయారు. (జ.1959).
2020: ఏడిద గోపాలరావు, ఆకాశవాణి కళాకారుడు.
పండుగలు, జాతీయ దినాలు
జాతీయ కుటుంబ సౌహార్థ దినోత్సవం
ప్రపంచ న్యూమోనియా అవగాహన దినోత్సవం.
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : నవంబర్ 12
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చరిత్రలోని రోజులు
నవంబర్ 11 - నవంబర్ 13 - అక్టోబర్ 12 - డిసెంబర్ 12 -- అన్ని తేదీలు
వర్గం:నవంబర్
వర్గం:తేదీలు |
నవంబర్ 11 | https://te.wikipedia.org/wiki/నవంబర్_11 | నవంబర్ 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 315వ రోజు (లీపు సంవత్సరములో 316వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 50 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1918: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది: మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి.
1675 : గురు గోవింద సింగ్ మతగురువయ్యాడు.
జననాలు
thumb|Maulana Abul Kalam Azad
1768: సికిందర్ జా, హైదరాబాదు మూడవ నిజాం (1803 నుండి 1829 వరకు). (మ.1829)
1821: దాస్తొయెవ్స్కీ, రష్యన్ రచయిత. క్రైమ్ అండ్ పనిష్మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలలు రాశాడు. (మ.1881)
1871: కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు, తెలుగు రచయిత. (మ.1919)
1888: మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (మ.1958)
1899: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, పంచాంగకర్త. (మ.1972)
1905: గుంటి సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు.
1917: కమల్ రణదివె, భారతదేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. (మ.2001)
1918: కృష్ణ కుమార్ బిర్లా, పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (మ.2008)
1921: సుసర్ల దక్షిణామూర్తి, దక్షిణభారత చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.2012)
1924: తెన్నేటి విద్వాన్, రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2015)
1974: రఘు దీక్షిత్ , భారతీయ గాయకుడు .
మరణాలు
1966: భాస్కరభట్ల కృష్ణారావు, ఆకాశవాణిలో దాదాపు 15 ఏళ్ళు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాడు. ఈయన 20 సంవత్సరాల కాలంలో మొత్తం 40 కథలు రచించాడు. (జ.1918)
1970: మాడపాటి హనుమంతరావు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత . (జ.1885)
1974: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (జ.1921)
1984: చండ్ర పుల్లారెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు - లెనినిస్టు) ప్రధాన కార్యదర్శి. సి.పి.గా ఖ్యాతిగాంచాడు. రచయిత, సిద్ధాంతకర్త, వక్త. (జ.1917)
1994: కువెంపు, కన్నడ రచయిత, కవి. (జ.1904)
2006: కప్పగంతుల మల్లికార్జునరావు, కథా, నవలా, నాటక రచయిత. (జ.1936)
2020: ఆర్.శాంత సుందరి, తెలుగు రచయిత్రి, అనువాదకురాలు.
2023:చంద్రమోహన్ , తెలుగు చలన చిత్ర నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ .(జ.1942)
పండుగలు , జాతీయ దినాలు
వెటరన్స్ డే.
జాతీయ విద్యా దినోత్సవం.
యుద్ద విరమణ దినం .
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : నవంబర్ 11
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చరిత్రలోని రోజులు
నవంబర్ 10 - నవంబర్ 12 - అక్టోబర్ 11 - డిసెంబర్ 11 -- అన్ని తేదీలు
వర్గం:నవంబర్
వర్గం:తేదీలు |
నవంబర్ 10 | https://te.wikipedia.org/wiki/నవంబర్_10 | నవంబర్ 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 314వ రోజు (లీపు సంవత్సరములో 315వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 51 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1990: భారత ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ నియమితుడైనాడు.
జననాలు
1483: మార్టిన్ లూథర్, క్రైస్తవ మత సంస్కరణోద్యమ నిర్మాత, బైబిల్ గ్రంథాన్ని తొలిసారిగా ప్రజాభాషలోనికి అనువదించిన వేదాంతి.
1798: ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్, (మ.1884)
1848: సురేంద్రనాథ్ బెనర్జీ, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1925)
1904: వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (మ.1996)
1911: ఏటుకూరి వెంకట నరసయ్య, క్షేత్రలక్ష్మి పద్యకావ్యంతో పేర్గాంచిన, మానవతావాది. (మ.1949)
1920: దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (మ.2004)
1942: రాబర్ట్-ఎఫ్-ఏంజిల్, ఆర్థికవేత్త .
1956: మాడభూషి శ్రీధర్, నల్సార్ లా యూనివర్శిటీ అధ్యాపకుడు, కేంద్ర సమాచార శాఖ కమిషనర్.
1957: శోభారాజు, గాయనీ, సంగీతదర్శకురాలు, రచయిత , అన్నమయ్య కీర్తనలు ప్రాచుర్యంలో విశేష కృషి .
మరణాలు
thumb|Tenneti Vishwanatham statue at Tenneti park Visakhapatnam
1949: ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (జ.1911)
1979: తెన్నేటి విశ్వనాధం, స్వాతంత్ర్య సమర యోధుడు, విశాఖ ఉక్కు ఉద్యమ నేత.
1992: ఎ.ఆర్.కృష్ణ, నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1926)
1993: రావిశాస్త్రి, న్యాయవాది, రచయిత. (జ.1922)
2019: టి. ఎన్. శేషన్ 10వ భారత ఎన్నికల ప్రధాన కమీషనర్. (జ.1932)
2020: జీడిగుంట రామచంద్ర మూర్తి, తెలుగు రచయిత, ఆకాశవాణి ప్రయోక్త.
పండుగలు , జాతీయ దినాలు
రవాణా దినం.
ప్రపంచ సైన్స్ దినోత్సవం .
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : నవంబర్ 10
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చరిత్రలోని రోజులు
నవంబర్ 9 - నవంబర్ 11 - అక్టోబర్ 10 - డిసెంబర్ 10 -- అన్ని తేదీలు
వర్గం:నవంబర్
వర్గం:తేదీలు |
తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి | https://te.wikipedia.org/wiki/తాంబూలాలిచ్చేశాను,_ఇక_తన్నుకు_చావండి | తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి అని కూడా అనటం కద్దు.
గురజాడ అప్పారావు కలం నుండి భాషలోకి ప్రవహించిన గొప్ప వాక్యాల్లో ఇది ఒకటి. ఆయన తన రచనల్లో రాసిన ఎన్నో పదాలు నానుడులై, సామెతలై, నుడికారాలై భాష లోకి ఒదిగి పోయాయి. అటువంటి సామెతల్లో అగ్రశ్రేణికి చెందినది కన్యాశుల్కం నాటకం లోని ఈ వాక్యం.
అగ్నిహోత్రావధాన్లు అనే ఒక పాత్ర, కన్యాశుల్కం మీది పేరాశతో భార్య ఇష్టానికి వ్యతిరేకంగా, ఆమెకు తెలియకుండా, తమ కూతురుకి ఒక ముసలివాడితో పెళ్ళి నిశ్చయిస్తాడు. దానికి భార్య, బావమరిది అభ్యంతరం చెప్పినపుడు, ఆసక్తికరమైన సంభాషణ వారి ముగ్గురి మధ్య జరుగుతుంది. ఆ సందర్భంలో అగ్నిహోత్రావధాన్లు చేత గురజాడ ఈ మాట అనిపిస్తాడు.
తాంబూలాలివ్వడమనేది భారతీయ సాంప్రదాయంలో పెళ్ళి నిశ్చయం చేసుకోవడం. అక్కడి వరకూ వచ్చాక ఇక ఆ పెళ్ళి ఆగటం సాధారణంగా జరగదు, పెళ్ళి దాదాపు జరిగినట్లే. నేను తాంబూలాలు కూడా ఇచ్చేశాను, ఇక మీరెంత గింజుకున్నా ఒరిగేదేమీ లేదని ఆ పాత్ర భావం.
చెయ్యాల్సిందంతా చేసేశాను, ఇంక ఎన్ననుకున్నా ఏమీ లాభం లేదు అని చెప్పాల్సిన సందర్భంలో దీనిని వాడతారు.
కేవలం ఒక పాత్ర సంభాషణలలో భాగంగా రాసిన డైలాగు సామెతగా భాషలో ఇంకిపోయింది.
వర్గం:సామెతలు |
భగవద్గీత | https://te.wikipedia.org/wiki/భగవద్గీత | right|300px|thumb|గీతోపదేశం బాగా జనప్రియమైన చిత్రం. ఇది కలంకారీ శైలిలో వస్త్రంపై అద్దిన చిత్రం.
భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.
భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
right|thumb|200px|19వ శతాబ్దానికి చెందిన భగవద్గీత వ్రాతప్రతి
భగవద్గీత ఆవిర్భావం
భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధం మయారు. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథ సారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.
భగవద్గీత విశిష్టత
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు ఇవి:
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.
ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించింది. (మహాభారతం - భీష్మ పర్వం)
నేను గీతను ఆశ్రయించి ఉండును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)
నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు. (మహాత్మా గాంధీ)
భగవద్గీతలో ముఖ్య విషయాలు
గీతా సారము
(భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్ధాలు, అంతరార్ధాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక "భగవద్గీత సారం" అన్నవిషయం ఇది వ్రాసేవారికి "అర్ధమయినంత, తోచినంత" అని గ్రహించాలి)
కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.
ఆత్మ నిత్య సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.
మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.
కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నాయి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు.
ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.
right|thumb|250px|శ్రీకృష్ణుడు, పార్థుడు గీతోపదేశం సన్నివేశం ఉన్న విగ్రహాలు తిరుమలలో
ఆత్మ తత్వము
జీవన కర్తవ్యము - కర్మ, జ్ఞానము, భక్తి
యోగ సాధన
భగవత్తత్వము
శ్రద్ధ, గుణ విభాగము
భగవద్గీత విభాగాలు
భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి 18 వరకు"జ్ఞాన షట్కము". ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. (ఆధ్యాయం శీర్షిక లేత నీలి రంగులో ఉంది. దానిపై క్లిక్ చేస్తే వికీసోర్స్లోని ఆ అధ్యాయానికి దారి తీస్తుంది)
1.అర్జున విషాద యోగము-ప్రథమాధ్యాయం
"ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు, పాండుపుత్రులు ఏమి చేశారు సంజయా?" అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగినదంతా చెబుతాడు. మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుని కోరికపై పార్ధసారథియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రథాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు, మిత్రులను చూశాడు. - వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్థించాడు.
2.సాంఖ్య యోగము - ద్వితీయాధ్యాయము
సాంఖ్యము అనగా ఆత్మానాత్మ వివేచన. కర్తవ్య విమూఢుడైన అర్జునుని కృష్ణుడు మందలించాడు. తరువాత అర్జునునికి ఆత్మ తత్వాన్ని బోధించాడు. తానే చంపేవాడినన్న భ్రమ వద్దని తెలిపాడు. ఇది గీతలోని తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరించాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు. దానికి శీతోష్ణ సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలు లేవు. ఇంద్రియాలకు విషయ సంపర్కం వలన ద్వంద్వానుభవాలు కలుగుతుంటాయి. సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు వంటి ద్వంద్వ విషయాలపట్ల సమబుద్ధిని కలిగి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి. సుఖము పట్ల అనురాగము, దుఃఖము పట్ల ఉద్విగ్నము లేకుండా కర్మలు చేసేవాడు, ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు, అహంకార మమకారాములు వీడినవాడు, బుద్ధిని ఆత్మయందే లగ్నము చేసినవాడు స్థితప్రజ్ఞుడు.
సాంఖ్య యోగం: శరీరము అశాశ్వతము. దానిని తెలుసుకున్న శరీరి (ఆత్మ) శాశ్వతము. ఈ విశయానికి ప్రాధాన్యమిచ్చి కర్తవ్యపాలన చేయాలి. ఈ రెండిటిలో ఏ ఉపాయాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నా చింతలు, శోకాలు తొలగిపోవును.
3.కర్మ యోగము - తృతయాధ్యాయము
కర్మలన్నింటినీ ఆవరించుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. కర్మలవలన సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును. అందువలన
యుక్తమైన కర్మలు చేస్తూనే ఉండాలి. వాటి ఫలితాన్ని గురించి ఆశించరాదు. అలాగని కర్మలు చేయడం మానరాదు. ఫలితం ప్రియమైనా, అప్రియమైనా గాని దానిని సమబుద్ధితో స్వీకరించాలి.
కర్మల పట్ల సంగము (ఆసక్తి, వ్యామోహం) పెంచుకోకూడదు. కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా గాని సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేసే కామ్యకర్మలు నీచమైనవి.
లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు. మోక్షప్రదాలు.
ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మ యోగము.
కర్మణ్యే వాధికారస్తే మాఫలే సుఖదాచనా,
మా కర్మఫలాగే దుర్భు:మాతే సంగోస్త్వ కర్మణి||
4.జ్ఞాన యోగము - చతుర్ధాధ్యాయము
ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రథము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు -
" ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను. రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మ ఫలాసక్తిని విడచి, నిత్య తృప్తుడై, అహంకార మమకారాలను పరిత్యజించి, సుఖదుఃఖాలకు అతీతుడైన, సమదృష్టి కలిగిన, త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు. ఇంద్రియ నిగ్రహము, శ్రద్ధ కలిగి, ఆత్మ ధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు."
5.కర్మసన్యాస యోగము - పంచమాధ్యాయము
ఇంతకూ కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం - "కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు"
6.ఆత్మసంయమ యోగము - షష్ఠాధ్యాయము
ఈ అధ్యాయంలో వివిధ యోగసాధనా విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనో బుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనసును నిగ్రహించుకొనవచ్చును. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలను దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఃఖాలనూ తనవిగా తలచి వాటిపట్ల దయ, కరుణ, ఆర్ద్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగసాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందుజన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు.
7.జ్ఞానవిజ్ఞాన యోగము - సప్తమాధ్యాయము
విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. వారిలో ఏఒక్కడో భగవంతుని తెలుసుకోగలుగుతాడు.
భగవంతుని ప్రకృతి (మాయ) మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు అనే ఎనిమిది తత్వాలుగా విభజింపబడింది. ఇది అపరా ప్రకృతి. ఇంతకంటె ఉత్తమమైనది పరాప్రకృతి భగవంతుని చైతన్యము. ఈ రెండింటి సంయోగం వలన సృష్టి జరుగుతుంది. మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించియున్నాడు. భగవంతుకంటె వేరుగా ఏదీ లేదు.
ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ వాసుదేవమయమని తెలుసుకొని కొలుస్తృఆడు గనుక అతడు భగవంతునికి ప్రియతముడు. అనేక దేవతల రూపాలలో భగవంతుని ఆరాధించే భక్తులను ఆయా దేవతలస్వరూపంలో వాసుదేవుడు అనుగ్రహిస్తాడు. దేవతలనారాధించేవారు దేవతలను, సర్వేశ్వరుని ఆరాధించేవారు సర్వేశ్వరుని పొందుతారు. జన్న జరా మరణాలనుండి మోక్షాన్ని పొందగోరినవారు దేవదేవుని (వాసుదేవుని) ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మమును పొందుతారు.
8.అక్షరపరబ్రహ్మ యోగము - అష్టమాధ్యాయము
బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడింది.
క్షరము అనగా నశించునది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్యమ విద్య. అంత్యకాలంలో భగవంతుని ధ్యానిస్తూ దే్హాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకొంటాడు. ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ దేహాన్ని విడచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమౌతుంది. అలా భగవంతుని పొందినవానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరల బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తమూ నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరినవారికి తిరిగి వెళ్ళడం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు.
9.రాజవిద్యారాజగుహ్య యోగము - నవమాధ్యాయము
కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగములలో జీవన విధానానికి మార్గం, భగవత్ప్రాప్తికి సాధనం నిర్దేశించబడినాయి. అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయం జరిగింది. 9న అధ్యాయం అయిన "రాజవిద్యా రాజగుహ్య యోగము" కృష్ణుడు తానే భగంతుడనని, సృష్టి స్థితి లయ కారకుడనని తెలిపాడు. ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడింది. కృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం -
" విద్యలలో ఉత్తమమైనది, అతి నిగూఢమయినది ఈ బ్రహ్మ విద్య. జీవుని మోక్ష రహస్యాన్ని తెలియజేస్తుంది. అర్జునా! నా అధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మ ఫల ప్రదాతను. ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. సర్వాన్నీ భరించేవాడిని, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణునొసగేవాడిని, సాక్షిని, సృష్టి స్థితి లయ కారకుడను, సత్స్వరూపుడను, అమృతుడను. మూఢులు నా తత్వాన్ని తెలియజాలక వ్యర్ధమైన ఆశలతోను, నిష్ప్రయోజనమైన కర్మలతోను నశిస్తున్నారు. సజ్జనులు నన్ను సదా కీర్తిస్తూ జహఞానయోగం ద్వారా ఆరాధిస్తారు. అనన్య చింతనతో నన్ను ఉపాసించేవారి యోగ క్షేమాలు నేనే వహిస్తాను."
"అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు. నేనొసగే కామ్యార్ధాలను ఆయా దేవతల ద్వారా పొదుతున్నారు. నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు. పవిత్రమైన హృదయంతో నాకు పత్రము, పుష్పము, ఫలము, జలము ఏది తర్పించినా దానిని స్వీకరించి నేను తృప్తుడనౌతాను. ఏ పని చేసినా ఆ కర్మ ఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మ బంధంనుండి విముక్తుడవౌతావు. నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడైనా అతడెన్నటికీ నశింపడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు. కనుక నాయందే మనసు లగ్నం చేసి, నా భక్తుడవై, నన్నారాధించుము. నన్నే శరణు జొచ్చుము. నన్నే నీవు పొందెదదవు"
10.విభూతి యోగము - దశమాధ్యాయము
ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందడానికి అవుసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మము ఏయే రూపములలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను.
" నేను సమస్త మానవుల హృదయాలలో ఆసీనుడనై యున్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే అనగా దైవమునకు ఆది అంతము నామము రూపము లేవు.. ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ. స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు." - అని తన విభూతుల గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు.,
ఓ కౌంతేయా! నీళ్ళలో రసమును నేను. చంద్రసూర్యలలో కాంతినేను.వేదములలో ప్రణవమును నేను.ఆకాశమున శబ్దమును నేను.మానవూలలో పౌరుషము నేను. నేలలో తావి నేను. సూర్యునిలో తేజస్సును నేను.భూతములలో జీవమేనేను. తాపసులలో తపస్సును నేను.భూతములన్నింటికి బీజమును నేను.బుద్ధివంతులలో బుద్ధిని నేను.తేజస్సులలో తేజస్సును నేను.బలవంతులలో కామరాగములు లేని బలమేనేను.ధర్మవిరుద్ధము కాని కామమేనేను.సాత్త్విక రాజసిక తామస భావములన్నియు నావల్లనే కలిగెడివి.వాటిలో నేను లేను.కాని అవి నాయందు ఉన్నాయి.విభూతి శ్లోకములకు ముఖ్యార్ధము చెప్పుచో పరిణామవాదములోకి దిగును.ఏలనగా భగవంతుడే రసము, కాంతి మొదలగు రుఊపములు తాల్చెనని చెప్పవలసి వచ్చును. దారమును పూసలును ఒకటి కావు.ఈవిషయానంతరమునందే విభూతిశ్లోకములున్నవి.పరమాత్మ వలననే సాక్షాత్తు భూతోత్పత్తి యగునని భ్రమను నివారించుటకు నాలగవ పాదమున వానిలో నేను లేనుగాని అవి నాలో ఉన్నవి అని ముగింపబడెను.క్రతువు, యజ్ఞము, స్వధ, ఔషధము, నేయి, నిప్పు, హోమము నేనే.నేనే జగతికి తండ్రిని, తల్లిని, తాతను తెలియదగినవాడను నేనే.పవిత్రమగు ఓంకారము ఋక్కుసామము యజస్సు, గతి, భర్త, ప్రభువు, సాక్షి, నివాసము, శరణము, నెచ్చెలి, ప్రభవము, ప్రళయము, ఆధారము, నిదానము నేనే.ఓ అర్జునా! నేనే వేడిమిని కలుగజేయునది.నేనే వర్షించు నది, నేనే నీరు లాగుకొనునది; అమృతము మృత్యువు, సత్తు అసత్తు నేనే.ప్రకృతియే కార్యము చేయును. కాని ఆప్రకృతి ఆత్మాధీనము. కావున ప్రకృతి కార్యము ఆత్మ కారోపించబడెను.జగత్తుయందు యేది దొడ్దదో ఆయా వస్తువులనే ఈశ్వరరూపముగా చింతించమని ఉపదేశించెను.
భగవానుని దివ్యగుణ వైభవాల గురించి విన్ తేజోరూపమును చూపమని ప్రార్థించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం గనుక కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. అది దివ్యమాల్యాంబర ధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ఇలా ప్రస్తుతించాడు.
"దేవదేవా! జగత్పతే! అనంతరూపా! సూర్యునివలె ప్రజ్వలించుచున్న నీ అనంత రూపము చూడ నాకు శక్యము గాకున్నది. నీవు దేవదేవుడవు, సనాతనుడవు. అనంత శక్తి సంపన్నుడవు. నీయందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు. దేవతు, మహర్షులు, పితరులు నిన్ను స్తుతిస్తున్నారు. ప్రభో! నీకు అనేక నమస్కారములు. మరల మరల నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము" అని ప్రార్థించాడు.
అర్జునుని కరుణించి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించడం తపస్సు వలన కాని, వేదాధ్యయనం వలన గాని అలవి కాదని చెప్పాడు. అనన్యమైన భక్తి వలన మాత్రమే ఆ దివ్యరూపాన్ని తెలుసుకోవడం సాధ్యమని తెలిపాడు.
11. విశ్వరూప సందర్శన యోగము - ఏకాదశాధ్యాయము
12.భక్తి యోగము - ద్వాదశాధ్యాయము
పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.
13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము - త్రయోదశాధ్యాయము
మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గూర్చి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే. అని, అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణపరమాత్ముడు తెలియజెప్పెను.
క్షేత్రమంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడుకొని యున్న శరీరము. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రంలో ఉండే జీవుడు. అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుడను నేనే అని, ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్యనున్న యథార్థ సంబంధం తెలిసికోవడం జ్ఞానమని కృష్ణుడు ఉపదేశించాడు. అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని లక్షణాలు - తనను తాను పొగడుకొనకపోవడం, గర్వం లేకపోవడం, అహింసాచరణ, ఋజుత్వము, గురు సేవా తత్పరత, శుచిత్వము, స్థిర బుద్ధి, ఆత్మ నిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండటం, ఇష్టానిష్ఠాల పట్ల సమభాఞం కలిగి ఉండడం, ఏకాంత ప్రియత్వం, తత్వ జ్ఞానం ధ్యేయాన్ని గ్రహించడం, భగవంతునియందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం వంటివి.
ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞాని తన ఆత్మ తత్వాన్ని తెలిసికొనలేక, క్షేత్రమే తాను అని భ్రమించిసంసార బంధాలకు లోనౌతాడు. అనేక జన్మలనెత్తుతాడు. యథార్థంగా శరీరానికి భిన్నంగా, సాక్షీభూతంగా, ప్రభువుగా, భరించువానిగా భగవానుడున్నాడు.
14.గుణత్రయవిభాగ యోగము - చతుర్థశాధ్యాయము
ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.
సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది. సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.
దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు.
15.పురుషోత్తమప్రాప్తి యోగము - పంచదశాధ్యాయము
త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు.
పురుషోత్తమ ప్రాప్తి యోగమును ఆధ్యాయముయందలి 16వ శ్లోకము
శ్లో❘❘ ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ ❘
క్షరస్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్చతే ❘❘
ఇక్కడ క్షరుడు అనగా త్రిగుణాల సృష్టి అయిన నాశనమొందు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు, ఆక్షరుడు అనగా క్షేత్రజ్ఞుడు, పురుషోత్తముడు అనగా పరమాత్మ. ఈ జ్ఞానం సృష్టి ఆది యందు దేవదేవునిచే సూర్యునికి చెప్పబడింది. తిరిగి మరల ఆ జ్ఞానమే దేవుని మానవరూపము అయిన భగవంతుడు శ్రీకృష్ణపరమాత్మ చే ద్వాపరయుగములో పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత రూపములో శ్రీ అర్జనుని కారణంగా చేసుకుని మరల ఈ లోకానికి చెప్పబడింది.
16.దైవాసురసంపద్విభాగ యోగము - షోడశాధ్యాయము
అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను.
మానవులు మనుష్యులుగా, మానవత్వముతో జీవనం సాగించుటకు ఏ లక్షణములను అలవరచుకోవాలి, ఏ లక్షణములకు దూరముగా వుండాలి అనే విషయములను తెలుసుకొనుటకు ఈ అధ్యాయము ఎంతగానో ఉపయోగపడుతుంది. దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి అలాగే అసురీ భావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయములో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియ చేసారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది.
దైవీ సంపద కలిగిన వారి లక్షణములు ఈ విధముగా వుంటాయి---------------
భయము లేకుండుట అంతః కరణమందు నిర్మలత్వము, తత్వ జ్ఞానార్ధమై ధ్యానమందు నిరంతర దృఢ స్థితి, సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ, గురుపూజనము, అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రములు చదువుట, చదివించుట, భగవంతుని గుణ నామ కీర్తనము, స్వధర్మ పాలనయందు కష్టముల యందు ఓర్పు, సరిరమున, అంతః కరణమున, ఇంద్రియములయందు సరళత్వము, మనోవాక్కాయముల నెవ్వరిని బాధింపకుండుట, సరళ సత్య భాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండుట కర్మల యందు కర్తృత్వ అభిమానము లేకుండుట, ఎవరినీ నిందింపకుండుట, సకల ప్రాణుల యందు నిర్హేతుకమైన దయ కలిగి యుండుట, ఇంద్రియ విషయ సంయోగము కలిగినను దానియందు ఆసక్తి లేకయుండుట, కొమలత్వము, లోకవిరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ యందు లజ్జ కలిగి యుండుట వ్యర్ధమైన కర్మలు చేయకుండుట. తేజము, క్షమా, ధైర్యము, బాహ్య శుద్ధి, ఎవరి యందును శత్రు భావము లేకుండుట తన యందు పూజ్యత అభిమానము లేకుండుట అనునవన్నియు ఓ అర్జునా! దైవీ సంపద కలిగిన వారి లక్షణములు.
ఓ అర్జునా! దంభము, దర్పము, దురభిమానము, క్రోధము, పౌరుషము, అజ్ఞానము మోసలగునవి అసురీ సంపదతో పుట్టిన వారి లక్షణములు.
17.శ్రద్దాత్రయవిభాగ యోగము- సప్తదశాధ్యాయము
వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞానుల, దానాలు చేస్తారు?
18.మోక్షసన్యాస యోగము - అష్టదశాధ్యాయము
కనుక అన్ని సంశయములను పరిత్యజించి, తనయందే మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహవిరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు..
భారతీయ షెడ్యూల్డ్ భాషలలో భగవద్గీత అనువాదాలు
1.సంస్కృతం 2.హిందీ 3.బెంగాలీ 4.అస్సామీ 5.మరాఠీ 6.కన్నడ 7.తెలుగు 8.గుజరాతీ 9.ఒరియా 10.తమిళం 11.ఉర్దూ భాషల్లో భగవద్గీత అనువదాలు ప్రచురించబడ్డాయి.మిగతా 11 షెడ్యూల్డ్ భాషలలో అనువాదాలు ప్రచురించబడాలి.
భగవద్గీత గురించి భాష్యాలు, రచనలు
సంస్కృతంలో
తెలుగులో
ఆంగ్లంలో
ఇతర భాషలలో
మరికొన్ని విశేషాలు
గీత గురించిన అభిప్రాయాలు
భగవద్గీత నుండి మార్గదర్శకత్వము పొందినవరిలో ఎందరో యోగులు, తాత్త్వికులు ఉన్నారు. వారిలో శ్రీ చైతన్య మహాప్రభు ఒకరు. ఈయన "హరే కృష్ణ" మంత్రోపాసకులు. మహాత్మ గాంధి తన అహింస సిద్ధాంతానికి గీత నుండే స్ఫూర్తిని పొందారు. గాంధీ మహాభారత యుద్ధాన్ని నిత్య జీవితంలో జరిగే సంఘర్షణలన్నిటికి వేదిక వంటిదని వర్ణించారు. అంతిమంగా గీత సారము ఆయనకు బ్రిటిష్ వారి వలస పాలనను ఎదిరించడానికి ఒక ఆయుధము వంటి స్ఫూర్తిని ఇచ్చింది.
అమెరికా అణు శాస్త్రవేత్త, అణుబాంబు సృష్టించిన 'మాన్ హాటన్ ప్రాజెక్ట్' నిర్దేశకుడైన 'రాబర్ట్ ఒపెన్హీమర్' 1945లో మొదటి అణ్వాయుధ ప్రయోగాన్ని చూసినపుడు ఆ ప్రభావాన్ని వర్ణించడానికి గీతలోని విశ్వరూప ఘట్టాన్నుండి (11-32) ఉదహరించాడని అంటారు .
శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులలో అగ్రగణ్యుడైన స్వామి వివేకానంద గీతలోని భక్తి, జ్ఞాన, కర్మ రాజ యోగాలకు ఎంతో విపులంగా నూతన భాష్యాన్ని వ్రాశారు. యోగులు కాదలచిన వారు గీతలోని ప్రతి అధ్యాయాన్ని వివరంగా చదవమని స్వామి శివానంద బోధించారు. ఒక యోగి ఆత్మ కథ రచయిత అయిన పరమహంస యోగానంద, గీతను ప్రపంచములోని అత్యుత్తమ పవిత్ర గ్రంథముగా పేర్కొన్నారు.
భగవద్గీత కాలం
భగవద్గీత ఎప్పుడు వ్రాయబడినదో పూర్తిగా నిర్ధారణ కాలేదు, లేదా నిరూపింపబడలేదు. మహాభారత ఇతిహాసమునందలై వివిధ ఖగోళ ఆధారల అనుసరించి, మహాభారత కాలాన్ని క్రీస్తు పూర్వం 3137 గా చెప్పబడుతున్నాయి. ఈ తారీఖులు హిందువుల విశ్వాసమైన కలియుగారంభమై 5000 సంవత్సరాలు అయినాయి అనేదానికి అనుకూలంగానే ఉన్నాయి. పురాణాలను అనుసరించి మాత్రం క్రీస్తుపూర్వం 2500 గా చెప్పబడుతున్నాయి. పాశ్చాత్య విద్వాంసులు మాత్రం ఈ తారీఖులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలుగా చెప్పుచున్నారు.
గీతా శ్లోక సంఖ్య
భగవద్గీతలోని శ్లోకాల సంఖ్య గురించి చాలా పరిశోధన జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది.
మహాభారతంలో భీష్మ పర్వం 43వ అధ్యాయం, 4వ శ్లోకం ఇలా ఉంది:
షట్శతాని సవింశాని శ్లోకానాం ప్రాహకేశవః
అర్జునః సప్తపంచాశత్ సప్తషష్టించ సంజయః
ధృతరాష్ట్రః శ్లోకమేకం గీతాయా మానముచ్యతే
దీన్నిబట్టి కృష్ణుడు 620 శ్లోకాలు, అర్జునుడు 57 శ్లోకాలు, సంజయుడు 67 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 745 శ్లోకాలు. కానీ, వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతిని బట్టి కృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 700. మరి కొన్ని ప్రతులలో 13వ అధ్యాయం "క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం" మొదట్లో అర్జునుడు అడిగినట్లుగా "ప్రకృతిం పురుషం చైవ ..." అని ఒక ప్రశ్న ఉంది. అది కనుక కలుపుకుంటే మొత్తం 701 శ్లోకాలు అవుతాయి.
ఇవి కాకుండా రాజస్థాన్లోని కథియవాడ్లో భోజ (భూర్జర) పత్రాలపై రాసిన భగవద్గీత పాఠాంతరం ఒకటి బయటపడిందనీ, దానిలో ఏకంగా 755 శ్లోకాలు ఉన్నాయనీ, తమ 'గీతా మకరందం' (1963) రెండవ ముద్రణలో (చూడు పే. 13, 1964) విద్యాప్రకాశానందగిరి వారు (శుకబ్రహ్మాశ్రమము, కాళహస్తి) రాశారు. కానీ, దీనిని గురించి మరిన్ని వివరాలు అందుబాటులో లేవు.
ఏది ఏమైనా, మహాభారత శ్లోకం ప్రక్షిప్తం కాదనుకుంటే మరొక 44/45 అమూల్యమైన శ్లోకాలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పచ్చు.
ఘంటసాల భగవద్గీత
భగవద్గీత. మహాభారతము సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలిచెను. యుద్ధ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మితృలను చూచి, హృదయము ద్రవించి,
స్వజనమును చంపుటకు ఇష్టపడక "నాకు విజయమూ వలదు, రాజ్య సుఖమూ వలదు" అని ధనుర్బాణములను క్రింద వైచె. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ:
దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు, అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు, శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు.
జీవునకు దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము యెట్లో మరొక దేహమును పొందుటకు కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు.
మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించునో అట్లే ఆత్మ (జీవాత్మ) జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది. (2.22)
ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు అర్పివేయును సమర్ధము కాదు. ఆత్మ నాశనము లేనిది. (2.23)
పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. (2.27)
యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా! యుద్ధమును చేయు కృతనిశ్చయుడవై లెమ్ము. (2.37)
కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. (2.47)
దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడును, రాగము, భయము, క్రోధము పోయిన వాడును, స్థితప్రజ్ఞుడని చెప్పబడును. (2.56)
విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాని యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. (2.62) క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. (2.63)
ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు.
అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసుకలు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను, ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది.
అన్నము వలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగును.
పార్దా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమును బట్టి, యెవడు అనుసరింపడో, వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్ధుడు, జ్ఞానీ కానివాడు సదా కర్మల నాచరించుచునే ఉండవలెను.
ఉత్తములైన వారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును.
అర్జునా! నీ వొనర్చు సమస్త కర్మలనూ నా యందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్ధము చేయుము.
చక్కగా అనుస్టింపబడిన పరధర్మము కన్న, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది.
పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామముచేత జ్ఞానము కప్పబడి యున్నది.
ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొఱకు ప్రతీయుగమునా అవతారము దాల్చుచున్నాను.
అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. (4:10)
ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియకోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కానీ, ఏ ఒక్కనియందు అనురాగాముకాని, ద్వేషముగాని లేవు. (4:11)
ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితులని విద్వాంసులని పల్కుదురు. (4:19)
యగ్నపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము గూడ బ్రహ్మమనియే తలంచవలయును. (4:24)
శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. (4:39)
కర్మ, సన్యాసములు రెండునూ మోక్షసోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగము కన్నా, కర్మానుష్టానమే శ్రేష్ఠమైనది. (5:2)
ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పనముగా కర్మల నాచరించునో, అతడు తామరాకుకు నీటిబిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు. (5:10)
ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును. (5:16)
విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందును శునకము శునక మాంసము వొండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి వుందురు. (5:18)
దేహత్యాగమునకు ముందు యెవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో, అట్టివాడు యోగి అనబడును. (5:23)
ఎవడు ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంబిమపజేసి, మనస్సును, బుద్ధిని, స్వాధీన మొనర్చుకొని, మోక్షాసక్తుడై యుండునో అట్టివాడే ముక్తుడనబడును. (5:28)
సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగను, సకల ప్రపంచ నియామకునిగను, నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. (5:29)
అర్జునా! సన్యాసమని దేనినందురో, దానినే కర్మయోగ మనియు అంటారు. అట్టి యెడ సంకల్పత్యాగమొనర్పనివాడు యోగికాజాలడు. (6:2)
యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మసంయమ యోగము లభ్యము. (6:17)
గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. (6:19)
సకలభూతములయందూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములు తనయందును, తనను అన్ని భూతములయందును చూచుచుండును. (6:29)
అర్జునా! ఎట్టివానికైనను, మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాసవైరాగ్యములచేత నిరోధింపవచ్చును. (6:35)
అర్జునా! పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి, భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. (6:47)
వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ది కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోన గలుగుచున్నాడు. (7:౩)
భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి యెనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము.
అర్జునా! నా కన్నా గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని, మరేదియును ఈ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉంది. (7:7)
భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, యెళ్ళ భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము. (7:9)
పార్దా! త్రిగునాత్మకము, దైవసంబందమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము. (7:14)
ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నాశ్రయించుచున్నారు. (7:16)
జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను శరణమునొందుచున్నాడు. (7:19)
ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు. (8:5)
అర్జునా! ఎవడు అభ్యాసయోగముతో, ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణపురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువుకన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారమున కన్నా ఇతరుడు. (8:8,9)
ఇంద్రియగోచరము కాని పరబ్రహ్మపదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము. (8:21)
జగత్తునందు శుక్ల, కృష్ణములనెడి రెండు మార్గములు నిత్యములుగా నున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మ రాహిత్యము, రెండవదాని వలన పునర్జన్మము కలుగుచున్నవి. (8:26)
యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యగ్నతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు. (8:28)
పార్దా! ప్రళయకాలమునందు సకల ప్రాణులును, నాయందు లీనమగుచున్నవి, మరల కల్పాదియందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను. (9:7)
ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించుచుండునో, అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. (9:22)
ఎవడు భక్తితో నాకు పత్రమైనాను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో, అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. (9:26)
పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు. (9:34)
కశ్యాపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారివలన ఎల్లలోకమందలి సమస్త భూతములు జన్మించును. (10:6)
పండితులు నాయందు చిత్తముగలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందము ననుభవించుచున్నారు. (10:9)
సమస్తభూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు నాశములకు నేనే కారకుడను. (10:20)
వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే. (10:22)
రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. (10:౩౦)
లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవములు.
పార్దా! దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార దర్శింపుము. (11:5)
ప్రభో కృష్ణా! దేవా! ఎల్లదేవతలు, ఎల్లప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ మొదలగుగాగల యెల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యుయు నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై, ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నా యందు దయముంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణా! ప్రసన్నుడవు కమ్ము. (11:15,16,20)
అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్దపడినవారిని నీవు చంపకున్నను బ్రతుకగల వారిందెవ్వరును లేరు. (11:32)
ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాది యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. (11:34)
అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి, కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింప గోరుచున్నాను కృష్ణా... (11:46)
అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు. (11:52)
ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు. (12:2)
అభ్యాసయోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి, మోక్షప్రాప్తి సంభవించుచున్నది. (12:12)
ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాతరహితుడై, భయమును వీడి, కర్మఫలత్యాగియై నాకు భక్తుడగునో, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. (12:16)
శత్రుమిత్రులయందును, మానావమానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ధి కలిగి సంగరహితుడై, నిత్యసంతుస్టుడై, చలించని మనస్సు గలవాడై, నా యందు భక్తిప్రవత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.
అర్జునా! దేహము క్షేత్రమనియు, దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. (13:1)
ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు, వానికి ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును. (13:11)
ప్రకృతిని ‘మాయ’ యని యందురు. అది శరీర సుఖదుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు, ఆ సుఖదుఃఖాదులను అనుభవించుచుండెను. (13:20)
శరీరము నశించినను, తాను నశింపక, ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో, వాడే యెరిగినవాడు. (13:27)
అర్జునా! గుణనాశరహితుడైనవాడు పరమాత్మ, అట్టి పరమాత్మ దేహాంతర్గుడయ్యెను. కర్మలనాచారించువాడు కాడు. (13:31)
పార్దా! సుర్యుడోక్కడే యెల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింప జేయుచున్నాడో, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు యెళ్ళ దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. (13:౩౩)
జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీస్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. (14:1)
అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను (పరమాత్మ) తండ్రి వంటివాడను.
అర్జునా! త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటంజేసి, సుఖ జ్ఞానాభిలాషల చేత, ఆత్మను దేహమునందు బంధించు చున్నది. (14:6)
ఓ కౌంతేయా! రజో గుణము కోరికలయందు అభిమానము, అనురాగము పుట్టించి, ఆత్మను బంధించుచున్నది.
అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులను మొహింపజేయునది. ఆ గుణం, మనుజుని ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్ధునిజేయును.
మానావమనములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు.
బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వర్థవృక్షము అనాది అయినది. అట్టి సంసారవృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టిదాని నెరింగినవాడే వేదార్ధసార మెరింగినవాడు.
పునరావృత్తి రహితమైన మోక్షపధము, సుర్యచంద్రాదుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది.
దేహులందు జఠరాగ్నిస్వరూపుడనై, వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను.
పార్దా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకుండుట మొదలుగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠీనపు మాటలాడుట, అవివేకము, మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును.
కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశమును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను.
శాస్త్రవిషయముల ననుసరింపక యిచ్చామార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్దులను పొందజాలడు. పరమపదమునందజాలడు.
జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మవాసనాబలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి.
సత్వగుణులు దేవతలను, రాజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు.
ఇతరుల మనస్సుల నొప్పింపనిదియు, ప్రియము, హితములతో కూడిన సత్యభాషనము, వేదాద్యన మొనర్చుట, వాచకతపస్సని చెప్పబడును.
జ్యోతిష్టోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమనియు, కర్మఫలము, ఈశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు.
కర్మములు ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని మూడు విధములు. కర్మఫలము కోరినవారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నాడు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు.
అర్జునా! కర్మమోక్షమార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల, ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భనమని ఎరుగుము.
ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయ ముందన్నవాడై, అంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు.
సమస్త కర్మల నాకర్పించి, నన్నే శరణుబొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము.
ఎవడు పరమోత్క్రష్టమైనదియు, పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకుపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమున కర్హుడు.
ధనంజయా! పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా?
కృష్ణా! అచ్యుతా! నా అవివేకము నీ దయవలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించింది. నాకు సందేహములన్నియు తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను.
యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్దారియగు అర్జునుడు, ఎచట నుందురో, అచ్చట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి యుండును.గీతాశాస్త్రమును ఎవరు పటింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు.
ఇవి కూడా చూడండి
మహాభారతము
గీతా జయంతి
హిందూ మతము
కురుక్షేత్ర సంగ్రామం
శ్రీ కృష్ణుడు
భగవద్గీత యథాతథము
విద్యార్థులకు పాఠ్యాంశంగా భగవద్గీత
వికీసోర్స్లో ఉన్న భగవద్గీత పాఠానికి అధ్యాయాల ప్రకారం లింకులు
అర్జునవిషాద యోగః -- (సంస్కృతము) (తెలుగు)
సాంఖ్య యోగః -- (సంస్కృతము) (తెలుగు)
కర్మ యోగః -- (సంస్కృతము ) (తెలుగు)
జ్ఞాన యోగః -- (సంస్కృతము ) (తెలుగు)
కర్మసన్యాస యోగ: -- (సంస్కృతము) (తెలుగు)
ఆత్మసంయమ యోగః -- (సంస్కృతము ) (తెలుగు)
జ్ఞానవిజ్ఞాన యోగః -- (సంస్కృతము) (తెలుగు)
అక్షరపరబ్రహ్మ యోగః -- (సంస్కృతము) (తెలుగు)
రాజవిద్యారాజగుహ్య యోగః -- (సంస్కృతము) (తెలుగు)
విభూతి యోగః -- (సంస్కృతము) (తెలుగు)
విశ్వరూప సందర్శన యోగః -- (సంస్కృతము) (తెలుగు)
భక్తి యోగః -- (సంస్కృతము) (తెలుగు)
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగః -- (సంస్కృతము) (తెలుగు)
గుణత్రయవిభాగ యోగః -- (సంస్కృతము) (తెలుగు)
పురుషోత్తమప్రాప్తి యోగః -- (సంస్కృతము) (తెలుగు)
దైవాసురసంపద్విభాగ యోగః -- (సంస్కృతము) (తెలుగు)
శ్రద్దాత్రయవిభాగ యోగః -- (సంస్కృతము) (తెలుగు)
మోక్షసన్యాస యోగః -- (సంస్కృతము) (తెలుగు)
మూలాలు
ఈ వ్యాసం రచనలో ఉపయుక్తమైన వనరులు
శ్రీమద్భగవద్గీత - తత్వవివేచనీ వ్యాఖ్య - రచన: జయదయాల్ గోయందకా - గీతాప్రెస్, గోరఖ్పూర్ ప్రచురణ (2002)
భగవద్గీత యథాతథము - రచన: ఏ.సి.భక్తివేదాంత ప్రభుపాద రచన - ప్రచురణ: భక్తివేదాంత బుక్ట్రస్ట్, హైదరాబాదు (2006)
శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహాభారతము - బొమ్మకంటి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, కొంపెల్ల వేంకటరామశాస్త్రి - ప్రచురణ: గొల్లపూడి వీరాస్వామి సన్స్, రాజమండ్రి (2001)
శ్రీమద్భగవద్గీతా పరిచయం - సంకలనం: బాలగంగాధర పట్నాయక్, దీపశిఖ, ఒడిషా - శ్రీ శాంతి ఆశ్రమం, తూర్పుగోదావరి జిల్లా - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
బయటి లింకులు
భగవద్గీత
https://web.archive.org/web/20161027062530/http://www.thraithashakam.org/publications/telugu/pdf/Thraitha-Siddhantha-Bhagavadgeetha.pdf
భగవద్గీత మొదటి భాగము
భగవద్గీత తెలుగు pdf and mp3 download for free
(తెలుగు) -> శ్రీ దయానంద పొన్నాల రాజయోగి, శ్రీమద్రామడుగు శివరామదీక్షిత అచల గురుపీఠ రాజయోగ ఆశ్రమము, సికింద్రాబాదు.
