link
stringlengths 41
231
| text
stringlengths 29
5k
|
---|---|
https://www.telugupost.com/movie-news/venky-plan-for-drushyam2-190676/ | రీమేక్ రాజా వెంకటేష్ ఇప్పటికే నారప్ప, దృశ్యం 2 షూటింగ్స్ పూర్తి చేసేసుకుని.. ఎఫ్ 3 షూటింగ్ లో బిజీగా ఉందామనుకున్నాడు కానీ.. అనిల్ రావిపూడి కి కరోనా రావడంతో ప్రస్తుతం ఎఫ్ 3 షూటింగ్ ని వాయిదా వేసింది టీం. అయితే మలయాళంలో అమెజాన్ ప్రైమ్ లో విడుదలై అద్భుతమైన హిట్ అయిన మోహన్ లాల్ దృశ్యం 2 సినిమాని ఆ సినిమా ఒరిజినల్ డైరెక్టర్ తో వెంకటేష్ తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. దృశ్యం 2 రీమేక్ రైట్స్ కొన్న నెల లోగా ఆ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి షాకిచ్చారు వెంకీ. అటు అసురన్ రీమేక్ నారప్ప, ఇటు దృశ్యం 2 రీమేక్ లని వెంకీ లుంగ చుట్టి పడేసాడు.అయితే మలయాళంలో మోహన్ లాల్ దృశ్యం 2 ని ఓటిటికి అమ్మేసినట్టుగా వెంకీ కూడా దృశ్యం 2 సినిమాని అంత ఫాస్ట్ గా చుట్టేసింది ఓటిటికి అమ్మెయ్యడానికే అనే టాక్ మొదలైంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది.. ఇలాంటప్పుడు దృశ్యం 2 మూవీని థియేటర్స్ లో విడుదల చేసందుకు టైం పడుతుంది కాబట్టి.. దగ్గుబాటి బ్రదర్స్ ఇద్దరూ దృశ్యం 2 ని ఓటిటికి అమ్మేయ్యొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే కరోనా లాక్ డౌన్ తో గత ఏడాది చాలా సినిమాలు ఓటిటి లోనే విడుదలయినట్లుగా వెంకీ అండ్ సురేష్ బాబు లు కూడా దృశ్యం 2 ని ఓటీటీకి అమ్మేస్తారో.. లేదంటే థియేటర్స్ కోసం వేచి చూస్తారో జస్ట్ వెయిట్ అండ్ సి. |
https://www.telugupost.com/movie-news/varudu-kavalenu-movie-is-coming-out-in-ott-from-january-7th-1345981 | చాలా కాలం తర్వాత నాగశౌర్య ఖాతాలో హిట్ పడింది. అశ్వత్ధామ తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగశౌర్యను వరుడు కావలెను సినిమాతో.. హిట్ వరించింది. నాగశౌర్య - రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 29వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. కాలేజీలో ప్రేమ- ఉద్యోగం- కుటుంబ అనుబంధాల మధ్య నడిచే ఈ సినిమా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఉండటంతో.. మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు వరుడు కావలెను ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.జనవరి 7వ తేదీ నుంచి జీ5 లో ఈ సినిమా స్ట్రీమ్ అవ్వనుంది. ఈ మేరకు జీ5 సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఆకాష్ - భూమి పాత్రల్లో కనిపించిన శౌర్య - రీతూ వర్మలు.. క్యారెక్టర్లో ఒదిగిపోయారనే చెప్పాలి. కూతురికి పెళ్లి చేసేందుకు నానా కష్టాలు పడుతున్న తల్లిగా నదియ కనిపిస్తారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్నందించారు. |
https://www.telugupost.com/movie-news/విజయ్-అదరగొడుతున్నారు-1055/ | ఇలయదళపతి విజయ్ హీరోగా 'రాజు రాణి' ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తేరీ'. ఈ చిత్రం థియేటికల్ ట్రైలర్ విడుదలై అదరగొడుతోంది. ఈ ట్రైలర్ ఎంతో స్టైలిష్గా ఉందని విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సమంత హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో విజయ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నాడు. ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ చూస్తే ఇందులో విజయ్ రజనీకాంత్లా కొన్ని స్టైలిష్గా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థం అవుతోంది. చూయింగ్ గమ్ను రజనీ సిగరెట్ను నోట్లో వేసుకున్నట్లుగా వేసుకోవడంతో పాటు ఆయన పలు విధాలుగా రజనీని ఇమిటేట్ చేసిన సంగతి అర్థం అవుతోంది. మరి ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను, విజయ్ అభిమానులను ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది. కాగా ఈచిత్రంలో సీనియర్ నటులైన ప్రభు, రాధికా కీలకపాత్రలు పోషించనున్నారు. |