భగవద్గీత రెండవ భాగము -> (తెలుగు) -> శ్రీ దయానంద పొన్నాల రాజయోగి, శ్రీమద్రామడుగు శివరామదీక్షిత అచల గురుపీఠ రాజయోగ ఆశ్రమము, సికింద్రాబాదు.
బహు భాషలలో భగవద్గీత -- ప్రముఖ సమకాలిక వ్యాఖ్యానాలతో
సంస్కృతము --> ఇంగ్లీషు-- స్వామీ భక్తివేదాంత ప్రభుపాద (ఇస్కాన్/హరేరామ హరేకృష్ణ) ప్రతిపదార్థ, తాత్పర్య, వ్యాఖ్యానాల సహితము (ఇంగ్లీషు)
కృష్ణ.కామ్ నుండి భగవద్గీత (ఇంగ్లీషు)
శ్రీమద్ జగన్నాథ్ దాస్ గారి వ్యాఖ్యానము (ఇంగ్లీషు)
భగవద్గీత లో ప్రేమ తత్త్వము, ఏకనాథ్ ఈశ్వరన్ గారి వ్యాఖ్యానము (ఇంగ్లీషు)
స్వామీ చిన్మయానంద అనువాదము వ్యాఖ్యానము (ఇంగ్లీషు)
సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ అనువాదము (ఇంగ్లీషు)
కాశీనాథ్ త్రయంబక్ తెలంగ్ అనువాదము (ఇంగ్లీషు)
మహాత్మాగాంధీ అనువాదము/వ్యాఖ్యానము (ఇంగ్లీషు)
''20080822191918/http://www.atmajyoti.org/gi_bhagavad_gita_intro.asp స్వామీ నిర్మలానందగిరి అనువాదము, పాడుకోవడానికి వీలుగా
డా. రామానంద్ ప్రసాద్ గారి అనువాదము
సేండర్సన్ బెక్ అనువాదము
స్వామీ తపస్యానంద అనువాదము
పరమహంస స్వామీ శివానంద సరస్వతి వ్యాఖ్యానము
విలియమ్ కాన్ జడ్జి అనువాదము
భక్తివేదాంత నారాయణ మహారాజ్ అనువాదము
వ్యాఖ్యానాలు
6 వ్యాఖ్యానాలు - ఆదిశంకర, రామనుజ, శ్రీధర స్వామి, మధుసూధన సరస్వతి, విశ్వనాథ చక్రవర్తి, బలదేవ విద్యాభూషణ (ఇంగ్లీషు లో వ్రాయబడిన సంస్కృత వ్యాఖ్యానాలు)
భక్తివేదాంత ప్రభుపాద గారి భగవద్గీత పరిచయ వ్యాఖ్యానము
స్వామీ నిర్మలానందగిరి వ్యాఖ్యానము
వ్లాదిమీర్ ఆంటనోవ్ వ్యాఖ్యానము
గోవింద లీలామృతము: శ్రీల భక్తివేదాంత నారాయణ మహారాజు
భగవద్గీత : దేవుని అర్జునుని సంభాషణలు
పరమహంస యోగానండ వ్యాఖ్యానము
శ్రీ అరబిందో వ్యాసములు
వినండి(ఆడియో)
Verses in Sanskrit, transliteration, Hare Krishna-influenced translations and accompanying chants in Realaudio
Recitation of verses in Sanskrit (MP3s)
Bhagavad Gita Sung in English, in streaming Realaudio
The Gita read in English. Streaming audio for each chapter. (Translation: A.C. Bhaktivedanta Swami Prabhupada)
Bhagavad Gita Online Classes by Swami Satyananda Saraswati
Bhagavad Gita in 6 Languages
Bhagavad Gita Lectures in English (MP3)
అవీ, ఇవీ
Vedantic commentary on the Gita
International Gita Society
Gita4free.com
Geeta Kavya Madhuri: Samples of metered translation into Hindi verse by Prof. Rajiv Krishna Saxena
An article in Hindi about the cycles of origin and destruction of universe as explained in Bhagavad-Gita
వర్గం:భగవద్గీత
వర్గం:పురాణాలు
వర్గం:హిందూమతం
వర్గం:ఈ వారం వ్యాసాలు |
బంగాళాదుంప | https://te.wikipedia.org/wiki/బంగాళాదుంప | దారిమార్పు బంగాళదుంప |
ధూర్జటి | https://te.wikipedia.org/wiki/ధూర్జటి | ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు.
ఇతనిని పెద్ద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు.
ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి పొత్తపి సీమ లోని, ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ్మ, రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు.
ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం, శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి, ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్రదేశములో ప్రచారములో ఉన్నాయి.
శ్రీ కాళహస్తీశ్వర శతకము నుండి
పుడమి న్నిన్నొక బిల్వ పత్త్రమున నేఁ బూజించి పుణ్యంబునుం
బడయన్; నేరక పెక్కు దైవంబులకుం బప్పుల్, ప్రసాదంబులుం,
గుడుముల్, దోసెలు, సారె సత్తు, లటుకుల్, గుగ్గిళ్ళునుం బెట్టుచుం
జెడి యెందుం గొఱగాక పోదు రకటా శ్రీ కాళహస్తీశ్వరా!
మును నేఁ బుట్టిన పుట్టులెన్ని గలవో ? మోహంబుచే నందుఁ జే
సిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో ? చింతించినంగాన నీ
జననంబేయని యున్న వాడ, నిదియే చాలింపవే నిన్నుఁ గొ
ల్చిన పుణ్యంబునకుం గృపారతుడవై శ్రీ కాళ హస్తీశ్వరా !
సంతోషించితిఁ జాలుఁ జాలు రతిరాజద్వార సౌఖ్యంబులన్
శాంతింబొందితిఁ జాలుఁ జాలు బహురాజద్వార సౌఖ్యంబులన్
శాంతింబొందెదఁ జూపు బ్రహ్మపదరాజద్వార సౌఖ్యంబు ని
శ్చింతన్ శాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తి మహాత్మ్యము నుండి
ప్రాఁతలు మీఁదఁ గప్పినఁ గృపామతి నోర్చితి, నీచు పొత్తునన్
బ్రాఁతిమెయిన్ మెసంగితివి, భక్తుఁడు కుంటెనఁ బంపఁబోతి, మై
పూఁత యొనర్చుకొంటి శవ భూతిఁ, గపాలమునన్ భుజించి, తీ
రోఁతలు పెక్కులుండ నివి రోయుదువే, యిఁక భక్తవత్సలా!"
ఓ సామీ ఇటువంటి కొండ దరిలో, నొంటింబులుల్, సింగముల్
గాసిం బెట్టెడు కుట్ర నట్టడవిలోఁ, గల్జువ్వి క్రీనీడ, నే
యాసం గట్టితి వేటిగడ్డ నిలు? నీవాఁకొన్నచోఁ గూడు నీ
ళ్ళే సుట్టంబులు దెచ్చి పెట్టెదరు? నీకిందేటికే లింగమా
రచనలు:
మూలాలు
వెలుపలి లంకెలు
వర్గం:తెలుగు కవులు
వర్గం:శతక కవులు
వర్గం:విజయనగర సామ్రాజ్య ప్రజలు |
అష్టదిగ్గజములు | https://te.wikipedia.org/wiki/అష్టదిగ్గజములు | thumb|అష్టదిగ్గజములు
అష్ట దిగ్గజాలు అంటే "ఎనిమిది దిక్కుల ఉండే ఏనుగులు" అని అర్థం. హిందూ పురాణాలలో ఎనిమిది దిక్కులనూ కాపలా కాస్తూ ఎనిమిది ఏనుగులు ఉంటాయని ప్రతి. ఇవే అష్టదిగ్గజాలు.
అదే విధంగా శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజాలు అని అంటారు.
పురాణాలలో అష్టదిగ్గజాలు
ఐరావతం
పుండరీకం
వామనం
కుముదం
అంజనం
పుష్పదంతం
సార్వభౌమం
సుప్రతీకం
కృష్ణదేవరాయలు ఆస్థానంలో
విజయ నగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని ఎనిమిది మంది కవులు అష్టదిగ్గజాలుగా తెలుగు సాహితీ సంప్రదాయంలో ప్రసిద్ధులయ్యారు. వీరికి కడప జిల్లాలోని తిప్పలూరు గ్రామాన్ని ఇచ్చినట్లు శాసనాధారాన్ని బట్టి తెలుస్తూంది.
సుప్రఖ్యాతమైన అష్టదిగ్గజాలు
అష్టదిగ్గజములు ఎవరెవరనే విషయమై చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ క్రింది వారు అయి ఉండవచ్చు అని ఒక భావన.
అల్లసాని పెద్దన
నంది తిమ్మన
ధూర్జటి
మాదయ్యగారి మల్లన లేక కందుకూరి రుద్రకవి
అయ్యలరాజు రామభధ్రుడు
పింగళి సూరన
రామరాజభూషణుడు (భట్టుమూర్తి)
తెనాలి రామకృష్ణుడు
తెలుగు సాహిత్య పాఠకుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన అష్టదిగ్గజాలుగా వీరికే ప్రఖ్యాతి ఉంది. ప్రజాబాహుళ్యంలో ప్రచారం పొందిన చాటువుల ప్రకారం పైనున్న వారే అష్టదిగ్గజ కవులు. వీరి మధ్య జరిగినాయన్న కథలూ, వాటికి సంబంధించిన పద్యాలు వంటివి ఎన్నో ఉన్నాయి. అష్టదిగ్గజాల గురించి తెలుగునాట ఎన్నోచోట్ల విస్తారంగా జరిగే సాహిత్యరూపకంలోనూ వీరి పాత్రలే వస్తూంటాయి. ఐతే పరిశోధకుల్లో వేరే పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.
అష్టదిగ్గజ కవుల గురించిన పరిశోధనలు
రాయలు సరస్వతీ పీఠాన్ని పరివేష్టించి ఎనమండుగురు కవులు కూర్చొనేవారని కథ ఉంది. కృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా మన్ననలందుకొన్న ఈ ఎనిమిదిమందీ నిజంగా తెలుగు కవులేనా, వారి పేర్లు పై జాబితాలోనివేనా అన్న విషయంపై సాహితీ చరిత్రకారులలో భిన్నభిప్రాయాలున్నాయి. పింగళి లక్ష్మీకాంతం ఈ విషయంపై ఇలా పరిశీలించారు .పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
కుమార ధూర్జటి వ్రాసిన కృష్ణరాయ విజయము అనే గ్రంథంలో
సరస సాహిత్య విస్ఫురణ మొనయ
సార మధురోక్తి మాదయగారి మల్ల
నార్యుడల యల్లసాని పెద్దనార్యవరుండు
ముక్కు తిమ్మన మొదలైన ముఖ్య కవులు అనే పద్యం ఉంది.
అష్టదిగ్గజాలలో ఐదుగురి పేర్లు నిశ్చయంగా చెప్పవచ్చును -
అల్లసాని పెద్దన : కృష్ణరాయలకు ఆప్తుడు. తన కృతిని రాయలకు అంకితమిచ్చాడు.
నంది తిమ్మన : తన కృతిని రాయలకు అంకితమిచ్చాడు. రాయల వంశముతో తిమ్మన వంశమునకు పూర్వమునుండి అనుబంధమున్నది. నంది మల్లయ, ఘంట సింగయలు తుళువ వంశమునకు ఆస్థాన కవులు.
అయ్యలరాజు రామభద్రుడు : ఇతని సకలకథాసార సంగ్రహమును రాయల యానతిపై ఆరంభించినట్లు, రాయల కాలంలో అది పూర్తికానట్లు పీఠికలో తెలుస్తున్నది. రామాభ్యుదయము మాత్రం రాయల అనంతరం వ్రాసి రాయల మేనల్లడు అళియ రామరాజుకు అంకితమిచ్చాడు.
ధూర్జటి : రాయల ఆస్థానంలో మన్ననలు అందుకొన్నాడు. ధూర్జటి తమ్ముని మనుమడు కుమార ధూర్జటి వ్రాసిన కృష్ణరాయ విజయంలో ఈ విషయం చెప్పబడింది. జనశృతి కూడా ఇందుకు అనుకూలంగానే ఉంది.
మాదయగారి మల్లన : ఇతడు అష్ట దిగ్గజాలలో ఒకడని చెప్పడానికి కూడా కుమార ధూర్జటి రచనయే ఆధారం. మల్లన తన గ్రంధాన్ని కొండవీటి దుర్గాధిపతి, తిమ్మరుసు అల్లుడు అయిన నాదెండ్ల అప్పామాత్యునకు అంకితమిచ్చాడు.
ఈ ఐదుగురు కాక తక్కిన మువ్వురి పేర్లు నిర్ణయించడానికి తగిన ఆధారాలు లేవు. ఊహలలో ఉన్న పేర్లు - (1) తాళ్ళపాక చిన్నన్న (2) పింగళి సూరన (3) తెనాలి రామకృష్ణుడు (4) కందుకూరి రుద్రయ్య (5) రామరాజ భూషణుడు (6) ఎడపాటి ఎఱ్ఱన (7) చింతలపూడి ఎల్లన. ఈ విషయం నిర్ణయించడానికి వాడదగిన ప్రమాణాలు ...
అతను రాయల సమకాలికుడయ్యుండాలి
రాయల ఆస్థానంలో ప్రవేశం కలిగి ఉండాలి
ఇలా చూస్తే తాళ్ళపాక చిన్నన్న (పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము వంటి గ్రంధముల రచయిత) బహుశా తాళ్ళపాక అన్నమయ్య కొడుకో, మనుమడో కావలెను. ఇతడు రాయల సమకాలికుడు కావచ్చును. అష్టదిగ్గజాలలో ఒకడైయుండే అవకాశం ఉంది. కందుకూరి రుద్రకవి రాయల సరస్వతీ మహలు ఈశాన్యంలో కూర్చొనేవాడని నానుడి. ఇతని నిరంకుశోపాఖ్యానము 1580లో వ్రాయబడినది అనగా ఈ కవి చిన్నతనములోనే రాయలు గతించియుండవలెను. ఆయన రాయల ఆస్థానంలో ప్రవేశించడానికి మంత్రులు, తాతాచార్యులు వంటివారెవరూ ఉపకరించకపోవడంతో రాయల క్షురకుడైన మంగలి కొండోజీ ద్వారా చేరారని, మంత్రుల కన్నా మంగలి కొండోజుయే గొప్పవాడని కీర్తిస్తూ పద్యం రాసినట్టు ప్రతీతి. ఈ మంగలి కొండోజు కృష్ణరాయల మరణానంతరం 1542-1565 వరకూ రాజ్యంచేసిన సదాశివరాయల కాలంలో ఆయనకూ, అసలైన అధికారం చేతిలో ఉన్న అళియ రామరాయలకు సన్నిహిత భృత్యుడు. బాడవి పట్టణ కాపురస్తుడైన మంగలి తిమ్మోజు కొండోజు గారు అంటూ ప్రస్తావిస్తూ చాలా దానశాసనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రుద్రకవి అతని సహకారంతోనే సదాశివరాయల కొలువులోకి వచ్చారనీ, రాయల మరణానంతరం కూడా ఆయన అష్టదిగ్గజాల్లో ప్రఖ్యాతులైన కొందరు కవులు ఉండేవారని వారితోనే ఈయనకు చాటువుల్లో చెప్పే సంగతి సందర్భాలు ఎదురై ఉండవచ్చని ప్రముఖ చరిత్రకారుడు దిగవల్లి వెంకట శివరావు పేర్కొన్నారు. చేరి కన్నడభూమి చెఱవట్టు పాశ్చాత్య/నృపతిపై నొక్కింత కృప తలిర్చు అన్న పద్యంలో రుద్రకవి విద్యానగర వినాశనాన్ని వర్ణించడమూ ఇందుకు బలమిచ్చింది. రామరాజభూషణుని వసుచరిత్ర తళ్ళికోట యుద్ధం తరువాత వ్రాయబడినట్లుగా అనిపిస్తుంది. కనుక ఇతని చిన్నవయసులోనే రాయల ఆస్థానంలో ఉండడం అనూహ్యం. పింగళి సూరన జననం రాయల మరణానికి 25 సంవత్సరాలముందు కావచ్చును కనుక అతడు కూడా అష్టదిగ్గజకవులలో ఉండే అవకాశం లేదు. అంతేగాక సూరన తండ్రికి రాయలు నిడమానూరు అగ్రహారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. తెనాలి రామకృష్ణకవి కాలం ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఉద్భటారాధ్య చరిత్ర బహుశా రాయల కాలంనాటి గ్రంథం. పాండురంగ మహాత్మ్యం రాయలు తరువాత వ్రాసినది.
ఈ పరిశీలనను ముగిస్తూ పింగళి లక్ష్మీకాంతం చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి - "రాయలు సరస్వతీ మహలులోని ఎనిమిదిమంది కవులు తెలుగువారే కానక్కరలేదు. రాజనీతిపరంగా వివిధ భాషలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండిఉండాలి. ఆయన తెనుగురాజు, ఆయన రాజ్యము తెనుగు రాజ్యము అయినందును ఆస్థానంలో ఐదు స్థానాలు తెలుగు కవులకు లభించాయి. అందరూ తెలుగువారేనని చరిత్రకారులెవరైనా వ్రాయదలచినచో చిక్కులు వచ్చును"
ఇవి కూడా చూడండి
తెలుగు సాహిత్యం - రాయల యుగము
ప్రబంధము
మూలాలు
వర్గం:ఏనుగులు |
భాగవతం - ఆరవ స్కంధము | https://te.wikipedia.org/wiki/భాగవతం_-_ఆరవ_స్కంధము | షష్ఠమ స్కందము అనగా ఆరవ స్కందము. ఈ స్కందాన్ని, 11, 12, స్కందాలను పోతన గారు రచింపలేదు, వారి శిష్యులైన సింగయగారు రచించారు. పరిశోధన రచనలలో ఎందుకు పోతన గారు ఈ స్కందాలు రచించలేదు అనేదానికి చాలా చాలా పరిశోధనలు చేసారు. ఈ క్రింది రెండు చాలా ముఖ్యమైన్ అబిప్రాయములు.
పోతన గారు ఈ నాలుగు స్కందములను తన శిష్యులకు వ్రాయమని ఇచ్చారు.
రాజు తనకు భాగవతమును అంకితము ఇవ్వలేదని నాశనము చేయ పూనితే ఈ నాలుగు స్కందాలు కాలిపొయినాయి.కనుక మరల వ్రాసినారు.
అంతాబాగానే ఉంది, కానీ పోతనగారు ఈ భాగవతాన్ని రెండు కట్టలుగా కట్టి చక్కగా భద్రపరిచారు. కానీ రెండు కట్టలలోనూ అడుగున ఉన్న రెండు స్కందాలు చెదలు చేత నాశనము అయినాయి. అందుకనే వాటిని వారి శిష్యులు తిరిగి వ్రాసినారు.
ఇహ ఈ ఆరవ స్కందములోని వివరములు
అజామిళోపాఖ్యానము
అజమిళుడు ఒక బ్రాహ్మణుడు. ఇతను చక్కగానే ఉండేవాడు, కానీ ఒక రోజు అడవిలో ఒక వేశ్య, కిరాతుల పూర్తి శృంగార క్రీడలు చూసి ఒక వేశ్య దగ్గరకు వెళ్ళి భార్యా, తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేస్తాడు, కానీ అతనికీ వేశ్యకు పుట్టిన కుమారునికి నారాయణుడు అని పేరు పెట్టుకుంటాడు.
ఇతను మృత్యుముఖంలో కుమారున్ని పిలుస్తు నారాయణా, నారాయణా అని అంటాడు, అప్పుడు అతనిని రక్షించడానికి స్వయంగా విష్ణుదూతలే వచ్చి యమదూతలతో వాదించి అజామిళునికి చక్కని బోధనలు చేస్తారు.
ఇందులోని ఇతర భాగాలు
దక్షుని హంసగుహ్యం అను స్తవరాజము
నారదుడు శబళాశ్వులకు ఉపదేశములు చేయుట
దక్షుని నారదుని శాపవృత్తాంతము
దేవాసుర యుద్ధము
శ్రీమన్నారాయన కవచము
వృతాసుర వృత్తాంతము
చిత్రకేతూపాఖ్యానము
సవితృ వంశ ప్రవచనాది కథ
వర్గం:హిందూమతం |
యుగాలు | https://te.wikipedia.org/wiki/యుగాలు | దారిమార్పు చతుర్యుగాలు
వేదాల ననుసరించి యుగాలు నాలుగు,
సత్యయుగము లేదా కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.
త్రేతాయుగము - 12,96,00 సంవత్సరాలు.
ద్వాపరయుగము - 8,64,000 సంవత్సరాలు.
కలియుగము - 4,32,000 సంవత్సరాలు. (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది).
యుగాదులు
కృత యుగాది - కార్తీక శుక్ల నవమి
త్రేతా యుగాది - వైశాఖ శుక్ల తృతీయ
ద్వాపర యుగాది - మాఘ బహుళ అమావాస్య
కలి యుగాది - బాధ్రపద బహుళ త్రయోదశి
బయటి లింకులు
హిందూ కాలమానము |
భక్తి యోగము | https://te.wikipedia.org/wiki/భక్తి_యోగము | భక్తి యొగమును గురించి భగవద్ గీతలో చక్కగ వివరించబడింది.
భక్తి యోగము
పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.
thumb|శివాలయంలో శివునికి అర్చన చేస్తున్న భక్తులు
నారద భక్తి సూత్రాలు
తొమ్మిది రకాల భక్తిని నారద మహర్షి భక్తి సూత్రాలలో వివరించారు. వీటినే నవవిధభక్తులు అని పిలుస్తారు.
శ్రవణము
గానము
స్మరణము
పాద సేవనము
అర్చనము
వందనము
దాస్యము
సఖ్యము
ఆత్మ నివేదనము
శైవాచార్యులు
వైష్ణవాచార్యులు
ఆళ్వారులు
గోదాదేవి
రామానుజాచార్యులు
మధ్వాచార్యులు
నింబార్క స్వామి
వల్లభాచార్యులు
రాఘవేంద్రస్వామి
చైతన్య ప్రభువు
ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద
వర్గం:హిందూమతం |
ఆళ్వారులు | https://te.wikipedia.org/wiki/ఆళ్వారులు | ఆళ్వారులు లేదా అళ్వార్లు (; ) శ్రీవైష్ణవ సంప్రాదాయంలోనూ, తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగిన విష్ణు భక్తులు. తమ పాశురాలతో విష్ణువును కీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపజేశారు. వీరు పాడిన (రచించిన) పాశురాలు అన్నీ (నాలుగు వేలు) కలిపి దివ్య ప్రబంధం లేదా నాలాయిరం లేదా ద్రవిడ వేదం అనబడుతాయి. భక్తి, పారవశ్యము, శరణాగతి - ఇవి ఈ అళ్వారుల జీవితంలోనూ, రచనలలోనూ, వారిని గురించిన గాథలలోనూ ప్రముఖంగా కానవచ్చే అంశాలు. ఆళ్వారులు అందించిన సాంస్కృతిక వారసత్వం వలన వైదిక కర్మలతోనూ, సంస్కృతభాషా సాహిత్యాలతోనూ ప్రగాఢంగా పెన వేసుకొని పోయిన హిందూ మతాచారాలు దక్షిణాదిన కొంత స్వతంత్రతను సంతరించుకొన్నాయి. కుల వ్యవస్థను తోసిపుచ్చడం కూడా ఆళ్వారుల జీవితంలోనూ, శ్రీవైష్ణవ సిద్ధాంతాలలోనూ ముఖ్యమైన అంశాలు. ఆళ్వారుల ఔన్నత్యాన్ని గురించి ఎన్నో అలౌకికమైన ఘటనలు, మహత్తులు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఆళ్వారులు అందరూ దైవాంశ సంభూతులనీ, సామాన్య జనానీకానికి భక్తిని ప్రబోధించి శ్రీమన్నారాయణుని పదపద్మాలను చేరుకొనే మార్గాన్ని ఉపదేశించిన మహనీయులనీ ప్రధానమైన విశ్వాసం.శైవభక్తుల చరిత్రనుగూర్చి పెరియ పురాణము అను గ్రంథముతెలుపునట్లే వైష్ణవాచార్యుల చరిత్రను తెలిపేది గురుపరంపర అనుగ్రంథము. అందు వీరిని గూర్చి అనేకమైన అద్భుత కథలు ఉన్నాయి.
thumb|right|400px|పన్నిద్దరు ఆళ్వారుల శిల్ప మూర్తులు
ఆళ్వారులు అంటే
ఆళ్వారులు అంటే 'దైవ భక్తి లోమునిగి ఉన్నవారు' అని అర్థం. వారు శ్రీమన్నారాయణుని ఆరాధనా సంకీర్తనాదులలో పరవశించి ఉన్నందున వారికి ఆళ్వారులు అన్న పేరు వచ్చింది.
ఆళ్వారులు అనగా జ్ఞానఖని అని మరియొక అర్ధము.
మరొక వివరణ ఇలా ఉన్నది - " భగవద్గుణానుభవము నిరర్గళముగా స్వర్గ గంగవలె వీరి వాక్కులనుండి ద్రవిడ భాషా రూపమున వెలువడినందున వీరికి ఆళ్వారులు అను పేరు కలిగినది. ఆళ్వారు అనిన 'కాపాడువారు' అని వ్యుత్పత్తి. తమ కవితలతో వీరు మనలను కాపాడుటకే అవతరించినారు. భగవదనుభవ పరీవాహ రూపమయిన భక్తిసాగరమున మునకలు వైచి యందలి లోతులను కనుగొన్నవారని కూడ ఈ మాటకు అర్ధము చెప్పవచ్చును. తమపై నమ్మకము కలిగిన బద్ధ జీవులను తమతోబాటు భక్తిరసామృత సింధువున ముంచి యుక్కిరిబిక్కిరి చేసి బ్రహ్మానందమున తేల్చుట కూడ వీరికి వెన్నతో బెట్టిన విద్య".
పన్నిద్దరు ఆళ్వారులు
కృష్ణ దేవరాయలు తన ఆముక్తమాల్యదలో ఆళ్వారులను ప్రస్తుతించే ప్రసిద్ధ పద్యం:
అల పన్నిద్దరు సూరులందును సముద్యల్లీలగావున్న బె
గ్గలికం దానము బావ నా నిజ మన:కంజాత సంజాత పు
ష్కల మాధ్వీక ఝురిన్ మురారి పొగియంగా జొక్కి ధన్యాత్ములౌ
నిల పన్నిద్దరు సూరులం దలతు మోక్షేచ్ఛామతిం దివ్యులన్"
ద్వాదశాదిత్యులు - అనగా పన్నెండు మంది సూర్యులు. వారి వేడిమి తీవ్రత దుర్భరమైనది. ఆ తాప తీవ్రత తగ్గించి మానవుల హృదయాల్లోని అఙ్ఞానాంధకారం దూరం చేసి ఙ్ఞాన దీపం వెలిగించడానికే భూమి మీద ఈ ద్వాదశ దినసూర్యు లవతరించారు. వారికి ప్రణామములు.
ఆళ్వారుల నందరికీ వారి సంస్కృత నామాలు చెప్పి సంగ్రహంగా నమస్కరించే శ్లోకమిది:
భూతం సరస్చ మహదాహ్వాయ భట్టనాథ
శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్;
భక్తాంఘ్రీ రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్"
ఈ శ్లోకంలో 11 ఆళ్వారుల పేర్లున్నాయి - వారు (1) పొయ్గై యాళ్వార్ (2) పూదత్తాళ్వార్ (3) పేయాళ్వార్ (4) పెరియాళ్వార్ (5) తిరుమళిశై యాళ్వార్ (6) కులశేఖరాళ్వార్ (7) తిరుప్పాణాళ్వార్ (8) తొండరడిప్పొడి యాళ్వార్ (9) తిరుమంగై యాళ్వార్ (10) ఉడయవర్ (11) నమ్మాళ్వార్.
ఉడయవర్ (రామానుజాచార్యులు) ను ఈ జాబితాలోంచి తొలగించి పదుగురు ఆళ్వారులు అనికూడా అంటారు.
ఉడయవర్ బదులు మధుర కవి, గోదాదేవి పేర్లు కూడా జోడించి మొత్తం పన్నిద్దరు ఆళ్వార్లని చెబుతారు. ('శ్రీ', 'భక్తిసార' అనే పదాలను విడదీసి 'శ్రీ' అనగా అండాళ్ అని కూడా వివరించడం జరుగుతుంది.
ఒకోమారు మధుర కవిని కలుపకుండా అండాళ్ను మాత్రమే జాబితాకు జోడించి పన్నిద్దరు ఆళ్వారులని లెక్క కట్టడం కూడా కద్దు.
అతి సాధారణంగా చెప్పబడే పన్నిద్దరు ఆళ్వారులు, వారి సంస్కృత నామములు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
పొయ్గయాళ్వార్ - మరొక పేరు సరోయోగి
పూదత్తాళ్వార్ - మరొక పేరు భూతయోగి
పేయాళ్వార్ - మరొక పేరు మహాయోగి
పెరియాళ్వార్ - మరొక పేరు భట్టనాథులు
తిరుమళిశై యాళ్వార్ - మరొక పేరు భక్తిసారులు
కులశేఖరాళ్వార్ - మరొక పేరు కులశేఖరుడు
తిరుప్పాణ్ఆళ్వార్ - మరొక పేరు మునివాహనులు
తొండరడిప్పొడి యాళ్వార్ - మరొక పేరు భక్తాంఘ్రి రేణువు
తిరుమంగయాళ్వార్ - మరొక పేరు పరకాలయోగి
ఆళ్వారుక్కు అదియాన్ - మరొక పేరు మధురకవి (శ్రీవైష్ణవ సంప్రదాయానికి ప్రవర్తకులైన 'ఉడయవర్', 'ఎమ్బెరుమనార్' అనే నామాంతరాలుగల భగవద్రామానుజాచార్యుల వారిని కొంతమంది మధురకవికి మారుగా చేరుస్తారు ఈ పన్నిద్దరిలో.)
ఆండాళ్ - మరొక పేరు గోదాదేవి
నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని
ఆళ్వారుల కాలం గురించి నిర్దిష్టమైన ఆధారాలు లేవు. వీరు ద్వాపర యుగాంతంనుండి కలియుగారంభం మధ్య ఉద్భవించారని సంప్రదాయ గాథలు. కాని శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలం సా.శ. 7వ శతాబ్దం - 9వ శతాబ్దం మధ్యకాలమని అభిప్రాయపడుతున్నారు.
ఆళ్వారుల అవతరణకు సంబంధించిన పురాణ గాథ
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయంలో విశ్వకర్మకూ, అగస్త్యునకూ జరిగిన వాగ్వివాదం వలన అగస్త్యుడు సృష్టించిన ద్రవిడభాష నిరసనకు గురై నిరాదరింపబడింది. ఆ భాషకు తగిన గౌరవాన్ని పునస్సంతరించడానికీ, అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న జీవులకు మోక్షమార్గం ఉపదేశించడానికీ దక్షిణ దేశంలో అవతరించమని శ్రీమన్నారాయణుడుతన దేవేరులకు, ఆయుధాలకు, పరివారానికి, చిహ్నాలకూ ఆదేశించాడు. అందుకు అనుగుణంగా భూదేవి గోదాదేవిగానూ, ఇతరులు వేరు వేరు ఆళ్వారులుగానూ అవతరించిరి. విష్ణువే శ్రీదేవీ సమేతుడై శ్రీరంగము, కంచి, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో అవతరించి వారి సేవలను అందుకొన్నాడు. పొయ్గయాళ్వారు పాంచజన్యము అంశ అనీ, నమ్మాళ్వారు విష్వక్సేనుని అంశ అనీ - ఇలా ఒక్కొక్క ఆళ్వారు ఒక్కొక్క విష్ణుసేవకుని అంశ అని చెబుతారు.
సంగ్రహ విశేషాలు
ముదలాళ్వారులు (పొయ్గై యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్)
ఆళ్వారులలో మొదటివారైనందున వీరు ముగ్గురిని ముదలాళ్వారులని అంటారు. వీరు ముగ్గురూ సా.శ. 719 ప్రాంతంలో సమకాలికులు. ఒకమారు వీరు ముగ్గురూ ఒక చీకటిరాత్రి వర్షంలో ఒక ఇంటి అరుగుమీద కలసికొని శ్రీమన్నారాయణుని దర్శనం పొందారని ఒక కథ ఉంది.
తిరుమళిశై యాళ్వార్ (తిరుమలసాయి ఆళ్వార్)
సా.శ. 720 ప్రాంతానికి చెంది ఉండవచ్చును. పుట్టుక రీత్యా పంచముడు. వైష్ణవం, బౌద్ధం, జైనం సిద్ధాంతాలలో పండితుడు. పెరుమాళ్ళను తన మిత్రునిగా తలచి మంగళాశాసనాలు పాడాడని చెబుతారు. ఈ ఆళ్వారు, అతని శిష్యుడు కాంచీపురం వదలి వెళ్ళిపోదలిస్తే ఆవూరి గుడిలోని పెరుమాళ్ళు తన చాపను (ఆదిశేషుని) చుట్టగా చుట్టుకొని వారివెంట బయలుదేరాడట. ఈ ఆళ్వారు చెప్పినట్లు చేయడం వలన ఆ దేవునికి 'యధోక్తకారి' అన్న పేరు వచ్చింది.
తిరుమంగయాళ్వార్ (తిరుమంగై ఆళ్వారు)
సా.శ. 776 కాలంనాటివాడు కావచ్చును. పుట్టుక రీత్యా శూద్రుడు. పూర్వాశ్రమంలో శృంగార పురుషుడు. తరువాత భక్తుడై పెరుమాళ్ళను స్తుతించాడు.
తిరుమంగై ఆళ్వార్ చోళదేశమందలి తిరుక్కరయలూర్ గ్రామవాసి. చోళరాజు వద్ద సేనాధిపత్యము వహించాడు. కొంతకాలమునకు దానిని వదలివేసి, దేశాటనపరుడై సుమారు 80 పుణ్యస్థలములను దరిశించి విష్ణుసంకీర్తనలను జేసినాడు. పెరియ తిరుమొణ్, తిరుక్కురుందాండకం తిరునెడుందాండకం, చిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరువేము కూరిరుక్కై అను షట్ప్రబంధములను రచించి, మహాకవియై నార్కవిప్పెరుమాన్, అనగా చతుర్విధ కవితా చక్రవర్తి అనుపేరొందినాడు.
జైన బౌద్ధమతాలను, శైవాన్ని కూడా ప్రతిఘటించి వైష్ణవ మతవ్యాప్తిని హెచ్చుగా సాధించాడు. ఒక బౌద్ధమతాలయము లోని స్వర్ణవిగ్రహమును చెరిపించి, ఆసొమ్ముతో శ్రీరంగనాధుని ఆలయమునకు తృతీయ ప్రాకారనిర్మాణము చేయించినాడట. శైవులు శివ పారమ్యాన్ని నిరూపించుటకై అతని దక్షిణ వామాంగములయందు బ్రహ్మ విష్ణు లుద్భవించినారని చెప్పినట్లుగానే, ఈతడు విష్ణువే సృజించి, మూర్తిత్రయ రూపములు దాల్చివిశ్వవ్యాప్తియై యున్నాడని, శమ దమాదులు కలిగి ధర్మమార్గమున ఏకైక భక్తి సల్పువారే ముక్తి బడయగలరని ఈతడు ప్రతిపాదించాడు.
తొండరడిప్పొడి యాళ్వార్ (తొండరాదిప్పోడి ఆళ్వారు)
సా.శ. 787 ప్రాంతంలో శ్రీరంగంలోని నందన వనానికి తోటమాలి. విప్రనారాయణుడు అని కూడా ప్రసిద్ధుడు. దండలు గుచ్చి శ్రీరంగనాధుని సేవించి తరించాడు.
తొండరడిప్పొడి యాళ్వార్, పెరియాళ్వార్ అను వారలు చోళపాండ్య దేశస్థులు. వీరికే క్రమముగా విప్రనారాయణుడని, విష్ణుచిత్తుడని నామాంతరములు.
తిరుప్పాణాళ్వార్ (తిరుప్పాన్ ఆళ్వారు)
సా.శ. 701 ప్రాంతం వాడు కావచ్చును. ఉరయూర్లో పానార్ ("అంటరాని జాతి" అనబడేది) కుటుంబంలో పెరిగాడు. తన అందమైన పాశురాలతో పెరుమాళ్ళను అర్చించాడు. పది పాశురాలు మాత్రం గల కావ్యం వ్రాసి ఉత్తమకవిగా వాసికెక్కినాడు.
పెరియాళ్వార్
శ్రీ విల్లిపుత్తూరుకు చెందినవాడు. దేవదేవుని తన బిడ్డగా భావించి మంగళాశాసనములు కీర్తించాడు. దేవునికే పెద్ద గనుక పెరియాళ్వారు అనబడ్డాడు. "పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు" అనే పాశురం ద్రవిడ వేదంలో చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది.
ఆండాళ్
"ఆముక్త మాల్యద", "గోదా దేవి" అని కూడా అనబడే ఈ తల్లి భూదేవి అవతారంగా పూజింపబడుతుంది. శ్రీరంగనాధుని వలచి పెళ్ళియాడిందని అంటారు. ఈమె పాడిన తిరుప్పావై వైష్ణవ మందిరాలలో ముఖ్యమైన సంకీర్తనా గేయము. తమిళ సాహిత్యంలో సమున్నత గేయము. ఈమె సా.శ. 776 కాలానికి చెంది ఉండవచ్చును.
నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని
సా.శ. 798 కలంవాడు కావచ్చును. పుట్టుక రీత్యా శూద్రుడు. ఆళ్వారులలో నమ్మాళ్వారుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. మిగిలిన ఆళ్వారులందరూ శరీరం, నమ్మాళ్వారులు శరీరి. జ్ఞాని. శ్రీవైష్ణవం దీక్షను తీసికొనేవారు తమ ప్రస్తుత గురువునుండి నమ్మాళ్వారు వరకూ అంజలి ఘటిస్తారు. దేవాలయాలలో 'శఠగోపం' పెట్టడం అనేది ఈ 'శఠకోపముని' పేరుమీద మొదలయిన ఆచారమే. తన జీవితకాలం అంతా ఒక చింతచెట్టు క్రిందనే గడిపాడు. నమ్మాళ్వారు రచించిన నాలుగు దివ్య ప్రబంధాలూ నాలుగు ద్రవిడ వేదాలుగా ప్రశస్తమయ్యాయి.
ఇతడు యోగాభ్యాసపరుడు. నాధముని, మధురకవి అనువారలీతని శిష్యులు. ఈతడు విష్ణుసారమ్యమును, సర్వ వ్యాపిత్వమును మోక్షదాయకత్వమును గూర్చి తన రచనలలో హెచ్చుగా ప్రతిపాదించాడు. ఈతని కాలమునకు దక్షిణదేశమున జైన బౌద్ధ మతములు క్షీనదశనొంది శైవవైష్ణవములకు గల స్పర్ధకూడ కొంత తగ్గిపోయినట్లు కనబడును.
మధురకవి యాళ్వార్
ఇతను బ్రాహ్మణుడు. తక్కిన ఆళ్వారులు శ్రీమన్నారాయణుని కీర్తించగా మధురకవి మాత్రం తన గురువైన నమ్మాళ్వారునే కీర్తించాడు. ఇతని గురుస్తోత్రం శ్రీవైష్ణవులకు చాలా ముఖ్యమైన ప్రార్థన.
కులశేఖరాళ్వార్
భక్తునిగా మారిన రాజు. ఎక్కువ కీర్తనలలో శ్రీరాముని స్తుతించాడు. తిరుమలలో బంగారు వాకిలి వద్దనున్న మెట్టును ఇతని పేరుమీద కులశేఖర పడి అని అంటారు.
దివ్య ప్రబంధాలు
ఆళ్వారులు పాడిన పాశురాలు అన్నీ కలిపి నాలుగు వేలు - - ఈ మొత్తాన్ని నాలాయిరం ద్రవిడ వేదం లేదా దివ్య ప్రబంధం అంటారు. తమిళ సాహిత్యంలో ఈ గేయాలకు విశిష్టమైన స్థానం ఉంది. వివిధ ఆళ్వారుల పాశురాల సంఖ్య క్రింది జాబితాలో ఇవ్వబడింది. పదకొండు మంది ఆళ్వారులు తమ పాశురాలలో శ్రీమన్నారాయణుని దివ్యావతారములను కీర్తించారు. కాని మధురకవి ఆళ్వారు మాత్రం తన గురువైన నమ్మాళ్వారునే స్తుతించాడు.
క్ర.సం. ప్రబంధం పేరు --- మొదటి పాశురం సంఖ్య చివరి పాశురం సంఖ్య మొత్తం పాశురాలు గానం చేసిన ఆళ్వారు 1 పెరియాళ్వార్ తిరుమొళి 1 473 473 పెరియాళ్వార్2తిరుప్పావై47450330 ఆండాళ్3నాచియార్ తిరుమొళి504646143 ఆండాళ్4 పెరుమాళ్ తిరుమొళి647 751 105 కులశేఖరాళ్వార్5 తిరుచ్చంద విరుత్తమ్752 871 120 తిరుమలిసాయి ఆళ్వార్6 తిరుమాలై 872 916 45 తొండరడిప్పొడి యాళ్వార్7 తిరుప్పల్లియేడుచ్చి 917 926 10 తొండరడిప్పొడి యాళ్వార్8 అమలనాది పిరాన్ 927 936 10 తిరుప్పానాళ్వార్9 కన్నినున్ శిరుత్తంబు 937 947 11 మధురకవి ఆళ్వార్10 పెరియ తిరుమొళి 948 2031 1084 తిరుమంగై ఆళ్వార్11 కురున్ తండగం 2032 2051 20 తిరుమంగై ఆళ్వార్12 నెడుమ్ తండగం 2052 2081 30 తిరుమంగై ఆళ్వార్13 ముదల్ తిరువందాడి 2082 2181 100పొయ్గై ఆళ్వార్14 ఇరందం తిరువందాడి 2182 2281 100భూదత్తాళ్వార్15 మూన్రం తిరువందాడి 2282 2381 100పేయాళ్వార్ 16 నాన్ముగన్ తిరువంతాడి 2382 2477 96తిరుమలశాయి ఆళ్వార్17 తిరువిరుత్తమం 2478 2577 100నమ్మాళ్వార్18 తిరువాశిరియం 2578 2584 7నమ్మాళ్వార్19 పెరియ తిరువందాడి 2585 2671 87నమ్మాళ్వార్20 తిరువెళుక్కుర్రిరుక్కై 2672 2672 1తిరుమంగై ఆళ్వార్21 సిరియ తిరుమడల్ 2673 2712 40తిరుమంగై ఆళ్వార్22 పెరియ తిరుమడల్ 2713 2790 78తిరుమంగై ఆళ్వార్23తిరువైమొళి 2791 3892 1102నమ్మాళ్వార్24 రామానుజ నూరందాడి 3893 4000 108తిరువరంగతముదనార్మొత్తం పాశురాలు 4000
ఆళ్వారులు, వారి స్వస్థలాలు, జన్మనక్షత్రాలు
వివిధ ఆళ్వారుల జన్మ స్థానము, వారు జీవించిన కాలము, వారి జన్మ నక్షత్రము క్రింది పట్టికలో ఇవ్వబడినాయి.
క్ర.సం. ఆళ్వారు కాలము, స్థలము ఇతర నామాలు నెల నక్షత్రం అంశ1పొయ్గై ఆళ్వార్7వ శతాబ్దం, కాంచీపురం సరో యోగి, కాసార యోగి, పొయ్గై పిరాన్, పద్మముని, కవిన్యార్పోరెయెర్
ఆశ్వీజంశ్రవణ పాంచజన్యం (శంఖం)2పూదత్తాళ్వార్7వ శతాబ్దం, మైసూరుభూతాళ్వార్ఆశ్వీజంధనిష్ఠ కౌమోదకి (గద)3పేయాళ్వార్7వ శతాబ్దం, కైరవముని, మహాదాహ్వయార్ ఆశ్వీజంశతభిష నందకం (ఖడ్గం)4తిరుమళిశై ఆళ్వార్7వ శతాబ్దం, తిరుమళిసాయిభక్తిసారుడు, భార్గవుడు, మగిసారాపురీశ్వరర్ (మహీసార పురీశ్వరుడు), మళిసాయి పిరాన్ పుష్యంమఘ సుదర్శన చక్రం5నమ్మాళ్వార్9వ శతాబ్దం, తిరునగరి (కురుగూర్)శఠకోపముని, సదారి, పరాంకుశ స్వామి, మారన్, వకుళాభరణుడు, కురిగైయార్కోనే వైశాఖవిశాఖ విష్వక్సేనుడు (సేనాపతి)6మధురకవి ఆళ్వార్9వ శతాబ్దం, తిరుకొళ్లూర్ఇంకవియార్, అళ్వారుక్కు ఆదియాన్ చైత్రం చిత్ర వైనతేయుడు (గరుత్మంతుడు)7కులశేఖర ఆళ్వార్8వ శతాబ్దం, తిరువంజిక్కోలమ్కొల్లికావలన్, కూదల్నాయకన్, కోయికోనె, విల్లివార్కోనె, చెయ్రలార్కోనే మాఘంపునర్వసు కౌస్తుభం (మణి)8పెరియాళ్వార్9వ శతాబ్దం, శ్రీవిల్లిపుత్తూరువిష్ణుచిత్తుడు, పట్టణాదన్, బట్టార్పిరన్, శ్రీవిల్లిపుత్తూరార్, శ్రీరంగనాధ స్వసూరార్ జ్యేష్టంస్వాతి గరుత్మంతుడు (వాహనం)9ఆండాళ్9వ శతాబ్దం, శ్రీవిల్లి పుత్తూర్చూడికొడుత్తనాచియార్, గోదా, గోదామాత ఆషాడంపూర్వఫల్గుణి భూదేవి10తొండరాడిప్పొడియాళ్వార్8వ శతాబ్దం, తిరుమందనగుడివిప్రనారాయణుడు, తిరుమందనగుడియార్, భక్తాంఘ్రిరేణుడు, పల్లియునర్తియపిరాన్ ధనుర్మాసం జ్యేష్ట వనమాల (దండ)11తిరుప్పాన్ ఆళ్వార్8వ శతాబ్దం, ఉరయూర్పానార్, మునివాహనుడు, యోగివాహనుడు, కవీశ్వరుడు కార్తీకంరోహిణి శ్రీవత్సం (చిహ్నం)12తిరుమంగై ఆళ్వార్8వ శతాబ్దం, తిరుక్కురయూర్కలియన్, ఆలినాదన్, నాలుకవి పెరుమాళ్, అరుల్మారి, పరకాల స్వామి, మంగైయార్కోనే కార్తీకంకృత్తిక శార్ఙ్గము (ధనుస్సు)
ఇవి కూడా చూడండి
శ్రీ వైష్ణవం
రామానుజాచార్యులు
http://www.suryaa.com/showNews.asp?category=1&subCategory=13&ContentId=4988
మూలములు
తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి - ప్రచురణ : సూర్య పబ్లికేషన్స్, హైదరాబాదు (2002) - ఆళ్వారుల కాలం గురించిన సంవత్సరాలు ఈ పుస్తకం నుండి తీసుకొనబడ్డాయి.
వనరులు
శ్రీ తిరుమంగై ఆళ్వార్
దివ్యదేశ వైభవ ప్రకాశిక - కిడంబి గోపాల కృష్ణమాచార్యుల రచన - ఎన్.వి.ఎల్.ఎన్.రామానుజాచార్యుల ఆంధ్ర వివరణ
దివ్య ప్రబంధ మాధురి - కె.టి.ఎల్.నరసింహాచార్యులు
ద్వాదశ సూరి చరిత్ర - కె.టి.ఎల్.నరసింహాచార్యులు
ఆళ్వారాచార్యుల సంగ్రహ చరిత్ర - పాలవంచ తిరుమల గుదిమెళ్ళ వేంకట లక్ష్మీనృసింహాచార్యులు
పరిచయ వ్యాసము
బయటి లింకులు
పన్నిరండు ఆళ్వారులు - దివ్యదేశం ఆన్లైన్
అళ్వారులు , వైష్ణవం
ఆళ్వారులు (రామానుజ.ఆర్గ్)
తమిళనాడు యొక్క ఆళ్వారు సంతులు - జ్యోత్స్నా కామత్
పరమయోగి విలాసము - తాళ్ళపాక తిరువేంగళనాధుని ద్విపద కావ్యము - తి.తి.దే. ప్రచురణ - వి.విజయరాఘవాచార్య పరిష్కరించినది (1938)
వర్గం:తమిళనాడు
వర్గం:హిందూమతం
వర్గం:శ్రీవైష్ణవం
వర్గం:ప్రముఖ వైష్ణవాచార్యులు
వర్గం:ఆళ్వారులు
వర్గం:హిందూ దేవతలు |
సరోయోగి | https://te.wikipedia.org/wiki/సరోయోగి | దారిమార్పు ముదలాళ్వారులు
en:Poigai Alvar
ta:பொய்கையாழ்வார் |
భూత యోగి | https://te.wikipedia.org/wiki/భూత_యోగి | దారిమార్పు ముదలాళ్వారులు
వర్గం:ఆళ్వారులు
en:Bhoothathalvar
ta:பூதத்தாழ்வார் |
మహాయోగి | https://te.wikipedia.org/wiki/మహాయోగి | దారిమార్పు ముదలాళ్వారులు
వర్గం:ఆళ్వారులు
ta:பேயாழ்வார்
en:Peyalvar |
కులశేఖరుడు | https://te.wikipedia.org/wiki/కులశేఖరుడు | పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకడైన కులశేఖర ఆళ్వార్ పునర్వసు నక్షత్రమున జన్మించాడు. అతను చేర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప రామభక్తుడైన అతను రాముని కష్టాలు తన స్వంత కష్టములుగా భావించేవాడు. అందువలన అతనిని ‘పెరుమాళ్’, (అంటే ‘అతి గొప్పవాడు’ – సాధారణంగా వెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పేరు) అనికూడా పిలిచేవారు. అతని భక్తి ఎంత తీవ్రమైనదంటే స్వామి భక్తులను సాక్షాత్తు స్వామివలే పూజించేవాడు.
కొడంగల్లూర్లోని త్రికులశేఖరపురం ఆలయం ఆళ్వార్ జన్మస్థలంగా పరిగణించబడుతుంది. వైష్ణవ సంప్రదాయాలు ఆళ్వార్ను పశ్చిమ తీరం (కేరళ) చేరా రాజ కుటుంబానికి చెందిన రాజుగా వర్ణిస్తాయి. పండితులు కులశేఖరను రాచరిక చేరా నాటక రచయిత కులశేఖర వర్మ, స్తాను రవి కులశేఖర (పాలన 844/45 - c. 870/71 AD) తో గుర్తించారు, ఇతను కేరళకు చెందిన తొలి చెర పెరుమాళ్ రాజు.కులశేఖరుడు పశ్చిమ దేశంలోని వంచిలో కలి శకం 28లో చేరా పాలకుడు దృఢవ్రతుడికి జన్మించాడు. యువరాజుకు యుక్తవయస్సు వచ్చినప్పుడు, అతని తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టి, ప్రజా జీవితం నుండి విరమించుకున్నాడు, కొత్త రాజు కులశేఖర సింహాసనాన్ని అధిష్టించాడు.
కులశేఖరుడు విష్ణుమూర్తికి గొప్ప భక్తుడు. అతని దైవభక్తి ఎంత గొప్పదంటే, ఒకానొక సందర్భంలో రాక్షస రాజు రావణుడు యువరాణి సీతాదేవిని ఎలా అపహరించాడు అనే కథనం జరుగుతున్నప్పుడు, అతను వెంటనే లంకపై దండయాత్ర కోసం తన సైన్యాన్ని రప్పించమని ఆదేశాలు జారీ చేశాడు. మరొక సందర్భంలో, వైష్ణవులపై రాజు చేసిన అనుగ్రహానికి అసూయపడిన మంత్రి, భక్తులపై తప్పుడు అభియోగాన్ని మోపారు. రాజు పాములతో కూడిన కుండలో తన చేతిని చొప్పించి, దానిని క్షేమంగా బయటకు తీయడం ద్వారా వారి అమాయకత్వాన్ని నిరూపించాడు.
కులశేఖరుడు తరువాత రాజ్య పాలనను విరమించుకుని పవిత్ర క్షేత్రమైన శ్రీరంగానికి తీర్థయాత్ర ప్రారంభించాడు. అతను అక్కడ కొన్నాళ్ళు గడిపి, తన దేవతను ఆరాధించాడు, తన కుమార్తె చెరకుల వల్లి నాచ్చియార్ను శ్రీరంగం ఆలయానికి వివాహం చేశాడు. అతను తన మొత్తం సంపదను కట్నంగా ఇచ్చాడు, చెనైవెన్రన్ మండపాన్ని నిర్మించాడు, ఆలయ ప్రాకారాన్ని బాగు చేశాడు (దీనిని "కులశేఖర తిరువీడి" అని పిలిచేవారు). తరువాత అతను తిరువేంకటం, తిరువయోధ్య, తిల్లై-చిత్రకూటం, తిరుకన్నపురం, తిరుమాలిరుంజోలై, తిరువిత్రువాక్కోడ్ యొక్క పవిత్ర దేవాలయాలను సందర్శించి, చివరకు నమ్మాళ్వార్ జన్మస్థలమైన తిరుక్కురుకూరు సమీపంలోని బ్రహ్మదేశంలో స్థిరపడ్డాడు (అక్కడ అతను అరవై ఏడు సంవత్సరాల వయస్సులో మరణించాడు).
బ్రిటిష్ రాక్ బ్యాండ్ కుల షకెర్ పేరు కులశేఖర నుండి ప్రేరణ పొందింది.
అతను శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామి సేవచేస్తుండేవాడు.ఈయన వేంకటేశ్వరస్వామిని నీ గర్భగుడి ముందు గడపగా నైనా పడివుండే వరమీయమని అడిగితే స్వామి తథాస్తు అన్నారట. నేటికీ తిరుమలలో గర్భగుడి ద్వారానికున్న గడపని 'కులశేఖర పడి' అని అంటారు. ఇతడు ముకుందమాల అను భక్తి స్తోత్రాన్ని సంస్కృతంలో రచించాడు.
రచనలు
కులశేఖర తమిళంలో "పెరుమాళ్ తిరుమొళి", సంస్కృతంలో " ముకుందమాల ", రచయిత. కులశేఖర ఆళ్వార్ యొక్క పద్యాలు ప్రకృతిలో భక్తితో కూడుకున్నవి, విష్ణువు - రాముడు, కృష్ణుడి యొక్క అత్యంత ముఖ్యమైన అవతారాలకు అంకితం చేయబడ్డాయి. వారి జీవితంలోని సంఘటనలలో అతను అనేక పాత్రలతో తనను తాను గుర్తించుకుంటాడు. రాముని భక్తుడు, అతను రాముడు లేదా అతని వృద్ధాప్య తండ్రి దశరథుని బాధాకరమైన అనుభవాలను తన స్వంతంగా భావించాడు. అతని భక్తి ఎంత తీవ్రంగా ఉందో, భక్తులను విష్ణు స్వరూపులుగా ఆరాధించేవాడు. ఒక పాటలో, అతను కృష్ణుడి యొక్క నిజమైన తల్లి దేవకిని గుర్తించాడు, అతని నుండి కృష్ణుడిని గోకులానికి తీసుకెళ్లారు, అక్కడ పెంపుడు తల్లిదండ్రులు నంద, యశోద అతనిని చూసుకున్నారు. కులశేఖర తన బిడ్డ నుండి విడిపోయినందుకు, అతనితో ఐక్యత కోసం దేవకి యొక్క నిర్జనాన్ని వ్యక్తం చేస్తాడు. కొన్ని పద్యాలలో, కులశేఖరుడు కృష్ణుడితో ప్రేమలో ఉన్న గోపికతో తనను తాను గుర్తించుకుంటాడు.
ఇవి కూడా చూడండి
కులశేఖర మహీపాల చరిత్రము
మూలాలు
Source: Naalaayira divya prabhandham: Commentary by. Dr. Jagadrakshakan. (1997). Aazhvaargal Research Centre, Chennai 600017.
ముకుందమాల
వర్గం:ఆళ్వారులు
వర్గం:ప్రముఖ వైష్ణవాచార్యులు |
మునివాహనులు | https://te.wikipedia.org/wiki/మునివాహనులు | దారిమార్పుతిరుప్పాణ్ ఆళ్వార్ |
తిరుమంగై ఆళ్వార్ | https://te.wikipedia.org/wiki/తిరుమంగై_ఆళ్వార్ | తిరుమంగై అల్వార్ ను తిరుమంగై మన్నన్ అని కూడా పిలుస్తారుVK 2006, p.49. దక్షిణ భారతదేశంలోని 12 మంది ఆళ్వారులలో చివరివాడు. అతను హిందూ మతం యొక్క వైష్ణవ సంప్రదాయానికి అనుబంధంగా గుర్తింపు పొందాడు. అతను పద్యాల కూర్పులో అత్యంత ఉన్నతమైన అళ్వార్లలో ఒకనిగా పరిగణించబడ్డాడుPillai 1994, pp. 192–4. అతనికి అద్భుతమైన కవితా "నర్కవి పెరుమాళ్" అనే బిరుదు ఉంది. అతనికి పరకాలయోగి అని కూడా పిలుస్తారు.
జీవిత విశేషాలు
అతను కలియుగ ప్రారంభంలో 397 సంవత్సరమునకు సరియగు "నళ" నామ సంవత్సర వృశ్చిక (కార్తిక) మాస శుక్ల పక్ష పూర్ణిమా గురువారమున కృత్తికా నక్షత్రమున "తిరుక్కుఱైయలూర్" అను దివ్యదేశమునందు జన్మించాడు. అతనికి తన తండ్రి ""నీలనిఱైత్తర్" అని నామకరణం చేసాడు.
అతను పద్మాంశమున జన్మించిన కుముదవల్లి నాచ్చియార్లను వివాహము చేసికొన్నాడు. అందుకు అతను శ్రీవైష్ణవ ఆరాధనను నిర్వహించుచూ పూజా ద్రవ్యములకై దొంగతనము చేసేవాడు. అతనిని పరీక్షింపదలచి పెండ్లి కుమారుని వేషములో వచ్చిన శ్రీమహావిష్ణువుని కూడా దోచి స్వామి పాదస్పర్శచే జ్ఞానోదయము పొందెను. అతను "నాన్కణ్డు కొణ్డేన్ నారాయణా వెన్ఱుం నామమ్" అని తిరుమంత్రమును ప్రకాశింపజేసిరి.
అతను తమ శిష్యులతో కలసి దివ్యదేశ సంచారము చేయుచు పెరుమాళ్లకు మంగళాశాసనము చేయుచుండిరి. వేదబాహ్యులైన జైన బౌద్ధాదులను జయించి ఆ ద్రవ్యముతో శ్రీరంగనాథులకు మణి మంటప ప్రాకారాదులు నిర్మించిరి.
వీరు నమ్మాళ్వార్లు అనుగ్రహించిన చతుర్వేద సారభూతమైన నాల్గు ప్రబంధములకు షడంగములుగా ఆరుప్రబంధములను అనుగ్రహించిరి. వీరివైభవము వాచామగోచారము. దానిని గురుపరంపరా ప్రభావాది గ్రంథములలో సేవింపవచ్చును.
మూలాలు
వనరులు
.
వర్గం:హిందూమతం
వర్గం:ఆళ్వారులు
వర్గం:ప్రముఖ వైష్ణవాచార్యులు |
మధురకవి | https://te.wikipedia.org/wiki/మధురకవి | మధురకవి 6వ శతాబ్దము నుండి 9వ శతాబ్దముల మధ్య దక్షిణ భారతదేశములో జీవించిన వైష్ణవ సాధువు, కృతికర్త. ఈయన నాలాయిరుమ్ (నాలుగువేల) దివ్యప్రబంధములో తన గురువైన నమ్మాళ్వారును స్తుతిస్తూ 11 పాశురాలను రచించాడు. ఈయన పన్నెండు మంది ఆళ్వారులలో ఒకడుగా భావిస్తారు. మధురకవి నమ్మాళ్వారు కంటే ముందే పుట్టినందువలన ఈయన్ను నమ్మాళ్వార్ లేవకముందే, సూర్యుడు ఉదయించేముందు స్తుతిస్తారు. సాంప్రదాయ కథలలో ఈయన్ను బాగా చదువుకున్న, సంగీతజ్ఞానమున్న, లోకం తిరిగిన బ్రాహ్మణునిగా చెబుతారు. ఈయన నమ్మాళ్వారు రచనలకు సంగీతాన్ని సమకూర్చాడు.
తొలి జీవితం
మధురకవి ఆళ్వారు, ఆళ్వారు తిరునగరి వద్ద తిరుక్కోలూరు అనే దివ్యదేశంలో చైత్రమాసంలో చిత్రా నక్షత్రములో ఒక బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈ దివ్యదేశములో పెరుమాళు వైతమానిధి (అనంత ధనరాశి భండారము) గా వెలశాడు.
మధురకవి ఆళ్వారు వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అంతేకాక తమిళ, సంస్కృత భాషలలో పండితుడు. ఈయన భగవంతుని స్తుతిస్తూ అనేక కీర్తనలు రచించాడు. జీవితములోని ఒక దశలో ఈయన అన్ని సంసారబంధాలను త్యజించి, మోక్షసాధనకై కృషిచేశాడు. ఈ ప్రయత్నములో భాగంగానే ఉత్తరాదిలోని దివ్యదేశాలైన అయోధ్య, మథుర మొదలైన ప్రదేశాలను సందర్శించాడు.
మూలాలు
వర్గం:ఆళ్వారులు
వర్గం:ప్రముఖ వైష్ణవాచార్యులు |
గోదాదేవి | https://te.wikipedia.org/wiki/గోదాదేవి | thumb|గోదాదేవి
ఆండాళ్ లేదా గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదా దేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచింది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది, ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ కావించరు, దానితో స్వామి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమి చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు.
తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి "తిరుప్పావు" వ్రతాచరణ చేస్తారు. ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది, వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమవుతుంది, అది చూసి విష్ణుచిత్తులవారు దుఃఖితులయితే స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశంచేసి మాయ నుండి వెలుపలకి రావడానికి సాయం చేస్తారు.
గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధమైనది. దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజూ, విష్ణువు యొక్క ఆలయంలో రోజుకొక్క పాశురం చొప్పున పఠిస్తారు.
మూలాలు
వర్గం:ఆళ్వారులు
వర్గం:ప్రముఖ వైష్ణవాచార్యులు |
బుద్ద అవతారము | https://te.wikipedia.org/wiki/బుద్ద_అవతారము | దారిమార్పు బుద్ధావతారం |
శ్రీకాకులం | https://te.wikipedia.org/wiki/శ్రీకాకులం | దారిమార్పు శ్రీకాకుళం జిల్లా |
వరాహావతారము | https://te.wikipedia.org/wiki/వరాహావతారము | శ్రీవరాహమూర్తి, వరాహావతారము, వరాహ స్వామి (Varaha incarnation) - ఇవన్నీ శ్రీమహావిష్ణువు మూడవ అవతారమును వర్ణించే నామములు.Krishna 2009, p. 45Krishna 2009, p. 47 హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీవరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. వరాహావతారం హిరణాక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము. స్వామి ప్రార్థనలలో ఒకటి:
ఆది వరాహ మూర్తి, యజ్ఞవరాహ మూర్తి, మహా సూకరం అని నామాలు కూడా ఉన్నాయి. తిరుమల కొండలపై మొదట వెలసిన స్వామి వీరే, వీరి అనుమతితోనే వేంకటేశ్వరుడు అక్కడ నివాసము ఏర్పాటుచేసుకున్నారు.
రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.
భాగవత పురాణ గాధ
మహాప్రళయం
మహాప్రళయం సంభవించింది. భూమి జలంలో మునిగిపోయింది. బ్రహ్మ చింతాక్రాంతుడై నిఖిల జగత్తును కల్పనచేశాను. స్వాయంభువ మనువు నివసించేందుకు ఆధారభూతమైన భూమి ఇప్పుడు లేకుండా పోయిందే అని భావిస్తూ, సర్వభూతాంతరాత్ముడైన పుండరీకాక్షుని స్మరించసాగాడు. ధ్యాన నిమగ్నుడైన బ్రహ్మ నాసిక (ముక్కు) నుంచి, బొటనవేలు పరిమాణమున్న వరాహంగా శ్రీహరి విశ్వంభరోద్ధారణకై జన్మించాడు. మరీచాది మునులు, మనువు కుమారులు చూస్తుండగానే, క్షణం లోపల ఏనుగంత ప్రమాణం పెరిగి చూసే వారికి అద్భుతాశ్చర్యములు కలిగించారు.
విశ్వంభరోద్ధరణ పర్వం
ప్రళయ కాలమందు ఆవరించిన దట్టమైన మేఘ గర్జనల వంటి ఘుర్గురారావంబులతో బ్రహ్మాండము పై పెంకు పగులునటుల, దిక్కులదరునట్లు, ఆకాశపు పొరలను చీల్చునట్లు, రొప్పుచూ పర్వతములు పెకలించుచు, ముట్టె బిగియించుచు, ముసముస మూరికొనుచున్న యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మ స్తుతించెను. "దేవా... సనకసనందనాదుల శాప వశమున జయ విజయులు దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులై జన్మించి ఉన్నారు. హిరాణ్యాక్షుడు నేడు అఖిలలోక కంటకుడై, చండ వేదండ శుండాదండ మండిత భుజాదండబున గదాదండంబు ధరియించి, తనను యుద్ధములో ఓడించగల వాడిని భూలోకమున గానక, దేవలోకముల దేవతలనోడించాడు. వరుణుని దండింప బూన అతడు నీకు సరి హరియే. అతని గెలిచి రమ్మన్నాడు. హిరణ్యాక్షుడు నీకై వెదకుచూ రసాతలమునకు పోయాడు.... అని బ్రహ్మ వివరించాడు.
మహా పర్వతమంత పెరిగిన వరాహమూర్తి
ఆ పలుకులు విని యజ్ఞవరాహమూర్తి యను సర్వేశ్వరుడు, ప్రాతార్మధ్యందిన తృతీయ సవనరూపుండు, మహా ప్రళయంబునందు యోగనిద్రావశుండై యుండు కాలమందు జలముల మునిగి, భూమి రసాతలగతంబైనందున, దానిని పైకి తీసుకువచ్చే ఉపాయంలో భాగంగా తాను మహా పర్వతమంతగా పెరిగిపోయాడు. ఆ పైన తన నిశిత కరాళక్షుర తీక్షంబులైన ఖురాగ్రంబుల సముద్ర జలమును చీల్చి రసాతలమును ప్రవేశించి భూమిని సమీపించెను. ఆ జల మద్యంలో సూకరాకారుడైన హరికి హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు. అప్పుడు శ్రీహరి తన తనూ కాంతితో దనుజాధీశుడైన హిరణ్యాక్షుని శరీరపు వెలుగును హరింపజేసెను. అంతేకాక తుది మొదళ్లకు చిక్కక, కొండలను పిండిచేయుచు, బ్రహ్మాండ భాండంబు పగులునట్లు కొమ్ములతో గుచ్చుచూ, సప్త సముద్రములింకునట్లు బంకమట్టిని ఎగజిమ్ముచు, తన కురుచ తోకను తిప్పుచు, గుప్పించి లఘించుచు, భూమిని తవ్వి తన నిశిత దంతాగ్రముల నిలిపి రాక్షస రాజు గుండెలు తల్లడిల్లునట్లు రణోత్సామున రంకెలు వేస్తూ ఆ వరాహమూర్తి రణానికి సిద్ధమయ్యారు.
యజ్ఞవరాహ-హిరణ్యాక్షుల సమరం
నిశిత సిత దంతముల వెలుగులు నింగిని వ్యాపింప, రసాతలమును వీడి భయంకర వరాహావతారమున వసుంధరను గొనిపోవుచున్న శ్రీహరిని అటునిటు అడ్డగించుచు, నిందించుచు హిరాణ్యాక్షుడు విడువిడుమని ఆక్షేపించాడు. అప్పుడు యజ్ఞవరాహమూర్తి భూమిని జలములపై నిలువబెట్టి ఆధారముగా తన బలమును ఉంచి, హిరాణ్యాక్షునిపై సమరమునకు సన్నద్ధుడాయెను. హిరణ్యాక్షుడు అతి భయంకరాకారుడై గద సారించి మాధవునెదుర్కొన్నాడు. ఇరువురు అన్యోన్య జయ కాంక్షలతో, పరస్పర శుండాదండ ఘట్టిత మధాంధ గంధ సింధుర యుగంబులవలె, రోష భీషణాచోపంబులం తలపడ బెబ్బులవలె, అతి దర్పాతిరేకంబున నెదర్చి రంకెలు వేయు మద వృషంభుల వలె పోరాడిరి.
నిస్తేజుడైన హిరణ్యాక్షుడు
హిరణ్యాక్షుని గద, శూలము శ్రీహరి ధీరత్వం ఎదుట వృథా అయ్యాయి. దాంతో హిరాణ్యాక్షుడు రోషోద్ధరుడై మాయా యుద్ధము ప్రారంభించాడు. భీకర పాషాణ పురీష మూత్ర ఘన దుర్గాంధ అస్థి రక్తములు కురియునట్లు మాయా చక్రమును భూచక్రముపై ప్రయోగించాడు. శ్రీహరి తన చక్రముతో మాయా చక్రాన్ని అడ్డగించారు. తన మాయలన్నియు కృతఘ్నునికి చేసిన ఉపకారమువలె పనిచేయకపోవుట గమనించిన హిరణ్యాక్షుడు వరాహమూర్తిపై లంఘించి తన బాహువులను చాచి, హరివక్షంపై బలం కొద్దీ పొడువగా, హరి తప్పించుకుని ఎదురు ముష్టి ఘాతం ఇచ్చాడు. ఆ దెబ్బకు దిర్దిరం దిరిగి, దిట చెడి, లోబడిన హిరణ్యాక్షుని కర్ణమూలమందు తన కోరలతో వరాహమూర్తి మొత్తెను.
బుడ బుడ నెత్తురు గ్రక్కుచు
వెడరూపము దాల్చి గ్రుడ్డు వెలికురక,
నిలం బడి పండ్లు గీటుకొనుచును విడిచెం
బ్రాణములు దైత్య వీరుండంతన్ దేవా... నీ లీలలు
బ్రహ్మాదుల ప్రార్థన
అనంతం హిరణ్యాక్షుని సంహరించి అతని రక్తధారలతో తడి చిన మోముపై భూమిని, బాలచంద్రుని కిరణములవలె మెరలుచున్న తన కోరలపై నిలిపిన యజ్ఞపోత్రిమూర్తిని జూచి బ్రహ్మాదులు ప్రణామము లాచరించి..... "ఈ విశ్వపు సృష్టి, స్థితి, లయ లందు వికారము నీవే, విశ్వము నీవే! నీ లీలలు అపారము. చర్మమున అఖిల వేదములు, రోమముల యందు బర్హిస్సులు, కన్నులలో అజ్యము, పాదముల యందు యజ్ఞ కర్మములు, తుండమున స్రువము, ముక్కులో ఇడాపాత్ర, ఉదరమున, చెవులలో జమసప్రాశిత్రములు, గొంతులో మూడు ఇష్టులు, నాలుకపై అగ్ని కలిగిన ఓ దేవా! వితత కరుణాసుధా తరంగితములైన నీ కటాక్షవీక్షణములతో మమ్ము కావవయ్యా..." అని ప్రార్థించారు.
అంతట లీలవోలె శ్రీయజ్ఞ వరాహమూర్తి భూమిని తన కోరలపై నుంచి సముద్రము పైన దించి, నిలిపి, విశ్రాంతి వహింపజేసి తిరోహితుడయ్యాడు.
జయదేవ మహాకవి దశావతార స్తుతి
వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా
శశిని కలంక కలేవ నిమగ్నా
కేశవ ధృత సూకర రూప
జయజగదీశ హరే!!
తాత్పర్యం
వరాహ అవతారం ఎత్తిన ఓ కేశవా!
నీ కోరల మీద నిలపబడియున్న ఈ భూగోళం
మచ్చలున్న చంద్రుని వలె ఉన్నది.
ఆలయాలు
తిరుపతి - భూవరాహ మూర్తి (కోనేటి గట్టున)
శ్రీముష్ణం - తమిళనాడు
నరసింహస్వామి - రవ్వలకొండ,బనగానపల్లి
చిత్రమాలిక
మూలాలు
Agiri thantha ni akka
వనరులు
డాక్టర్ లంకా శివరామప్రసాద్ వ్యాసం
బయటి లింకులు
The Battle Between Lord Boar (Varaha) and the Demon Hiranyaksha (vedabase.net)
వర్గం:భాగవతము
వర్గం:విష్ణుమూర్తి అవతారాలు |
మత్స్యావతారం | https://te.wikipedia.org/wiki/మత్స్యావతారం | హిందూమత పురాణాలలో శ్రీమహావిష్ణువు దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. మత్స్యం అనగా చేప. ఈ అవతారంలో విష్ణువు రెండు పనులు చేసినట్లుగా పురాణ గాథ. ప్రళయకాలంలో జీవరాసులను నావలో జలనిధిని దాటించడం. వేదాలను కాపాడడం.
ఆ రాక్షసుడిని సంహరించిన విధం పోతన భాగవతంలో ఇలా వర్ణించాడు (పోతన పద్యం)
ఉరకంభోనిధిలోని వేదముల కుయున్ దైత్యున్ జూచి వే
గరులాడించి ముఖంబు సాచి పలువీతన్ తోక సారించి మేన్
మెరయన్ దౌడలు గీరి మీసలడరన్ మీనాకృతిన్ విష్ణుడ
క్కరటిన్ దాకి వధించె ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవున్
ఆ శ్రీమన్నారాయణుని సత్యవ్రతుడు ఇలా ప్రస్తుతించాడు (పోతన పద్యం)
చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై
వలనై కోర్కెల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలువెంటన్ బడి లోకమక్కటా వృధా బద్ధాశమై పోయెడున్
నిలువన్నేర్చునె హేమరాశి గనియున్ నిర్భాగ్యుడంభశ్శయ్యాపహా!
సత్య వ్రతుని కీర్తనలకు సంతోషించి శ్రీమత్స్యావతారమూర్తి అతనికి సాంఖ్యయోగ క్రియను, పురాణ సంహితను ఉపదేశించెను. అందరితోను, మూలబీజములతోను ఉన్న ఆ నావను ప్రళయాంభోనిధిని దాటించెను.
సత్యవ్రతుడు ప్రస్తుతం నడుస్తున్న "వైవస్వత మన్వంతరానికి" అధిపతి అయ్యాడు.
మత్స్యావతారంలో శ్రీమహావిష్ణువు వెలసిన ప్రముఖ ఆలయం
వేదనారాయణస్వామి ఆలయం నాగలాపురం
చిత్రమాలిక
యివి కూడా చూడండి
ఆంధ్రప్రదేశ్ విశిష్ట దేవాలయాలు
మూలాలు
ఇతర లింకులు
వర్గం:విష్ణుమూర్తి అవతారాలు |
సుమతీ శతకము | https://te.wikipedia.org/wiki/సుమతీ_శతకము | తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేక స్థానము ఉంది. బహుజన ప్రియమైన శతాకాలలో సుమతీ శతకం ఒకటి. ఇది బద్దెన అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు వారి జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. "అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె తన శత్రువు" వంటి పద్యాలు తెలియని తెలుగు వారు ఉండరు. ఈ శతకంలోని ఎన్నో పద్యభాగాలను సామెతలు లేదా జాతీయములుగా పరిగణించ వచ్చును.
ఈ శతకానికి మకుటం "సుమతీ". సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యము పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో వేమన శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము అత్యధికం. సుమతీ శతకం 108 నీతి పద్యాల సమాహారం.
రచయిత
సుమతీ శతకం వ్రాసినదెవరో కచ్చితమైన సమాచారం లభించడంలేదు. పలు రచనల్లో "సుమతీ శతక కర్త" అని ఈ రచయితను ప్రస్తావించడం జరుగుతుంది. సా.శ. 1220-1280 మధ్య కాలంలో Vemulawada chalukayraju Bhadra bhupaludu ye Bhaddena ani charitrakarulu abhiprayam బద్దెన లేదా భద్ర భూపాలుడు అనే కవి సుమతీ శతకం రచించాడని సాహితీ చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు కాకతీయ రాణి రుద్రమదేవి (1262-1296) రాజ్యంలో ఒక చోళ సామంత రాజు. ఈ రచయితే రాజనీతికి సంబంధించిన సూక్తులతో నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఇతడు మహాకవి తిక్కనకు శిష్యుడు.
సుమతీ శతకాన్ని బద్దెనయే రచించినట్లయితే తెలుగు భాషలో వచ్చిన మొదటి శతకాలలో అది ఒకటి అవుతుంది. (పాలకురికి సోమనాధుని వృషాధిప శతకము, యాతావక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వచ్చిన కాలంలోనిదే అవుతుంది.)
సుమతి శతకము ప్రథమత: 1868వ సంవత్సరమునందు ప్రకటింపబడింది.1877 వ సంవత్సరమునందు రంగనాయకులు, 1889వ సంవత్సరమునందు జి.బాలగురునాధయ్య, అదే సంవత్సరమునందు పి.శల్వరాజమొదలి, 1910వ సంవత్సరమునందు అజ్ఞాతవ్యక్తి, 1912వ సంవత్సరమునందు జి.వి.రామానుజులు నాయుడు, అజ్ఞాత సంవత్సరమునందు నరసింహులుశెట్టి ప్రకటించిన సుమతి శతకము ఇదే మనకు ప్రసిద్ధి సుమతీ శతకము అయినది. దీనిని 1928లో వావిళ్ళవారి ప్రచురణకు వచ్చింది. అది మొదలు 1982 వరకు ఇదే ముద్రితములైన, పునర్ముద్రితములైన సుమతి శతకములు అనేకములు పుష్కములుగా ఉన్నాయి. కాని వేటిలోను కర్తృకాలములు సరిగా నిర్ణయించబడలేదు. సుమతి శతకము కర్త శైవ, వైష్ణవమత సంబంధమైన పురాణగాధలను వదలి, ఎక్కువ ఉపమానములను జీవితమునుండి గ్రహించెను.ఇది జైనకవుల ప్రత్యేకత. తమిళ వేదముగ ప్రసిద్ధమైన తిరుక్కురల్ అను తమిళ గ్రంథములో మత సంబంధమైన ఉపమానములు తక్కువ. జీవిత ఉపమానాలు ఎక్కువ. అందువలన కొందరు దీనిగ్రంధకర్త తిరువల్లు కార్ జైనుడని సామాన్యముగా విశ్వసింతురు. సుమతి శతకము తాళపత్ర ప్రతులు మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారము నందు; తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయమునందు మాత్రమే కాక, కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్కార్యాలయమునందు, హైదరాబాదు ప్రాచ్యలిఖిత గ్రంథాలయములో ఉన్నాయి. వీటిలో 'శ్రీరాముని దయచేతను' అనే శతక పద్యము గ్రంథాదిని ఉంది. వేమన, భర్తృహరి మొదలగు వారు కూడా జీవిత ఉపమానాలు ఉపయోగించారు కూడా. అందువలన సుమతి శతకము జైనకవి విరచితము అనుట సునిసతము కాదు. బద్దెనకు భీమా: అని మరియొక పేరుకలదు. సుమతి శతకము భీమనకృత మని కల పద్యము లిఖితప్రతియందు ఉంది. అందువలన ఇది బద్దెన విరచితము అని కొందరి విశ్వాసము. అలానే ఇది బద్దెన విరచితము అనుటకు మరికొన్ని ఆధారాలు: నీతిశాస్త్ర ముక్తావళిలోని ప్రథమ పద్యము, ధారాశుద్ధి లేని కొన్ని పద్యములు.మానవల్లి రామకృష్ణకవి గారు 1910వ సంవత్సరమునందు నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథమును ప్రకటించారు. అప్పటికే బద్దెన విరచిత నీతి సారము మద్రాసు ప్రాచ్యలిఖిత భాంఢాగారమునందు రెండు తాళప్రతులు ఉన్నాయి. కావున ఇది ఆయన్ విరచితము అనుటకు ఇది మరొక ఆధారముగా భావించవచ్చును.
సుమతీ శతకమందు కొన్ని పద్యములు సంస్కృత శ్లోకముల కాంధ్రీకరణములు. ఉదాహరణ:
శ్లో:కార్యేషుదాసీ కరణేషు మంత్రీ
రూపేచలక్ష్మీ క్షమయా ధరిత్రీ
భోజ్యేషు మాతా శయనేషు రంభా
షడ్ధర్మయుక్తా కులధర్మపత్నీ
తే.గీ:పని సేయునెడల దాసియు
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
దనభుక్తియెడల దల్లియు
నన దనకుల కాంత యుండ నగురా సుమతీ.
అదే విధంగా భర్తృహరి శ్లోకములకు భాషాంతీకరణములు కూడా ఉన్నాయి.
పాలను గలసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా,
బాలచవి జెరుచు, గావున
తాలసుడగువానిపొందు వలదుర సుమతీ...!
పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ.
1840లో సి.పి.బ్రౌన్ సుమతీ శతకాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు.
సుమతీ శతకం విశిష్టత
శతాబ్దాలుగా సుమతీ శతకం పద్యాలు పండితుల, పామరుల నోళ్ళలో నానుతున్నాయి. సుమతీ శతకం పద్యాలలోని పదాలు చాలా తేలికగా గుర్తుంటాయి. అనేక సందర్భాలలో ఇందులోని పదాలను ఉదహరించడం జరుగుతాయి. సుమారు ఏడు వందల ఏళ్ళ క్రితం వ్రాయబడినా దాదాపు అన్ని పదాలూ ఇప్పటి భాషలోనూ వాడుకలో ఉన్నాయి. ఇది పాతకాలం కవిత్వమని అసలు అనిపించదు. పండితులకు మాత్రమయ్యే పరిమితమైన భాష కాదు. పెద్దగా కష్ట పడకుండానే గుర్తు పెట్టుకొనే శక్తి ఈ పద్యాలలోని పదాలలోనూ, వాటిని కూర్చిన శైలిలోనూ అంతర్లీనమై ఉంది. అందుకే చదవడం రానివాళ్ళు కూడా సుమతీ శతకంలోని పద్యాలను ధారాళంగా ఉదహరించగలిగారు.
సుమతి శతకమున పద్యములన్నియు అ కారాది క్రమమున ఉన్నాయి. ఈ విధానానికి సుమతి శతక కర్థ బద్దెన యే ప్రారంబకుడు. ఇతనిననుసరించి ఆ తర్వాతి కాలములలో భాస్కర శతకము, వేణుగోపాల శతక కర్థలు కూడా సుమతి శతకాన్ని అనుసరించారు.
పూర్తి పద్యం రానివారు కూడా ఒకటి రెండు పాదాలను ఉట్టంకించడం తరచు జరుగుతుంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు
అక్కరకు రాని చుట్టము
అప్పిచ్చువాడు, వైద్యుడు
ఇత్తడి బంగారమగునె
తను వలచినదియె రంభ
ఖలునకు నిలువెల్లవిషము
బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ
కనకపు సింహాసనమున శునకము కూర్చుండ బెట్టి
ఎప్పుడు సంపదలు గలిగిన నప్పుడు బంధువులు వత్తురు
తరతరాలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకూ, పంతుళ్ళు తమ శిష్యులకూ సుమతీ శతకంలోని నీతులను ఉపదేశిస్తున్నారు. 700 సంవత్సరాల తరువాత కూడా ఇందులోని సూక్తులు నిత్య జీవనానికి సంపూర్ణంగా వర్తిస్తాయి. చెప్పదలచిన విషయాన్ని సూటిగా, కొద్ది పదాలలో చెప్పిన విధానం అత్యద్భుతం. మొదటి పద్యంలోనే కవి "ధారాళమైన నీతులు నోరూరగ జవులుపుట్ట, ఔరా యనగా, నుడివెద"నని చెప్పుకున్నాడు. ఇందుకు పూర్తి న్యాయం చేయగలిగాడు.
కొన్ని అధిక్షేపింపదగిన విషయాలు
ఇప్పటి "సామాజి సృహ" పరంగా ఉన్న అవగాహనతో చూస్తే కొన్ని పద్యాలలో కనిపించే ఆనాటి దృష్టి అసంబద్ధంగా కనిపిస్తుంది. "నమ్మకుమీ వామ హస్తుని"). ముఖ్యంగా స్త్రీల పట్ల, కొన్ని కులాల పట్ల వ్యక్తమైన అభిప్రాయాలు దురాచారాలుగా అనిపిస్తాయి. ("కోమలి నిజము, గొల్ల ని సాహిత్య విద్య" ఉండవని కవి వ్రాశాడు). ఎవరైనా తమ కాలానికి సంబంధించిన అభిప్రాయాలకు బందీలే అని మనం గ్రహించాలి.
మూలాలు
వనరులు
అడ్లూరి శేషు మాధవరావు వ్యాసం
https://web.archive.org/web/20130121194002/http://eenadu.net/Magzines/Sahitisampadainner.aspx?qry=sumathi
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
Open Source Audio by Dr. Goli Anjaneyulu.
Sumati Satakam Versions: Adyar Library
Sumati Satakam Versions: Charles Philip Brown
Sumati Satakam Transcription, Andhra Pradesh Sate Oriental Manscript Library and Research Institute
https://kalyankrishna4886.files.wordpress.com/2013/09/sumathisatakalu-english.pdf |
పురాణాలు | https://te.wikipedia.org/wiki/పురాణాలు | thumb|300px|ప్రముఖ ఎనిమిది విగ్రహాలుతో యుద్ధంలో రాక్షసుడు రక్తబీజుడు నకు వ్యతిరేకంగా దేవత దుర్గ, మార్కండేయ పురాణము లోని దేవి మహాత్మ్యం లోని చిత్రం.
అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగంలో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.
పురాణ వాఙ్మయం ఆవిర్భావం
thumb|300px|భాగవత పురాణము ఆధారంగా వరాహ అవతారము యొక్క ఒక ఉదాహరణ
"పురాణ" శబ్దానికి "పూర్వ కాల కథా విశేషం" అన్న అర్ధం నిరూఢమై ఉంది. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటికే ఈ వాఙ్మయం ప్రస్తుతం లభిస్తున్న రూపు సంతరించుకొంది కాని వేదవాఙ్మయ కాలానికే దీని మౌలిక రూపం ఏర్పడి ఉండాలి. యజ్ఞసమయంలో ఋక్సామచ్ఛందాలతో పాటు ఉచ్చిష్ట రూపమై పురాణం ఆవిర్భవించిందని అధర్వణ వేదంలో తొలిసారిగా ప్రస్తావింపబడింది. శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్తు, గోపథ బ్రాహ్మణం వంటి గ్రంథాలలో పురాణ ప్రశంసలున్నాయి. ఆదికాలంలో ఇది వేదాధ్యయనానికి ఒక సాంగ సాధన ప్రక్రియగా ఉండేదని, కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించి మతసాహిత్యంగా రూపుదిద్దుకొందని విమర్శకుల ఊహ. సుదీర్ఘ కాలం జరిగే యజ్ఞయాగాది కార్యాల సమయంలో నడుమ నడుమ విరామ వేళలలో ఇష్ట కథా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమైన దేతల కథలను ఇలా చెబుతూ ఉండవచ్చును. మొదటి కాలంలో బహుశా యఙ్నాన్ని నిర్వహించే పండితులే ఈ కథాకాలక్షేపం జరిపి ఉండవచ్చును కాని ఇది ప్రధాన కార్యక్రమం కాదు గనుక క్రమంగా సూత పౌరాణికులకు (క్షత్రియునకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించిన సంతానం) ఈ విధి సంక్రమించి ఉండవచ్చును. ఇలాంటి ఐతిహ్యం వాయు బ్రహ్మాండ విష్ణు పురాణాలలో కనిపిస్తుంది.శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి శేషగిరిరావు
వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన సూత శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. వీరిలో అకృతవర్ణుడు, సావర్ణి, కాశ్యప శాంశపాయనులు వేరువేరుగా మూడు పురాణ సంహితలను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంథజాతమంతా పురాణ వాఙ్మయానికి మూలమయింది. ఈ విధంగా పరిశీలిస్తే అప్పటి యాఙ్ఞికులైన బ్రాహ్మణుల అధీనంలో ఉన్నవాఙ్మయాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వ్వస్థీకరించి, కాలానుగుణంగా అవుసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా క్రీ.పూ. 600-300నాటికే పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొందని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకొంటూ సా.శ. 12వ శతాబ్దివరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును.
ప్రణవం వేదాలు పురాణాల పుట్టుక
పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్దం వెలువడింది. ఆ శబ్దంలో నుండి అ కార ఉకార మకార శబ్ధాలు కూడిన ఓంకారశబ్దం ఆవిర్భవించింది. "అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్దంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ 'అ'కార, 'ఉ'కార 'మ'కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.
వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి.
పురాణం లక్షణాలు
ప్రతి పురాణం కుడా పురాణాల ముఖ్యమైన లక్షణాలను మొదటి సర్గలలో చెబుతుంది. కూర్మపురాణంలో చెప్పబడిన పురాణ ఉపోద్ఘాతము ప్రకారం
సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం
సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.
సర్గము - సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది
ప్రతి సర్గము - సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం)
వంశము - పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట
మన్వంతరము - ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట
వంశాలచరిత్ర
భాగవతంలో పురాణ లక్షణాలు పది చెప్పబడ్డాయి
సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ
వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయ
దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదు:
అనగా సర్గము (సృష్టి), ప్రతిసర్గము (ప్రళయము), వృత్తి (వ్యాపారము), రక్షా (పరిపాలవ), అంతరము (మన్వాదుల కాలము), వంశము (వంశాదుల విషయము), వంశానుచరితము (సూర్య, చంద్ర వంశస్థుల కథనాలు), సంస్థా (స్థితి), హేతువు (కారణము), అపాశ్రయము (ఆశ్రయ విషయాలు) అనే పదీ పురాణ లక్షణాలు. కొంతమంది ఇలా పది లక్షణాలున్నవి మహాపురాణాలని, ఐదు లక్షణాలున్నవి పురాణాలని వర్గీకరిస్తున్నారు."అష్టాదశ పురాణములు" - వాడ్రేవు శేషగిరిరావు
పురాణాల విభజన
పురాణాల పేర్లు చెప్పే శ్లోకం
సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందములో చెప్పబడింది.
మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్
పైన చెప్పిన వాటిలో:
"మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
"భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం
"బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
"వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం
మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:
అ -- అగ్ని పురాణం
నా—నారద పురాణం
పద్—పద్మ పురాణం
లిం -- లింగ పురాణం
గా—గరుడ పురాణం
కూ -- కూర్మ పురాణం
స్క—స్కంద పురాణం
అష్టాదశ పురాణములలో శ్లోకాలు శ్లోకాల సంఖ్య వివిధ గ్రంధాలలో తేడాగా ఉంది. వాడ్రేవు శేషగిరిరావు రచన "అష్టఅదశ పురాణములు"లో ఇచ్చిన సంఖ్య (ఇతర సంఖ్యలో భిన్నంగా ఉంటే గనుక) బ్రాకెట్లలో ఉంచబడింది.
బ్రహ్మ పురాణం - బ్రహ్మదేవుడు మరీచికి బోధించింది. 10,000 శ్లోకములు కలది.
పద్మ పురాణము - బ్రహ్మదేవునిచే చెప్పబడింది. 55,000 శ్లోకములు కలది.
విష్ణు పురాణం - పరాశరుని రచన. దీనిలో 63,000 శ్లోకములు ఉన్నాయి.
శివ పురాణం - వాయుదేవునిచే చెప్పబడింది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
లింగ పురాణము - నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉంది.
గరుడ పురాణం - విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.
నారద పురాణము - నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించింది. 18,000 శ్లోకములు కలది.
అగ్ని పురాణం - భృగుమహర్షిచే చెప్పబడింది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
స్కంద పురాణం - కుమారస్వామిచే చెప్పబడింది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.
భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం - శతానీకుడు సుమంతునకు బోధించింది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
బ్రహ్మవైవర్త పురాణం - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించింది. 18,000 (12,000) శ్లోకములు కలది.
మార్కండేయ పురాణం - పక్షులు క్రోష్టి (జైమిని) కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉంది.
వామన పురాణము - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.
వరాహ పురాణం - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించింది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
మత్స్య పురాణం - శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
కూర్మ పురాణం - శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.
బ్రహ్మాండ పురాణం - బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.
దేవతాప్రాముఖ్యాన్ని గుణాన్ని చెప్పే శ్లోకం
ఈ క్రింది శ్లోకం అష్టాదశ పురాణాలను మూడు విధాలుగా విభజిస్తూ వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాలుగా చెబుతుంది.
వైష్ణవం నారదీయం చ తధా భాగవతం శుభం గారుడంచ తధా పాద్మం
వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విష్ణ్వేయాని శుభానిదై
బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం బ్రహ్మరాజ నిబోధతే
మాత్స్య కౌర్మం తధా లైంగ శైవం స్కౌందం ఆగ్నేయంచ షడేతాని తామసాని భోధమే
ఇలాంటిదే మరొక శ్లోకం
బ్రాహ్మం పాద్వం వైష్ణవంచ శైవం వైంగం చ గారుడమ్
నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంజ్ఞికమ్
భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కండేయం చ వామనమ్
వారాహం మత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్
వైష్ణవ పురాణాలు - సాత్విక గుణాన్ని
బ్రహ్మ పురాణాలు - రాజస గుణాన్ని
శైవ పురాణాలు - తామస గుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి అని పై శ్లోకం అర్థం
మహాపురాణాలు
పురాణము పేరు శ్లోకములు సంఖ్య వ్యాఖ్యలు అగ్ని 15,400 శ్లోకములు వాస్తు శాస్త్రం, రత్నశాస్త్రం వివరాలను కలిగి ఉంది. భాగవత 18,000 శ్లోకములు విష్ణువు యొక్క పది అవతారాలు చెప్పడం, పురాణాలల్లో యొక్క అత్యంత ప్రసిద్ధి, ప్రముఖం అయినదిగా భావించింది., column 3, under the entry Bhagavata. దీని పదవ, పొడవైనది అని చెప్పవచ్చు, కృష్ణ పనులు, వ్యాఖ్యానం, తన చిన్ననాటి లీలలు పరిచయం, తరువాత అనేక భక్తి ఉద్యమాలు ఒక ప్రక్రియ ద్వారా విశదీకరించింది. బ్రహ్మ 10,000 శ్లోకములు గోదావరి, దాని ఉపనదులు వివరిస్తుంది.. బ్రహ్మాండ 12,000 శ్లోకములు లలితా పంచాక్షరీ, కొన్ని హిందువులు ప్రార్థనలు వర్ణించు ఒక వాచకం కలిపి ఉంది. బ్రహ్మవైవర్త 17,000 శ్లోకములు కృష్ణ, వినాయకుడు దేవతలు,పూజించే మార్గాలను వివరిస్తుంది.. గరుడ 19,000 శ్లోకములు మరణం, దాని తర్వాత కార్యాలు వివరిస్తుంది. హరివంశ 16,000 శ్లోకములు ఇతిహాసములు (పురాణ కవిత్వం) పరిగణించబడుతుంది. కూర్మ 17,000 శ్లోకములు విష్ణువు యొక్క పది ప్రధాన అవతారములు యొక్క రెండవది ఉంది. లింగ 11,000 శ్లోకములు విశ్వం యొక్క లింగం వైభవం, శివ యొక్క చిహ్నం, మూలం వివరిస్తుంది. ఇది
లింగం గురించి అనేక కథలు ఉన్నాయి. ఇందులో విష్ణు, బ్రహ్మ మధ్య వివాదం ఎలా అనివార్యమైంది, అలాగే ఎలా పరిష్కరించవచ్చు అనేది కూడా అగ్ని లింగం తెలియ జేస్తుంది. మార్కండేయ 09,000 శ్లోకములు దేవి మహాత్మ్యం, గుళ్ళల్లో పూజారులు/శాక్తేయులు మొదలగు వారి కోసం ఒక ముఖ్యమైన వాచకం, పొందుపరచబడింది. మత్స్య 14,000 శ్లోకములు మత్స్యావతారము కథ, విష్ణువు యొక్క పది ప్రధాన అవతారాల యొక్క మొదటి అవతారం. ఇది కూడా పలు రాజ వంశాల వారసత్వపు వివరాలను కలిగి ఉంది. నారద 25,000 శ్లోకములు వేదాలు, వేదాంగాలు గొప్పతనం వర్ణిస్తుంది. పద్మ 55,000 శ్లోకములు భగవద్గీత గొప్పతనాన్ని వివరిస్తుంది. అందువల్ల, ఇది కూడా గీతామహత్మ్యము గా (లిట్. భగవద్గీత ఘనత ) అంటారు. శివ 24,000 శ్లోకములు శివుడు, ఆయన గురించి ఇతర కథలు, పూజలు, శివ గొప్పతనం, గొప్పతనాన్ని వివరిస్తుంది. స్కంద 81,100 శ్లోకములు స్కంధ (లేదా కార్తికేయ), శివుడు యొక్క కుమారుడు పుట్టిన వివరాలు వివరిస్తుంది. ఇది చాలా పొడవైన పురాణం., ఇందులో సంబంధిత పురాణములు, ఉపమానరీతిగా, కీర్తనలు, కథలు భారతదేశంలో తీర్థయాత్రా కేంద్రాలలో భౌగోళిక స్థానాలను కలిగిన ఒక అసాధారణమైన, కచ్చితమైన పుణ్యస్థల సూచికను కలిగి ఉంది. అనేక ఆచూకీ లభ్యం కాలేని సూక్తులను వాచకము రూపములో అందిస్తుంది. వామన 10,000 శ్లోకములు ఉత్తర భారతదేశంలో కురుక్షేత్రం చుట్టూ ప్రాంతాల్లో వాటిని వివరిస్తుంది. వరాహ 24,000 శ్లోకములు విష్ణు భక్తి ఆచారాలు, వివిధ రూపాలు ప్రార్థన వివరిస్తుంది. శివుడు, దుర్గ యొక్క అనేక దృష్టాంతాలు కూడా కలిగి ఉంది. వాయు 24,000 శ్లోకములు శివ పురాణం యొక్క మరో పేరు విష్ణు 23,000 శ్లోకములు విష్ణువు అనేక పనులు, ఆయనని పూజించేవారు వివిధ మార్గాలను వివరిస్తుంది.
వర్గీకరణ
మహాపురాణాలు దైవము యొక్క మూడు రూపములు ప్రకారంగా వర్గీకరించ బడ్డాయి.
త్రిమూర్తి:
వైష్ణవ పురాణాలు: విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణము, గరుడ పురాణం, పద్మ పురాణము, వరాహ పురాణం, వామన పురాణము, కూర్మ పురాణం, మత్స్య పురాణము బ్రహ్మ పురాణాలు: బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణము, భవిష్య పురాణం, శైవ పురాణాలు: శివ పురాణము, లింగ పురాణము, స్కంద పురాణం, అగ్ని పురాణం
పద్మ పురాణంలో, ఉత్తర ఖండంలో (236.18-21), దానికదే ఒక వైష్ణవ పురాణం, మూడు గుణాలలో లేదా లక్షణాలను అనుగుణంగా పురాణాల్లో వర్గీకరించింది; సత్యం, అభిమానం, ఉదాసీనత:
సత్వ ("నిజం; స్వచ్ఛత") విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణము, గరుడ పురాణం, పద్మ పురాణము, వరాహ పురాణం రాజస ("డిమ్నెస్; అభిరుచి") బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణము, భవిష్య పురాణం, వామన పురాణము బ్రహ్మ పురాణము తామస ("చీకటి; అజ్ఞానం") మత్స్య పురాణము, కూర్మ పురాణం, లింగ పురాణము, శివ పురాణం స్కంద పురాణం, అగ్ని పురాణం
వ్రాతప్రతులు
thumb|300px|11 వ శతాబ్ధానికి చెందిన నేపాలు తాళపత్ర వ్రాతప్రతుల సంస్కృత గ్రంథాలు (మార్కండేయ పురాణం)
పురాణాల వ్రాతప్రతుల అధ్యయనం చాలా అస్థిరంగా ఉన్నందున సవాలుగా ఉంది.Ludo Rocher (1986), The Puranas, Otto Harrassowitz Verlag, , pages 59-67Gregory Bailey (2003), The Study of Hinduism (Editor: Arvind Sharma), The University of South Carolina Press, , pages 141-142 ఇది మహాపురాణాలు, ఉపపురాణాలన్నింటికి వర్తిస్తుంది. పురాణగ్రంధాలు అధికంగా ముఖ్యంగా పాశ్చాత్య పండితుల ఉపయోగంలో ఉన్నాయి. "ఒక వ్రాతప్రతి ఆధారంగా లేదా యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిన కొన్ని వ్రాతప్రతుల మీద ఆధారపడి ఉన్నాయి". అదే శీర్షికతో విభిన్నమైన లిఖిత ప్రతులు ఉన్నప్పటికీ. పురాణ వ్రాతప్రతుల ఉనికిని పండితులు చాలాకాలానికి ముందుగా గుర్తించారు. ఇవి "ముద్రిత ప్రతులకు చాలా భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది". ఇది ఏది కచ్చితమైనదో అస్పష్టంగా ఉంది. యాదృచ్ఛికంగా లేదా చెర్రీపిక్డు ప్రింటెడు ప్రతుల నుండి తీసుకోబడిన తీర్మానాలు భౌగోళికంగా విశ్వజనీయమైనవి. అదే శీర్షిక పురాణ వ్రాతప్రతులలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. కానీ ప్రాంతీయ భాషలైన తమిళం, తెలుగు, బెంగాలీ, ఇతరులు ఎక్కువగా విస్మరించబడ్డాయి.
కాలక్రమానుసార మార్పులు, చేర్పులు
మధ్యయుగ శతాబ్దాల నుండి కొత్తగా కనుగొన్న పురాణాల వ్రాతప్రతులు పండితుల దృష్టిని ఆకర్షించాయి. పురాణ సాహిత్యం కాలక్రమేణా నెమ్మదిగా పునర్నిర్మాణంలో అనేకమార్పులు సంభవించాయి. అలాగే అనేక అధ్యాయాలను ఆకస్మికంగా తొలగించడం కొత్త సమాచారంతో భర్తీ చేయడం వంటివి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పురాణాలు 11 వ శతాబ్దం లేదా 16 వ శతాబ్దానికి ముందు ఉన్న వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి.
ఉదాహరణకు కొత్తగా కనుగొన్న నేపాలులోని స్కంద పురాణం తాటి-ఆకు వ్రాతప్రతి సా.శ. 810 నాటిది అయినప్పటికీ వలసరాజ్యాల కాలం నుండి దక్షిణ ఆసియాలో చెలామణి అవుతున్న స్కంద పురాణం సంస్కరణలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంది.Dominic Goodall (2009), Parākhyatantram, Vol 98, Publications de l'Institut Français d'Indologie, , pages xvi-xviiR Andriaensen et al (1994), Towards a critical edition of the Skandapurana, Indo-Iranian Journal, Vol. 37, pages 325-331 మరో నాలుగు వ్రాతప్రతుల తదుపరి ఆవిష్కరణలు, పత్రం రెండుసార్లు పెద్ద పునర్ముద్రణల ద్వారా వెళ్ళిందని సూచిస్తుంది. మొదట 12 వ శతాబ్దానికి ముందు, 15 వ -16 వ శతాబ్దంలో సంభవించిన రెండవ పెద్ద మార్పు కారణాలు అస్పష్టంగా ఉన్నాయి. స్కంద పురాణం వ్రాతప్రతులు విభిన్న సంస్కరణలు కాలక్రమేణా "చిన్న" పునరావృత్తులు, అంతర్కాలుష్యంతో రచనలోని ఆలోచనల అవినీతిని సూచిస్తున్నాయి.Kengo Harimoto (2004), in Origin and Growth of the Purāṇic Text Corpus (Editor: Hans Bakker), Motilal Banarsidass, , pages 41-64
ప్రతి పురాణం కూర్పు తేదీ వివాదాస్పద సమస్యగా ఉందని రోచరు పేర్కొన్నాడు. ప్రతి పురాణ వ్రాతప్రతులు ఎంసైక్లోపీడియా శైలిలో ఉన్నాయని డిమ్మిటు, వాను బ్యూటెనెను పేర్కొన్నాడు. ఇవి ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరిచే వ్రాయబడ్డాయి అని నిర్ధారించడం కష్టం:
నకిలీలు
చాలా వ్రాతప్రతులు తాటి ఆకు మీద వ్రాయబడ్డాయి లేదా బ్రిటిషు ఇండియా వలసరాజ్యాల కాలంలో కాపీ చేయబడ్డాయి. కొన్ని 19 వ శతాబ్దంలో ఉన్నాయి. వివిధ పురాణాల మీద అధ్యయనాలు తరచూ నకిలీల కారణంగా బాధించబడుతుందని పురాణాల ప్రచారంలో స్వేచ్ఛ సాధారణమైనదని, పాత వ్రాతప్రతులను కాపీ చేసిన వారు పదాలను భర్తీ చేశారని లేదా వలసరాజ్యాల పండితులు ప్రచురణ మీద ఆసక్తి చూపుతున్నారనే సిద్ధాంతానికి తగినట్లుగా కొత్త విషయాలను చేర్చారని లూడో రోచరు పేర్కొన్నాడు.
అనువాదాలు
1840 లో విష్ణు పురాణం సంస్కరణ ఒకటి ప్రారంభ ఆంగ్ల అనువాదాలలో ఒకటి ప్రచురించబడింది.HH Wilson (1840), Vishnu Purana Trubner and Co., Reprinted in 1864 అదే వ్రాతప్రతులు విల్సను అనువాదం మన్మధ నాథుదత్తు చేత పునర్నిర్వచించబడి 1896 లో ప్రచురించబడింది.MN Dutt (1896), Vishnupurana Eylsium Press, Calcutta " ఆల్ ఇండియా కాశీరాజ్ ట్రస్టు " పురాణాల సంచికలను ప్రచురించింది.
మారిదాసు పౌల్లే (మరియాదాసు పిళ్ళై) 1788 లో భగవత పురాణం తమిళ ప్రతుల నుండి ఒక ఫ్రెంచి అనువాదాన్ని ప్రచురించారు. ఇది ఐరోపాలో విస్తృతంగా పంపిణీ చేయబడింది. ఇది 18 వ శతాబ్దపు హిందూ సంస్కృతి, హిందూ మతం వలసరాజ్యాల కాలంలో చాలా మంది యూరోపియన్లకు పరిచయం అయ్యింది. 1795 లో అదే రచనను " లే భగవత" పేరుతో భిన్నమైన అనువాదాన్ని పాండిచేరి నుండి పౌల్లే తిరిగి ప్రచురించాడు.Jean Filliozat (1968), Tamil Studies in French Indology, in Tamil Studies Abroad, Xavier S Thani Nayagam, pages 1-14 పౌలు అనువాదం నకలు పారిసులోని బిబ్లియోథెకు నేషనలు డి ఫ్రాంసులో భద్రపరచబడింది.
ప్రభావం
thumb|పురాణాలు హిందువుల పండుగలు, వివిధకళాలను ప్రభావితం చేసాయి.
Katherine Zubko (2013), The Bhagavata Purana: Sacred Text and Living Tradition (Editors: Ravi Gupta and Kenneth Valpey), Columbia University Press, , pages 181-201
భారతీయ సాహిత్యం పురాణాల శైలి దేశంలోని సంస్కృతి విద్య అధ్యయన వేత్తలు, ముఖ్యంగా భారతీయ అధ్యయన వేత్తలు అత్యంతంగా ప్రభావితం చేసాయి. "సంస్కృతి మిశ్రితం"లో ఆచారబద్ధమైన ఆచారాల నుండి వేదాంత తత్వశాస్త్రం వరకు, కల్పిత ఇతిహాసాల నుండి విభిన్న విశ్వాసాలను కలగలిపి సమగ్రపరచడం జరిగింది. వాస్తవిక చరిత్ర, వ్యక్తిగత ఆత్మపరిశీలన, యోగా నుండి సామాజిక వేడుకలు, ఉత్సవాలు, దేవాలయాల నుండి తీర్థయాత్ర వరకు, ఒక దేవుడి నుండి మరొక దేవునికి, దేవతల నుండి తంత్రానికి, పాత నుండి క్రొత్త వరకు కూడా ప్రభావం ప్రదర్శించాడు.Gregory Bailey (2003), The Study of Hinduism (Editor: Arvind Sharma), The University of South Carolina Press, , pages 162-167 ఈ అద్భుత బహిరంగ పాఠాలు కాలక్రమేణా సామాజికంగా కూర్చబడ్డాయి. ఇది గ్రెగు బెయిలీ, హిందూ సంస్కృతిని "క్రొత్త విషయాలను నిరంతరం చేరుస్తూనే పాతదాన్ని కాపాడుకోవడానికి" అనుమతించి ఉండవచ్చు. "అవి అవి గత 2,000 సంవత్సరాలలో సాంస్కృతిక అనుసరణ, పరివర్తన రికార్డులు"గా ఉన్నాయి.Greg Bailey (2001), Encyclopedia of Asian Philosophy (Editor: Oliver Leaman), Routledge, , pages 442-443
పురాణ సాహిత్యం వివిధ భాషలతో వివిధ ఆర్థిక తరగతుల నుండి వివిధ రాజ్యాలు, సాంప్రదాయాలలో, ప్రజల వైవిధ్యత "సంస్కృతి, వసతి"ను ప్రభావితం చేసింది. సమకాలీన "హిందూ మతం సాంస్కృతిక సమైఖ్యతని"ను కృష్ణుడు ప్రభావితం చేసాడని సూచిస్తున్నాయి.R Champakalakshmi (2012), Cultural History of Medieval India (Editor: M Khanna), Berghahn, , pages 48-50 వారు భారతదేశంలో సాంస్కృతిక బహుళ్యాన్ని ప్రభావితం చేయడంలో సహాయపడ్డారని సాహిత్య రికార్డు సూచిస్తుంది.
పురాతన మధ్యయుగ భారతదేశంలో సాంస్కృతిక మార్పిడి, ప్రసిద్ధ విద్యకు పురాణాలు సమర్థవంతమైన మాధ్యమంగా పనిచేశాయని ఓం ప్రకాషు పేర్కొన్నారు. ఈ గ్రంథాలు వాయు పురాణంలోని పాశుపత విష్ణు పురాణంలోని సత్వా, మార్కెండేయ పురాణంలోని దత్తాత్రేయ, భవష్య పురాణంలోని భోజకులు వంటి ప్రాంతీయ దేవతలను స్వీకరించి వివరించి సమగ్రపరిచాయి. ఇంకా ప్రకాషు ఇలా చెబుతున్నాడు. అవి "కవితలు, నాటకీయత, వ్యాకరణం, నిఘంటువు, ఖగోళ శాస్త్రం, యుద్ధం, రాజకీయాలు, వాస్తుశిల్పం, భౌగోళికం, ఔషధం వంటి లౌకిక విషయాలకు అగ్ని పురాణం, గరుడ పురాణంలో సుగంధ ద్రవ్యాలు, లాపిడరీ ఆర్ట్స్, చిత్రకళలు, శిల్పం, విష్ణుధర్మోత్తర పురాణంలోని ఇతర కళలు " మొదలగు అంశాలు ప్రస్తావించాయి.Om Prakash (2004), Cultural History of India, New Age, , pages 33-34
భారతీయ కళలు
పురాణాల సాంస్కృతిక ప్రభావం భారతీయ శాస్త్రీయ కళలకు విస్తరించింది. పాటలు, దక్షిణ భారతదేశంలోని భరత నాట్యం ఈశాన్య భారతదేశంలో రాసా లీల వంటి నృత్య సంస్కృతి,Guy Beck (2013), The Bhagavata Purana: Sacred Text and Living Tradition (Editors: Ravi Gupta and Kenneth Valpey), Columbia University Press,, pages 181-201
నాటకాలు, పారాయణాలు పురాణాలతో ప్రభావితమయ్యాయి.Ilona Wilczewska (2013), The Bhagavata Purana: Sacred Text and Living Tradition (Editors: Ravi Gupta and Kenneth Valpey), Columbia University Press, , pages 202-220
పండుగలు
పురాణ సాహిత్యంలో హోలీ, దీపావళి, దుర్గా పూజ వంటి ప్రధాన హిందూ సాంస్కృతిక ఉత్సవపురాణాలు, చంద్ర మానం ఆచారాలు, వేడుకలు ఉన్నాయి.A Whitney Sanford (2006), Alternative Krishnas: Regional and Vernacular Variations on a Hindu Deity (Editor: Guy Beck), State University of New York Press, , pages 91-94Tracy Pintchman (2005), Guests at God's Wedding: Celebrating Kartik among the Women of Benares, State University of New York Press, , pages 60-63, with notes on 210-211
ఉపపురాణాలు
ఈ అష్టాదశపురాణాలే కాకుండా ఉపపురాణాలు కూడా 18 ఉన్నాయి. అవి:
నరసింహ
శివధర్మ
దౌర్వాస
నారదీయ పురాణము
కాపిల
మానవ
ఔసనశ
బ్రహ్మాండ
వారున
కౌశిక
లైంగ
సాంబ
సౌర
పారాశర
మారీచ
భార్గవ
స్కాంద
సనత్కుమార
ఇవి కూడా చూడండి
ముంబ్రా దేవి ఆలయం
మూలాలు
వనరులు
"అష్టాదశ పురాణములు" - రచన: వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ: సోమనాధ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)
శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - రచన : ఏల్చూరి శేషగిరిరావు - ప్రచురణ : శ్రీరామకృష్ణ మఠము, హైదరాబాదు
బయటి లింకులు
మన పురాణాలలోని నీతికథలు
వర్గం:హిందూ గ్రంథాలు |
అష్టాదశ పురాణములు | https://te.wikipedia.org/wiki/అష్టాదశ_పురాణములు | దారిమార్పు పురాణాలు |
పురాణముల పట్టిక | https://te.wikipedia.org/wiki/పురాణముల_పట్టిక | దారిమార్పు పురాణాలు |
తెలుగు శాసనాలు | https://te.wikipedia.org/wiki/తెలుగు_శాసనాలు | thumb|వేయి స్తంభాల గుడి లోని రుద్రదేవుని శాసనం చరిత్ర, భాషా కావ్యరచనా విషయాలలో ముఖ్యమైన శాసనం. ఇది చాళుక్యుల తర్వాత కాకతీయులు స్వాతంత్ర్యం వహించుటకు కారణమైంది. ఇందులో అనేక విజయాల గురించి రమ్యమైన భాషాశైలిలో చెప్పబడింది.
అశోకుని శాసనాలలో కనిపించే మౌర్యలిపియే భారతీయ భాషలన్నిటికి మాతృక అనిపిస్తున్నది. అందులోనుండే తెలుగు అక్షరాలు రూపొందినా యనిపిస్తుంది.తెలుగు శాసనాలు - రచన: జి. పరబ్రహ్మశాస్త్రి - ప్రచురణ: ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు (1975) ఇంటర్నెట్ ఆర్చీవులలో లభ్యం కుబ్బీరకుని భట్టిప్రోలు శాసనము, అశోకుని ఎఱ్ఱగుడిపాడు (జొన్నగిరి) గుట్టమీది శాసనము ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో లభించే మొదటి వ్రాతలుగా భావిస్తున్నారు. వాటిలోని భాష ప్రాకృతము, లిపి బ్రాహ్మీలిపి.
తరువాత అమరావతిలోని నాగబు అనే పదము (సా.శ. 1వ శతాబ్ది), విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" (సా.శ. 6వ శతాబ్ది) మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు. నాగార్జునకొండ వ్రాతలలో కూడా తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రాకృత శాసనాలు లేదా సంస్కృత శాసనాలు. కనుక తెనుగు అప్పటికి జనసామాన్యంలో ధారాళమైన భాషగా ఉన్నదనడానికి ఆధారాలు లేవు. ఆరవ శతాబ్ది తరువాత బ్రాహ్మీలిపినే కొద్ది మార్పులతో తెలుగువారు, కన్నడంవారు వాడుకొన్నారు. అందుచేత దీనిని "తెలుగు-కన్నడ లిపి" అని పరిశోధకులు అంటారు.
అనేక ఆధారాలు
6,7 శతాబ్దాలలో పల్లవ చాళుక్య సంఘర్షణల నేపథ్యంలో రాయలసీమ ప్రాంతం రాజకీయంగా చైతన్యవంతమయ్యింది. ఈ దశలో రేనాటి చోడులు సప్తసహస్ర గ్రామ సమన్వితమైన రేనాడు (కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు) పాలించారు. తెలుగు భాష పరిణామంలో ఇది ఒక ముఖ్యఘట్టం.ఆంధ్రుల చరిత్ర - రచన: ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2003) వారి శాసనాలు చాలావరకు తెలుగులో ఉన్నాయి. వాటిలో ధనంజయుని కలమళ్ళ శాసనం (వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా) మనకు లభిస్తున్న మొదటి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది సా.శ. 575 కాలందని అంచనా. అంతకుముందు శాసనాలలో చెదురు మదురుగా తెలుగు పదాలున్నాయి గాని సంపూర్ణమైన వాక్యాలు లేవు.
ఆ తరువాత జయసింహవల్లభుని విప్పర్ల శాసనము సా.శ. 641 సంవత్సరానికి చెందినది. 7,8, శతాబ్దులలోని శాసనాలలో ప్రాకృత భాషా సంపర్కము, అరువాతి కాలంలో సంస్కృత భాషా ప్రభావం అధికంగా కానవస్తాయి. 848 నాటి పండరంగుని అద్దంకి శాసనములో ఒక తరువోజ పద్యమూ, తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి యుద్ధమల్లుని బెజనాడ శాసనములో ఐదు సీసము (పద్యం) పద్యాలున్నాయి. 1000 ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న విరియాల కామసాని గూడూరు శాసనములో మూడు చంపకమాలలు, రెండు ఉత్పల మాలలు వ్రాయబడ్డాయి.దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంథాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.
ధనంజయుని కలమళ్ళ శాసనం
సుమారు సా.శ. 575 - కమలాపురం తాలూకా - (ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 221) కు చెందిన ఈ శాసనం మనకు లభించే మొట్ట మొదటి పూర్తి తెలుగు శాసనం.
..........
కల్ము[తు]రా
జు ధనంజ
యుదు రేనా
ణ్డు ఏళన్
చిఱుంబూరి
రేవణకాలు [పం]
పు చెనూరుకాజు
అఱి కళా ఊరి [-]
ణ్డవారు ఊరి ... ...
... ....
..... ... పఞ్చ [మ]
హా పాతకస
కు
ఎరికల్ మహారాజు ధనుంజయుడు రేనాడును ఏలుతుండగా చిఱుంబూరు అనే గ్రామానికి చెందిన రేవణ అనే ఉద్యోగి పంపున చెనూరు గ్రామానికి చెందిన 'కాజు' (వాక్యం అసంపూర్ణం) - ఈ ధర్మం చెడగొట్టువాడు పంచమహాపాతకుడగును - అని కావచ్చును. కానీ ప్రస్తుతం ఈ శాసనం ఎక్కడుందో తెలియరావడం లేదు. సమాచార హక్కు చట్టంద్వారా డాక్టర్ వేంపల్లె గంగాధర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఆ వివరాలు తమవద్ద లేవని పేర్కొంది. ఇప్పటి వరకూ ఈ శాసనం మద్రాసులోని ఎగ్మూర్ మ్యూజియంలో వున్నదని భావిస్తూ వచ్చాం
పుణ్యకుమారుని తిప్పలూరి శాసనం
పుణ్యకుమారుని తిప్పలూరి శాసనము - 630 - - కమలాపురం తాలూకా - ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 231
సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము - 725 - - ఎపిగ్రాఫికా ఇండికా XI - పేజి 345
అరకట వేముల శాసనము - 8వ శతాబ్దం - ప్రొద్దుటూరు తాలూకా -
వేల్పుచర్ల శాసనము - జమ్మలమడుగు తాలూకా -
గణ్డ త్రిణేత్ర వైదుంబ మహారాజు వన్దాడి శాసనము - రాయచోటి తాలూకా -
కొండపఱ్తి శాసనం - 9వ శతాబ్దం - వరంగల్ వద్ద
పండరంగని అద్దంకి శాసనం (సా.శ. 848) - అద్దంకి
తెలుగు ఛందస్సులో మొదటి తరువోజ పద్య శాసనము చారిత్రకముగా చాలా విలువైనది. దీనిని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి ప్రకటించారు: పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు
బలగర్వ మొప్పగ బైలేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు బండరంగు
బంచిన సామంత పదువతో బోయ
కొట్టము ల్వండ్రెండు గొని వేంగినాటి
గొఱల్చియ త్రిభువనాంకుశ బాణ నిల్చి
కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి
కందుకూర్బెజవాడ గవించె మెచ్చి.
గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనం (సా.శ. 848-850)
గుణగ విజయాదిత్యుడు స్వయముగా వేయించిన కందుకూరు శాసనములో మనకు మొట్టమొదటి సీసపద్యం కనిపిస్తుంది.
"శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు
శివ పద వర రాజ్య సేవితుండ
ఖిలుడు ననృతరిపు బలుడు నాహవరావ
దండమోద్య సిఘాసనుండగణిత
దానమాన్యుండు దయా నిలయుండును
భండన నండన పండరంగు
...................................కొలది లేని
కొట్టము ల్వోడిచి గుణక నల్ల
తాని పక్ష పాతి................
....................విభవ గౌరవేంద్ర..
ఈ పద్యం చాల వరకూ శిథిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ కొమర్రాజు లక్ష్మణరావుగారు ఇచ్చారు.
గుణగ విజయాదిత్యుని ధర్మవరం శాసనం (సా.శ. 848-850)
గుణగ విజయాదిత్యుని ధర్మవరం శాసనంలో తొలి ఆటవెలది పద్యం కనపడుతున్నట్లుగా తెలుస్తోంది.
కిరణపురము దహళ నిరుతంబు దళెనాడున్
అచలపురము సొచ్చెనచలితుండు
వల్లభుండు గుణకె నల్లుండు (వంచి) నన్
బండరంగ చూరె పండరంగు
యుద్ధమల్లుని బెజవాడ శాసనం (సా.శ. 930) - విజయవాడ
మధ్యాక్కఱల్లో వ్రాసి చెక్కించిన ఈ పద్యశాసనాన్ని జయంతి రామయ్య పంతులు పరిష్కరించారు.
స్వస్తి నృపాంకుశాత్యంత వత్సల సత్యత్రిణేత్ర
విస్తర శ్రీయుద్ధమల్లుం డనవద్య విఖ్యాతకీర్తి
ప్రస్తుత రాజాశ్రయుండు త్రిభువనాభరణుండు సకల
వస్తు సమేతుండు రాజసల్కి భూవల్లభుం డర్థి.
పరగంగ బెజవాడ గొమరుసామికి భక్తుడై గుడియు
నిరుమమమతి నృపధాము డెత్తించె నెగిదీర్చె మఠము
గొరగల్లా కొరులిందు విడిసి బృందంబు గొనియుండువారు
గరిగాక యవ్వారణాసి వ్రచ్చిన పాపంబు గొండ్రు.
కొరివి శాసనం - (సా.శ. 930) - వరంగల్ జిల్లా మానుకోట
కొరివి గద్య శాసనము తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటులకు చెందిన ముగ్గురు సామంత రాజుల మధ్య జరిగిన పోరాటమును తెలియజేస్తుంది. తెలుగు వచనములో పటిష్ఠమైన రచన దీనిలో కనిపిస్తుంది.
శ్రీ విక్రమాదిత్య నృపాగ్ర తనయుండైన చాళుక్య భీమునకు శౌచకందర్పునకుం వేగీశ్వరునకు రణమర్దాన్వయ కులతిలకుండైన కుసుమాయుధుండు గన్నరబల్లహుని కస్తప్రాప్తంబైన రణమర్దన కండియందన భుజనీర్య బలపరాక్రమంబున దెచ్చి ... శ్రీ నిరవద్యుం డనేక సమరసంఘట్టన భుజాసి భాసురుడై తమయన్న రాజశ్రీకెల్లం దానయర్హుండై నిల్చి.
జినవల్లభుని కుర్క్యాల శాసనము - 945 - కరీంనగర్ జిల్లా కుర్క్యాల
బణపతి దీర్ఘాసి శాసనము - 997 - కళింగపట్నం
గూడూరు శాసనం - (సా.శ. 1124) - జనగామ తాలూకా, గూడూరు
అరుదగునట్టి ఎఱ్ఱనృపు నంగన గామమ సాని యాక మే
ల్గరదని బేతభూవిభుని గాకతి వల్లభుచేసి వాని దా
బరగంగ జేతబెట్టి ఘను బల్లవరాయని యాగిజొచ్చె భా
స్కర విభు చక్రవర్తి గని కాకతి నిల్పుట కోటిసేయదే !
హన్మకొండ శాసనం (సా.శ. 1163)
వేయి స్తంభాల గుడి లోని రుద్రదేవుని శాసనము చరిత్ర, భాషా కావ్యరచనా విషయాలలో ముఖ్యమైన శాసనము. ఇది చాళుక్యుల తర్వాత కాకతీయులు స్వాతంత్ర్యము వహించుటకు కారణమైనది. ఇందులో అనేక విజయముల గురించి రమ్యమైన భాషాశైలిలో చెప్పబడింది.
హస్త్యారోహణ కర్మ కర్మఠగతిం చాళుక్య చూడామణిం
శశ్వద్యుద్ధ నిబద్ధ గహ్యరమతిం యుద్ధే బబంధ క్షణాత్
కృద్ధేనోద్ధుర మంత్రకూటనగరీ నాథో థయో నిస్త్రపో
గుండః ఖండిత ఏవ ముండితశిరః క్రోడాంక వక్షఃస్థలః
కందూరోదయ చోడ వంశ విలసత్ క్షీరాబ్ధిగర్భోద్భవ
త్పద్మైకాశ్రయ రుద్రదేవనృపతేః కింవర్ణ్యతే విక్రమః
మూలాలు
వర్గం:జాబితాలు
వర్గం:తెలుగు భాష |
విష్ణుకుండినుల శాసనాలు | https://te.wikipedia.org/wiki/విష్ణుకుండినుల_శాసనాలు | దారిమార్పు విష్ణుకుండినులు#%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2 %E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81 |
లక్ష | https://te.wikipedia.org/wiki/లక్ష | thumb|ఒక లక్ష (99999+1)
లక్ష (లేదా ల్యాక్) సాంప్రదాయ సంఖ్యా మానము లోని ఒక కొలత. భారత దేశము, బంగ్లాదేశ్లలో ఇప్పటికీ దీనిని చాలా విరివిగా ఉపయోగిస్తారు. ఒక లక్ష, వంద వేలకు సమానము. వంద లక్షలు కలిపి ఒక కోటి అవును.
భారత దేశము కాక తక్కిన ప్రపంచములో సాధారణముగా ఉపయోగించే పద్ధతికి భిన్నముగా, ఈ సాంప్రదాయ సంఖ్యా మానము ప్రకారము అంకెల మధ్య విభాజకాలు వేరే పద్ధతిలో ప్రవేశపెడతారు. ఉదాహరణకు, 3 మిలియన్లు ఈ విధముగా వ్రాయబడును: 3,000,000. ఇదే విలువగల 30 లక్షలు ఈ విధముగా వ్రాయబడును: 30,00,000. కామాలు పెట్టిన తీరు గమనించండి.
ఇవి కూడా చూడండి
కోటి
భారతీయ సంఖ్యా మానము
మూలాలు
వర్గం:సంఖ్యామానాలు |
అవధానం (సాహిత్యం) | https://te.wikipedia.org/wiki/అవధానం_(సాహిత్యం) | thumb|250x250px|బెంగళూరులో 2012లో జరిగిన శతావధాని డా. గణేశ్ గారి శతావధానం కార్యక్రమ చిత్రం
అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
అవధాన స్వరూపం
కవి యొక్క ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తి (గుర్తుంచుకోగల శక్తి, memorising ability)కి పాండితీ ప్రకర్షకు అవధానం అత్యున్నత పరీక్ష. సాంప్రదాయికంగా జరిగే అష్టావధానంలో 8 మంది పృఛ్ఛకులు (ప్రశ్నలు అడిగేవారు) అవధాని చుట్టూ చేరి వివిధ రకాలైన ప్రశ్నలు (పాండిత్యాన్ని పరీక్షించేవి కొన్ని, అవధాని సహనాన్ని పరీక్షించేవి మరికొన్ని) అడుగుతూ ఉంటారు. పృఛ్ఛకులు కూడా పాండిత్య పరంగా ఉద్దండులైన వారే ఉంటారు.
ఎందరో కవి పండితులు అవధాన ప్రక్రియను జయప్రదంగా చేసి పండితుల మన్ననలను పొందారు. అవధానం విజయవంతంగా చేసిన వారిని అవధాని అని అంటారు. ఏక కాలంలో తెలుగు, సంస్కృతం - రెండు భాషల లోనూ అవధానం చేసిన పండితులు ఉన్నారు.
అవధానంలో రకాలు
అవధానాలు చాలా రకాలు. ముఖ్యంగా అవధానాలను వేదసంబంధ, సాహిత్య, సాహిత్యేతర అవధానాలుగా వర్గీకరించవచ్చు.
వేదసంబంధ అవధానాలు: స్వరావధానం, అక్షరావధానం .
సాహిత్య అవధానాలు: అష్టావధానం, శతావధానం, సహస్రావధానం... ఇలా 20దాకా ఉన్నాయి.
సాహిత్యేతర అవధానాలు: శతకలశావధానం, శభ్దావధానం, రామాయణ, భగవద్గీత అవధానాలు. ఇవి ధారణ సంబంధమైనవి. అంటే ఒక్కసారి చదివి లేదా విని గుర్తుంచుకోవడం ద్వారా మళ్లీ చెప్పేవి.
సాంకేతిక అవధానాలు: నేత్రావధానం, అంగుష్టావధానం మొదలగునవి.
శాస్త్ర సంబంధ అవధానాలు: గణితావధానం, జ్యోతిషావధానం, వైద్యావధానం, అక్షరగణితావధానం .
కళా సంబంధ అవధానాలు: చిత్రకళావధానం, నాట్యావధానం, సంగీతాష్టావధానం, చతురంగావధానం, ధ్వన్యవధానం .
సంగీత నవావధానం ..ఈప్రక్రియను ప్రారంభించిన వారు మీగడ రామలింగస్వామి. ఎనమిది మంది పృఛ్ఛకులకు, ఇరవై పద్యాలను పన్నెండు రాగాలను ఇస్తారు. వాటిలో నుండి పద్యాలు తాము కోరుకున్న రాగాలలో గానం చేయమని అడగవచ్చు. ఉదాహరణకు పాండవోద్యోగంలో బహుళ ప్రచారంలో ఉన్న పద్యం 'జెండాపై కపిరాజు ' ఇంతవరకు పాడిన నట గాయకులందరూ దీన్ని మోహన రాగంలోనే పాడారు. పరస్పర విరుద్ధమైన లక్షణాలు ఉన్న శివరంజని లేక ముల్తాన్ రాగాలలో పాడమని పృఛ్ఛకులు అడిగితే అవధాని ఆ రాగంలో పద్యభావం చెడకుండా పాడాలి. పృచ్చకులు కూడా దాదాపుగా పద్యాలను రాగయుక్తంగా పాడగలవారై ఉంటారు. అందువల్ల ఒక్కొక్క పద్యాన్ని పరస్పర విరుద్ధమైన ఛాయలున్న రాగాలలో వినగలుగుతాం.
అవధానంలో అంశాలు
అవధానంలో అనేక అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పండితుడు నిర్వహిస్తాడు. అతడిని పృచ్ఛకుడు అని అంటారు. అవధాని పాండిత్యాన్ని, సమయస్ఫూర్తినీ పరీక్షిస్తూ తగు ప్రశ్నలను సంధిస్తూ ఉంటారు పృచ్ఛకులు. ఈ అంశాలను స్థూలంగా నాలుగు వర్గాలుగా విభజించవచ్చు. అవి:
ధారణా సహిత సాహిత్య సంబంధమైన అంశాలు: వర్ణన, సమస్యాపూరణ, దత్తపది, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, ఉద్దిష్టాక్షరి (లేదా చిత్రాక్షరి), నిర్దిష్టాక్షరి (లేదా న్యస్తాక్షరి), ఇచ్చాంకశ్లోకము, నిషేధాక్షరి, శ్లోకాంధ్రీకరణము, వ్యత్యాస్తపాది, ఏకసంథాగ్రహణం, వృత్తమాలిక, లిఖితాక్షరి, నిర్దిష్ట భావానువాదంం నల్లెంట్లు మొదలైనవి.
ధారణా రహిత సాహిత్య సంబంధమైన అంశాలు: ఆకాశపురాణం, ఆశువు, పురాణపఠనం, అప్రస్తుత ప్రసంగం, కావ్యానుకరణం (పేరడీ), కావ్యోక్తి, ఛందోఃభాషణం, జావళి, కీర్తన, పాట, గేయం, చిత్రకథ, అన్యభాషోపన్యాసం, నృత్తపది, వచనకవిత, మినీకవిత, అంత్యాక్షరి, అక్షరవిన్యాసం ఇత్యాదులు.
ధారణా సహిత సాహిత్యేతర అంశాలు: ఘంటాగణనం, పుష్పగణనం, నామసమీకరణం, యాంత్రిక గణనం వగైరా.
ధారణా రహిత సాహిత్యేతర అంశాలు: సంగీతము, చదరంగము, అశ్వప్లుతం, వారగణనం, పేకాట వంటివి.
నిషిద్ధాక్షరి
వృచ్ఛకుడు ఒక విషయాన్ని గురించి ఫలానా ఛందస్సులో ఒక పద్యం చెప్పవలసినదిగా అవధానిని కోరతాడు. అవధాని ఆ విషయం మీద ఆ చందస్సులో ఒక పద్యం మొదలెడతాడు, ఒక పదంతో. అప్పుడు వృచ్ఛకుడు అవధాని చెప్పిన పదాన్ని బట్టి తరువాత ఏ అక్షరం రాగలదో ముందుగానే వూహించి ఆ అక్షరం మీద సిషేదం విధిస్తాడు. అంటే అప్పుడు ఆ అక్షరం ఉపయోగించ కూడదని అర్థం. అవధాని ఆ అక్షరం కాకుండా వేరే అక్షరంతో పద్యాన్ని కొనసాగిస్తాడు. ఈ విధంగా ఆ పద్యం పూర్తయ్యే లోపు అనేక సార్లు నిషిద్దాక్షరాన్ని ప్రయోగిస్తాడు వృచ్ఛకుడు. అవదాని పద్యభావం చెడకుండా పద్యాన్ని పూర్తి చేస్తాడు. పూర్తి చేయడమంటే ఒకేసారి పూర్తి చేయడం కాదు. అవధానం పూర్తయ్యేలోపు పూరించాలి. అవధాని ఆ పద్యంలో రెండు మూడు పాదాలు చెప్పగానే మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు. ఇంత వరకు చెప్పిన పద్య భాగాన్ని అలాగే మనసులో ముద్రించుకొని ఇచ్చిన మరో అంశానికి వెళతారు అవదాని. ఈ అవధాన ప్రక్రియ సంస్కృతంలోను, తెలుగులో మాత్రమే మనకు తెలుస్తుంది. ఇది తెలుగు భాషకు మహాభూషణము.
నిషిద్ధాక్షరి విభాగంలో అవధానిని - శ, ష, స, హ - లను ఉపయోగించకుండా శివుని పై ఒక పద్యాన్ని చెప్పమనగా అవధాని ఇలా చెప్పాడు.
డమరుకమును మ్రోగించుచు
నమరించెను మానవులకు ' అఆ ' మాలన్
కమనీయముగా వ్రాయగ
నుమతోడుగ నున్న వాని నుద్ధతి గొలుతున్.
నిర్దిష్టాక్షరి
నిర్దిష్టాక్షరి అనగా నిర్దేశించబడిన అక్షరాలు గలదని అర్థం. దీనినే న్యస్తాక్షరి అని కూడా పిలుస్తారు. వృచ్ఛకుడు ఒక విషయాన్ని గురించి ఫలానా చందస్సులో ఒక పద్యం చెప్పమని అవధానిని అడుగుతూ, పద్యంలోని నాలుగు పాదాలలో ఫలానా స్థానంలో ఫలానా అక్షరం మాత్రమే వుండాలి అని నాలుగు అక్షరాలను నిర్దేశిస్తాడు. అవధాని పృచ్ఛకుడు చెప్పిన అక్షరాలను ఉపయోగించి పద్యాన్ని పూరిస్తారు. దీనినే న్యస్తాక్షరి అని కూడా పిలుస్తారు.
దత్తపది
ఇది న్యస్తాక్షరి లాంటిదే. కాకపోతే అక్కడ ఒక పాదానికి ఒక అక్షరాన్నిస్తారు. ఇందులో ఒక్క పాదానికి ఒక్కొక్క పదాన్నిస్తారు. ఆ పదాలు కూడా ఒక దానికి ఒకటి పొంతన లేకుండా వుంటాయి. ఉదాహరణగా చెప్పాలంటే. వంకాయ, అమెరికా, రాముడు, గాందీతాత. ఒక్కొక్క పాదంలో ఒక పదాన్ని వుంచి ఫలాన చందస్సులో, ఫలాన విషయంపై ఒక పద్యం చెప్పమని వృచ్ఛకుడు ప్రశ్నను సందిస్తాడు. అవదాని ఆయా పదాలనుపయోగించి అర్థవంతమైన పద్యాన్ని చెప్పడానికి ప్రయత్నించి నాలుగు పదాలు చెప్పగానే మరొక వృచ్ఛకుడు మరో సమస్యతో అడ్డగిస్తాడు. అవధాని అంతవరకు చెప్పిన పద్యభాగాన్ని అలాగే గుర్తు పెట్టుకుని మరో సమస్యలోకి దిగాలి. ఈ దత్తపదులను పృచ్ఛకుడు వివిధ రకాలుగా అడగవచ్చు.
ఉదాహరణకు:
అశ్లీల అమంగళకరమైన పదాలు : చెప్పు - చేట - చీపురు - పేడ అనే పదాలతో శ్రీకృష్ణదేవరాయలు అల్లసానిపెద్దనకు చేసిన సత్కారం.
స్వార్థత్యాగపదాలు: అంటే ఆ పదాలకు ఉన్న అర్థాలతో కాకుండా వేరే అర్థములో పద్యం చెప్పమని కోరడం. ఒక అవధానంలో పాలు - పెరుగు - నేయి - నూనె ఈ పదాలతో అయా పదాల అర్థం రాకుండా భారతార్థంలో పద్యం చెప్పమని కోరబడింది.
పౌనరుక్త్య పదాలు: ఒకే పదాన్ని నాలుగు పాదాలలో అర్థభేదంతో పూరించమని అడగడం.
విపరీత పదాలు: ధర్మజ - భీమ - దుర్యోధన - నకుల అనే పదాలతో రామాయణార్థంలో పద్యం.
అన్యభాషాపదాలు: తాజా - ఖాజా - సోజా - జాజా అనే ఉర్దూపదాలతో సీతాకళాణం.
దేశ/నగర/పట్టణ/గ్రామ/వ్యక్తుల నామాలు: జయప్రద - స్మిత - కాంచన - జానకి అనే పదాలతో రామాయణార్థంలో పద్యం.
అర్థరహిత పదాలు:
ధ్వన్యనుకరణ పదాలు: పిల్లి - నల్లి - బల్లి - తల్లి అనే పదాలతో భారతార్థంలో పద్యం.
సుకర పదాలు: చనుము - కనుము - వినుము - కొనుము అనే పదాలతో భారతపరంగా పద్యం.
దుష్కర పదాలు:ఉష్ట్రము - భ్హ్రాష్ట్రము - రాష్ట్రము - లోష్ట్రము అన్న పదాలతో ప్రథమ కేళీ వర్ణన.
సమస్యా పూరణం.
వృచ్ఛకుడు లోక విరుద్ధంగా వున్న విషయాన్ని సమస్యగా చేసి ఒక పద్య పాదాన్ని ఇస్తాడు. అవదాని గారు తనకిచ్చిన పద్య పాదంలోని లోక విరుద్ధమైన భావాన్ని విరిచి లోకామోదమైన భావంతో పద్యాన్ని పూరించాలి. ఉదాహరణకు: కప్పను చూడంగ పాము గజగజ లాడెన్. ఈ పద్య పాదంలోని అర్థం లోక విరుద్ధము. అదే అర్థంతో పద్యాన్ని ఎవరైనా చెప్పగలరు. అందులోని అర్థాన్ని సజావుగా మార్చి పద్యం చెప్పాలి. అవధాని గారు ఈ సమస్యను స్వీకరించి మొదటి పద్య పాదంలో కొంత భాగము చెప్పగానే ...... అతని ధారణకు ఆంతరాయాన్ని కలిగిస్తూ మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు.
సమస్యాపూరణలలో రకాలు
పదసమాసవాక్య చమత్కృతి - ఈ రకం పూరణలలో సమస్య ముందు పదాన్ని వెనుక పదంతో కలిపి సమస్యను అర్థవంతగా పూరిస్తారు. ఉదాహరణకు "సతి సతి గవయంగ బుత్ర సంతతి కలిగెన్" అనే సమస్యను (తన సౌధ వ)సతి అని ముందు పాదంలో పెట్టి అర్థవంతంగా పూరించబడింది.
నూతనకల్పనాచమత్కృతి - ఇచ్చిన సమస్యను కొత్త కొత్త ఊహలతో పూరించే విధానం.
క్రమాలంకార చమత్కృతి - ఈ రకం పూరణలలో చివరి పాదంలోని పదాలకు పైనున్న మూడు పాదాలలో క్రమంగా ప్రశ్నల రూపంలో పూరణ ఉంటుంది. ఉదాహరణకు "రావణుడన్న రామునకు రామునకున్ నుమ తల్లి కోడలౌ" అనే సమస్యను రావణుడు - అన్న - రామునకు (రఘురామునికి) - రామునకున్ (పరశురామునికి) - ఉమ - తల్లి - కోడలు అనే సమాధానాలు వచ్చేవిధంగా పై మూడు పాదాలలో ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానం వరుసగా నాలుగవ పాదంలో సమస్య రూపంలో ఇవ్వబడింది.
శ్లేష చమత్కృతి - ఒకే పదానికి రెండు అర్థాలు ఉన్నప్పుడు ఇచ్చిన అర్థంలో కాకుండా రెండవ అర్థంలో పూరించవచ్చు. ఉదాహరణకు "పగలు శశాంకుడంబరముపై విలసిల్లు కళాసమగ్రుడై" అనే సమస్యను పగలు అంటే ఉదయం అనే అర్థంలో కాక ద్వేషాలు, వైరాలు అనే అర్థంలో ఏల ఈ పగలు? అని ఒక అవధాని పూరించాడు.
ప్రాస చమత్కృతి: క్లిష్టమైన ప్రాసతో ఇచ్చిన సమస్యను పూరించడం ప్రాస చమకృతి క్రిందకు వస్తుంది.
సాంకేతిక చమత్కృతి: జ్యోతిష సంకేతాల చేతగాని, ఇతర సంకేతాల చేతగాని పూరించబడిన పూరణలు సాంకేతిక చమత్కృతి క్రింద పరిగణించబడతాయి. ఉదాహరణకు "ఆరును గోరి మూటి కొరకై పదొకండున కంగలార్చెడిన్" అనే సమస్యకు జ్యోతిషములోని ద్వాదశి చక్రములోని ఆరవ రాశి కన్య, మూడవ రాశి మిధునము, పదుకొండవ రాశి కుంభము అనే అర్థంతో పురుషుడు కన్యను వివాహమై తరువాత మిధునమై ఆ తర్వాత అన్నము (కుంభం) కొరకు అంగలారుస్తాడు అని పూరణ చేయబడింది.
అధిక్షేప చమత్కృతి: నిందించే లేదా బెదిరించే భావంతో సమస్యలను పూరించినవి అధిక్షేప చమత్కృతి క్రిందకు వస్తాయి.
అపహాస్య చమత్కృతి: పరిహాసంగా, హేళనగా, గేలి చేసే విధంగా పూరించిన సమస్యలు ఈ విభాగానికి చెందుతాయి.
అర్థాంతరన్యాస చమత్కృతి: సామాన్యమైన విషయాన్ని విశేషంగా చెప్పే ఉక్తి అర్థాంతరన్యాస చమత్కృతి.
కాకుస్వర చమత్కృతి
శబ్దగతార్థ చమత్కృతి
లోకోక్తి చమత్కృతి
లోకజ్ఞతా చమత్కృతి
పౌనరుక్త్య చమత్కృతి
చారిత్రక చమత్కృతి
ఛందోనిగూఢ చమత్కృతి
వర్ణన
వృచ్ఛకుడు ఏదో ఒక చందస్సులో, ఏదో ఒక విషయాన్ని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పమంటాడు. అవధానిగారు ఆ నిర్థిష్టమైన చందస్సులో ఆ విషయమై వర్ణనాత్మకమైన పద్యం చెప్పాలి. వీటిలో అనేక రకాలైన వర్ణనలు ఉన్నాయి. దైవస్తుతి, పురాణ సంబంధమైన వర్ణనలు, ప్రబంధాలలోని వర్ణనలు, చిత్రకవిత్వాలు, భాషాంతరీకరణ పద్యాలు, అన్యాపదేశ పద్యాలు, ప్రతి పద్యాలు అనగా సుప్రసిద్ధమైన ఒక పద్యాన్ని ఇచ్చి అదే అర్థం వచ్చేటట్లు ఇంకొక ఛందస్సులో వర్ణించడం, అల్పవిషయము - బృహత్పద్యం (ఉదా: దోమకాలు - మహాస్రగ్ధర వృత్తంలో), బృహద్విషయము - అల్పపద్యం (ఉదా: దశావతారాలు - కందపద్యంలో), అచ్చతెలుగు పద్యాలు, సమకాలీన రాజకీయ, సాంఘిక విషయ పద్యాలు, శాస్త్రీయ పద్యాలు, ఆశీర్వచన పద్యాలు ఇలా అవధానాలలో అనేక విధాలుగా వర్ణనాంశాన్ని పూరించారు.
ఆశువు
వృచ్ఛకుడు ఒక విషయాన్నిచ్చి అడిగిందే తడవుగా, ఆలోచించుకోకుండా వెంటనే ఆశువుగా చందోబద్ధమైన పద్యాన్ని ఆ విషయాన్ని గురించి చెప్పాలి. అవధాని ఛందశ్శాస్త్రంలో ప్రవీణుడై వృత్తాలు, జాతులు, ఉపజాతులలోని పద్యలక్షణాలను ఔపోసన పట్టి ఉండాలి. పద్యాలు చెబుతున్నప్పుడు గణాలు, యతులు, ప్రాసలు అవంతట అవే వాటి స్థానాలలో వచ్చి కుదురుకోవాలి.
పురాణ పఠనం:
వృచ్ఛకుడు పురాణం, ఇతిహాసం, ప్రబంధం, కావ్యం ఇలాంటి గ్రంథాలలో ఒక ప్రధాన ఘట్టాలలో నుండి ఏదైనా ఒకటి రెండు పద్యాలను చదివి వినిపిస్తాడు అవధానిగారికి. అవధానిగారు ఆ పద్యాలను విని ..... ఆ పద్యాలు ఏ గ్రంథంలోనివి, ఆ గ్రంథ కర్త ఎవరు? ఆ సందర్బమేది వంటి విషయాలు.... పురాణ పక్కీలో చెప్పాలి... అవధాని గారు ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తుండగా....... మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు. అవదానిగారు అతన్ని 'కొంత సేపు ఆగు ' అని అనకుండా అతని ప్రశ్న వినడానికి సిద్ధ పడాలి.
అప్రస్తుత ప్రసంగం
పైన చెప్పిన సమస్యలు అవధాని గారి జ్ఞాపక శక్తికి, అతని ధారణా శక్తిని పరీక్షించేవి. ఆ యా విషయాల గురించి తీవ్రంగా అలోచిస్తూ వుండగా ఈ వృచ్ఛకుడు ప్రస్తుత విషయానికి పూర్తిగా విరుద్ధమైన విషయాన్ని గురించి ఒక కొంటె ప్రశ్న సందిస్తాడు. అవధాని ఏకాగ్రతను చెడగొట్టడానికి అప్రస్తుత ప్రసంగి (పృచ్ఛకులలో ఒకరు) చేయని ప్రయత్నం ఉండదు. ఉదాహరణకు ఒక సభలో ఒకాయన "అవధాని గారూ, భర్త భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తోంది. భర్త పశువ అన్నాడు. భార్య కోతి అంది. వారి మాటల్లో ఆంతర్యమేమిటి" అని అడిగారు. దానికి అవధాని... "పళ్లెం నిండా శుభ్రంగా వడ్డించవే" అని భర్త అంటే "కోరినంత తినండి" అని భార్య జవాబిచ్చింది అని చెప్పాడు. "హనుమంతుని తోక పెద్దదా-ద్రౌపది కోక పెద్దదా" వంటివి మరికొన్ని ఉదాహరణలు. అవధాని, అప్రస్తుత ప్రసంగి విసిరే ఛలోక్తులూ చెణుకులకు తడుముకోకుండా చెప్పగలిగితేనే సభ శోభిస్తుంది. ఎందుకంటే, పద్యాలూ ఛందస్సుల గురించి తెలియని వారిని ఆకట్టుకునేది ఈ అప్రస్తుత ప్రసంగమే.
వ్యస్తాక్షరి
ఇది ధారణకు సంబంధించిన అంశము. ఈ అంశంలో ఒక వాక్యం లేదా పద్యంలోని అక్షరాలు లేదా పదాలకు అంకెలు వేసి వాటిని వేరువేరుగా కత్తిరించి వాటికి క్రమము తప్పించి అవధానము జరుగుతున్నప్పుడు మధ్యమధ్యలో అవధానికి అందిస్తారు. అవధాని ఆ కాగితపు ముక్కలో ఉన్న అక్షరాన్ని లేదా పదాన్ని చదివి గుర్తు పెట్టుకుని ఆ కాగితపు ముక్కలను పక్కకు పడవేస్తాడు. అవధానం చివరలో ఆ అక్షరాలను/పదాలను క్రమంలో పేర్చి వాక్యాన్ని/పద్యాన్ని అప్పజెప్పుతాడు. ఈ అంశంలో అవధానులు తెలుగు భాష మాత్రమే కాక సంస్కృతం, ఇంగ్లీషు, అరవం, హిందీ తదితర భాషా వాక్యాలను కూడా అప్పజెప్పుతారు. మాడభూషి వేంకటాచార్యులు ఈ అంశాన్ని ఎనిమిది భాషలలో చేశాడు.
ఛందోభాషణం
ఈ అంశంలో పృచ్ఛకుడు, అవధాని పద్యాలలో సంభాషిస్తారు. పృచ్ఛకుడు ప్రశ్నను ఒక పద్యంలో కాని ఒక పద్య భాగంలో కాని అడిగితే అవధాని సమాధానాన్ని ఆ పద్యం మిగిలిన భాగంలో పూర్తి చేస్తాడు.
పురాణ పఠనం
శాస్త్రార్థము
ఏకసంథాగ్రహణం
అనువాదం
చిత్రాక్షరి
అక్షర విన్యాసం
స్వీయ కవితాగానం
ఘంటా గణనం
ఘంటా గణనం అనగా అప్పుడప్పుడు గంట కొడుతుంటారు. అవధాని ఆ సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని గంటలు కొట్టారో చివరలో చెప్పాల్సి ఉంటుంది.
ఘంటావధానం
ఈ అంశాన్ని సాధారణంగా జంట అవధానాలాలో ప్రదర్శిస్తారు. ఈ అంశాన్ని ధూళిపాళ మహదేవమణి ప్రవేశపెట్టాడు. ఇది ఒక విధంగా Dumb charades వంటిది. ఒక అవధానికి పృచ్ఛకుడు ఒక పదం కాని ఒక వాక్యం కానీ చెబుతాడు. ఆ అవధాని ఒక స్టీలు పళ్ళెంపై గరిటతో కాని, స్పూనుతో కాని శబ్దం చేస్తాడు. ఆ శబ్దాన్ని బట్టి రెండవ అవధాని ఆ పదాన్ని/ వాక్యాన్ని చెబుతాడు.
పుష్ప గణనం
పుష్ప గణనము అనగా అవధానికి తగిలేలా అప్పుడప్పుడు పుష్పాలు విసురుతుంటారు. ఆయన ఆ పూల సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని పూలు విసిరారో చివరలో చెప్పాల్సి ఉంటుంది.
వార గణనం
పంచాంగ గణనం
కావ్యానుకరణం
సంగీతం
మీ ప్రశ్నకు నా పాట
అవధాన క్రమం
నమూనా అవధానం ఇలా జరుగుతుంది.
1.ఇప్పటి వరకు ఒక ఆవృతం మాత్రమే పూర్తయింది. ఏ ఒక్కరికీ పూర్తి సమాధానం ఇవ్వకనే మరో వృచ్ఛకుడు అడ్డు తగిలాడు. ఈ సారి రెండో ఆవృతంలో (రెండో రౌండు) తిరిగి మొదటి వృచ్ఛకుడు నాప్రశ్నకు సమాదానమేది అని ప్రశ్నిస్తాడు. అతనడిగిన ప్రశ్నేమిటో ఎంతవరకు సమాదాన మిచ్చాడో గుర్తు పెట్టుకొని ఆ పద్యంలో రెండో పాదం చెప్పాలి. మొదటి వృచ్చకునికొ సమాధానం పూర్తి కాక ముందే రెండో వృచ్చకుడు నాసంగతేమిటని అడుగుతాడు. అతనికి ఇంతకు ముందు ఎంతవరకు సమాధానము చేప్పారో గుర్తు పెట్టుకొని మిగతా సమాదాన భాగాన్ని పూరిచి చెప్పాలి. ఇంతలో మూడో వృచ్చకుడు.... ఇల ఒకరి తర్వాత మరొకరు తాము ఇదివరకు సంధించిన ప్రశ్నలు చెప్పకుండా తమకు రావలసిన సమాధానలను గురించే అడుగుతారు. అవధానిగారు ....... మీకు ఎంత వరకు సమాదానము చెప్పాను? అని అడగ కుండా ఆ విషయాన్ని మనసులోనే వూహించుకుని తరువాతి పద్య పాదాన్ని పూరించి సమాధానము చెప్పాలి. ఆ విధంగా నాలుగో రౌండులో మాత్రమే ప్రతి వృచ్ఛకునికి పూర్తి సమాదానము వస్తుంది. అవధానులెవరైనా వృచ్చకులు అడిగిన ప్రశ్నలకు చంధోబద్దమైన పద్యాలతో సమాధానము చెప్పడమే కాదు ఆ సమాధానాలు అత్యంత రసవత్తరంగా, మనోజ్ఞంగా. సాధారణ ప్రేక్షకుల సైతం ఆకట్టు కునే విధంగా వుటాయి. అందులోనే అవధాని గారి గొప్పతనం, ప్రజ్ఞా వుంటాయి.
ఆ విధంగా అన్ని నియమాలతో పద్యాలు చెప్పడం ఒక ఎత్తైతే నాలుగు రౌండ్లు పూర్తవగానే ఆ పద్యాలన్నిటినీ ధారణ చేసి అదే క్రమంలో ఏక ధాటిగా వాటిని అపొపగించడం మరో ఎత్తు. ఇదే ఈ అవధాన కార్యక్రమంలో గొప్పవిషయం. అలా అష్టావధాన కార్యక్రమం చాల కోలాహలంగా ఆనంద భరితంగా ముగుస్తుంది.
3 సమస్యా పూరణం అన్న పై విషయంలో కప్పను జూడంగ పాము గజగజ లాడేన్. ఇది అసమజమైనది. (అనగా కప్పను చూడగా పాము గజగజ లాడి భయపడు. ఆ ఆర్థాన్ని మార్పు చేసూ అక్షరాలను ఏమాత్రము మార్చకుండా పూరించాలి) అనే పద్య పాదాన్ని పూర్వం ఒక సమస్యగా ఇచ్చారు ఒక అవధాని గారికి. దానికి అవధానిగారు పూరించిన సమాదానము పూర్తి పద్యం లోని భావం చూడండి. వెంకప్ప అనే రైతు తన పొలంవద్ద నున్న కుప్పలకు కావలికై వెళుతూ ఒక కర్రను, కిర్రు చెప్పులును ధరించి వెళుతుంటే అతన్ని చూసి అనగా వెంకప్పను జూడంగ పాము గజగజ లాడెన్. ఈ పూరణ ఎంత అద్భుతంగా వుందో.......
4.పువ్వులు విసురుట: అవధాన కార్యక్రమము జరుగుతుండగా ఒకరు అవదాని పైకి అప్పుడప్పుడు ఒక్క పువ్వును విసురు తాడు. అవధానం పూర్తి కాగానే తనపైకి ఎన్ని పువ్వులు విసిరారో గుర్తు పెట్టుకొని కచ్చితమైన సమాధానం చెప్పాలి అవధాని గారు.
6. గంటలు కొట్టుట. అవధానం జరుగుతున్నప్పుడు ఒకరు గంట కొడుతుంటాడు. అవధానం పూర్తవగానె., అతను ఎన్ని గంటలు కొట్టాడొ గుర్తు పెట్టుకొని అవధాని గారు చెప్పాలి. పువ్వులు విసరటం, గంటలు కొట్టటం అనే రెండు అంశాలు రెండు వుండవు. ఈ రెంటి వుద్దేశం ఒక్కటే గాన ఏదో ఒక్కటే వుంటుంది. అది కూడా పైన చెప్పిన ఎనిమిది అంశాలలో ఒకదాని బదులుగా ఈ రెంటిలో ఒక్క దాన్ని వుంచు తారు. ఎలాదైనా ఎనిమిది అంశాలుండాలి అనేది నిబంధన.
అష్టావధానం
అష్టావధానంలో ఎనిమిది ప్రక్రియలు ఒకేసారి చెయ్యాలి. కనీస సమయం నాలుగు గంటలు. సాధారణంగా కింది ప్రక్రియలను ఎన్నుకుంటారు.
కావ్య పాఠము
కవిత్వము
శాస్త్రార్థము
ఆకాశపురాణము
లోకాభిరామాయణము
వ్యస్తాక్షరి (లేదా) న్యస్తాక్షరి
చదరంగము
పుష్ప గణనము
ఇవే కాకుండా కొంతమంది సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగం, వివర్గాక్షరి, నిర్దిష్టాక్షరి, ఘంటా గణనం, పురాణ పఠనం, సహ పఠనం, కావ్యోక్తి, ఇచ్ఛాంక శ్లోకం మొదలగు వాటిలో ఎనిమిది ప్రక్రియలు ఎన్నుకుంటారు. చివరలో "ధారణ"తో అవధానం ముగుస్తుంది. ధారణ అనగా ఆ అవధానంలో తాను చెప్పిన అన్ని పద్యాలను అవధాని చివరలో చెప్పవలసి ఉంటుంది.
అష్టావధానములో ఇవ్వబడిన ఎనిమిది అంశాలలో స్వల్ప తేడాలుంటాయి.
శతావధానం
వంద మంది పృచ్ఛకులను ఎదుర్కొని చేసే అవధానాన్ని శతావధానం అంటారు. సాధారణంగా శతావధానంలో సమస్య, దత్తాక్షరి, వర్ణన, అప్రస్తుత ప్రసంగం అంశాలు ఉంటాయి.
దశావధానం
దశావధానము అనగా ఏక కాలమున విలక్షణములగు పదివిషయములపై ధీపటిమను ప్రసరింపజేసి, ఏవిషయమునను బుద్ధి కుశలత సడలింపక, వీగిపోక సహృదయవతంసులచే శిరః కంపము చేయించు కొనక విద్యావినోదము, అష్టావధానము వలే పది అంశములపై చిత్తము ఏకాగ్రమొనర్చి చేయు అవధానము. ఆశుకవిత అను లేఖిన్యాదిపరికర సాహాయము లేకయే, తడువుకొనకుండ, ధారావాహికముగ, ఆడిగిన విషయమును గూర్చి సలక్షణమగు చంధోబద్ధ రచన మొనరించుట. దీనిని చేసిన ఒకకవి పేరు తెలియకున్నను ఆతని దశావధానకవి అన్న బిరుదు మాత్రము వ్యాప్తినొందినది. ఈకవి శ్లోకమొకటి సా.శ.1689 సం. న రచించబడిన చతుర్భుజుని రసకల్పద్రుమము న ఉదహరింపబడింది. హిందూ పత్రిక (13-12-1949)లో మద్రాసునగరమున పి.ఆర్ముగంపిళ్ళ యను ఒక ద్రావిడకవి దశావధాన మొనరించెననియు, అందలి పదవిషయములలో ఒకటి జ్యోతిశాశ్త్ర కౌశలద్యోతకమనియు ప్రకటింపబడెను. అందు ఆతడు, వెనుకటి ఆంగ్ల సంవత్సరమొకటి పేర్కొని యేనెల యేతిథి యేవార మగునో చెప్పెనట.ఆధునిక కాలంలో ర్యాలీ ప్రసాద్ 'దశావధానం' ప్రక్రియలో వచనావధానాన్ని నిర్వహించారు.
శతఘంటావధానం
దీనిని చేసిన వారలో పేరుగాంచిన కవి శ్రీ విద్వాన్ అభినవపండితరాయ మాడభూషి వేంకటాచార్యులు గారు. వివిధ ఆకృతులు, పరిమాణములూ గల 100 కంచు చెంబులపై సంఖ్యలు వేస్తారు. వాటిని అవధానికి కనబడకుండా వేరే గదిలో ఉంచి, ఒక్కొక్క చెంబు సంఖ్యను చెప్పి, ఒక కర్రతో కొడతారు. అప్పుడు శబ్దాన్ని విని అవధాని గుర్తు పెట్టుకోవాలి. అలా అన్ని చెంబులనూ సంఖ్య చెప్పి కర్రతో కొడతారు. ఆ తరువాత, తన ఇష్టం వచ్చిన రీతిలో ఏదో ఒక చెంబును కొడతారు. అవధాఅని ఆ శబ్దాన్ని బట్టి ఆ చెంబు సంఖ్య ఎంతో చెప్పాలి. ఇది శత ఘంటావధానములో ముఖ్యమైన ప్రక్రియ.
సహస్రావధానం
ద్వి సహస్రావధానం
త్రి సహస్రావధాన
నాట్యావధానం
కొందరు అవధానులు
అవధాని జగన్నాథ పండిత రాయలు మొఘల్ చక్రవర్తి షాజహాన్ నే తన ధారణా శక్తితో మెప్పించిన దిట్ట.
అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు (1864-1945) - అష్టావధానం చేసారు. వ్యస్తాక్షరిలో భాగంగా 50 పదాల గ్రీకు పాఠ్యాన్ని వరుసలో పేర్చి చెప్పడం వీరి అవధానంలో ఒక విశిష్టత. అసాధ్య అష్టావధానం అనే ప్రక్రియను కూడా నిర్వహించారు. ఇందులో సంగీతం కూడా భాగం. అసామాన్యమైన తాళ జ్ఞానం ఉండాలి కాబట్టి దీన్ని అసాధ్య అష్టావధానం అని అన్నారు. ఈ అవధానంలో పదముగ్గురు పృచ్ఛకులు పాల్గొనేవారని రాళ్ళబండి కవితాప్రసాద్ చెప్పారు. "ఒక పల్లవి పాడుతూ, రెండు కాళ్ళతో రెండు వేరువేరు తాళాలు వేస్తూ, రెండు చేతులతో మరో రెండు తాళాలు వేస్తూ ఉండాలి -ఇవన్నీ పృచ్ఛకుడు చెప్పిన శృతిలో వెయ్యాలి" [2006. అవధాన విద్య - ఆరంభ వికాసాలు. సహృదయ సాహిత్య, సాంస్కృతిక సంస్థ, హనుమకొండp. 48. & 237.]. నారాయణ దాసు ఏకకాలంలో పంచ, షట్ తాళాలు కూడా వేసేవారు. నాటి సంగీత, సాహిత్యకారులు ఆయన్ను లయ బ్రహ్మ, పంచముఖి పరమేశ్వర, సంగీత సాహిత్య సార్వభౌమ అనే బిరుదులతో గౌరవించారు.
తిరుపతి వేంకట కవులుగా ప్రసిద్ధులైన జంటకవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి (1871-1919), చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి (1870-1950) - వీరు అవధాన ప్రక్రియకు తమ కాలంలో జీవం పోసి ఎనలేని ప్రజాదరణ సాధించారు. వీరి పాండిత్యాన్ని, చమత్కార చతురతను గూర్చి ఇప్పటికీ సాహితీ ప్రియులు కథలు కథలుగా చెప్పుకొంటారు.
కొప్పరపు సోదర కవులు - (కొప్పురపు వేంకట సుబ్బరాయ కవి, వేంకట రమణ కవి) తిరుపతి వేంకట కవుల సమకాలీనులు. మెరుపు వేగంతో పద్యాలను అల్లడం వీరి ప్రత్యేకత.
వేంకట రామకృష్ణ కవులు - తిరుపతి వేంకట కవుల సమకాలీనులు
పిశుపాటి చిదంబర శాస్త్రి - 1930-40 లలోని గొప్ప అవధానులలో ఒకడు
వేంకట రామకృష్ణ కవులు - ప్రఖ్యాత జంట కవులు
రాజశేఖర వేంకటశేషకవులు - ప్రఖ్యాత జంట కవులు
పల్నాటి సోదరకవులు - ప్రఖ్యాత జంట కవులు
దేవులపల్లి సోదరకవులు - వీరు ముగ్గురు
శ్రీరామేశ్వర కవులు - జంట కవులు
కాకర్ల కొండలరావు
ఆముదాల మురలి
ఆధునిక కాలంలో
ర్యాలీ ప్రసాద్ :ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక కవి.తెలుగు కవిత్వంలో తొలిసారిగా వచన కవిత్వంలోని అన్ని 1.అభ్యుదయ కవిత్వం, 2.విప్లవ కవిత్వం, 3.దిగంబర కవిత్వం, 4.స్త్ర్రీ వాద కవిత్వం, 5.దళిత వాద కవిత్వం, 6.ముస్లింవాద కవిత్వం, 7.అనుభూతి వాద కవిత్వం 8.ప్రకృతి వాద కవిత్వం, 9.హైకూ మొదలగు ప్రక్రియలలో అవధానాన్ని చేసి జాతీయ రికార్డులు సాధించారు.వచన కవిత్వంలో మహా సహస్రావధానాలు నిర్వహించారు. సాధారణంగా అవధానాలు ముందస్తు పధకం ప్రకారం జరుగుతాయనేది చాలా చోట్ల చూస్తుంటాము. వీరు అవధానాలు బహిరంగంగా అంటే సభకు వచ్చిన వారిచ్చిన సమస్యలను పూరించి అవధానం పూర్తి చేయడం విశేషం.
వచన కవిగా 1.తమస్, 2.రాలిన పూలు, 3.ఆమని, 4.అల ఒక కల, 5.స్వప్నభాష, 6.పునాసనీడ, 7.మట్టి, 8.ఏలేరు తీరాన 9.తదనంతరం, 10.కుంకుమరేఖ, 11.ఆల్ఫా-ఒమెగా, 12.ఒక రాస్తాను మొదలగు కావ్యాలు రచించారు. కాకినాడ నివాసి. వీరి గురువు తొలుత ర్యాలి వెంకట్రావు, కలహంస, విద్యారత్న, వచన కవితా విశారద బిరుదు.జాతీయ స్ఠాయిలో అనెక పురస్కారాలు పొందారు.
డాక్టర్ గరికిపాటి నరసింహారావు . వెయ్యి మంది పృచ్ఛకులతో 21 రోజుల పాటు సంపూర్ణంగా అవధానం చేసినందుకు ఆయనను మహా సహస్రావధానిగా పిలుస్తారు. వారు మహాసహస్రావధానంలో భాగంగా ముందు చెప్పిన 750 పద్యాలను అనితరసాధ్యమైన రీతిలో 21వ రోజు ఏకధాటిగా మహాధారణ చేసినందుకు వారిని 'ధారణ బ్రహ్మ రాక్షస' అనే బిరుదుతో సత్కరించారు. వీరి 'సాగర ఘోష' కావ్యం ఎంతో ప్రసిద్ధం.
దూపాటి సంపత్కుమారాచార్య 1932 మే 18 న ఓరుగల్లు పట్టణంలో జన్మించారు. వీరి తల్లి ప్రఖ్యాతి గాంచిన కవయిత్రి శ్రీమతి శేషమ్మ గారు. తండ్రి శేషాచార్యులు గారు. వీరు ప్రాథమిక విద్యను వరంగల్లు లోను, మచిలీపట్నం లోను పూర్తి చేసి, ఎస్.ఎస్.ఎల్.సిని మాత్రం పాలకొల్లులో పూర్తి చేశారు. ఆ తర్వాత 1962లో హన్మకొండలో బి.ఏడ్. శిక్షణను పూర్తి చేశారు. వీరు 1965 వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి ప్రవేటుగా చచివి తెలుగులో ఎం.ఏ పట్టాను పొందారు. ద్విశతావధానిగా ప్రఖ్యాతి వహించిన రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి వద్ద సంపత్కుమారు గారు అవధానము చేయుటలో వున్న మెళుకువలు, రహస్యాలను నేర్చుకున్నారు. వీరు రెండు వందలకు పైగా అష్టావధానాలు చేసిన ప్రముఖులు.
డాక్టర్ మేడసాని కృష్ణమోహన్. (జననం ఏప్రిల్ 19, 1954) అష్టావధానాలు, శతావధానాలు, ఒక సహస్రావధానం చేశాడు. ఇటీవలే పంచసహస్రావధానం నిర్వహించి సాహితీ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని సాక్షాత్కరింపచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ గా సేవలందిస్తున్నాడు.
డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ. తెలుగులోను, సంస్కృతంలోను కూడా అవధానాలు నిర్వహించగల దిట్ట.
కడిమిళ్ళ వరప్రసాద్. పలు అష్టావధానాలు, శతావధానాలే కాక అవధాన ప్రక్రియలో శిష్యుడు కోట లక్ష్మీనరసింహంతో కలిసి జంట సహస్రావధానం కూడా నిర్వహించారు. అవధానులుగా రాణిస్తున్న కోట లక్ష్మీనరసింహం, వద్దిపర్తి పద్మాకర్ లకు అవధాన ప్రక్రియ నేర్పి తీర్చిదిద్ది "గురు సహస్రావధాని"గా పేరొందారు.
సురభి శంకర శర్మ. తెలుగులోను, సంస్కృతంలోను కూడా అవధానాలు నిర్వహించగల దిట్ట.
అష్టకాల నరసింహరామశర్మ. అవధాన ప్రక్రియపై విశేష పరిశోధన జరిపాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. 150పైగా అవధానాలు చేశాడు .
డాక్టర్ రాళ్ళబండి కవితా ప్రసాద్ వివిధ నూతన ప్రక్రియలు ప్రవేశపెట్టాడు.500పైగా అవధానాలు చేశాడు. తెలంగాణలో-
డాక్టర్ ఆర్.గణేష్ 17పైగా భాషలలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. 8 భాషలలో 500పైగా అవధానాలు చేశాడు.
నరాల రామారెడ్డి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వీరు ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు. అష్టావధాని. అనేక అవధానాలు చేశారు. చమత్కారం వీరి ప్రత్యేకత. అమెరికాలో అవధానాలు చేసి మన్ననలు పొందారు.
డా।।ఇమ్మడోజు భద్రయ్య ।। కం నామధేయం విశ్వ. కలం పేరుతో కలసి ఇ.బి.విశ్వ గాను వ్యవహృతులు. 18 సంవత్సరాల ప్రాయంలోనే భద్ర నరసింహ శతకము వ్రాసి ప్రసిద్ధి చెందారు. వీరి విశ్వ గేయనాటికలు ముదిగొండ శివప్రసాద్, సంజీవదేవ్ గారల వంటి ప్రసిద్ధుల మన్ననలు పొందాయి. వీరు ఒకప్పటి కరీంనగర్ జిల్లాలో బోయినిపల్లి మండలంలోని మల్లాపురం గ్రామంలో జన్మించారు.ఈ గ్రామం ప్రస్తుతం సిరిసిల్ల రాజన్న జిల్లాలో చేర్చబడింది . వీరి తల్లిదండ్రులు లక్ష్మమ్మ రాజవీరయ్య గారలు. వీరి తండ్రి గారు వాస్తు జ్యోతిషములో నిష్ణాతులు. నవ్యకవిత్వంలో భావకవిత్వం-విశ్లేషణ పిహెచ్.డి సిద్ధాత గ్రంథం.
డాక్టర్ ఇ.బి. విశ్వగారు శాతవాహన యునివర్శిటిలో కరీంనగర్ లోను అవధానాలు చేశారు.డాక్టర్ గండ్ర లక్ష్మణరావు హరిప్రసాద్ శర్మ కృష్ణమూర్తి శాస్త్రి వంటి ఉద్ధండులు పృచ్ఛకులు వీరి అవధానాలలో పాల్గొన్నారు .
అవుసుల భానుప్రకాశ్. మెదక్ జిల్లా బూరుగుపల్లిలో పుట్టి పెరిగి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మే, ఎం.ఫిల్ పట్టా పుచ్చుకొని భాషోపాధ్యాయులుగా సంగారెడ్డిలో స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు.తెలుగు భాషోపాధ్యాయునిగా, ప్రభుత్వ పాఠ్యపుస్తక రచయితగా, విషయనిపుణులుగా, జిల్లాలో ప్రముఖ వ్యాఖ్యాతగా, మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థనిర్వాహకునిగా లబ్ధ ప్రతిష్ఠులైన వీరు నలభైకి పైగా అష్టావధానాలు పూర్తి చేశారు.
పంచసహస్రావధానులు
జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి
మేడసాని మోహన్
ద్విసహస్రావధానులు
మాడుగుల నాగఫణి శర్మ.
సహస్రావధానులు
మేడసాని మోహన్, మాడుగుల నాగఫణి శర్మ, గరికపాటి నరసింహారావు.
వచనావధానం
ర్యాలి ప్రసాద్ ఈ ప్రక్రియ రూపశిల్పి.
ద్విశతావధానులు
రాళ్ళబండి కవితా ప్రసాద్, కడిమిళ్ళ వరప్రసాద్, గరికపాటి నరసింహారావు, మాడుగుల నాగఫణి శర్మ, ర్యాలి ప్రసాద్.
శతావధానులు
చెఱువు సత్యనారాయణ శాస్త్రి
మేడసాని మోహన్
పల్నాటి సోదరకవులు
జాన దుర్గా మల్లికార్జునరావు
సురభి శంకరశర్మ
సి.వి.సుబ్బన్న
గరికపాటి నరసింహారావు
తాతా సందీప్ శర్మ
చల్లా పిచ్చయ్యశాస్త్రి
కొండపి మురళీకృష్ణ
కోట వేంకట లక్ష్మీనరసింహం
గన్నవరం లలితాదిత్య
నరాల రామారెడ్డి
రాళ్ళబండి కవితాప్రసాద్
అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు
గౌరీభట్ల వెంకటరామశర్మ
మాడుగుల వేంకట సూర్య ప్రసాదరాయ కవి
గండ్లూరి దత్తాత్రేయశర్మ
మాడుగుల నాగఫణి శర్మ
దోర్భల ప్రభాకరశర్మ
శ్రీరామ నరసింహమూర్తి కవులు
పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
బూరాడ గున్నేశ్వరశాస్త్రి
వద్దిపర్తి పద్మాకర్
డోకూరి కోట్ల బాలబ్రహ్మాచార్యులు
కడిమిళ్ళ వరప్రసాద్
రాంభట్ల పార్వతీశ్వర శర్మ
జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి
అష్టావధానులు
ప్రసాదరాయ కులపతి
అష్టకాల నరసింహరామశర్మ
దిట్టకవి శ్రీనివాసాచార్యులు
ఇందారపు కిషన్ రావు
బులుసు వెంకట రామమూర్తి
దివాకర్ల వెంకటావధాని
వెల్లాల నరసింహశర్మ
దోనిపర్తి రమణయ్య
మేడూరు ఉమామహేశ్వరం
గడియారం శేషఫణిశర్మ
ధూళిపాళ మహదేవమణి
కేసాప్రగడ సత్యనారాయణ
శంకరగంటి రమాకాంత్
గాడేపల్లి కుక్కుటేశ్వర్ రావు
ఆమళ్ళదిన్నె వెంకట రమణప్రసాద్
గౌరీభట్ల రఘురామశర్మ
గురువేపల్లి నరసింహం
ముద్దు రాజయ్య
మరింగంటి కులశేఖరా చార్యులు
పాలపర్తి వేణుగోపాల్
బేతవోలు రామబ్రహ్మం
రాళ్ళబండి నాగభూషణశర్మ
తిగుళ్ళ రాధాకృష్ణ శర్మ
కర్రా గోపాలం
పణతుల రామేశ్వర శర్మ
దూపాటి సంపత్కుమారాచార్య
కురుబ నాగప్ప
గౌరీభట్ల రామకృష్ణశర్మ
కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు
పాణ్యం లక్ష్మీనరసింహశర్మ
కోవెల సుప్రసన్నాచార్య
పూసపాటి నాగేశ్వరరావు
కోట రాజశేఖర్
కట్టమూరు చంద్రశేఖర్
చక్రాల లక్ష్మీకాంతరాజారావు
విఠాల చంద్రమౌళిశాస్త్రి
అందె వేంకటరాజము
చిలుకూరి రామభద్రశాస్త్రి
లోకా జగన్నాధ శాస్త్రి
శిరిశినహళ్ శ్రీమన్నారాయణాచార్యులు
చిఱ్ఱావూరి శ్రీరామశర్మ
రాంభట్ల పార్వతీశ్వరశర్మ
పరిమి రామనరసింహం
అయాచితం నటేశ్వరశర్మ
పుల్లాపంతుల వెంకట రామశర్మ
రేవూరి అనంత పద్మనాభరావు
కావూరి పూర్ణచంద్రరావు
బెజుగామ రామమూర్తి
చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ
దేవులపల్లి విశ్వనాధం
మాజేటి వెంకట నాగలక్ష్మీప్రసాద్
ముటుకుల పద్మనాభరావు
పణితపు రామమూర్తి
మేడవరం మల్లికార్జునశర్మ
వంకరాజు కాల్వ వీరభద్రాచార్యులు
తిగుళ్ళ శ్రీహరిశర్మ
ఆశావాది ప్రకాశరావు
జోస్యుల సదానందశాస్త్రి
పణిదపు వీరబ్రహ్మం
మాడుగుల అనిల్కుమార్
పేరాల భరతశర్మ
మద్దూరి రమమూర్తి
అవధానం రంగనాధ వాచస్పతి
భద్రం వేణు గోపాలాచార్యులు
సురభి వెంకట హనుమంతురావు
పరవస్తు ధనుంజయ
చిలుకమర్రి రామానుజాచార్యులు
వేదాటి రఘుపతి
తాతా సందీప్ శర్మ
గణపతి అశోక్ శర్మ
నారాయణం బాల సుబ్రహ్మణ్యశర్మ
గౌరిపెద్ది రామసుబ్బశర్మ
ఆరుట్ల రంగాచార్య
గుమ్మా శంకరరావు
డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
తటవర్తి శ్రీ కల్యాణ చక్రవర్తి, మెల్బోర్న్, ఆస్ట్రేలియా
అవుసుల భానుప్రకాశ్
వచన కవిత్వ అవధానం
ర్యాలి ప్రసాద్ : తెలుగు భాషలో తొలి సారిగా వచన కవిత్వంలోని అన్ని ప్రక్రియలలో దశావధానం నిర్వహించి తెలుగు కవిత్వానికి విశిష్టతను చేకూర్చారు.
మూలాలు
బయటి లింకులు
అవధానము - సమస్యాపూరణ
వర్గం:తెలుగు సాహిత్య ప్రక్రియలు |
వినాయకుడు | https://te.wikipedia.org/wiki/వినాయకుడు | వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవులలో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు.Rao, p. 1. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుడు స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. Brown, p. 1. " is often said to be the most worshipped god in India."
Getty, p. 1. ", Lord of the , although among the latest deities to be admitted to the Brahmanic pantheon, was, and still is, the most universally adored of all the Hindu gods and his image is found in practically every part of India." హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు. Rao, p. 1.
Martin-Dubost, pp. 2–4.
Brown, p. 1. గణేశుడి పట్ల భక్తి జైన, బౌద్ధమతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది.* Chapter XVII, "The Travels Abroad", in: Nagar (1992), pp. 175–187. For a review of Ganesha's geographic spread and popularity outside of India.
Getty, pp. 37–88, For discussion of the spread of Ganesha worship to Nepal, Chinese Turkestan, Tibet, Burma, Siam, Indo-China, Java, Bali, Borneo, China, and Japan
Martin-Dubost, pp. 311–320.
Thapan, p. 13.
Pal, p. x.
గణేశుని అనేక విశేషణాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు.Martin-Dubost, p. 2. గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడిగా (విఘ్నేశ్వరుడు),విఘ్నాలను తొలగించడంలో గణేశుని పాత్ర ఏమిటో తెలుసుకోవడానికి గణపతి ఉపనిషత్తుపై వ్యాఖ్యానం చూడండి. 12 వ శ్లోకం కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించి పూజలు చేస్తుంటారు. పనులు ప్రారంభించేటపుడు కృతువుల్లో, పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారు. మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా గణపతిని పూజిస్తారు.These ideas are so common that Courtright uses them in the title of his book, Ganesha: Lord of Obstacles, Lord of Beginnings. ఆయన పుట్టుక, లీలల గురించి అనేక పౌరాణిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి.
ఋగ్వేదంలోని 2.23.1 శ్లోకంలో బ్రాహ్మణస్పతిని వేద కాలపు గణపతిగా పరిగణిస్తారు. సా. శ 1వ శతాబ్దం నాటికే గణేశుడు ఒక ప్రత్యేకమైన దైవంగా అవతరించాడు. కానీ సా.శ 4 నుంచి 5 వ శతాబ్దంలో గుప్తుల కాలం నాటికి వేదకాలంలోని, అంతకు ముందు కాలపు పూర్వగాముల లక్షణాలను సంతరించుకున్నాడు.Narain, A.K. ": The Idea and the Icon" in శైవ సాంప్రదాయం ప్రకారం గణపతి పునర్జీవితుడైన శివు పార్వతుల పుత్రుడే కానీ, గణపతి అన్ని హిందూ సంప్రదాయాల్లోనూ కనిపిస్తాడు. గణాపత్యంలో వినాయకుడు సర్వోత్కృష్టమైన దేవుడు.For history of the development of the and their relationship to the wide geographic dispersion of Ganesha worship, see: Chapter 6, "The " in: Thapan (1997), pp. 176–213.
గణేశుడి గురించి వివరించే ముఖ్యమైన గ్రంథాలు గణేశ పురాణం, ముద్గల పురాణం, గణపతి అధర్వశీర్షం, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, ఇంకా మరో రెండు పౌరాణిక విజ్ఞాన శాస్త్రాలు ముఖ్యమైనవి.
పద వ్యుత్పత్తి
వినాయకుడికి అనేక పేర్లున్నాయి. గణపతి, గణేశుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు మొదలైనవి. శ్రీ అనే గౌరవవాచకాన్ని ఈ పేర్ల ముందు వాడుతుంటారు.
గణం అంటే ఒక సమూహం. పతి లేదా ఈశ అంటే యజమాని, నాయకుడు అని అర్థం. Narain, A.K. ": A Protohistory of the Idea and the Icon". Brown, pp. 21–22.
Apte, p. 395. ఇక్కడ గణాలు అంటే గణేశుడి తండ్రియైన శివుడి సైన్యాలు. గణం అంటే సాధారణ అర్థంలో ఒక వర్గం, తరగతి, సంఘం లేదా సంస్థ అని కూడా భావించవచ్చు.
హిందూ మతంలో వినాయకుని ప్రాముఖ్యత
thumb|ఎడమ|5వ శతాబ్దికి చెందిన పాలరాతి వినాయక విగ్రహం. - గర్దెజ్, ఆఫ్ఘనిస్తాన్లో లభించింది. ప్రస్తుతం కాబూల్ "దర్గా పీర్ రత్తన్ నాథ్"లో ఉంది. - విగ్రహ పీఠంపై ఇలా వ్రాసి ఉంది "మహావినాయకుని గొప్ప సుందర మూర్తి"- షాహి రాజు ఖింగలునిచే ప్రతిష్ఠింపబడింది.For photograph of statue and details of inscription, see: Dhavalikar, M. K., ": Myth and Reality", in: .
భారతదేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాథుడు, పిల్లైయార్ వంటి అనేక నామాలతో అర్చిస్తారు. హిందూమతంలో పూజింపబడే అనేక దేవతామూర్తులలో దాదాపు అన్ని సంప్రదాయాలలోను, అన్ని ప్రాంతాలలోను బహుళంగా అర్చింపబడే దేవుడు వినాయకుడు.See:
Brown, p. 1. " is often said to be the most worshipped god in India."
Getty, p. 1. ", Lord of the , although among the latest deities to be admitted to the Brahmanic pantheon, was, and still is, the most universally adored of all the Hindu gods, and his image is found in practically every part of India." శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం, బౌద్ధంలలోను, భారతదేశం వెలుపల చీనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండొనీడియా వంటి దేశాలలోను కూడా వినాయకుడి అర్చన ఉంది.See:
Rao, p. 1.
Martin-Dubost, pp. 2–4.
Brown, p. 1.to Jains, Buddhists, and beyond India.See:
Chapter XVII, "The Travels Abroad", in: Nagar (1992), pp. 175–187. For a review of Ganesha's geographic spread and popularity outside of India.
Getty, pp. 37-88, For discussion of the spread of Ganesha worship to Nepal, Chinese Turkestan, Tibet, Burma, Siam, Indo-China, Java, Bali, Borneo, China, and Japan
Martin-Dubost, pp. 311–320.
Thapan, p. 13.
Pal, p. x.
వినాయకునికి అనేక నామములు, పేర్లు ఉన్నాయి. కాని అంతటా అత్యంత ప్రస్ఫుటంగా గుర్తింపబడే లక్షణాలు - ఏనుగు ముఖం, ఎలుక వాహనంSee:
Thapan, p. 254.
Commentary on , verse 12 in for Ganesha's role as an eliminator of obstacles, అడ్డంకులు తొలగించే గుణంThese ideas are so common that Courtright uses them in the title of his book, Ganesha: Lord of Obstacles, Lord of Beginnings. For the name Vighnesha, see: , విద్యా, బుద్ధి ప్రదాత . ధార్మిక, లౌకిక కార్యక్రమాల (వ్రతము, యజ్ఞము, పరీక్షలు వ్రాయడం, ఇల్లు కట్టడం వంటివి) ఆరంభంలో వినాయకుడిని స్తుతించే లేదా పూజించే ఆనవాయితీ సర్వసాధారణంGetty, p. 5..
వైదిక కాలంనుండి, అంతకుముందు ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుని సూచిస్తున్నప్పటికీ సా.శ. 4వ, 5వ శతాబ్దాలలో, ప్రత్యేకించి గుప్తుల కాలంలో వినాయకునికి ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు, సంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుకున్నట్లుగా అనిపిస్తుంది.Narain, A. K. ": The Idea and the Icon" in తరువాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనంలో ఒక విభాగం అయ్యింది. వినాయకుడు అందరికంటే అత్యున్నతమైన భగవంతుడు (దేవదేవుడు) అని విశ్వసించే గాణపత్య సమాజం ఈ కాలంలో ఏర్పడింది. వినాయకుని గురించి తెలిపే ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు - గణేశ పురాణము, ముద్గల పురాణము, గణపతి అథర్వశీర్షము.
స్వరూపం
right|thumb|13వ శతాబ్దానికి చెందిన గణేశ విగ్రహం - మైసూర్ జిల్లా, కర్ణాటక
భారతీయ శిల్ప, చిత్ర కళలలో వినాయకుని మూర్తీకరణ విస్తృతంగా, చాలా వైవిధ్యంతో కనిపిస్తుంది.Pal, p. ix. కాల క్రమంలో వినాయకుని చిత్రించే, శిల్పించే విధానం మారుతూ వస్తున్నది.See:
Martin-Dubost, for a comprehensive review of iconography abundantly illustrated with pictures.
Chapter X, "Development of the Iconography of ", in: , for a survey of iconography with emphasis on developmental themes, well-illustrated with plates.
Pal, for a richly illustrated collection of studies on specific aspects of Ganesha with a focus on art and iconography. నిలబడినట్లుగాను, నృత్యం చేస్తున్నట్లుగాను, రాక్షసులతో యుద్ధం చేస్తున్నట్లుగాను, కుటుంబంలో బాలునిగా ఆడుకొంటున్నట్లుగాను, నేలపై కూర్చున్నట్లు, సింహాసనాశీనుడైనట్లు - ఇలా వివిధ సన్నివేశాలలో గణపతి శిల్పాలు, చిత్రాలు కనిపిస్తుంటాయి.
సా.శ. 2వ శతాబ్దం నాటికి శ్రీలంకలో వినాయకుడి విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తున్నది. మిహింతలెలోని కంటకచైత్యంలో లభించిన వినాయక విగ్రహం క్రీ.పూ. 1వ శతాబ్దానికి చెందినదని అంచనా వేశారు. మనకు లభించిన గణేశ విగ్రహాలలో ఇదే అత్యంత పురాతనమైనది. ఇందులో ఒకే దంతం కలిగిన మరుగుజ్జు, ఇతర మరుగుజ్జులతో పరివేష్టింపబడినట్లుగా చూపబడింది.Ellawala, p. 159. 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో వినాయకుని విగ్రహాలు సాధారణమయ్యాయి.Brown, p. 175. వినాయకుడు ఒక ప్రత్యేకమైన దేవునిగా గుర్తింపబడిన తరువాత, వినాయక పూజా సంప్రదాయం స్థిరపడిన తరువాత - అంటే 900-1200 కాలం తరువాత - వినాయకుని ఆకారం సాధారణంగా కుడిప్రక్క చూపిన విగ్రహంవలె ఉంటూ వచ్చింది. ఏనుగు తల, బానపొట్ట, ఒకచేత విరిగిన దంతం, మరొకచేతిలో ఉన్న లడ్డూను స్పృశిస్తున్న తొండం - ఇవి సాధారణంగా కనిపించే చిహ్నాలు. ఎల్లోరా గుహలలో మరింత పురాతనమైన (7వ శతాబ్దానికి చెందిన) గణేశ విగ్రహం లభించింది కాని అందులో చేతుల చిహ్నాలు స్పష్టంగా తెలియడంలేదు.See photograph 2, "Large Ganesh", in: Pal, p. 16. సాధారణంగా వినాయకుని విగ్రహాలలోని పైచేతులలో ఒకచేత అంకుశం మరొక చేత పాశం కనిపిస్తాయి. క్రింది చేతులలో ఒకచేత దంతం, మరొకచేత లడ్డూ ఉన్నట్లు చూపుతారు. ఆధునిక రూపాలలో దంతం ఉన్న చేతి బదులు అభయముద్రలో ఉన్న చేతిని చూపుతున్నారు.See:
Martin-Dubost, pp. 197–198.
photograph 9, "Ganesh images being taken for immersion", in: Pal, pp. 22–23. For an example of a large image of this type being carried in a festival procession.
Pal, p. 25, For two similar statues about to be immersed. నృత్యం చేస్తున్నట్లున్న గణపతి మూర్తులలో కూడా నాలుగు చేతులను ఇలానే చూపుతుంటారు.See:
Pal, pp. 41–64. For many examples of Ganesha dancing.
Brown, p. 183. For popularity of the dancing form.
విగ్రహాలు, చిత్రాలు
left|thumb| చతుర్భుజ గణపతి - నూర్పూర్ శైలి చిత్రం - 1810 కాలానికి చెందినది.Four-armed . Miniature of Nurpur school, circa 1810. Museum of Chandigarh. For this image see: Martin-Dubost (1997), p. 64, which describes it as follows: "On a terrace leaning against a thick white bolster, is seated on a bed of pink lotus petals arranged on a low seat to the back of which is fixed a parasol. The elephant-faced god, with his body entirely red, is dressed in a yellow dhoti and a yellow scarf fringed with blue. Two white mice decorated with a pretty golden necklace salute by joining their tiny feet together. counts on his rosary in his lower right hand; his two upper hands brandish an axe and an elephant goad; his fourth hand holds the broken left tusk." ఆది నుండి వినాయకుడిని ఏనుగుతలతోనే చిత్రీకరిస్తున్నారనిపిస్తున్నది.Nagar, p. 77. ఇలా ఏనుగు తల ఉండడానికి అనేక పురాణ గాథలున్నాయి. "హేరంబ గణపతి"ని ఐదు తలలతో చూపుతారు.
thumb|సింహాచలం లో వినాయక విగ్రహం
వినాయకునికి ఏక దంతుడు అన్న పేరు మొదటి నుండి ఉంది. చాలా పురాతనమైన విగ్రహాలలో కూడా వినాయకుడు తన విరిగిన దంతాన్ని చేతబట్టుకొన్నట్లుగా చూపారు.Getty, p. 1.Heras, p. 29. ముద్గల పురాణం ప్రకారం వినాయకుని రెండవ అవతారం "ఏకదంతావతారం".Granoff, Phyllis. " as Metaphor". Brown, p. 90.
అలాగే పెద్ద పొట్ట కూడా మొదటి నుండి (గుప్తుల కాలంనుండి) వినాయకుని శిల్పాలలో కనిపిస్తున్న అంశం."Ganesha in Indian Plastic Art" and Passim. Nagar, p. 101. ముద్గల పురాణంలో చెప్పిన రెండు అవతారాలు (హేరంబుడు, మహోదరుడు) ఈ పెద్దపొట్ట అనే అంశంయొక్క ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి.Granoff, Phyllis. " as Metaphor". Brown, p. 91. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తూ తన ఉదరంలో ఉంచుకొన్నందున అతనికి "లంబోదరుడు" అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణములో ఉంది.See:
Br. P. 2.3.42.34
Thapan, p. 200, For a description of how a variant of this story is used in the Mudgala Purana 2.56.38–9 వినాయకునికి రెండు చేతుల నుండి, 16 చేతుల వరకు చూపుతారు.For an inconographical chart showing number of arms and attributes classified by source and named form, see: Nagar, pp. 191–195. Appendix I. సాధారణంగా నాలుగు చేతులతో శిల్పాలు, చిత్రాలు చేస్తారు.For history and prevalence of forms with various arms, and the four-armed form as one of the standard types, see: . పురాతనమైన విగ్రహాలలో మాత్రం రెండు చేతులనే చూపారు.See:
, For two-armed forms as an earlier development than four-armed forms.
Brown, p. 103. Maruti Nandan Tiwari and Kamal Giri say in "Images of In Jainism" that the presence of only two arms on a Ganesha image points to an early date. 9వ, 10వ శతాబ్దాలలో 14 నుండి 20 చేతుల వరకు ఉన్న ప్రతిమలు చెక్కారు.Martin-Dubost, p. 120. వినాయకుని చిత్రీకరణలో పాము కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది అనేక విధాలుగా చూపబడుతుంది.See:
Martin-Dubost, p. 202, For an overview of snake images in Ganesha iconography.
, For an overview of snake images in Ganesha iconography. గణేశ పురాణము ప్రకారము వినాయకుడు వాసుకి (పాము) ని తన కంఠానికి చుట్టుకొన్నాడు.See:
Martin-Dubost, p. 202.For the Ganesha Purana references for around the neck and use of a serpent-throne.
. For the story of wrapping around the neck and around the belly and for the name in his sahasranama as ("Who has a serpent around his neck"), which refers to this standard iconographic element. మరి కొన్ని మూర్తులలో పాము యజ్ఞోపవీతంగా చూపబడింది.See:
Martin-Dubost, p. 202. For text of a stone inscription dated 1470 identifying Ganesha's sacred thread as the serpent .
Nagar, p. 92. For the snake as a common type of for Ganesha. ఇంతే కాకుండా పాము ఉదరాభరణంగా (మొలతాడు లాగా), చేతిలో ఉన్నట్లుగా, కాళ్ళవద్ద చుట్టుకొని ఉన్నట్లుగా, సింహాసనంగా - ఇలా అనేక విధాలుగా చూపబడింది. వినాయకుడి నుదురు మీద తిలకం, కొన్ని సార్లు మూడవ నేత్రం చూపుతారు.See:
Nagar, p. 81. For third eye or Shaiva tilaka with three horizontal lines.
the in: Sharma (1993 edition of Ganesha Purana) I.46.1. For Ganesa visualized as (having three eyes). గణేశ పురాణం ప్రకారం వినాయకుని తల మీద తిలక చిహ్నం, చంద్రవంక కూడా ఉంటాయి. ముఖ్యంగా "బాలచంద్ర వినాయకుడు" అనే రూపంలో చంద్రవంకను చూపుతారుSee:
Nagar, p. 81. For citation to Ganesha Purana I.14.21–25 and For citation to Padma Purana as prescribing the crescent for decoration of the forehead of Ganesha
Bailey (1995), pp. 198–199. For translation of Ganesha Purana I.14, which includes a meditation form with moon on forehead.
వినాయకుని వివిధ రూపాలకు వివిధ వర్ణాలు ఆపాదింపబడ్డాయి. వీటిని గురించి శ్రీతత్వనిధి అనే శిల్పగ్రంథంలో చెప్పబడింది."The Colors of Ganesha". Martin-Dubost, pp. 221–230. ఉదాహరణకు హేరంబ గణపతిని, ఋణమోచన గణపతిని తెలుపు రంగులోను, ఏకదంత గణపతిని నీలిరంగులోను, దుర్గాగణపతిని బంగారు వర్ణంలోను, సృష్టిగణపతిని ఎరుపు రంగులోను చూపుతారు.
వాహనం
thumb|right|తన వాహనమైన ఎలుకపై సవారీ చేస్తున్న వినాయకుడు.
అధికంగా వినాయకునికి వాహనంగా ఎలుకను చూపుతారు. మొట్టమొదటి కాలంలో వచ్చిన వినాయక విగ్రహాలలో వాహనాన్ని చూపలేదు.Krishan, pp. 48, 89, 92. ముద్గలపురాణంలో వినాయకుని ఎనిమిది అవతారాలు చెప్పబడినాయి. (వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అవతారాలు). ఆ ఎనిమిది అవతారాలలో ఐదు అవతారాలకు వాహనం ఎలుక. వక్రతుండ అవతారం వాహనం సింహం. వికట అవతారం వాహనం నెమలి. విఘ్నరాజ అవతారం వాహనం శేషువు.Krishan, p. 49. గణేశ పురాణంలో నాలుగు అవతారాలు ప్రస్తావింపబడినాయి. అందులో మహోటక అవతారం వాహనం సింహం. మయూరేశ్వర అవతారం నెమలి. ధూమ్రకేతు అవతారం గుర్రం. గజాననుని అవతారం ఎలుక.See:
Krishan, pp. 48–49.
Bailey (1995), p. 348. For the Ganesha Purana story of with the peacock mount (GP I.84.2–3). జైనుల సంప్రదాయాలలో గణేశునికి ఎలుక, ఏనుగు, తాబేలు, పొట్టేలు, నెమలి వాహనాలు వివిధ సందర్భాలలో చెప్పబడినాయి. (చూపబడినాయి) See:
Krishan, p. 49.
Maruti Nandan Tiwari and Kamal Giri, "Images of In Jainism", in: Brown, pp.101-102.
7వ శతాబ్దం నుండి మధ్య, పశ్చిమ భారతంలో వచ్చిన శిల్పాలలో ఎలుకను చూపడం మొదలయ్యిందని Martin-Dubost అభిప్రాయపడ్డాడు.See note on figure 43 in: Martin-Dubost, p. 144. లిఖిత గ్రంథాలలో మత్స్య పురాణములో మొట్టమొదటగా ఎలుక వాహనం గురించి వ్రాయబడింది. తరువాత బ్రహ్మాండ పురాణము, గణేశ పురాణములలో ఈ విషయం ఉంది. చివరి అవతారంలో ఎలుకను వాహనంగా చేసుకొన్నట్లు గణేశపురాణంలో ఉంది.Citations to Matsya Purana 260.54, Brahmananda Purana Lalitamahatmya XXVII, and Ganesha Purana 2.134–136 are provided by: Martin-Dubost, p. 231. గణపతి అధర్వశీర్షం అనే గ్రంథంలో ఒక ధ్యాన శ్లోకం ప్రకారం వినాయకుని ధ్వజంమీద ఎలుక ఉంటుంది.Martin-Dubost, p. 232.. గణపతి సహస్రనామాలలో "మూషిక వాహన", "అఖుకేతన" అనే పేర్లున్నాయి.For see v. 6. For Ākhuketana see v. 67. In: . (, 1991). Source text with a commentary by in Sanskrit.
ఎలుక వాహనం సంకేతాన్ని అనేక విధాలుగా వివరిస్తారు - ఎలుక తామస ప్రవృత్తికి చిహ్నం. కనుక కామక్రోధాలను అణగ ద్రొక్కడం అనగా ఎలుకపై స్వారీ చేయడం.For a review of different interpretations, and quotation, see: Grimes (1995), p. 86.A Student's Guide to AS Religious Studies for the OCR Specification, by Michael Wilcockson, pg.117 పంటలకు హాని కలిగించే ఎలుకను అదుపు చేయడం అనగా విఘ్నాలను నివారించడం అని మరొక వివరణ ఉంది. ఇది గ్రామదేవత లక్షణాలలో ఒకటిKrishan pp. 49–50. ఎలుకనెక్కినందున వినాయకుడు ఎక్కడికైనా వెళ్ళగలడని (సర్వాంతర్యామి) మరొక అభిప్రాయం ఉంది.See:
Martin-Dubost, p. 231.
Rocher, Ludo. "'s Rise to Prominence in Sanskrit Literature", in: Brown (1991), p. 73. For mention of the interpretation that "the rat is 'the animal that finds its way to every place,'"
ఇతర విశేషాలు
ఓంకారము
thumb|left|ఓకారం రూపపు ఆభరణంలో వినాయకుడు
హిందూమతంలో ప్రణవ మంత్రం అయిన ఓంకారము స్వరూపమే వినాయకుడని అంటారు. వినాయకుడి రూపము ఓంకారంలా ఉంటుందని చెబుతుంటారు. (ముఖ్యంగా దేవనాగరి, తమిళ లిపులలో) For examples of both, see: Grimes, pp. 79–80. గణపతి అధర్వశీర్షంలో ఈ విషయం ఇలా ఉంది:
గణపతీ! నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవు. నీవే ఇంద్రుడవు.
నీవే అగ్నివి, వాయువువు, సూర్యుడవు, చంద్రుడవు, నీవే భూలోకము, అంతరిక్షము, స్వర్గము. నీవే ఓంకారము.Chinmayananda, p. 127. In Chinmayananda's numbering system, this is upamantra 8.
మూలాధార చక్రము
కుండలినీ యోగము ప్రకారము షట్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. ఈ చక్రంలోనే కుండలినీ శక్తి సాధారణంగా అంతస్థితమై (చుట్టు చుట్టుకొని, నిద్రాణమై) ఉంటుంది. వినాయకుని రూపంలో పామను చూపడానికి, మూలాధార చక్రంతో ఉన్న సంబంధానికి సాఱూప్యం చెబుతుంటారు.Tantra Unveiled: Seducing the Forces of Matter & Spirit By Rajmani Tigunait; Contributor Deborah Willoughby ; Published 1999; Himalayan Institute Press; p. 83; ISBN 0-89389-158-4 గణపతి అధర్వశీర్షంలో కూడా ఈ విషయం చెప్పబడింది. కనుక వినాయకుడు అన్నింటికీ "మూలాధారము" అని కూడా వివరిస్తుంటారు.Chinmayananda, op. cit., p. 127. In Chinmayananda's numbering system this is part of upamantra 7. 'You have a permanent abode (in every being) at the place called "Muladhara"'.
వినాయక స్వరూపానికి తాత్విక వివరణ
thumb|right|మంగళూరులోని "కుద్రోళి భగవతి" మందిరంలో అలంకృత గణేశవిగ్రహం.
వినాయకుని ఆకారం పై ఎన్నో చర్చలు, అభిప్రాయాలు, తత్వార్థ వివరణలు, కథలు ఉన్నాయి. ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం - ఇవి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలు.
వినాయకుని ఆకారం దేవనాగరి లిపిలో "ఓం" (ప్రణవం) ను పోలి ఉన్నదని చెబుతారు. ఇది చిత్రకారులకు చాలా ప్రియమైన విషయం. ఓంకారంలో వినాయకుడిని చూపిస్తూ ఎన్ని బొమ్మలు గీయబడ్డాయో చెప్పలేము. ఎందరో చిత్రకారులు ఈ విషయంలో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.
వినయకుని తొండము "ఓం"కారానికి సంకేతమని చెబుతారు.
ఏనుగు తల - జ్ఙానానికీ, యోగానికీ చిహ్నము.
మనిషి శరీరము - మాయకూ, ప్రకృతికీ చిహ్నము
చేతిలో పరశువు - అజ్ఙానమును ఖండించడానికి సంకేతము
చేతిలో పాశము - విఘ్నాలు కట్టిపడవసే సాధనము
విరిగిన దంతము - త్యాగానికి చిహ్నము
మాల - జ్ఙాన సముపార్జన
పెద్ద చెవులు - మ్రొక్కులు వినే కరుణామయుడు
పొట్టపై నాగ బంధము - శక్తికి, కుండలినికి సంకేతము
ఎలుక వాహనము - జ్ఙానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి.
వినాయకుని గూర్చి కథలు
వినాయకుని జననం, ఏనుగు తల
right|thumb|వినాయకునికి స్నానం చేయిస్తున్న పార్వతీ పరమేశ్వరులు - 18వ శతాబ్దం కాలపు కాంగ్రా శైలి చిత్రం - అలహాబాదు మ్యూజియంలో ఉన్నది
వినాయకుని జననం గూర్చి సర్వసాధారణమైన కథ, వినాయక చవితి వ్రతంలో చదివేది: గజాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు. శివుని తన శరీరములో దాచుకొన్నాడు. కాని విష్ణువుకు ఇచ్చిన మాట ప్రకారం, తన శిరస్సును లోకపూజ్యము చేయమని కోరి, మరణించాడు. కైలాసములో శివుని రాకకు ఎదురు చూసే పార్వతి పిండితో ఒక బాలుని బొమ్మ చేసి, ప్రాణము పోసింది. తను స్నానమునకు పోవునపుడు ఆ బాలుని వాకిలి వద్ద కాపలా ఉంచింది. ఆ బాలుడు ద్వారము దగ్గర శివుని అడ్డుకొన్నాడు. కోపించి శివుడు బాలుని తల తెగవేశాడు. విషయము తెలిసికొని పార్వతి హతాశురాలైంది. ఆప్పుడు శివుడు గజాసురుని శిరస్సును అమర్చి తన కొడుకుని తిరిగి బ్రతికించాడు. గణపతిగా నియమించాడు.
బ్రహ్మవైవర్త పురాణములోని కథ: శివుని ఉపదేశము ప్రకారము పార్వతి విష్ణువును పూజించి, పుణ్యకవ్రతము మాచరించి కొడుకును కన్నది. ఆ బాలుని జన్మ వేడుకలలో బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆశీర్వదించారు. కాని శనీశ్వరుడు మాత్రం ఆ బాలుని వైపు చూడలేదు, తన దృష్టి వల్ల హాని జరుగుతుందనే భయంతో. కాని పార్వతి బలవంతంపై బాలుని ముఖం చూడక తప్పలేదు. అప్పుడు ఆ బిడ్డ తల పగిలిపోయింది. దేవతలంతా చింతితులు కాగా విష్ణువు పుష్పభద్రానదీ తీరంనుంచి ఒక గున్న ఏనుగు తల తెచ్చి, అతికించి, ఆ బాలును పునరుజ్జీవితుని చేశాడు.
మరొక కథ ప్రకారం (వరాహ పురాణం) - శివుని నవ్వు నుండి వినాయకుడు జన్మించాడు. అయితే వినాయకుని అందం చాలా ఎక్కువ కావడం వలన (దిష్టి తగులకుండా?) శివుడు అతనికి ఏనుగు తల, బాన పొట్ట ఉండేలా చేశాడు.
గణాధిపత్యం, చంద్రునినవ్వు, పార్వతిశాపం
వినాయక వ్రత కల్ప విధానములో వినాయకునికి గణాధిపత్యం ఎలా లభించిందీ, గణపతని చూసి నవ్విన చంద్రుడు పార్వతీదేవి శాపానికి ఎలా గురైంది ప్రస్తావించి ఉంది.
గణాధిపతి స్థానానికి వినాయకుడూ, కుమారస్వామీ పోటీ పడ్డారు. శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు - "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చెసి ముందుగా నా వద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుంది". కుమార స్వామి నెమలి వాహనంపై వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు. వినాయకుడు నారాయణ మంత్రము జపిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. నారములు అనగా జలములు, జలమున్నియు నారాయుణుని ఆధీనాలు. అనగా ఆ మంత్ర ఆధీనములు. మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు. వినాయకునికే ఆధిపత్యము లభించింది.
గణాధిపతియైన వినాయకుడు లోకముల పూజలు అందుకొని, సుష్టుగా భోజనం చేసి, కైలాసమునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోయాడు. కాని బొజ్జ కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే, అదిచూసి చంద్రుడు పకపక నవ్వాడు. ఆ నవ్వుకు (దృష్టి దోషానికి) వినాయకుడి పొట్ట పగిలిపోయింది. కోపించిన పార్వతి "నిన్ను చూచినవారు నీలాపనిందలకు గురియగుదురు గాక" అని శపించింది. ఫలితముగా లోకమునకు చంద్రుడు నింద్యుడయినాడు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు.
లోకుల ప్రార్థనలు మన్నించిన పార్వతి 'భాద్రపద శుద్ధ చవితి' నాడు (చంద్రుడు నవ్విన నాడు) మాత్రమే ఈ శాపము వర్తిస్తుందని శాప ప్రభావాన్ని సడలించింది. ఆ ఒక్కరోజు లోకులు జాగ్రత్త పడసాగారు. ద్వాపర యుగంలో కృష్ణుడు పొరపాటున చంద్రుని చూచినందున ఆయనకు కూడా శ్యమంతకమణి అపహరించాడనే అపనింద అంటుకుంది. శ్రమించి కృష్ణుడు అసలు విషయాన్ని ఋజువు చేసుకొన్నాడు. కాని శక్తి హీనులైన సామాన్యులకు ఇది ఎలా సాధ్యం? ప్రజల విన్నపాన్ని మన్నించి కృష్ణుడు "భాద్రపద శుద్ధ చవితి" నాడు వినాయకుని పూజించి, ఈ కథ విని, అక్షతలు తలపై ధరిస్తే ఈ శాపదోషం అంటదని ఉపాయాన్ని అనుగ్రహించాడు
సిద్ధి, బుద్ధి
thumb|right|సిద్ధి, బుద్ధి సమేతుడైన వినాయకుడు - శ్రీ మయూరేశ్వరునిగా - మోరెగావ్లో అష్టవినాయక మందిరంలో మూలవిరాట్టు|link=Special:FilePath/ShriMayureshwar_Morgaon.jpg
వినాయకునకు సిద్ధి, బుద్ధి అనేవారు భార్యలు. కనుకనే వినాయకుడు ఉన్నచోట సకల కార్యాలూ సిద్ధిస్తాయి. జ్ఙానం వికసిస్తుంది. ఇక కొరతేమున్నది. అందువలన ఏ పనైనా - పూజ కాని, పెళ్ళి కాని, గృహప్రవేశం గాని, ప్రారంభోత్సవం గాని, రచనారంభం గాని, పరీక్ష గాని, ఉద్యోగం గాని - వినాయకుని పూజతోనే మొదలవుతుంది. ముఖ్యంగా జ్యోతిష్యులకూ, రచయితలకూ వినాయకుడు నిత్యారాధ్య దేవుడు.
కాకిరూపంలో గణపతి
(తమిళనాట ప్రచారంలో ఉన్న గాథ) అగస్త్యమహర్షి ఒకసారి కోపించి కావేరీనదీ జలాలను తన కమండలంలో బంధించివేశాడు. ప్రజల ఇబ్బందిని గమనించి, ఇంద్రుడు ప్రార్థించగా అప్పుడు వినాయకుడు కాకి రూపంలో వెళ్ళి నీటిని త్రాగుతున్నట్లు నటిస్తూ ఆ కమండలాన్ని దొర్లించి ఎగిరిపోయాడు. మళ్ళీ కావేరి నది మామూలుగా ప్రవహించసాగింది. తన తొందరపాటును తెలిసికొని అగస్త్యుడు వినాయకుని స్తుతించాడు.
భూకైలాస్ కథ
(తెలుగునాట ప్రసిద్ధి చెందిన నాటకము) ఒకసారి రావణుడు శివుని మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని కోరాడు. శంకరుడే లింగరూపుడై రావణుని చేతికి వచ్చాడు. కాని ఎక్కడ నేలమీద పెడితే అక్కడే ప్రతిష్ఠితమౌతానని చెప్పాడు. సంధ్యా వందనసమయం అయినందున రావణుడు ఆ లింగాన్ని ఎక్కడ ఉంచాలో ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వినాయకుడు బాల బ్రహ్మచారి రూపంలో వస్తాడు. రావణుడు శివలింగాన్ని పట్టుకోమని కోరాడు. కాని ఆయన "నేను నీ అంత బలవంతుని కాను. మోయలేకపోయినప్పుడు మూడుసార్లు పిలిస్తాను. నువ్వు రాకుంటే క్రింద పెట్టేస్తాను" అని షరతు విధించి ఆత్మలింగాన్ని తీసికొన్నాడు. సంధ్యావందనం మధ్యలో మూడుసార్లు పిలిచినా సమయానికి రావణుడు రాలేకపోయాడు. బరువు మోయలేనివానివలె గణపతి ఆత్మలింగాన్ని నేలమీద పెట్టేస్తాడు. ఆవిధంగా పెట్టిన ప్రదేశమే ఇప్పుడు ఉన్న గోకర్ణ పుణ్యక్షేత్రము. రావణాసురుడు అప్పుడు ఆ ఆత్మలింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తే ఐదు భాగాలుగా విడి పోయి, సముద్రతీరములోని ఐదు చోట్ల పడితే ఆ ఐదు కూడా పుణ్యక్షేత్రాలగా వెలిశాయు. అ క్షేత్రాలలో కర్ణాటకలో ఉన్న మురుడేశ్వర ఒకటి.
మహాభారతానికి వ్రాయసకాడు
వేదాలను విభజించిన వేదవ్యాసుడు పంచమవేదమైన మహాభారతాన్ని వ్రాయడానికి సంకల్పించాడు. తాను చెప్తూ ఉంటే వ్రాయగల సమర్థునికోసం గణపతిని ప్రార్థించాడు. గణపతి ఒక నియమాన్ని విధించాడు - వ్యాసుడు ఎక్కడా ఆపకుండా చెప్పాలి. ఒప్పుకొన్న వ్యాసుడు కూడా ఒక నియమం విధించాడు - తాను చెప్పినదానిని పూర్తిగా అర్థం చేసుకొనే గణపతి వ్రాయాలి. అలా ఒప్పందం ప్రకారం భారత కథా రచన సాగింది. తన దంతాన్నే ఘంటంగా గణపతి వినియోగించాడు. అంతటి మహానుభావుల సమర్పణ గనుకనే మహాభారతం అనన్య మహాకావ్యమైనది.
పండుగలు, ఆచారాలు, దేవాలయాలు
పూజ, పండుగలు
thumb|right|2013 వినాయక చవితికి ఖైరతాబాద్లో ప్రతిష్ఠింపబడిన వినాయకుడుఅనేక ధార్మిక, లౌకిక కార్యక్రమాలలో వినాయకుని పూజించడం సర్వసాధారణం. ఏదైనా పూజ లేదా వ్రతం చేసేటపుడు ముందుగా వినాయకుని పూజిస్తారు గనుక అతనిని "ప్రథమపూజ్యుడు" అంటారు. అలాగే పెళ్ళి, పుట్టినరోజు, శంకుస్థాపన, గృహప్రవేశం, క్రొత్త వాహనం కొనడం, పరీక్షలకు సిద్ధం కావడం, వ్యాపారం మొదలు పెట్టడం, ముహూర్తం నిశ్చయించడం, జాతకం వ్రాయడం, ఉత్తరం వ్రాయడం - ఇలా ఎన్నో సందర్భాలలో వినాయకుని పూజిస్తారు లేదా స్మరిస్తారు.Krishan pp.1-3 వినాయకుని బొమ్మ లేదా ప్రతిమ లేని హిందూ గృహం అరుదు. అన్ని కులాలు, సంప్రదాయాలు, శాఖలలోను, అన్ని ప్రాంతాలలోను వినాయకుని పూజ జరుగుతూ ఉంటుంది.K.N. Somayaji, Concept of Ganesha, p.1 as quoted in Krishan pp.2-3 ముందుగా వినాయకుని సంతోషపెడితే ఆటంకాలు రాకుండా కార్యసిద్ధి లభిస్తుందని, కష్టాలు దూరంగా ఉంటాయని, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.Krishan p.38 శైవులు, వైష్ణవులు, బౌద్ధులు, జైనుల - ఇలా అన్ని శాఖలలోను వినాయకుని పూజించే ఆచారం ఉంది.For worship of Ganesha by "followers of all sects and denominations, Saivites, Vaisnavites, Buddhists and Jainas" see సంగీత నృత్యప్రదర్శనలు (ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో), సమావేశాలు, ఉత్సవాలు కూడా వినాయకుని ప్రార్థనతో మొదలవుతుంటాయి.Nagar, Preface. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం గం గణపతయే నమః వంటి ప్రార్థనా మంత్రాలను తరచు ఉచ్ఛరిస్తుంటారు.Grimes p.27
వినాయకునికి అధికంగా లడ్డూలు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. తెలుగునాట పానకము, వడపప్పు, ఉండ్రాళ్ళు, పాలతేలికలు, పప్పులో ఉండ్రాళ్ళు, కుడుములు వంటి పదార్థాలు నివేదన చేస్తారు. ఎర్ర చందనం పూస్తారు. గరిక, మారేడు వంటి పత్రులను పూజలో వాడుతారు. వినాయకుని మందిరం వద్ద జిల్లేడు చెట్టు ఉండడం కూడా సాధారణంగా చూడవచ్చును.
ఇలా సందర్భానుసారంగాను, నిత్య పూజా కార్యక్రమంలో భాగంగాను చేసే పూజలు మాత్రమే కాకుండా వినాయకునికి సంబంధించిన రెండు పండుగలు జరుపుకొంటారు. అవి -
భాద్రపద శుద్ధ చతుర్థి నాడు (ఆగస్టు / సెప్టెంబరు నెలలలో) వచ్చే వినాయక చవితి
మాఘ కృష్ణ చతుర్థి నాడు (జనవరి / ఫిబ్రవరి నెలలలో) వచ్చే వినాయక జయంతి
ప్రతి చంద్రమాసంలో వచ్చే వినాయకుడి ఉత్సవం సంకటహర చతుర్థి
వినాయక చవితి
thumb|right|250px|వినాయక చవితి అనంతరం విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసే దృశ్యం - హైదరాబాదు
భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వచ్చే వినాయకచవితి దాదాపు దేశమంతటా పెద్దయెత్తున నిర్వహింపబడుతుంది.For the fourth waxing day in being dedicated to Ganesa () see: Bhattacharyya, B., "Festivals and Sacred Days", in: Bhattacharyya, volume IV, p. 483. ఈ పండుగలో గమనించదగిన ముఖ్యాంశాలు
మట్టితో చేసిన వినాయకుని ప్రతిమ ఇంటింటా పాలవెల్లి క్రింద మంటపంలో ప్రతిష్ఠించి అనేక రకాల పత్రితోను పూలతోను పూజ చేయడం
లడ్డూలు, పానకము, వడపప్పు, ఉండ్రాళ్ళు, పాలతేలికలు, పప్పులో ఉండ్రాళ్ళు, కుడుములు వంటి పదార్థాల నివేదన
వీధివీధినా గణపతి ప్రతిష్ఠ, సామూహిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు
9రోజుల ఉత్సవాల తరువాత, 10వ రోజున ఉత్సవ విగ్రహాల నిమజ్జనం
ఈ విధంగా ఈ పండుగ కుటుంబ పరిధిలోను, సామాజికంగాను కూడా జరుపుకునే పండుగగా రూపు దిద్దుకొంది. అంతకు ముందు ఇంటిపూజకే పరిమితమైన పూజా విధానం 1893లో బాల గంగాధర తిలక్ అధ్వర్యంలో మహారాష్ట్రలో సామూహిక ఉత్సవాలుగా రూపుదిద్దుకొన్నాయి.The Experience of Hinduism: Essays on Religion in Maharashtra ; Edited By Eleanor Zelliot, Maxine Berntsen, pp.76-94 ("The Ganesh Festival in Maharashtra: Some Observations" by Paul B. Courtright); Published 1988; SUNY Press; ISBN 0-88706-664-X హిందూ సమాజంలో వివిధ వర్ణాల మధ్య సుహృద్భావాన్ని పెంచడానికి, జాతీయతాభావాన్ని ప్రోత్సహించడానికి ఈ విధమైన ఉత్సవాలు ఉపయోగపడుతాయని అతని లక్ష్యం.See:
Brown (1991), p. 9.
Thapan, p. 225. For Tilak's role in converting the private family festivals to a public event in support of Indian nationalism.See:
Momin, A. R., The Legacy Of G. S. Ghurye: A Centennial Festschrift, p. 95.
Brown (1991), p. 9. For Ganesha's appeal as "the god for Everyman" as a motivation for Tilak. అతను నెలకొలిపిన సంప్రదాయం (మైదానాలలో విగ్రహాలను ప్రతిష్ఠించడం, 10వ రోజున నిమజ్జనం చేయడం) ఇప్పటికీ కొనసాగుతున్నది.For Tilak as the first to use large public images in (pavilions or tents) see: Thapan, p. 225.
దేవాలయాలు
దేశంలో కొన్ని మందిరాలు ప్రధానంగా వినాయకుని మందిరాలుగా ఉంటాయి (ఉదాహరణకు కాణిపాకం). అయితే అనేక (దాదాపు అన్ని) దేవాలయాలలోను వినాయకుని ప్రతిమ లేదా ఉపాలయం లేదా అంతరాలయం ఉండడం జరుగుతుంది. కోటలు, రాజప్రాసాదాలు, ఇళ్ళు, వీధులు, రావిచెట్టు - ఇలా అనేక స్థానాలలో గణపతి విగ్రహం ప్రతిష్ఠిస్తుంటారు. ప్రత్యేకంగా వినాయకుడు ప్రధాన దైవంగా ఉన్న లేదా గణపతి పూజకు ప్రాముఖ్యత ఉన్న కొన్ని ఆలయాలు - <ref></</ref>
right|thumb|కర్పగ వినాయక మందిరం, పిళ్ళైయార్ పట్టి, తమిళనాడు
ఆంధ్ర ప్రదేశ్ - కాణిపాకం
మహారాష్ట్ర - వై, మోరెగావ్
మధ్య ప్రదేశ్ - ఉజ్జయిని
రాజస్థాన్ - జోధ్ పూర్, నాగోర్, రాయిపూర్ (పాలి)
బీహార్ - బైద్యనాధ్
గుజరాత్ - బరోడా, ఢోలక్, వల్సాద్
ఉత్తర ప్రదేశ్ - వారాణసి (ధుండిరాజ్ మందిరం),
కేరళ - తిరుచిరాపల్లి (జంబుకేశ్వర మందిరం - ఉచ్చి పిళ్లైయార్ కొట్టై), పిళ్లైయార్ పట్టి (కర్పగవినాయక మందిరం), రామేశ్వరం, సుచీంద్రం
కర్ణాటక - హంపి, కాసరగోడ్, ఇదగుంజి
అష్ట వినాయక మందిరాలు
మహారాష్ట్రలో పూణె సమీపంలో (100 కిలోమీటర్ల పరిధిలో) ఉన్న ఎనిమిది ఆలయాలను అష్టవినాయక మందిరాలంటారు. ఒక్కొక్క ఆలయంలోను గణపతి ఒక్కొక్క రూపంలో పూజలు అందుకొంటాడు.
మోరెగావ్, అష్టవినాయక మందిరం
సిద్ధి వినాయక మందిరం, సిద్ధాటెక్
బల్లాలేశ్వర మందిరం, పాలి
వరద వినాయక మందిరం, మహాడ్
చింతామణి మందిరం, తియూర్
గిరిజాత్మజ మందిరం, లేయాంద్రి
విఘ్నహర మందిరం, ఒజార్
మహాగణపతి మందిరం, రంజనగావ్
వీటిలో ముందుగా మోరేశ్వర మందిరాన్ని దర్శించే సాంప్రదాయం ఉంది.
కాణిపాకం
right|thumb|250px|కాణిపాకం దేవాలయం లోపలి దృశ్యం
కాణిపాకం, చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామం. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి ముప్పై నిముషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును.
కాణిపాకంలో కొలువు తీరిన వినాయకునికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు అనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయని, స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ది వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది.
ఇతర దేశాలు, మతాలలో
thumb|"నర్తించే గణపతి. సెంట్రల్ టిబెట్. 15వ శతాబ్దం ఆరంభకాలపు చిత్రం. వస్త్రంపై అద్దిన చిత్రం. ఎత్తు: 68 సెంటీమీటర్లు".This work and its description are shown in Pal, p. 125. ఈ స్వరూపాన్ని "మహారక్త" అని కూడా అంటారు.For a representation of this form identified as Maharakta, see Pal, p. 130.
thumb|9వ శతాబ్దానికి చెందిన వినాయక విగ్రహం - పంబన్ మందిరం, జావా, ఇండొనేషియా
వాణిజ్య, ధార్మిక సంబంధాల కారణంగా ఆగ్నేయాసియాలో అనేక హిందూదేవతల పూజా సంప్రదాయాలు నెలకొన్నట్లే వినాయకుని పూజించడం కూడా అందిపుచ్చుకొన్నారు.Nagar, p. 175. ఇది ప్రధానంగా 10వ శతాబ్దంలో జరిగింది. ముఖ్యంగా వ్యాపారులు పూజించే దేవతామూర్తులలో వినాయకుడు ముఖ్యుడుగా ఉన్నాడుThapan, p. 152.. మలయా ద్వీపకల్పంలోని అనేక భాగాలలో వినాయకుని విగ్రహాలు లభించాయి. ముఖ్యంగా శైవాలయాలలో వినాయకుని పూజ కూడా సర్వసాధారణం. వినాయకుని మూర్తిచిత్రీకరణలో స్థానిక సంస్కృతి ప్రభావం బాగా కనిపిస్తుంది.Getty, pp. 55–66.. క్రమంగా ఈ సంస్కృతి బర్మా, థాయిలాండ్, కంబోడియాలకు విస్తరించింది. ఇప్పుడు ప్రధానంగా బౌద్ధ సమాజమైన థాయిలాండ్లో వినాయకుడు విఘ్ననివారకునిగా పూజలందుకొంటున్నాడు.
ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాం ప్రవేశించడానికి ముందుగా హిందూ, బౌద్ధ సంస్కృతుల ప్రభావం బాగా ఉండేది. ఆ కాలానికి చెందిన కొన్ని గణేశ విగ్రహాలు లభించాయి.See:
Nagar, p. 175.
Martin-Dubost, p. 311.
మహాయాన బౌద్ధంలో వినాయకుని స్వరూపం కొన్నిసార్లు బౌద్ధ దేవతగాను, మరొకొన్నిసార్లు హిందూ రాక్షసునిగాను కూడా చూపబడింది.Getty, pp. 37–45. గుప్తుల కాలం చివరిభాగంలోని బౌద్ధ శిల్పాలలో వినాయకుని శిల్పాలున్నాయి.Getty, p. 37. బౌద్ధ దేవతగా వినాయకుడు అధికంగా నృత్యముద్రలో చూపబడ్డాడు. ఉత్తర భారతదేశం, నేపాల్, టిబెట్లలో ఈ రకమైన చిత్రాలు లభించాయి.Getty, p. 38. నేపాల్లో వినాయకుని హేరంబునిగా ఆరాధిస్తారు. ఈ రూపంలో వినాయకునికి ఐదు తలలు ఉంటాయి. వాహనం సింహం.Getty, p. 40. టిబెట్టులో వినాయకుని చిత్రీకరణ tshogs bdag అనబడింది.Wayman, Alex (2006). Chanting the Names of Manjushri. Motilal Banarsidass Publishers: p.76 . ISBN 81-208-1653-6 ఒకోమారు దేవునిగాను, ఒకోమారు మహాకాలుని పాదాలక్రింది నలుగుతున్నట్లుగాను చూపారు. మరికొన్ని చోట్ల విఘ్ననివారకునిగా చూపారుSee:
Getty, p. 42
Nagar, p. 185. కొన్ని వైవిధ్యాలతో వినాయకుడు చీనా, జపాన్ సంప్రదాయాలలో కూడా దర్శనమిస్తాడు. ఉత్తర చైనాలో 531 సంవత్సరానికి చెందిన ఒక విగ్రహం లభించింది.Martin-Dubost, p. 311. జపాన్లో 806 కాలంలో వినాయకపూజ గురించి ప్రస్తావించినట్లు ఆధారం లభించింది.Martin-Dubost, p. 313.
జైన గ్రంథాలలో గణేశపూజ ప్రస్తావింపబడలేదు కాని చాలామంది జైనులు వినాయకుని పూజిస్తారు. వారు కుబేరుని కొన్ని లక్షణాలు వినాయకునికి ఆపాదించినట్లు అనిపిస్తుంది.Krishan, p. 121. వ్యాపార వృత్తులలో జైనులు అధికంగా పాల్గొనడం ఇక్కడ గమనించాలి. 9వ శతాబ్దానికి చెందిన జైన గణేశ విగ్రహం ఒకటి లభించింది.Krishan, p. 122. రాజస్థాన్, గుజరాత్లలో జైనమందిరాలలో వినాయక విగ్రహాలున్నాయి.Thapan, p. 158.
అవీ ఇవీ
32 గణపతులు
ప్రధానంగా గణపతుల సంఖ్య 21 (కనుకనే ఏకవింశతి పత్రపూజ చేస్తారు). ఇంకా అవాంతర భేదగణపతులు 11 - మొత్తం 32
ప్రార్థనలు, కీర్తనలు
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను)
అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశం
అనేకదమ్ తమ్ భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే
(అగజ) పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్ని వేళలా ఎన్నో విధములైన సంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.
ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాధనం
వినాయకుని ప్రార్థనలు ఇన్నీ అన్నీ అని చెప్పజాలము. ప్రతి పనికీ, రచనకూ ముందు వినాయకుని ప్రార్థించడం ఆనవాయితీ గనుక దాదాపు ఎన్ని పద్యకావ్యాలున్నాయో అన్ని ప్రార్థనా పద్యాలున్నాయి. ఇక సంప్రదాయ శ్లోకాలు సరేసరి. కాని తెలుగువారికి అత్యంత పరిచయమున్న పద్యమిది.
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్.
ప్రత్యేకతలు
thumb
పత్రితో పూజ చేయడం గణపతి ఆరాధనలో ఒక ప్రత్యేకత. 21 పత్రులు లేదా 108 పత్రులు పూజకు వాడాలని శాస్త్రము. ఈ పత్రులన్నింటికీ ఆయుర్వేద వైద్య విధానంలో మంచి ఔషధీగుణాలున్నాయి.
ఏ మాత్రము ఆదరణకు నోచుకోని జిల్లేడు, ఉమ్మెత్త చెట్లు వినాయకుని పూజకు వాడతారు.
తెలుగు వారు వినాయకునికి ఉండ్రాళ్ళు, కుడుములు, చలిమిడి, పళ్లు నైవేద్యం పెడతారు. ఇవన్నీ నాగరికత పెరగక ముందు వంటలు. నూనెలూ, వేపుళ్ళూ, దినుసులూ అవసరం లేదు. బహుశా వినాయకుని పూజ అతి ప్రాచీన సంప్రదాయం గనుక ఇలా జరిగి ఉండవచ్చును.
వినాయకుడి చిత్రం పెళ్ళి శుభలేఖల్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం. సంప్రదాయవాదులకూ, ఆధునికులకూ కూడా ఇది సామాన్యం
వినాయకుడి చిత్రాన్ని గీయడానికి చిత్రకారులు ఎన్నో మెళకువలూ, విధానాలూ రూపొందించారు. ఒకటి రెండు చిన్న గీతలునుంచి క్లిష్టమైన డిజైనులవరకూ ఎన్నో విధాలుగా వినాయకుని చిత్రించారు. ఎక్కువగా ఓంకారాకృతిలో వినాయకుని చిత్రించడం సామాన్యం.
ఇప్పుడు పల్లెల్లోనూ, చిన్న నగరాల్లోనూ, మహానగరాల్లోనూ వినాయక చవితికి విగ్రహాలు వీధివీధినా ప్రతిష్ఠించి, పూజలు జరిపి, పెద్దయెత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక చివరి రోజున నిమజ్జనమైతే ఒక పెద్ద కార్యక్రమమైపోతున్నది. ప్రజలకూ, ప్రభుత్వానికీ ఇది పెద్ద సవాలుగా పరిణమిస్తున్నది.
ఇవికూడా చూడండి
అశోక సుందరి
వినాయక చవితి
వినాయక వ్రత కల్ప విధానము
వినాయక జయంతి
వినాయకుడి దేవాలయాల జాబితా
వినాయకుడి 108 పేర్లు
మూలాలు
ఆధార గ్రంథాలు
Four volumes.
.
.
. Source text with a commentary by Bhāskararāya in Sanskrit.
వినాయకచవితి వ్రతకల్పము - మైలవరపు శ్రీనివాసరావు రచన, ఇతర రచనలు
బయటి లింకులు
వినాయకుని రూపం, అంతరార్ధం
వినాయకుని గురించి
సంకష్టహర గణపతి వ్రతం
వర్గం:హిందూమతం
వర్గం:హిందూ దేవతలు
వర్గం:పురాణాలు
వర్గం:వినాయకుడు
వర్గం:ఏనుగులు
వర్గం:ఈ వారం వ్యాసాలు |
సెప్టెంబర్ 1 | https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_1 | సెప్టెంబర్ 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 244వ రోజు (లీపు సంవత్సరములో 245వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 121 రోజులు మిగిలినవి.
సంఘటనలు
thumb|నారా చంద్రబాబు నాయుడు
1939: రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనది.
1961: మొదటి అలీన దేశాల సదస్సు బెల్గ్రేడ్ లో ప్రారంభమైనది.
1992: 10వ అలీన దేశాల సదస్సు ఇండోనేషియా లోని జకర్తా లో ప్రారంభమైనది.
1995: నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ 19వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
2006: పద్దెనిమిదవ లా కమిషన్ ను, (ఆర్డర్ నంబర్ A.45012/1/2006-Admn.III) తేది 2006 సెప్టెంబర్ 1 న ఏర్పాటు చేసారు. ఇది 2009 ఆగష్టు 31 వరకు అమలులో ఉంటుంది. 2007 మే 28 వరకు జస్టిస్ ఎమ్. జగన్నాధరావు అధ్యక్షుడు. ఆ తరువాత ఎ.ఆర్. లక్ష్మణన్ ను నియమించారు.
2008: భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్గా దువ్వూరి సుబ్బారావు నియమితుడైనాడు.
2008: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
జననాలు
1945: గుళ్ళపల్లి నాగేశ్వరరావు, నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1947: పి.ఎ.సంగ్మా, భారతదేశ లోక్ సభ మాజీ సభాపతి. (మ.2016)
1950: టీ.కృష్ణ, తెలుగు సినీ దర్శకుడు .(మ.1986)
1973: రామ్ కపూర్, భారతీయ టెలివిజన్ నటుడు.
1975: యశస్వి, కవిసంగమం కవి.
1985: ముమైత్ ఖాన్ , తెలుగు,తమిళ ,హిందీ, కన్నడ, నటి.మోడల్, ఐటెం సాంగ్ లోగుర్తింపు.
మరణాలు
1904: పూండ్ల రామకృష్ణయ్య, తెలుగు పండితుడు, విమర్శకుడు. (జ.1860)
1990: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (జ.1914)
1992: ఎస్.వి.జోగారావు, సాహిత్యవేత్త. (జ.1928)
2002: బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. (జ.1929)
2020: మాతంగి నర్సయ్య, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ మంత్రి.
స్థాపనలు
1901: శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, తెలంగాణలో మొదటి గ్రంథాలయం
1956: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పండుగలు , జాతీయ దినాలు
* - ఎల్.ఐ.సి. ఫార్మేషన్ డే
* - ఉజ్బేకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం
పోషక పదార్థాల వారోత్సవం
ప్రపంచ కొబ్బరి దినోత్సవం
బయటి లింకులు
బీబీసి: ఈ రోజున
టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 1
చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
ఈ రోజున ఏమి జరిగిందంటే.
చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
ఈ రొజు గొప్పతనం.
కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 2 - ఆగష్టు 31 - ఆగష్టు 1 - అక్టోబర్ 1 -- అన్ని తేదీలు
వర్గం:సెప్టెంబర్
వర్గం:తేదీలు |
టి వి సాహిత్యం | https://te.wikipedia.org/wiki/టి_వి_సాహిత్యం | టీ వీ సాహిత్యానికి భవిష్యత్తులో మంచి జగము ఉన్నట్టు తోచుచున్నది, మన వాళ్ళు టీ వీ లకు అతుక్కుపోయే సమయము చూస్తే!
ప్రస్తుతానికి మన టీవీలలో అంతులేని సీరియల్లు అను కథలు, సీరియల్లకే చెందిన పాటలను, సినిమా సంభంధించిన ప్రోగ్రాములూ, కొన్ని హాస్యపు జల్లుల సీరియల్లు, (ప్రస్తుతానికి అయితే ఈ టీ వీ లోని డూప్సు, జెమినీ టీ వీలోని అమృతం సీరియలును, మా టీ వీలోని కానిష్టేబులు కనకారావును చెప్పుకోవచ్చు. ) డామినేటు చేస్తున్నాయి!
తెలుగు దేశంలోని టీవీల గురించి చెప్పుకునేది ఏదైనా రాడన్ టీ వీ వారి తమిళ డబ్బింగు సీరియల్లు గురించీ ఈ టీ వీ అధినేత, సుప్రిమో అయిన రామోజీరావు గారి కుమారుడు అయిన సుమన్ గారి బహుముఖ ప్రజ్ఞాపాటవాలను గురించి చెప్పుకోకుంటే పూర్తికానట్లే!
చూడండి
తెలుగు టీ వీ చానల్లు
భారతీయ టీ వీ చానల్లు
తెలుగు బుల్లితెర నతులు కావలెను9030196011
వర్గం:మాధ్యమాలు |
తెలుగు సాహితీకారుల జాబితాలు | https://te.wikipedia.org/wiki/తెలుగు_సాహితీకారుల_జాబితాలు | ఈ వ్యాసం పునర్వవ్యవస్థీకరణ జరుగుతున్నది. ఈ వ్యాసంలో విభజనను పటిష్ఠంగా రూపొందించేందుకు సహకరించండి.
సూచనలు
ఎందరో మహాను భావులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. వారి గురించి తెలుసుకొనడానికి ఇది ఒక వేదికగా, ఒక సూచికగా ఉపయుక్తమయ్యే జాబితా.
ఒక్కొక్క కాలానికి చెందిన రచయితలను ఒక్కో వ్యాసం (జాబితా)లో ఉంచాలి. జాబితాల పేర్లు దిగువన ఇవ్వబడ్డాయి. ఆధునిక యుగంలో వివిధ సాహితీ ప్రక్రియలు పరిఢవిల్లినందున ఆధునిక యుగంలో ఒక్కో విభాగానికి ఒక్కో జాబితా ఏర్పరచబడింది. కొందరు (ఉదాహరణ: గురజాడ, విశ్వనాధ) చాలా జాబితాలలోకి వస్తారు. అన్ని జాబితాలలోనూ వారి పేర్లు వ్రాయవచ్చును.
రచయితలతో బాటు వారి రచనలను కూడా వ్రాయాలి. ఒక్కో రచయితకూ ఒక్కో వ్యాసం, ఒక్కో (ముఖ్య)రచనకూ ఒక్కో వ్యాసం వికీలో ఉండాలని ఆకాంక్ష. విశ్వనాధ వంటివారి రచనలు పెద్ద జాబితా
అవ్వవచ్చును. అటువంటి చోట వారి రచనల జాబితాకు (లేదా వారి గురించిన వ్యాసానికి) లింకు ఇవ్వవచ్చును.
ప్రాఙ్నన్నయ యుగము : సా.శ. 1000 వరకు
ప్రాఙ్నన్నయ యుగం
నన్నయ యుగము : 1000 - 1100
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:నన్నయ యుగం కవులు]] లేదా [[వర్గం:నన్నయ యుగం రచనలు]], వ్యాసాలకు సంబంధించిన మూస
నన్నయ్య లేదా నన్నయభట్టు - ఆదికవి, వాగనుశాసనుడు
శ్రీ మదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము, సభా పర్వము, అరణ్య పర్వములో కొంత
ఆంధ్రశబ్ద చింతామణి - అలభ్యం
లక్షణ సారము - అలభ్యం
ఇంద్ర విజయము - అలభ్యం
చాముండీ విలాసము - అలభ్యం
నారాయణ భట్టు - నన్నయ భట్టుకు సహకరించాడు
శివకవి యుగము : 1100 - 1225
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:శివకవి యుగం కవులు]] లేదా [[వర్గం:శివకవి యుగం రచనలు]]
మూస
మల్లికార్జున పండితారాధ్యుడు
శివతత్వ సారము
నన్నెచోడుడు
కుమార సంభవము
కళా విలాసము
పాల్కురికి సోమనాధుడు
పండితారాధ్య చరిత్రము
బసవ పురాణము
అనుభవ సారము
వృషాధిప శతకము - తెలుగులో మొదటి శతకం కావచ్చును.
వేములవాడ భీమకవి
ఇతని గ్రంథాలేవీ అందుబాటులో లేవు. కాలం కూడా స్పష్టంగా తెలియదు. కాని ఇతని చాటువులను ఇతరులు ఉట్టంకించారు.
తిక్కన యుగము : 1225 - 1320
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:తిక్కన యుగం కవులు]] లేదా [[వర్గం:తిక్కన యుగం రచనలు]]
ఈ యుగానికి సంబంధించిన మూస
తిక్కన్న - కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు
శ్రీ మదాంధ్ర మహాభారతము - 15 పర్వములు
నిర్వచనోత్తర రామాయణము
విజయసేనము
కవి వాగ్బంధనము
పావులూరి మల్లన
గణిత సార సంగ్రహము - గణిత విజ్ఞానానికి సంబంధించిన రచన
ఎలుగంటి పెద్దన
ప్రకీర్ణ గణితము - గణిత విజ్ఞానానికి సంబంధించిన రచన
గోనబుద్ధారెడ్డి
రంగనాథ రామాయణము
చక్రపాణి రంగనాధుడు
నయన రగడ
మూలఘటిక కేతన
దశకుమార చరిత్రము
ఆంధ్ర భాషా భూషణము
విజ్ఞానేశ్వరీయము
కాచవిభుడు - విట్ఠలుడు (సోదరులు, గోనబుద్ధారెడ్డి కుమారులు)
రంగనాధ రామాయణము ఉత్తరకాండము
మంచన
కేయూరబాహు చరిత్రము
యథావాక్కుల అన్నమయ్య
సర్వేశ్వర శతకము
మారన
మార్కండేయ పురాణము
బద్దెన
నీతిసార ముక్తావళి
సుమతీ శతకము (ఇది బద్దెన రచించాడని ఒక అభిప్రాయము మాత్రమే)
శివదేవయ్య - ఈ క్రింది మూడు రచనలు చేసినాడని ఒక అభిప్రాయమున్నది.
పురుషార్ధ సారము
సకలనీతి సమ్మతము
"శివదేవ ధీమణీ" శతకము
అప్పనమంత్రి
చారుచర్య
అధర్వణాచార్యుడు (ఇతను నన్నెచోడుడు, తిక్కన మధ్యకాలమువాడై యుండవచ్చును)
ఇతడు భారతమును కొంతభాగము రచించియుండవచ్చునని అభిప్రాయము.
వికృతి వివేకము, త్రిలింగ శబ్దానుశాసనము, అధర్వణ ఛందస్సు అనే లక్షణ గ్రంథాలు కూడా వ్రాశాడని కొన్నిచోట్ల ఉంది.
ఎఱ్ఱన యుగము : 1320 - 1400
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:ఎఱ్ఱన యుగం కవులు]] లేదా [[వర్గం:ఎఱ్ఱన యుగం రచనలు]]
ఈ యుగానికి సంబంధించిన మూస
ఎఱ్ఱన - ప్రబంధ పరమేశ్వరుడు, శంభూమిత్రుడు
శ్రీ మదాంధ్ర మహాభారతము - అరణ్య పర్వము సంపూర్తి
హరివంశము
లక్ష్మీనృసింహ పురాణము
"సంక్షేప రామాయణము" అనే కావ్యాన్ని కూడా రచించాడంటారు.
నాచన సోమన
ఉత్తర హరివంశము
గోన బుద్ధారెడ్డి -
రంగనాధ రామాయణము
హుళక్కి భాస్కరుడు, అతని పుత్రుడు మల్లికార్జున భట్టు, అతని మిత్రుడు అయ్యలార్యుడు
భాస్కర రామాయణము
రావిపాటి త్రిపురాంతకుడు (రావిపాటి తిప్పన)
త్రిపురాంతకోదాహరణము
ప్రేమాభిరామము, అంబికా శతకము, చంద్ర తారావళి - అనే గ్రంథాలు కూడా వ్రాశాడు కాని అవి అలభ్యం.
చిమ్మపూడి అమరేశ్వరుడు
విక్రమ సేనము (అలభ్యం)
విన్నకోట పెద్దన
శ్రీనాధ యుగము : 1400 - 1500
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:శ్రీనాధ యుగం కవులు]] లేదా [[వర్గం:శ్రీనాధ యుగం రచనలు]]
ఈ యుగానికి సంబంధించిన మూస
వేమన
వేమన శతకము
శ్రీనాథుడు - కవిసార్వభౌముడు
మరుత్తరాట్చరిత్రము
శృంగార నైషధము
పల్నాటి వీరచరిత్రము
హరవిలాసము
కాశీ ఖండము
భీమ ఖండము
క్రీడాభిరామము
శివరాత్రి మహాత్మ్యము
శాలివాహన సప్తశతి
శృంగార దీపిక (ఇది వ్రాసినది కుమారగిరి రెడ్డి అని కూడా ఒక అభిప్రాయం ఉంది.)
పోతన - సహజకవి, అతని శిష్యులు బొప్పరాజు గంగయ, వెలిగందల నారయ, ఏర్చూరి సింగన
శ్రీ మదాంధ్ర మహాభాగవతము
వీరభద్ర విజయము
భోగినీ దండకము (ఇది పోతన రచనయేనని అభిప్రాయం)
మడికి సింగన
వాసిష్ఠ రామాయణము
భాగవతం దశమ స్కంధం ద్విపద
సకల నీతి సమ్మతము - తెలుగులో మొట్టమొదటి సంకలన గ్రంథం
పద్మపురాణం ఉత్తర ఖండం
పిల్లలమర్రి పినవీరభద్రుడు -
జైమిని భారతము
శృంగార శాకుంతలము
అవసార దర్పణము, నారదీయము, మాఘ మహాత్మ్యము, పురుషార్ధ సుధానిధి, మానసోల్లాస సారము - అవే గ్రంథాలు రచించాడు కాని అవి లభించలేదు.
ప్రతాప రుద్రుడు
నీతిసారము (రాజనీతి గురించి)
అధర్వణుడు
త్రిలింగ శబ్దానుశాసనము
భైరవి కవి
రత్నసారము - (విలువైన మణుల గురించి)
మనుమంచి భట్టు
హయలక్షణ సారము (గుర్రాల గురించి విజ్ఞాన గ్రంథము)
తాళ్ళపాక అన్నమయ్య
అన్నమయ్య కీర్తనలు
శ్రీవేంకటేశ్వర శతకము
అలమేలు మంగా శతకము
తాళ్ళపాక తిమ్మక్క
సుభద్రా కళ్యాణము
వామనభట్టబాణుడు
పార్వతీపరిణయము
వేమభూపాల చరితము
హంస సందేశము
జక్కన
విక్రమార్క చరిత్రము
అనంతామాత్యుడు
భోజరాజీయము
ఛందోదర్పణము
రసాభరణము
గౌరన
నవనాధ చరిత్రము
హరిశ్చంద్ర కథ ద్విపద కావ్యము
దగ్గుపల్లి దుగ్గన
కాంచీ మాహాత్మ్యము
నాచికేతూపాఖ్యానము
దూబగుంట నారాయణకవి
పంచతంత్రము
బైచరాజు వేంకటనాధుడు
పంచతంత్రము (బైచరాజు)
వెన్నెలకంటి సూరకవి
విష్ణుపురాణము
పిడుపర్తి సోమన (పిడుపర్తి సోమనాధ కవి)
బసవ పురాణము
నంది మల్లయ - ఘంట సింగన (జంట కవులు)
ప్రబోధ చంద్రోదయము
వరాహ పురాణము
కొఱవి గోపరాజు
సింహాసన ద్వాత్రింశిక
వెన్నెలకంటి అన్నయ్య
షోడశ కుమార చరిత్ర
విన్నకోట పెద్దన
కావ్యాలంకార చూడామణి
కూచిరాజు ఎఱ్ఱన
కొక్కోకము ("రతి విలాసం" అనే సంస్కృత కామశాస్త్ర గ్రంథానికి తెలుగు)
మడికి అనంతయ్య (మడికి సింగన తమ్ముడు)
విష్ణుమాయా విలాసము (అయితే ఇది చింతలపూడి ఎల్లన వ్రాశాడనే అభిప్రాయం కూడా ఉంది)
వెన్నెలకంటి జన్నమంత్రి
దేవకీనందన శతకము
కొలని గణపతి దేవుడు
శివయోగ సారము
మనోబోధన
అయ్యలరాజు తిప్పయ్య
ఒంటిమెట్ట రఘువీర శతకము
ఆంధ్రకవి రామయ్య
విష్ణుకాంచీ మాహాత్మ్యము
చెందలూరు చిక్కయ్య
వాచికేతూపాఖ్యానము
పశుపతి నాగనాధుడు
విష్ణు పురాణము
దోనయామాత్యుడు
సస్యానందము (శాస్త్ర గ్రంథము - వర్షముల ఆగమ సూచనలు, జ్యోతిశ్సాస్త్రానుసారం)
శ్రీధరుడు
కృష్ణమాచార్యుడు
పిడుపర్తి నిమ్మయాచార్యుడు
పిడుపర్తి (మొదటి) బసవకవి
పిడుపర్తి (రెండవ) బసవకవి
ప్రోలుగంటి చెన్నశౌరి
గంగనాచార్యుడు
ఈశ్వర ఫణిభట్టు
సదానంద యోగి
పెనుమత్స వెంకటాద్రి
పెనుమత్స గోపరాజు కవి
అడిదము నీలాద్రి కవి
మాడయ కవి
రేవణూరి తిరుమల కొండయార్యుడు
రాయల యుగము : 1500 - 1600
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:రాయల యుగం కవులు]] లేదా [[వర్గం:రాయల యుగం రచనలు]]
ఈ యుగానికి సంబంధించిన మూస
కృష్ణదేవరాయలు - ఆంధ్రభోజుడు
ఆముక్త మాల్యద
అష్టదిగ్గజాలు
అల్లసాని పెద్దన
మను చరిత్రము
హరికథా సారము
నంది తిమ్మన
పారిజాతాపహరణము
ధూర్జటి
శ్రీకాళహస్తి మాహాత్మ్యము
శ్రీకాళహస్తీశ్వర శతకము
మాదయ్యగారి మల్లన
రాజశేఖర చరిత్ర
అయ్యలరాజు రామభధ్రుడు
రామాభ్యుదయము
సకలకథాసార సంగ్రహము
పింగళి సూరన
రాఘవ పాండవీయము - మొట్టమొదటి ద్వ్యర్ధి కావ్యము
కళాపూర్ణోదయము - ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు. ఇది తెఉగు సాహిత్యంలో చాలా విశిష్టమైన కావ్యంగా మన్ననలు పొందింది.
ప్రభావతీ ప్రద్యుమ్నము
గిరిజా కళ్యాణం
గరుడ పురాణం (తెనుగించాడు)
రామరాజభూషణుడు (భట్టుమూర్తి)
వసు చరిత్రము
హరిశ్చంద్ర నలోపాఖ్యానము
నరసభూపాలీయము
తెనాలి రామకృష్ణుడు లేదా తెనాలి రామలింగడు
పాండురంగ మాహాత్మ్యము
ఘటికాచల మాహాత్మ్యము
ఉద్భటారాధ్య చరిత్రము
కందర్పకేతు విలాసము - అలభ్యం. జగ్గన ప్రబంధ రత్నాకరము లోని కొన్ని పద్యాల వల్ల ఈ గ్రంథ వివరాలు తెలుస్తున్నాయి.
హరిలీలా విలాసము - అలభ్యం. జగ్గన ప్రబంధ రత్నాకరము లోని కొన్ని పద్యాల వల్ల ఈ గ్రంథ వివరాలు తెలుస్తున్నాయి.
తాళ్ళపాక చిన్నన్న
పరమయోగి విలాసము
అష్టమహిషీ కళ్యాణము
మొల్ల (కుమ్మరి మొల్ల)
మొల్ల రామాయణము
కందుకూరి రుద్రయ్య
నిరంకుశోపాఖ్యానము
జనార్దనాష్టకము
సుగ్రీవ విజయము (యక్షగానము)
సంకుసాల నృసింహ కవి
కవికర్ణ రసాయనము (మాంధాతృ చరిత్రము)
ఎలకూచి బాలసరస్వతి
యాదవ రాఘవ పాండవీయము
మల్లభూపాలీయము (భర్తృహరి సుభాషితం)
రంగ కౌముది (అలభ్యం)
నాదెండ్ల గోపన
కృష్ణార్జున సంవాదము
కాకుమాని మూర్తికవి
పాంచాలీ పరిణయము
చింతలపూడి ఎల్లన
రాధామాధవము
విష్ణుమాయా నాటకము
తారక బ్రహ్మ రాజీయము (వేదాంత గ్రంథము)
చదలవాడ మల్లయ
విప్రనారాయణ చరిత్రము
బుట్టేపాటి తిరుమలయ్య
ద్విపద భారతము
మాదయ్య
మైరావణ చరిత్రము
తెనాలి రామభద్రకవి
ఇందుమతీ పరిణయము
దోనేరు కోనేరు కవి
బాల భాగవతము (ద్విపద)
అద్దంకి గంగాధర కవి
తపతీ సంవరణము
పొన్నగంటి తెలగన్న
యయాతి చరిత్ర
శంకర కవి
హరిశ్చంద్ర కథ
ఎడపాటి ఎఱ్ఱన
శృంగార మల్హణ చరిత్రము
కుమార ధూర్జటి
కృష్ణరాయ విజయము
తరిగొప్పు మల్లన
చంద్రభాను చరిత్రము
సారంగు తమ్మయ్య
వైజయంతీ విలాసము
అందుగుల వెంకయ్య
రామరాజీయము (అళియ రామరాజు చరిత్ర)
కాసె సర్వప్ప
భాస్కర పంతులు
బైచరాజు వెంకటనాధ కవి
వెల్లంకి తాతంభట్లు
పిడుపర్తి సోమనాధుడు
పిడుపర్తి బసవకవి
కోట శివరామయ్య
మల్లారెడ్డి
రామరాజు రంగప్పరాజు
మట్ల అనంత భూపాలుడు
కంచి వీరశరభ కవి
తిమ్మరాజు
తాళ్ళపాక తిరువెంగళ నాధుడు
రాయసము వేంకట కవి
చరిగొండ ధర్మన్న
తురగా రామకవి
చెన్నమరాజు చెన్నమరాజు
తెనాలి అన్నయ్య
సవరము చిననారాయణ నాయకుడు
దామెర వేంకటపతి
చిత్రకవి పెద్దన్న
యాదవామాత్య కవి
కంసాలి రుద్రయ్య
ముద్దరాజు రామన్న
చిత్రకవి అనంతకవి
లింగముగుంట రామకవి
లింగమగుంట తిమ్మన్న
వెలగపూడి వెంగనార్యుడు
రెంటూరి రంగరాజు
సింహాద్రి వేంకటాచార్యుడు
రాజలింగ కవి
చిత్రకవి రమణయ్య
కాకునూరి అప్పకవి
దక్షిణాంధ్ర యుగము: 1600 - 1775
లేదా నాయకరాజుల యుగము
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:దక్షిణాంధ్ర యుగం కవులు]] లేదా [[వర్గం:దక్షిణాంధ్ర యుగం రచనలు]]
మూస
ముద్దుపళని
రాధికా సాంత్వనము
రంగాజమ్మ
మన్నారుదాస విలాసము (యక్షగానము)
ఉషా పరిణయము (ప్రబంధము)
మధురవాణి (సంస్కృత కవయిత్రి.)
రఘునాధుని రమాయణ సంగ్రహమునకు సంస్కృతీకరణ
రామభద్రాంబ
ఉషా పరిణయం (యక్షగానం)
క్షేత్రయ్య
మువ్వగోపాల పదములు
రామదాసు
రామదాసు కీర్తనలు
లింగనమహి శ్రీకామేశ్వరకవి
సత్యభామా సాంత్వనము
ధేను మాహాత్మ్యము (వచన గ్రంథము)
శృంగార నైషధ పారిజాతము
చేమకూర వెంకటకవి
విజయ విలాసము
సారంగధర చరిత్రము
రఘునాధ నాయకుడు (1614 - 1633)
శృంగార సావిత్రి
వాల్మీకి చరిత్రము
పారిజాతాపహరణము
భారత సంగ్రహము
రామాయణ సంగ్రహము
విజయ రాఘవుడు (1633-73)
రఘునాధాభ్యుదయము
ప్రహ్లాద చరిత్రము
విప్ర నారాయణ చరిత్రము
పార్వతీ పరిణయము
కృష్ణాధ్వరి
తిరుమలాధ్వరి
చిత్రకూట మహాత్మ్యము (యక్షగానము)
కోనేటి దీక్షిత చంద్రుడు
విజయ రాఘవ కళ్యాణము (యక్షగానము)
చల్లా సూరయ్య
వివేక విజయము (ప్రబోధ చంద్రోదయానికి యక్షగాన స్వరూపం)
కూచిపూడి నాటకములు
ప్రహ్లాద నాటకము
రామ నాటకము
ఉషా పరిణయము
వెలిదండ్ల వేంకటపతి
శృంగార రాధామాధవము
మట్ల అనంత భూపాలుడు
కకుత్స్థ విజయము
సవరము చిననారాయణ నాయక్
కువలయాశ్వ చరిత్ర
దామెళ వెంగ నాయక్
బహుళాశ్వ చరిత్ర
విజయరంగ చొక్కనాధుడు
నాగ మాహాత్మ్యము
శ్రీరంగ మహాత్మ్యము
సుముఖము వేంకటకృష్ణప్ప నాయుడు
జైమిని భారతము (వచన రూపం)
సారంగధర చరిత్ర (వచన రూపం)
రాధికా సాంత్వనము
అహల్యా సంక్రందనము
రఘునాధ తొండమానుడు
పార్వతీ పరిణయము
శేషము వేంకటపతి
తారా శశాంకము
వేమన
వేమన పద్యములు
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
బ్రహ్మంగారి కాలజ్ఞానం
బ్రహ్మంగారి తత్వాలు
కుందుర్తి వేంకటాచల కవి
మిత్రవిందా పరిణయము
వెలగపూడి కృష్ణయ్య
మాలతీ మాధవము
నుదురుపాటి వెంకయ్య
మల్లపురాణము
నుదురుపాటి సాంబయ్య
ఆంధ్ర భాషార్ణవము
సాంబ నిఘంటువు
కట్టా వరదరాజు
ద్విపద రామాయణము
కళువ వీర్రాజు
భారతము (వచన రూపం)
నంజయ్య
హాలాస్య మహాత్మ్యము
క్షీణ యుగము : 1775 - 1875
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:క్షీణ యుగం కవులు]] లేదా [[వర్గం:క్షీణ యుగం రచనలు]]
మూస
త్యాగరాజు
త్యాగరాజు కీర్తనలు
నౌకా భంగము (నాటకం)
ప్రహ్లాద చరిత్రము (నాటకం)
కంకంటి పాపరాజు
ఉత్తర రామాయణము
కనుపర్తి అబ్బయామాత్యుడు
అనిరుద్ధ చరిత్రము
కూచిమంచి తిమ్మకవి
కుక్కుటేశ్వర శతకము
అచ్చతెనుగు రామాయణము
నీలాసుందరీ పరిణయము
రుక్మిణీ కళ్యాణము
శివలీలా విలాసము
కూచిమంచి జగ్గకవి
చంద్రలేఖా విలాపము
వక్కలంక వీరభద్రకని
వాసవదత్తా పరిణయము
అడిదము సూరకవి
చంద్రమతీ పరిణయము
రామలింగేశ్వర శతకము
ఇతని చాటువులు బహు ప్రసిద్ధములు
ధరణిదేవుల రామయమంత్రి
దశావతార చరిత్రము
దిట్టకవి నారాయణకవి
రంగరాయ చరిత్రము
చిత్రకవి సింగనార్యుడు
బిల్హణీయము
కృష్ణదాసు
రాధాకృష్ణ విలాసము (గీత గోవిందం ఆధారంగా)
వేమనారాధ్యుల సంగమేశ్వరకవి
అహల్యా సంక్రందనము
అయ్యలరాజు నారాయణకవి
హంసవింశతి
గట్టు ప్రభువు
కుచేలోపాఖ్యానము
కృష్ణకవి
శకుంతలా పరిణయము
తరిగొండ వేంకమాంబ
వేంకటాచల మాహాత్మ్యము
రాజయోగసారము
విష్ణు పారిజాతము
వశిష్ఠ రామాయణము
జలక్రీడా విలాసము
ద్విపద భాగవతము (ద్వాదశ స్కంధము)
కృష్ణ మంజరి.
శివలీలా విలాసము
యక్షగానాలు, నాటకములు, శతకాలు
చెళ్ళపిళ్ళ నరసకవి
యామినీపూర్ణతిలకా విలాసము
వేంకటేశ్వర విలాసము
మండపాక పార్వతీశ్వరశాస్త్రి
మండపాక పార్వతీశ్వరశాస్త్రి శతకములు - ఈ కవి 60 పైగా శతకములు వ్రాసెను.
రాధాకృష్ణ సంవాదము
క్రొత్తలంక మృత్యుంజయకవి
ధరాత్మజా పరిణయము (ద్వ్యర్ధి కావ్యము)
బుక్కపట్నం తిరుమల వేంకటాచార్యులు
అచలాత్మజా పరిణయము (ద్వ్యర్ధి కావ్యము)
పిండిప్రోలు లక్ష్మణకవి
రావణ దమ్మీయము (లంకా విజయము) (ద్వ్యర్ధి కావ్యము)
అయ్యగారి వీరభద్రకవి
యాదవ రాఘవ పాండవీయము (త్ర్యర్ధి కావ్యము) - ఇంతకు పూర్వము ఎలకూచి బాల సరస్వతి వ్రాసినది.
ఓరుగంటి సోమశేఖరకవి
రామకృష్ణార్జునరూప నారాయణీయము త్ర్యర్ధి కావ్యము) - యాదవ రాఘవ పాండవీయము - మరొక విధముగా
ఆధునిక యుగము : 1875 నుండి
1875 నుండి 2000 వరకు వెలువడిన రచనలు, రచయితలు, రచయిత్రుల జాబితా ఈ భాగంలో చేర్చాలి. ఇక్కడినుండి సాహిత్య ప్రక్రియలు అనేక రంగాలలో వికసించాయి. కనుక ఒకో ప్రక్రియానుసారం విభజించాలి. కనుక ఈ భాగం ప్రత్యేక జాబితా వ్యాసంగా చేయబడుతున్నది.
ఈ కాలంలో వివిధ సాహితీ ప్రక్రియలు విస్తరించాయి. అచ్చు యంత్రాలు రావడం వల్లా, విద్య అందరికీ అందుబాటులోకి రావడం వల్లా ఎన్నో రచనలు మనకు లభ్యమౌతున్నాయి. కనుక ఈ యుగంలోని రచయితలనూ, రచనలనూ మరిన్ని జాబితాలుగా విభజిస్తున్నాము. సౌలభ్యం కోసం ఈ భాగంలో "ఆధునిక యుగం" అనే పదాలను వాడడం లేదు.
చూడండి - ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
21వ శతాబ్దం
చూడండి - 21వ శతాబ్దం సాహితీకారుల జాబితా
వనరులు
పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
కందుకూరి వీరేశలింగం - ఆంధ్ర కవుల చరితము 2వ భాగం ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
వర్గం:సాహిత్యం జాబితాలు
వర్గం:జాబితాల జాబితాలు |
ప్రబంధ యుగము | https://te.wikipedia.org/wiki/ప్రబంధ_యుగము | దారిమార్పుప్రబంధము |
శతక సాహిత్యము | https://te.wikipedia.org/wiki/శతక_సాహిత్యము | శతకము (Sathakamu) అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.
"ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రాచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు నొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ ఏ మూలనో ఒకచోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే" అని శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణరావు అభిప్రాయం.తెలుగు సాహిత్య చరిత్ర - డాక్టర్ ద్వా.నా. శాస్త్రి - ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా.... అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడంలో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శతక రచనా ప్రక్రియ నాటి నుండి నేటి వరకు అవచ్చిన్నంగా కొన సాసుతూనే ఉంది. ఇక తెలుగుకు సజాతీయములైన కన్నడ, తమిళము, మలయాళము భాషలలో వెలువడిన శతకముల సంఖ్య అతి తక్కువ. కన్నడ భాషలో శతక రచన తెలుగు భాష కంటే ముందు ప్రారంభ మైనను ఆ భాషలో శతక సాహిత్యానికి ప్రాధాన్యత ఎంత మాత్రము లేదు. తెలుగుకు మాతృక యైన సంస్కృతమున కూడా ఇన్ని శతకములు లేవు. తెలుగులో మాత్రమే శతక సాహిత్యము ప్రత్యేకతను చాటుకున్నది.తెలుగు సాహిత్యం ప్రసిద్ధి చెందింది
శతకం లక్షణాలు
శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలుగానీ, పూర్తి చరణము గానీ ఉండటం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకం లాంటిది. దీనిని మకుటము అంటారు. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అనునది వేమన శతకము నకు మకుటము, అలాగే సుమతీ అనునది సుమతీ శతకము నకు మకుటము, అలాగే వేంకటేశ్వరా, దాశరథీ అనునవి ఇతర ఉదాహరణములు.
శతక సాహిత్యం గురించి చెప్పే టప్పుడు, విశ్వనాథ సత్యనారాయణ వారి శతకాల గురించి తప్పకుండా ప్రస్తావన చెయ్యాల్సిందే.
ఈ క్రింద చెప్పిన 10 శతకాలు వాటి పేర్లు, మకుటము ప్రస్తావించటం జరిగింది.
1. శ్రీగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ శైల మల్లికార్జున మహా లింగ! - విశ్వనాథ సత్యనారాయణ
2. శ్రీకాళహస్తి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ! - విశ్వనాథ సత్యనారాయణ
3. భద్రగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భద్ర గిరి పుణ్య నిలయ శ్రీ రామ! - విశ్వనాథ సత్యనారాయణ
4. కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి! - విశ్వనాథ సత్యనారాయణ
5. శేషాద్రి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ! - విశ్వనాథ సత్యనారాయణ
6. ద్రాక్షారామ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భీమేశలింగ! ద్రాక్షారామ సంగ! - విశ్వనాథ సత్యనారాయణ
7. నందమూరు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! సంతాన వేణు గోపాల! - విశ్వనాథ సత్యనారాయణ
8. నెకరు కల్లు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి! - విశ్వనాథ సత్యనారాయణ
9. మున్నంగి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నిర్ముల! మున్నంగి వేణు గోపాల! - విశ్వనాథ సత్యనారాయణ
10. వేములవాడ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేములవాడ రాజరాజేశ్వర! స్వామి! - విశ్వనాథ సత్యనారాయణ
సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యము పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో వేమన శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము గురించి వేరే చెప్పాల్సిన పని లేదు.
మిగిలిన సాహిత్య ప్రక్రియలకున్న అలంకారిక, లాక్షణిక నియమాలు అనే బంధాలు శతక సాహిత్యానికి లేవు. ఛందస్సుకు అనుగుణంగా ఉంటే చాలు. విషయాన్ని ఒక పద్యంలో వెళ్ళగ్రక్కవచ్చును. లేదా 10 పద్యాలలో విస్తరింప వచ్చును. కథ చెప్పాలనీ, ముగింపు ఉండాలనీ నియమం లేదు. కనుక కవికి బోలెడంత స్వేచ్ఛ ఉంది. చదివేవాడికి కూడా రోజులతరబడి ఒకే గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సిన పని బడదు. కనుక ఒక్కపద్యంతోనే కవికీ, చదువరికీ అనుబంధం ఏర్పడవచ్చును. శతకాలు క్లుప్తంగా విషయాన్ని విడమరచి చెప్పే సాధనాలు. అందుకే ఇవి ప్రజా కవిత్వముగా ఆదరణ సంతరించుకొని ఉండవచ్చును.
శతకానికుండ వలసిన లక్షణాలను ముఖ్యంగా ఐదింటిని పేర్కొన వచ్చును. అవి. 1. సంఖ్యా నియమము, 2. మకుట నియమము, 3. వృత్త నియమము, 4. రస నియమము, 5. భాషా నియమము.
1. సంఖ్యా నియమము
శతకము అనగా వంద అని అర్థము. ఏ శతకము లోనైనా వందకు పైగానె పద్యము లుండవలెను, అంతకన్న తక్కువ పద్యములతో నున్నది శతకమనిపించు కోదు. వందకు తక్కువ గానీ, ఎక్కువ గాని పద్యములున్నచో వాటి విడిగా పేర్లున్నాయి. ఉదాహరణకకు..... పది పద్యములున్నచో దశకము, ఇరవై ఐదు పద్యములతో నున్నదానిని పంచవిశంతి అనీ, ముప్పదిరెండు పద్యములు గల దానికి రాగ సంఖ్య అనీ, మూడు వందల పద్యములున్నచో త్రిశతి అనీ వాటికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి.
2.మకుట నియమము.
శతకము లోని ప్రతి పద్యంలో చివర నున్న సంబోధనా పదమే మకుటము. ఈ మకుటము తప్పని సరిగా సంబోధన గానే వుండవలెను. ఈ సంబోధన కూడా ఒకే రీతిగా నుండ వలెను. మకుటమునకు వాడిన పదానికి సంబంధించిన పదానికి పర్యాయ పదములు గానీ, సమానార్థమైన పదములు గాని వుండ కూడదు. ఒక శతకములో మకుటము.గా సర్వేశ్వరా అనే పదాన్ని వాడిన యడల అన్ని పద్యములకు అదే పదాన్ని వాడవలెను గానీ, దానికి ప్రత్యామ్నాయమైన ఇతర పదాలు అనగా విశ్వేశ్వరా., లోకేశ్వరా వంటి వాడకూడదు.
కొన్ని పద్యములలో ఒక పదమే మకుటముగా నుండగా.... కొందరు కవులు ఒక పద్య పాదమంతయూ మకుటముగా నెంచుకొనిరు. ఒక పద్య పాదమంతయు మకుటముగా నున్న శతకమునకు యుధాహరణముగా వేమన శతకాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. విశ్వదాభిరామ వినుర వేమ అను మకుటము పూర్తిగా ఒక పద్య పాదము. ఆవిధంగా ఒకే పదము మకుటం నెంచుకుని వ్రాసిన శతకానికి యుధాహరణగా సుమతీ శతకాన్ని చెప్పుకోవచ్చు. సుమతీ అను ఒక పదము ఇందులోని మకుటము.
3.వృత్తనియమము
శతకము లోని మకుట నియమమును బట్టే వృత్త నియమము యేర్పడినది. తెలుగున తొలి శతకము..... మల్లికార్జున పండితారాధ్యుని శ్రీ గిరి మల్లికార్జున శతకము. ఇందలి మకుటము శ్రీగిరి మల్లికార్జునా అని యుండుట చేత నిందు చంపక మాల, ఉత్పల మాల పద్యములు తప్ప వేరు వృత్తములు ఇమడనేరవు. ఇట్లే సర్వేశ్వర అను మకుటమున్నపుడు ఆ పద్యము మత్తేభము గానీ, శార్దూలము గాని అయి యుండవలెను. వేమన పద్యాలలోని మకుటము విశ్వదాభిరామ వినుర వేమ ఇందులో ఆటవెలది తప్ప మరొకటి వుండే అవకాశము లేదు. అలా వేరు వృత్తములను వ్రాయడాని ప్రయత్నిస్తే చందస్సు కుదరదు. కనుక శతకములో ప్రతి పద్యమూ ఒకే వృత్తంలో నుండవలెననెడి నియమమేర్పడినది.
4.రసనియమము
శతకములో యే రసము ప్రతిపాదిన రచన సాగించాలో ముందే నిర్ణయించుకొని అందులోని పద్యములన్నియు ఆ రస ప్రధానమైనవిగానె వుండవలెను. ఉదాహరణకు భక్తి రస ప్రధానమైన శతకములో ఇతర రసాలైన, శృంగార రసము, ప్రసక్తి రాకూడదు. శతకములో ఒకరసప్రధానమైన చో అందులో ఇతర రసాల ప్రయోగముండారాదని నియమము. అలా ఆయా రసప్రధానమైన శతకములెన్నో ఉన్నాయి. రసనియమముల ననుసరించి వెలువడిన శతకములలో కొన్ని ముఖ్యమైనవి......., భక్తి శతము, శృంగార శతకము, నీతి శతకము, వేదాంత శతకము, హాస్య శతకము, కథా శతకము, సమస్యా శతకము, మొదలగునవి..
5.భాషా నియమము
శతకము లన్నియు సలక్షణమైన కావ్వ భాషలోనే యుండును. కావుననే లాక్షణికులు శతకములనుండి ప్రయోగములు వంటి వాటిని ప్రామాణికములుగా తీసుకొంటారు. కానీ తెలుగున చంద్రశేఖర శతకమని ఒకటున్నది. దానిలో చంద్ర శేఖర అనే మకుటముతో చంపక, ఉత్పలమాలిక లతోవున్నది. ఇందలి భాష అంతయూ గ్రామ్యమే.
శతక వాఙ్మయము ప్రగతి
మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారము శతక వాఙ్మయమునకు ఆద్యముగా చెప్పవచ్చును. పాల్కురికి సోమన (సా.శ.1300) వృషాధిప శతకము మొట్టమొదటి సంపూర్ణ శతకము. సుమారు ఈ కాలములోనే బద్దెన సుమతీ శతకము, యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వెలువడ్డాయి. వీటి ఒరవడిలోనే తెలుగులోను, కన్నడములోను శతక వాఙ్మయము చాలాకాలం కొనసాగింది.
తరువాత తెలుగులో ఎన్ని వేల శతకాలు వచ్చాయో చెప్పడం కష్టం. ఎందరో పండితులు, కవులు, ఔత్సాహిక రచయితలు వేర్వేరు అంశాలలో శతకాలు రచించారు. భక్తి (కృష్ణ శతకము), శృంగారము (భర్తృహరి), తత్వము, వేదాంతము (బమ్మెర పోతన - నారాయణ శతకము), నీతి (సుమతీ శతకము), పొగడటం, తిట్టటం, పొగడినట్టు తిట్టడం, తిట్టినట్టు పొగడడం, వర్ణించడం, బోధించడం - అన్ని విషయాలలోనూ శతకాలు వ్రాశారు. వీటిలో చాలావరకు ముద్రణకు నోచుకొనబడలేదు.
తెలుగు వాగ్మయమున మొట్టమొదట వెలసిన శతకములన్నియి శైవమత సంప్రదాయకములు. దీనిని బట్టి తెలుగున శతక సాహిత్య ప్రక్రియకు ఆద్యులు శివ కవులే నని రూడిగా చెప్పవచ్చు.
బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యమే సంఘంలోని ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిల్లో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ముప్ఫై పేజీలకు సరిపోయే భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వ వేత్త. అందరూ అనుకొన్నదానికి కూడా నిక్కచ్చిగా ఎదురు నిలచిన మహానుభావుడు వేమన.
శతక సాహిత్యంలో ముప్ఫైకి పైగా ముస్లిం కవులు వ్రాసిన శతకాలున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అలాగే క్రైస్తవ భక్తిపరంగా కూడా చాలా శతకాలున్నాయి.
తెలుగు శతకాలు
మూలాలు
వనరులు
ఆడ్లూరి శేషు మాధవరావు - తెలుగు భాష, సాహిత్యము వెబ్ సైటు లోని వ్యాసములు
"ఈనాడు" లో చీకోలు సుందరయ్య వ్యాసము - "శతక సాహిత్యంలో ముస్లిం కవులు"
శతకాలు - [http://www.teluguthesis.com తెలుగుపరిశోధన]లో
వర్గం:తెలుగు సాహిత్యం |
నవలా సాహిత్యము | https://te.wikipedia.org/wiki/నవలా_సాహిత్యము | నవల (ఆంగ్లం: Novel) తెలుగు సాహిత్యంలో ఒక ప్రక్రియ. ఇవి ఆధునిక కాలంలో అత్యంత ఆదరణ పొందుతున్నది.
ప్రారంభ కాలం
19వ శతాబ్ది అంత్యం నుంచి తెలుగు నవల ప్రారంభం అయింది. వీరేశలింగం కొందరు తొలి తెలుగు నవలగా, మరికొందరు పరిశోధకులు తొలినాళ్ళలోని ఒక తెలుగు నవలగా భావించే శ్రీరంగరాజ చరిత్రము వ్రాశారు. చిన్నయసూరి పంచతంత్రం వ్రాస్తూ వదిలిపెట్టిన విగ్రహతంత్రాన్ని కందుకూరి వీరేశలింగం పూర్తిచేసి ప్రచురించారు. ఆ సమయంలో మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పనిచేస్తున్న సమర్ధి రంగయ్యచెట్టి వీరేశలింగం ప్రతిభను మెచ్చుకుంటూ అభినందన లేఖ వ్రాస్తూ తెలుగులో స్వకపోలకల్పితమైన వచన ప్రబంధ రచనకు మీరు పూనుకోలేరా? అని మెచ్చుంటూనే ప్రోత్సహించే సూచనలు చేశారు. శ్రీరంగరాజ చరిత్రము ఆలోచనకు అదే మొదలు కావచ్చునని సాహిత్య విమర్శకులు భావించారు. 1892లో న్యాయవాది సుబ్బారావు సంపాదకత్వంలో వెలువడిన "చింతామణి" పత్రిక నవలను బాగా ప్రోత్సహించింది. నవలల పోటీలు నిర్వహించి నవలా సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది, నవలా రచనకు కావలసిన సూత్రాలను నిర్ణయించింది. అయితే ఈ ప్రారంభకాలంలో వెలువడిన నవలలు ఎక్కువగా సంఘ సంస్కరణల ప్రాముఖ్యత కనిపిస్తుంది.
నవల
నవాన్ విశేషాన్ లాతి గృహ్ణతీతి నవలా' అనగా నవీణమైన విశేషాలు తెలుపునది నవల అని కాశీ భట్టబ్రహ్మయ్యశాస్త్రి చెప్పెను.
నవలకు నవలా' అని పేరు పెట్టినది కాశీ భట్టబ్రహ్మయ్యశాస్త్రి.
చనవల: నవల అనగా స్త్రీ అని అర్థం.
ఆంగ్లంలో ఉన్న నావల్ అనే పదం ఆధారంగా నవల అనే పేరు వచ్చింది.
ఇంగ్లీషులో పదాలు హలంతపదాలు హల్లు అంతంగా ఉన్నది novel అనే పదం.
తెలుగు పదాలు అజంతపదాలు అచ్చుతో అంతంగా ఉన్నది నవల అనే పదం.
కల్పనలతో కూడినది, సుదీర్ఘ ఊహనిర్మిత కథ నవల.
కథ మానవజీవిత పార్శ్వాన్ని చెపుతుంది.
నవల మానవ జీవితాన్ని సమగ్రంగా చెపుతుంది.
నవలలో కథ, కవిత్వం, నాటకం ఈ మూడు ఉంటాయి.
నవలను సమగ్రమైన ప్రక్రియా, సమాహార ప్రక్రియా (complete) అని అంటారు.
మధ్యతరగతి ఇతిహాసం అని మరొక పేరు నవలకు ఉంది.
పాకెట్ థియేటర్ అని నవలకు ఇంకోపేరు ఉంది.
నవల-లక్షణాలు
వచనం కలిగినది.
కథ కలిగినది.
సుదీర్ఘత కలిగినది.
కల్పనలు కలిగినది.
20వ శతాబ్దం
మొదటి భాగం
20వ శతాబ్దం తొలిరోజుల్లో వచ్చిన మార్పులు నవలా రచనను ప్రభావితం చేశాయి. జాతీయ భావాలు, ఆంగ్ల విద్యావ్యాప్తి, సంస్కరణోద్యమాలు, పత్రికా వ్యాప్తి, పుస్తక ప్రచురణలు, సంస్థల స్థాపన మొదలైనవన్నీ నవలా వికాసానికి తోడ్పడ్డాయి. కృష్ణాపత్రిక, దేశమాత, సరస్వతి, హిందూ సుందరి, మనోరమ, ఆంధ్రపత్రిక వంటి పత్రికలు సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలు వేశాయి. విజ్ఞాన చంద్రికా మండలి, ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల, సరస్వతీ గ్రంథ మండలి, వేగుచుక్క గ్రంథమాల వంటి ప్రచురణ సంస్థలు ఎన్నో విలువైన పుస్తకాలను ప్రచురించాయి.
మొదటగా చారిత్రక, అపరాధ పరిశోధన నవలా అనువాదాలు ఎక్కువగా జరిగాయి. దీనిని "అనువాద యుగం" అని పేర్కొనవచ్చును. బెంగాలీ భాషనుండి అనువాదితమైన నవలల్లో ఆనందమఠం (ఓ.వై.దొరస్వామయ్య), ప్రఫుల్లముఖి (కనకవల్లి భాస్కరరావు), రాధారాణి (చాగంటి శేషయ్య) వంటివి ప్రసిద్ధిపొందాయి. మలయాళం నుండి అనువాదితమైన నవల "కళావతి" (దొడ్ల వెంకటరామరెడ్డి) వచ్చింది. అప్పుడే "ఐవాన్ హో" (కేతవరపు వేంకటశాస్త్రి) వంటి ఆంగ్ల చారిత్రక నవలలు వెలువడ్డాయి.
ఈ శతాబ్దిలో తర్వాత కాలంలో స్వతంత్ర చారిత్రక నవలలు వెలువడ్డాయి. ధరణి ప్రెగ్గడ వేంకట శివరావు రచించిన "కాంచనమాల" (1908), వేంకట పార్వతీశ కవుల "వసుమతీ వసంతము" (1911), ఎ.పి. నరసింహం పంతులు వ్రాసిన "వసంతసేన" (1912), సత్యవోలు అప్పారావు వ్రాసిన "పున్నాబాయి" (1913) వంటివి ప్రసిద్ధిపొందాయి.
right
1900-1920 మధ్యకాలంలో సాంఘిక సమస్యలు ఇతివృత్తాలుగా వెలువడిన నవలలో వస్తు వైవిధ్యం కనిపిస్తుంది. పాశ్వాత్య ప్రభావంతో హేతువాద దృష్టి పెరిగి సమాజ సంక్లిష్టతను నవలలు చిత్రించాయి. వితంతు వివాహాలు, హరిజనాభ్యుదయం వంటి సంస్కార ప్రతిపాదకాలైన వస్తువులు కనిపిస్తాయి. నేదునూరి గణేశ్వరరావు రచించిన "సుగుణతి పరిణయము" (1903), హద్దునూరి గోపాలరావు "సుందరి" (1912), కొత్తపల్లి సూర్యారావు "కులపాలిక" (1913) వంటివి ఈ రకమైనవి. తల్లాప్రగడ సూర్యనారాయణ రచించిన "హేలావతి" (1913) ఈ కాలంలో వెలువడిన మొదటి హరిజనాభ్యుదయ నవల.
రాబోయే నవలలకు మార్గదర్శకత్వం వహించిన రచనలుగా మాతృమందిరం, గణపతి, మాలపల్లి నవలలను చెప్పుకోవచ్చును. చిలకమర్తి వారి "గణపతి" (1919) ఆ కాలంలోని బ్రాహ్మణ కుటుంబాల్లో వచ్చిన కల్లోలాలకు అద్దంపట్టిన హస్యపూరిత నవల. హరిజన సమస్యను చిత్రిస్తూ ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన నవల "మాలపల్లి"లో వ్యావహారిక భాష వాడడం విశేషం.
thumb|right|బారిష్టరు పార్వతీశం నవల ముఖ చిత్రం
1920-47 మధ్య తెలుగు నవల కొత్త పోకడలు పోయింది. నవ్య సాహిత్యోద్యమం, వ్యావహారిక భాషావాదం, కాల్పనిక ఉద్యమం మొదలై నవలను ప్రభావితం చేశాయి. భాషా విప్లవం తీసుకురావాలన్న గాఢమైన తపన ఈ రచయితలలో కనిపిస్తుంది. గుడిపాటి వెంకటాచలం, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు ఈ కోవలోకి చెందుతారు. స్త్రీ స్వేచ్ఛ, స్వేచ్ఛా ప్రణయాలను చలం ప్రతిపాదిస్తే, సమాజం పటిష్టం కావాలంటే నీతి నియమాలు, కట్టుబాట్లు దృఢతరం కావాలని విశ్వనాథ భావించారు.
ఇదేకాలంలో మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు వికాసానికి తోడ్పడిన గొప్ప రచయితలు. మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం (1925) ఉత్తమ హాస్య నవల, మునిమాణిక్యం "కాంతం" అనే హాస్య ధోరణిగల తెలుగు ఇల్లాలిని సృష్టించిన ధన్యుడు. తెలుగుతనం పట్ల గాఢమైన అభినివేశంతో రచనలు చేసినవారు శ్రీపాద శాస్త్రి ఆత్మబలి, రక్షాబంధనము అనే ప్రసిద్ధ నవలలు రచించారు.
రెండవ భాగం
right|thumb
1947 తర్వాత కాలంలో తెలుగు నవల రాశిలోనూ, వైవిధ్యంలోను ప్రజాదరణలోను ఇది "నవలాయుగం" అనేంత ప్రాచుర్యం పొందినది. భారత స్వాతంత్ర్యానంతరం వచ్చిన నవలలను చారిత్రికాలు, సాంఘికాలు అని స్థూలంగా విభజించవచ్చును. సాంఘిక నవలల్లో ఎంతో వైవిధ్యం, భిన్న దృక్పధాలు, ధోరణులు కనిపిస్తాయి. ఈ కాలంలో నవల మధ్య తరగతి జీవితాన్ని అన్ని కోణాల్లో చూపించడానికి ప్రయత్నించింది.
కొడవటిగంటి కుటుంబరావు మధ్య తరగతి జీవితాలలోని వైరుధ్యాలను విశ్లేషాత్మకంగా చిత్రిస్తూ ఆలోచింపజేసే నవలలు రాశారు. "చదువు", "అనుభవం" మొదలైన నవలల్లో సమాజంలోని అస్తవ్యస్తత పాత్రల స్వభావాల్లో కనిపిస్తుంది. "చివరకు మిగిలేది" నవలా రచయిత బుచ్చిబాబు ది ప్రధానంగా సౌందర్య దృష్టి, అయినా సంఘమనే చట్రంలో ఇమడలేని వ్యక్తి జీవిత చిత్రణ దీనిలో కనిపిస్తుంది. చైతన్య స్రవంతి మార్గంలో మనో విశ్లేషణాత్మకంగా రచించిన గోపీచంద్ నవల "అసమర్ధుని జీవితయాత్ర" రాచకొండ విశ్వనాథశాస్త్రి గారి "అల్పజీవి"లో కూడా ఇదే రీతి కనిపిస్తుంది. నవీన్ "అంపశయ్య"లో విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల జీవితాన్ని రచించారు. ఈ వ్యవస్థలో వర్గతత్వాన్ని చిత్రించిన బీనాదేవి "పుణ్యభూమి కళ్ళుతెరు" చాలా ప్రసిద్ధికెక్కింది.
పూర్వం నవలా రచయిత్రులు తక్కువగా ఉన్నా, ఇప్పుడు విస్తృత సంఖ్యలో స్త్రీలు రచనలు చేస్తున్నారు. వారిలో ఎక్కువమంది వాస్తవికతకు సుదూరమైన పగటి కలలను చిత్రిస్తున్నారు. జనాకర్షణ కల ప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి.
పురుష ప్రపంచంలో స్త్రీల బానిస బ్రతుకును చిత్రిస్తూ వారు తమ వ్యక్తిత్వం కొరకు పోరాడాలని ప్రబోధించే రచయిత్రి రంగనాయకమ్మ. ఆమె రచించిన "బలిపీఠం"లో సాంఘిక చైతన్యం కొరవడిన వారు వర్ణాంతర వివాహం చేసుకుంటే వచ్చే కష్టనష్టాలు చిత్రించారు. సామాజిక సమస్యలను వస్తువుగా తీసుకొని వాసిరెడ్డి సీతాదేవి రచించిన మట్టి మనిషి, అడవి మల్లి, ఇల్లిందల సరస్వతీదేవి రచించిన భవతి భిక్షాందేహి, దరిచేరిన ప్రాణులు ఇలాంటి ప్రయోజనంతో రాసిన నవలలు. స్త్రీ సెక్స్ జీవితానికి సంఘం విధించిన కట్టుబాట్లను ఎదిరిస్తూ రాసిన రచయిత్రి లత.
నవలా రచయితలు
దాశరథి రంగాచార్య
గుడిపాటి వెంకట చలం
బుచ్చిబాబు
ముప్పాళ రంగనాయకమ్మ
మొక్కపాటి నరసింహశాస్త్రి
అడవి బాపిరాజు
విశ్వనాథ సత్యనారాయణ
ఉన్నవ లక్ష్మీనారాయణ
పి. లలిత కుమారి (ఓల్గా)
కొడవటిగంటి కుటుంబరావు
తెన్నేటి హేమలత (లత)
యండమూరి వీరేంద్రనాథ్
యద్దనపూడి సులోచనారాణి
మధుబాబు
మల్లాది వెంకటకృష్ణమూర్తి
సూర్యదేవర రామమోహనరావు
యర్రంశెట్టి శాయి
కొమ్మూరి వేణుగోపాలరావు
చల్లా సుబ్రహ్మణ్యం
కవనశర్మ
అర్నాద్ (హరనాధరెడ్డి)
రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి)
వడ్డెర చండీదాసు
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
చివుకుల పురుషోత్తం
అద్దంకి అనంతరామయ్య
ద్విభాష్యం రాజేశ్వరరావు
నవలలు - రచయితలు - విశేషణం
+నవలా రచయితలు - విశేషణంక్రమ సంఖ్యనవలరచయిత పేరువిశేషణం1శ్రీరంగరాజ చరిత్ర (1872)నరహరిగోపాల కృష్ణమూర్తిదీనికి సోనాబాయి పరిణయం అనిపేరు కలదు (తొలి తెలుగు నవల, తొలి తెలుగు చారిత్రక ప్రయత్నం )2రాజశేఖర చరిత్ర (1875)కందుకూరి వీరేశలింగంపంతులు (దీనికి వివేకచంద్రిక అని పేరు కలదు) (ఇది తొలి తెలుగు సంపూర్ణ సాంఘిక నవల. దీనికి మూలం ఆంగ్లంలో 'గోల్డ్ స్మిత్ రచించిన వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్ అని అంటారు.
ఇది అనుసరణ కావచ్చు. దీన్ని ఇంగ్లీషులోకి a fortunes wheelగా అనువదించబడింది)
|-
|3
|సత్యరాజా పూర్వదేశయాత్రలు
|కందుకూరి వీరేశలింగం పంతులు
|(ఇది ఆంగ్లంలో జోనాధన్ స్లిప్ట్ రచించిన గలివర్ ట్రావెల్స్ అనేదానికి అనుసరణ)
|-
|4
|మంజువాణి విలాసం
|వనప్పాకం అనంతామాచార్యులు
|
|-
|5
|ధర్మవతి విలాసం
|ఖండవల్లి రామచంద్రుడు
|
|-
|6
|లక్ష్మీసుందర విజయం
|ఖండవల్లి రామచంద్రుడు
|
|-
|7
|రామచంద్ర విజయం
|చిలకమర్తి లక్ష్మీనరసింహం
|
|-
|8
|దాసీకన్య
|చిలకమర్తి లక్ష్మీనరసింహం
|
|-
|9
|అహల్యబాయి
|చిలకమర్తి లక్ష్మీనరసింహం
|
|-
|10
|గణపతి (హాస్య నవల)
|చిలకమర్తి లక్ష్మీనరసింహం (ఆంధ్రస్కాట్)
|
|-
|11
|రాయ్ చూర్ యుద్ధం
|కేతవరపు వేంకటశాస్త్రి
|
|-
|12
|రామరాజ్యానికి రహదారి
|పాలగుమ్మి పద్మరాజు
|
|-
|13
|బతికిన కాలేజి
|పాలగుమ్మి పద్మరాజు
|
|-
|14
|అల్పజీవి
|రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి)
|(ఈ నవలలో సుబ్బయ్య, మనోరమ అనేపాత్రలు కలిగిన నవల. ఇది మనోవైజ్ఞానికమైన నవల.
ఆప్ర్ఫెడ్ ఆడ్లార్ (ఇడిప్లస్ కాంప్లేక్స్) అందించిన ఆత్మనూనత బ్రాంచి మొదలైన అంశాలు కలిగిన నవల అల్పజీవి.
streemm of consciousness అనే శైలి తెలుగు చైతన్య స్రవంతి శిల్పం కలిగిన నవల అల్పజీవి)
|-
|15
|సొమ్ములుపోనాయండి
|రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి)
|
|-
|16
|గోవులొస్తున్నయి జాగ్రత్త
|రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి)
|
|-
|17
|రత్తాలు రాంబాబు
|రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి)
|
|-
|18
|రాజుమనిషి
|రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి)
|(ఈయన మధ్య తరగతి సమస్యలు బడుగు వర్గాల సమస్యలను ఇతివృత్తంగా తీసుకున్న రచయిత)
|-
|19
|మనోరమ
|వేంకట పార్వతీశ కవులు
|
|-
|20
|మాతృమందిరం
|వేంకట పార్వతీశ కవులు
|(బాలాంత్రపు వెంకట్రావు,ఓలేటి పార్వతీశం అనేవారే వేంకట పార్వతీశ కవులు.అపరాధ పరిశోధక నవలకు ఆధ్యులు వీరు)
|-
|21
|టిప్పుసుల్తాన్
|అక్కిరాజు ఉమాకాంతం
|
|-
|22
|రెండు మహానగరాలు(అనువాద నవల)
|తెన్నేటి సూరి
|(చార్లెస్ డికెన్శ్ రచించిన a tale of two cities అనేదానికి ఈ నవల అనువాదం)
|-
|23
|ఛంఘీజ్ ఖాన్
|తెన్నేటి సూరి
|
|-
|24
|కపాల కుండల
|దొరస్వామయ్య
|(తొలి తెలుగు అనువాద నవల)
|-
|25
|ఆనందమట్
|దొరస్వామయ్య
|
|-
|26
|మాలపల్లి
|ఉన్నవ లక్ష్మీనారాయణ
|(దీనికి సంగవిజయ అని పేరు కలదు)(1920) (ఇది తొలి తెలుగు సాంఘిక నవల)
|-
|27
|ఏకవీర
|విశ్వనాధ సత్యన్నారాయణ
|(మధుర ప్రణయ ఇతివృత్తం కలిగిన ఒక చారిత్రక నవల)
|-
|28
|బద్దన్నసేనాని
|విశ్వనాధ సత్యనారాయణ
|
|-
|29
|కడిమి చెట్టు
|విశ్వనాధ సత్యనారాయణ
|
|-
|30
|దిండు కింద పోక చెక్క
|విశ్వనాధ సత్యనారాయణ
|
|-
|31
|వేయిపడగలు
|విశ్వనాధ సత్యనారాయణ
|(పసిరిక పాత్ర కీలకమైనది.తెలుగులో బృహత్ నవల ఇది.
పి.వి.నరసింహరావు వేయిపగడలు నవలనీ సహస్రాఫణ్'అనే పేరుతో హిందీలోకి అనువదించారు.) విశ్వనాధ సత్యన్నారాయణ ఇంకా స్వర్గానికి నిచ్చెనలు, చెలియలి కట్ట, పురణవైరగ్రంధమాల, విష్ణుశర్మ ఇంగీషు చదువు, పులుల సత్యాగ్రహం, వీరవల్లుడు, తెరచిరాజు, మాబాబు, హోహోహూహూ, మిహిరకుల్లుడు అనే నవలల్ని రచించాడు.32హిమబిందువుఅడవి బాపిరాజు (శాతవాహనుల లాలం నాటిది ఈ నవల)33గోనగనరెడ్డి అడవి బాపిరాజు 34అడవి శాంతశ్రీ అడవి బాపిరాజు35నారాయణరావు (సాంఘిక నవల)అడవి బాపిరాజు36కోసంగి (చారిత్రక నవల)అడవి బాపిరాజు37బారిస్టరు పార్వతీశం (హస్య నవల)మొక్కపాటి నరసింహాశాస్త్రి38అహోబిలీయం (తొలితెలుగు జాతీయోద్యమ నవల)వేలూరి శివరామశాస్త్రి39చదువు, అనుభవంకొడవటిగంటి కుటుంబరావు40చివరకు మిగిలేదిబుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బరావు) (ఇది మనోవైజ్ఞానికమైన నవల. ఇందులో పాత్రలు కోమల, దయానిది)41అసమర్థుని జీవయాత్ర త్రిపురనేని గోపిచంద్ (ఇందులో నాయకుడు సీతారామారావు) ఈయన రచించిన నవలలు అన్నీ మనోవిజ్ఞానానికి సంబంధించినవే.ఈయన ఇంకా పరివర్తన, పిల్లితిమ్మెర, ప్రేమహాపతులు, శిథిలాలయం, గడుయపడని తలుపులు, పండితపరమేశ్వరశాస్త్రి వీలునామా, మెరుపులు-మరకలు (ఉషారాణి పాత్ర కలిగిన నవల)42కీలుబొమ్మలు జి.వి.కృష్ణారావు43హిమజ్వాల, అనుక్షణికంవడ్డెర చండీదాస్44పల్లె పిలిచింది ద్వారకాఆంధ్రప్రభ 1989 దీపావళి నవలల పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకుంది.45ఐ.సి.సి.యు చిత్తర్వు మధువైద్యవృతి-కార్డియాలజీ నేపథ్యంలో రాసిన వైజ్ఞానిక నవల.
ఇవి కూడా చూడండి
తెలుగు నవలల ఆధారంగా తీసిన సినిమాలు
మూలాలు
వర్గం:నవలలు |
సినిమా సాహిత్యం | https://te.wikipedia.org/wiki/సినిమా_సాహిత్యం | దృశ్యమాధ్యమమైన సినిమా కోసం రచించే వివిధ ప్రక్రియల సాహిత్యం సినిమా సాహిత్యం లేదా సినిమా రూపకల్పనకు ఉపకరించే సాహిత్యం సినిమా సాహిత్యం. కాగా తెలుగు సినిమా కోసం రచన చేసిన/తెలుగు సినిమాలో ప్రదర్శితమైన సాహిత్యాన్ని తెలుగు సినిమా సాహిత్యంగా, సినిమాలపై వచ్చిన సాహిత్యాన్ని సినిమారంగం గురించిన తెలుగు సాహిత్యం పేర్కొంటారు. సినిమా కథ, సంభాషణలు, స్క్రీన్ప్లే, పాటలు వంటి ఎన్నో సాహిత్య ప్రక్రియలు తెలుగు సినిమా సాహిత్యంలోకి వస్తాయి. వివిధ ప్రక్రియల్లో సముద్రాల జూనియర్, సముద్రాల సీనియర్దేవులపల్లి కృష్ణ శాస్త్రి, డా.సి.నారాయణ రెడ్డి,వీటూరి, రాజశ్రీ, ఆచార్య ఆత్రేయ, పింగళి నాగేంద్రరావు, దాశరథి కృష్ణమాచార్య, గూడవల్లి రామబ్రహ్మం, చక్రపాణి, ముళ్ళపూడి వెంకటరమణ, ఆరుద్ర, దాసరి నారాయణరావు, జాలాది,జంధ్యాల, వేటూరి సుందరరామ్మూర్తి, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, గణేశ్ పాత్రో, యండమూరి వీరేంద్రనాథ్, త్రివిక్రం శ్రీనివాస్, అనంత శ్రీరాం, రామజోగయ్య శాస్త్రి తదితర సాహిత్యకారులు ఎందరో సినీ సాహిత్య రంగంలో కృషిచేశారు.
సినిమా పాటల రచయితలు
పింగళి నాగేంద్రరావు
నార్ల చిరంజీవి
ఆచార్య ఆత్రేయ
ఆరుద్ర
అనిశెట్టి సుబ్బారావు
రసరాజు
కొసరాజు రాఘవయ్య చౌదరి
సముద్రాల
శ్రీశ్రీ
మైలవరపు గోపి
జాలాది రాజారావు
మల్లాది రామకృష్ణశాస్త్రి
దేవులపల్లి కృష్ణశాస్త్రి
డా.సి.నారాయణ రెడ్డి
డా. మల్లెమాల
సిరివెన్నెల సీతారామశాస్త్రి
వేటూరి సుందరరామ్మూర్తి
దాశరథి
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
సదాశివ బ్రహ్మం
జ్యోతిర్మయి
జంధ్యాల పాపయ్య శాస్త్రి
దాసరి నారాయణ రావు
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
సామవేదం షణ్ముఖశర్మ
చంద్రబోస్
సుద్దాల అశోక్ తేజ
కులశేఖర్
వెన్నెలకంటి
రాజశ్రీ
సాహితి
రామజోగయ్య శాస్త్రి
జె.కె.భారవి
భువనచంద్ర
వనమాలి
అనంత శ్రీరామ్
భాస్కరభట్ల రవికుమార్
వెన్నెల శామ్ప్రకాష్
సినిమా కథా రచయితలు
ఆదివిష్ణు
పరుచూరి బ్రదర్స్
ఆదిత్యాక్
అజయ్ కిషోర్
అజయ్ శాంతి
ఆకెళ్ళ
త్రివిక్రమ్
సినిమా మాటల రచయితలు
పరుచూరి బ్రదర్స్
గొల్లపూడి మారుతీరావు
గణేష్ పాత్రో
శివా చతుర్వేద్
త్రివిక్రమ్ శ్రీనివాస్
దాసరి నారాయణరావు
జంధ్యాల
సత్యానంద్
బోయపాటి శ్రీను
ఎం.వి.ఎస్.హరనాథ్ రావు
ఇవి కూడా చూడండి
తెలుగు సినిమా పాట
సినిమారంగం గురించిన తెలుగు సాహిత్యం
మూలాలు
వర్గం:తెలుగు సినిమా
వర్గం:తెలుగు సాహిత్య ప్రక్రియలు
వర్గం:తెలుగు సాహిత్యం
వర్గం:సినిమా |
సాఫ్టువేరు కంపెనీల జాబితా | https://te.wikipedia.org/wiki/సాఫ్టువేరు_కంపెనీల_జాబితా | thumb|256x256px|గూగుల్ సీ.ఈ.ఓ, సుందర్ పిచాయ్, భారత ప్రధాని నరేంద్ర మోడీమైక్రో సాఫ్ట్
ఐ బి ఎం
ఒరాకిల్
సన్
అడోబీ
మెటా ప్రొడుక్ట్స్
టీ సీ యస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)
సీ.టీ.యస్ (కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్)
విప్రో
సత్యం
ఇన్ఫోసిస్
టిబ్కో
ఐ ఫ్లెక్ష్
హెచ్ పీ
గూగుల్
క్యా ప్ జె మి ని
యాహూ
జునిపర్ నెట్ వర్క్స్
సిస్కో
టెక్సాస్ ఇన్ స్ట్రుమెంట్స్
ఇంటెల్
సిమాంటెక్
మెకాఫీ
సింఫనీ
ఆప్ లాబ్స్
కుస్తెర్స్
ఇన్నొమిన్ద్స్
ఇన్ఫొటెక్
వాల్యులాబ్స్
ఐతాట్స్
కీన్
వర్గం:కంప్యూటరు సాఫ్టువేరు సంస్థలు
వర్గం:జాబితాలు |
మైక్రోసాఫ్ట్ | https://te.wikipedia.org/wiki/మైక్రోసాఫ్ట్ | 267x267px|alt=Bill Gates|బిల్ గేట్స్|కుడిalt=Satya Nadella, The Executive Chairman and CEO of Microsoft|thumb|సత్య నాదెళ్ళ, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, CEO
మైక్రోసాఫ్ట్ కార్పోరేషను, ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. ప్రపంచ వ్యాప్థంగా ఉన్న అన్ని శాఖలను కలుపుకొని, 2004 మే నాటికి ఈ సంస్థలో సుమారుగా 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని రెడ్మాండ్ నగరంలో ప్రధాన కార్యాలయం గల ఈ సంస్థ 1975 వ సంవత్సరంలో బిల్ గేట్స్ మరియూ పౌల్ అలెన్ అను ఇద్దరు మిత్రులు స్థాపించారు. ఈ సంస్థ వివిధ రకాలైన కంప్యూటరు పరికరాలకు వివిధ రకాలయిన సాఫ్టువేర్ అభివృద్ధి పరచడం, తయారు చేయడం, లైసెన్స్లు ఇవ్వడం మరియూ సహకారం అందించడం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియూ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అత్యంత ప్రముఖమైన, ప్రజాదరణ పొందిన సాఫ్టువేర్ ఉత్పత్తులు. ఈ రెండు సాఫ్టువేర్లు సుమారుగా డెస్క్-టాప్ కంప్యూటరులో అటో ఇటో పూర్తి వాటాని కలిగి ఉన్నాయి.
ప్రస్తుత వ్యాపార కార్యకలాపములు
right|thumb| మైక్రోసాఫ్ట్ రెడ్మాండ్ ఆఫీసు, ఇందు సుమారుగా 80 లక్షల చదరపు అడుగుల వైశాల్యం (750, 000 చదరపు మీటర్లు), 28,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ గుర్తు ఆ క్యాంపసునకు మొదటి గుర్తు.
వీరి తరువాతి విండోసు ఆపరేటింగు సిస్టము అయిన విండోస్ విస్టా 2006 లో విడుదల చేశారు. ఇందులోని కొన్ని విషయములు: డివైజులకు మరింత గొప్ప సహకారము (ఉదాహరణకు మీడియా ప్లేయర్లు), ఏయిరో అని పిలవబడు, మరింత గొప్ప యూజర్ ఇంటర్ ఫేసూ, మెట్రో అని పిలవబడు పీ డీ యఫ్ లాంటి ఫార్మేట్, డెస్క్ టాప్ లోనికి క్రొత్త "శోధన" వ్యవస్థ, మరియూ ఇంకా చాలా చాలా కొత్త ఫీచర్లు చేర్చబడినాయి.
మైక్రోసాఫ్ట్ తన ఎక్స్ బాక్స్ నకు మరొక కొత్త వర్షను విడుదలకు సిద్దం చేస్తుంది, దీనిని ఎక్స్ బాక్స్ 360 అని పిలుస్తున్నారు. ఈ ఎక్స్ బాక్స్ను వారు విండోస్ విస్టా మరియూ విండోస్ మీడియా సెంటర్తో కలిపి (integrate ? ) ఓ గొప్ప వినోదపరమైన విప్లవం తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.
ఇటీవల సంస్థ అధికారులు చేసిన ఉపన్యాసాలు, వ్యాఖ్యల ద్వారా ఓ విషయం అర్థమవుతుంది, అది ఏమిటంటే ఇహ నుండి సంస్థ "తక్కువ ధర, అందుకు కొనండి" అనే సిద్దాంతాన్ని వదిలి "మంచి నాణ్యత , భవిష్యత్తులో ఖర్చులను తగ్గిస్తాము" అని చెప్పి అమ్మకాలు చెయ్యబోతున్నారు అని.
right|thumb| మైక్రో సాఫ్ట్ హైదరాబాదు క్యాంపస్ లోని బోర్డు
చరిత్ర
మైక్రో - సాఫ్ట్ అనగా సూక్ష్మమైన కంప్యూటరు అను పదములనుంది వచ్చింది.
ఇప్పటి చరిత్ర
మైక్రోసాఫ్ట్ సహనిర్మాత పాల్ అలెన్ బిల్ గేట్స్ను కలవడానికి అతని గది వద్దకు ఒక పత్రికను తీసుకుని వచ్చాడు [Altair 8080]. అది ప్రపంచములో మొట్టమొదటి వ్యాపార పరమైన మోడల్స్ మైక్రో-కంప్యూటర్.
కంప్యూటర్ల కోసం సాఫ్టువేర్
బిల్గేట్స్ కాలిఫోర్నియాలో జరిగిన ఆల్థింగ్స్ డిజిటల్ కాన్ఫరెన్స్లో మైక్రోసాఫ్ట్ 2009లో విడుదల చేయనున్న విండోస్-7లో టచ్స్క్రీన్ సదుపాయం ఏర్పాటు చేసినట్టు ప్రకటన చేశారు. విండోస్ విస్టా వెర్షన్ తరువాత విడుదల చేయబోయే విండోస్-7లో ఉండే మల్టీటచ్ ఇంటర్ఫేస్ ద్వారా ఇప్పటిదాకా మౌస్ చేసే పనులన్నింటినీ మన చేతివేళ్లతోనే చేసేలా రూపొందించినట్టు మైక్రోసాఫ్ట్ చెబుతోంది.ఇప్పటిదాకా కొన్ని హై ఎండ్ మొబైల్స్కు మాత్రమే పరిమితమైన ఈ టచ్స్క్రీన్ సదుపాయం ఇప్పుడు కంప్యూటర్లకు వాడుకునేలా రూపొందించే ప్రయత్నం ఒక విప్లవాత్మక మార్పు అనిచెప్పవచ్చు. విస్టా తరువాత తమ సంస్థ నుండి విడుదలయ్యే సరికొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్-7 మల్టీటచ్ ఇంటర్ఫేస్ కలిగి ఉంటుందని, ఇకపై వినియోగదారులు మౌస్తో కాకుండా, వేలితోనే కంప్యూటర్ను ఆడించవచ్చని బిల్గేట్స్ ప్రకటించారు.విండోస్-7 మల్టీటచ్ ఇంటర్ఫేస్తో రూపొందించడానికి ప్రధాన ప్రేరణ యాపిల్ సంస్థ విడుదల చేసిన ఐఫోన్ అని చెప్పవచ్చు. టచ్స్క్రీన్ సాఫ్ట్వేర్తో రూపొందిన ఐఫోన్ విడుదలైన 11 మాసాలలోనే దాదాపు 60 లక్షల హ్యాండ్సెట్లు అమ్ముడుపోవడం బిల్గేట్స్ను ఆలోచనలో పడేసిందని మార్కెట్ వర్గాల విశ్లేషణ.విండోస్-7లోని టచ్స్క్రీన్ ఇంటర్ఫేస్ ద్వారా కంప్యూటర్ వినియోగదారులు వివిధ అప్లికేషన్లు ఓపెన్ చేయాలన్నా, క్లోజ్ చేయాలన్నా, ఫోటోలు, వీడియోలు చూడటం దగ్గర్నించీ ప్రతిదీ టచ్ కంట్రోల్స్తోనే చేయవచ్చు. టచ్స్క్రీన్ ఆపరేటింగ్ సిస్టం అప్లికేషన్ల రూపకల్పనలో నిమగ్నమైన మైక్రోసాఫ్ట్ 2008 చివరనగానీ, 2009 మొదట్లోగానీ విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది.
విండోస్ మొబైల్ ఫోన్ల కోసం సాఫ్టువేర్
మొబైల్ ఫోన్ల కోసం ప్రత్యేక రూపొందించిన విండోస్ మొబైల్ సాఫ్టువేర్ కు మరిన్ని ఫీచర్స్ను జోడించి కొత్త వెర్షన్ను విఫణి లోనికి విడుదల చేసింది. విండోస్ మొబైల్ ఫ్లాట్పాం ఆధారంగా పనిచేసే మొబైల్ ఫోన్స్, స్మార్ట్ఫోన్స్లలో కొత్త ఫీచర్స్తో తయారైన మ్యూజిక్ వెర్షన్లను ఈ సాఫ్ట్వేర్ అందిస్తుందని మైక్రోసాఫ్ట్ మొబైల్ కమ్యూనికేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ లీజ్ వెల్లడించారు.
thumb|మైక్రోసాఫ్ట్ హైదరాబాదు కార్యాలయం
మైక్రోసాఫ్ట్ దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్, మోటోరోలా ఇంక్, తైవాన్కు చెందిన హైటెక్ కంప్యూటర్స్ (హెచ్టీసీ), అశూష్టెక్ కంప్యూటర్ వంటి సంస్థల భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ ఈ సాఫ్టువేర్ ను రూపొందించిందని ఆండీ లీజ్ తెలిపారు.ఈ సాప్ట్వేర్ ఆపిల్ ఇంక్ కంపెనీకి చెందిన ఐఫోన్, బ్లాక్ బెర్రీ డివైజ్, ఫిన్లాండ్స్ నోకియా వంటి హ్యాండ్ సెట్లలో ఆక్సెస్ అవుతుందని, ఈ విండోస్ మొబైల్ సాఫ్టువేర్ తో సెల్ఫోన్ ద్వారా నచ్చిన పాటలను వినవచ్చునని మైక్రోసాఫ్ట్ వివరిస్తుంది.
సాధించిన విజయాలు
సంస్థ విస్తరణ,విలీనాలు
యాహూ కొనుగోలుకోసం మైక్రోసాఫ్ట్ 47.5 బిలియన్ డాలర్లు చెలిస్తామని ప్రతిపాదించింది. అంటే యాహూ షేర్ ఒక్కింటికి 33 డాలర్లు ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చిందనన్నమాట. అయితే షేర్కు 37 డాలర్ల చొప్పున 57 బిలియన్ డాలర్లను ఇవ్వాలని యాహో కోరింది. గత ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ 44.6 బిలియన్ డాలర్లు ఇస్తామని -షేర్కి 31 డాలర్లు- మొదట ప్రతిపాదించినా, చర్చల క్రమంలో ఆ మెత్తాన్ని పెంచింది.
కానీ ఈ విలీన ప్రతిపాదనకి యాహూ అంగీకరించక పోవటంతో మైక్రోసాఫ్ట్ ప్రయత్నం విఫలమయింది. కొనుగోలు చేయాలని గత మూడు నెలలుగా చేస్తూ వస్తున్న ప్రయత్నాలకు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్వస్తి చెప్పింది.
పురస్కారాలు
విశేషాలు
పుస్తకాలు, ప్రచురణలు
వీడియోలు
బయటి లింకులు
మైక్రోసాఫ్టు అధికారిక వెబ్సైట్ :లింక్
మైక్రోసాఫ్టు ఇంగ్లీష్ వికీపీడియా :లింక్
మైక్రోసాఫ్టు గురించి సమగ్ర సమాచారంతో ఇంగ్లీష్ వికీపీడియా : పోర్టల్ లింక్
ఇవికూడా చూడండి
బిల్ గేట్స్
లినక్స్
విండోస్
మ్యాక్ ఓయస్ టెన్
మూలాలు
వర్గం:అంతర్జాతీయ వ్యాపార సంస్థలు
వర్గం:సాఫ్టువేరు సంస్థలు
వర్గం:సాంకేతిక సంస్థలు
వర్గం:మొబైల్ ఫోన్ తయారీదారులు
వర్గం:హైదరాబాదు లో సాఫ్ట్వేర్ సంస్థలు
వర్గం:ఈ వారం వ్యాసాలు |