https://www.telugupost.com/movie-news/not-shah-rukh-khan-but-his-bodyguard-was-stopped-at-mumbai-airport-by-customs-1447939 | బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ను ఎయిర్ పోర్టులో ఆపేశారనే వార్తలు శనివారం చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే..! ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు షారుఖ్ ను ఆపేశారని చెప్పుకొచ్చారు. అనేక ఖరీదైన గడియారాలు, ఇతర గాడ్జెట్లను తీసుకుని వస్తున్నారని.. అందుకే ముంబై ఎయిర్పోర్ట్ అధికారులు షారుఖ్ ఖాన్ ను ఆపినట్లు శనివారం నివేదించబడింది. షారుక్ శుక్రవారం రాత్రి షార్జా నుంచి వచ్చినట్లు విమానాశ్రయంలో ఉన్న ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) వర్గాలు తెలిపాయి. యూఏఈలోని ఎక్స్పో సెంటర్లో నిర్వహిస్తున్న గ్లోబల్ సినిమా ఐకాన్, కల్చరల్ నరేటివ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి శనివారం షారుఖ్ ఖాన్ దుబాయ్ వెళ్లారు. షారుఖ్ ఖాన్, అతడి బృందాన్ని టీ-3 టెర్మినల్ వద్ద రెడ్ ఛానల్ దాటుతుండగా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. బ్యాగులని సిబ్బంది తనిఖీ చేశారు. బ్యాగులో Baubn & Zurbk వాచీలు, 6 బాక్సుల రోలెక్స్ వాచీలు, స్పిరిట్ బ్రాండ్ వాచీలు, Apple సిరీస్ వాచీలు లభించాయి. వీటితో పాటు వాచీల ఖాళీ పెట్టెలు కూడా ఉన్నాయని కథనాలు వచ్చాయి.అయితే ఆపింది షారుఖ్ ఖాన్ ను కాదని.. అతని అంగరక్షకుడు రవిశంకర్ సింగ్ అని తేలింది. షారుఖ్ ఖాన్ అంగరక్షకుడు రవిశంకర్ సింగ్ కస్టమ్స్ కు డబ్బులు చెల్లించినట్లు ఎయిర్ పోర్టు అధికారి తెలిపారు. షారుఖ్, అతని మేనేజర్ పూజా దద్లానీ, రవిశంకర్ సింగ్.. మరో ముగ్గురు సభ్యులు చార్టర్డ్ ఫ్లైట్లో 12:30 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జనరల్ ఏవియేషన్ టెర్మినల్లో దిగారు. లగేజీ స్క్రీనింగ్ సమయంలో, కస్టమ్స్ సిబ్బంది ఆరు బ్యాగ్లలో రెండింటిలో ఆరు లగ్జరీ వాచీలను కనుగొన్నారని అధికారి తెలిపారు. వాచీలు రూ.17.86 లక్షలకు విలువ చేయగా, ప్రస్తుతం ఉన్న రేటు ఆధారంగా రూ.6.88 లక్షల కస్టమ్స్ సుంకం విధించినట్లు తెలిపారు. జనరల్ ఏవియేషన్ టెర్మినల్ కస్టమ్స్ డ్యూటీ చెల్లింపు కౌంటర్ పనిచేయకపోవడంతో, కస్టమ్స్ అధికారులు షారుఖ్ బాడీగార్డ్ను విమానాశ్రయంలోని టెర్మినల్ 2కి తీసుకెళ్లారు, అక్కడ అతను సూపర్స్టార్ తరపున మొత్తాన్ని చెల్లించాడని అధికారి తెలిపారు. కొంత సమయం సింగ్ అక్కడే వేచి ఉండగా.. ఖాన్తో సహా మిగిలిన ఐదుగురు సభ్యులు విమానాశ్రయం నుండి వెళ్ళిపోడానికి అనుమతించారని, ఆ తర్వాత కస్టమ్స్ డ్యూటీ చెల్లింపు ప్రక్రియ పూర్తయిందని అధికారి తెలిపారు. షారుఖ్ ఖాన్ ను అస్సలు అదుపులోకి తీసుకోలేదని, ఎలాంటి ప్రశ్నలు అడగలేదని కస్టమ్స్ విభాగం తెలిపింది. |
https://www.telugupost.com/movie-news/kangana-ranaut-alia-bhatt-fight-117698/ | గతంలో వారసత్వ బ్యాగ్రౌండ్ తో సినిమాల్లోకి వచ్చి టాప్ పొజిషన్ కి వెళ్లడం ఒక వింతేమీ కాదు…. నాలాగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లో టాప్ హీరోయిన్ గా నిలబడడం గొప్పంటూ వారసత్వం విషయంలో అలియా భట్ ని బహిరంగంగానే ఒక ఆట ఆదుకున్న కంగనా రనౌత్ మరోసారి అలియా భట్ పై నోరు పారేసుకుంది. ఎప్పుడూ ముక్కుసూటిగా అందరి విషయంలో ఓపెన్ గా మాట్లాడుతూ తిట్లు తినే కంగనా మరోమారు అలియా భట్ ని టార్గెట్ చేసింది. నిన్నగాక మొన్న మణికర్ణికా విషయంలో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన కంగనా ఇప్పుడు మరోమారు బాలీవుడ్ మీడియాకి మేత వేసింది. గత ఏడాది అలియా భట్ నటించిన గల్లీ బాయ్ సినిమాతో అలియా భట్ తొ ప్రతి అవార్డు విషయంలో మణికర్ణికా లో కంగనా చేసిన పాత్ర పడుతూ వస్తుంది. అయితే తాజాగా జరిగిన ఓ అవార్డు వేడుకలో మణికర్ణికా కు గట్టి పోటీ ఇచ్చింది గల్లీ భాయ్ అలియా భట్. ఫైనల్ గా ఆ అవార్డు ని మణికర్ణికా తో బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చినందుకు గాని కంగనాకు రావడంతో.. మీడియా వారు కంగనాని.. ఈ అవార్డు విషయంలో అలియా భట్ నుంచి గట్టిపోటీ ఎదురైందా.. అని అడగగా… దానికి కంగనా రనౌత్ గల్లీ బాయ్ సినిమాలో అలియా పాత్ర ఏమంత గొప్పగా లేదు. అసలు నిజంగా చెప్పాలంటే గల్లీ బాయ్ లో అలియా చాలా రొటీన్ పాత్ర చేసింది. అలియా గల్లీ బాయ్ లో చేసిన పాత్ర నాకేం నచ్చేలేదు. అలంటి పాత్ర చేసిన అలియా తొ నాకు పోటీనా అంటూ… అలియా భట్ ని ఉద్దేశించి.. ఇలాంటి చెత్త పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గిస్తే బావుంటుందని.. ఉచిత సలహా కూడా పారేసింది కంగనా. మరి అంతలా అలియా పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన కంగనాపై అలియా స్పందన ఎలా ఉంటుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/సూపర్-స్టార్-తిరస్కారాని-17539/ | తాజాగా 66 వ ఏట అడుగుపెట్టిన సూపర్ స్టార్ రజని కాంత్ ఇప్పటికీ చెరగని ఛరిష్మాతో కేవలం తన పోస్టర్ తో ప్రేక్షకులను థియేటర్ల వైపు బారులు తీరేలా చేస్తున్నారు. ఆయనతో కలిసి తెరను పంచుకోవాలని ఉవ్విల్లూరే అగ్ర తారలు ఎందరో లెక్కే లేదు. ఇటీవల ఆయన నటిస్తున్న 2 .o చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ వేడుకలో బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ తనకు రజని కాంత్ తో కలిసి నటించాలని వుంది అని వేదిక పై బహిరంగ ప్రకటన చేశారు. బాలీవుడ్ మరో టాప్ హీరో ఆమిర్ ఖాన్ తాను నటించినా దంగల్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో కూడా అనువదిస్తుండగా ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పవలసిందిగా రజని ని కోరారు.ఆమిర్ ఖాన్ చేసిన ప్రతిపాదనను రజని కాంత్ తిరస్కరించారు అన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వాస్తవమే కానీ, రజని కి సినిమా నచ్చకపోవటం వలెనే తన గొంతు అరువు ఇవ్వటానికి నిరాకరించారు అని వచ్చిన కథనాలను మాత్రం ఆమిర్ ఖాన్ ఖండించారు. దంగల్ ప్రత్యేక ప్రదర్శన వేసి రజని కాంత్ కి చూపించగా ఆయనకు బాగా నచ్చటంతోనే తాను తమిళ వెర్షన్ కి డబ్బింగ్ చెప్పవలసిందిగా రజని ని కోరాడట ఆమిర్ ఖాన్. అయితే ఇద్దరు స్టార్ హీరోస్ ల కు ఇటువంటి సహకారాలు వర్తించకూడదు అని, ఒకవేళ ఆలా చేస్తే ఫలితం తేడా కొట్టే అవకాశాలున్నాయని సూచించి రజని తిరస్కరించారట. రజని గొంతు తమిళ ప్రేక్షకులకు సుపరిచితం కావటంతో తెరపై కనిపిస్తున్న ఆమిర్ హావభావాలని ఆస్వాదించకుండా కేవలం వినిపించే గొంతు తో ప్రయాణం చేసే ప్రమాదం ఉండటమే రజని ఆమిర్ ప్రతిపాదనను నిరాకరించటానికి కారణమట. |
https://www.telugupost.com/movie-news/విలనిజాన్ని-పరిచయం-చేసావ-36809/ | బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 'జై లవ కుశ' లో ఎన్టీఆర్ ఇపుడు తన విలనిజం ఎలా వుండబోతుందో చూపెట్టేస్తున్నాడు. చెప్పిన టైంకే అంటే గురువారం సాయంత్రం 5.22 ని.షాలకు 'జై' టీజర్ ని విడుదల చేసింది 'జై లవ కుశ' చిత్ర యూనిట్. మరి ముందునుండి చెబుతున్నట్టే 'జై లవ కుశ' మూడు టీజర్స్ తో అభిమానులకు త్రిబుల్ బొనాంజా అందించడానికి వస్తామని చెప్పినట్లే ఇప్పుడు 'జై' టీజర్ తో అభిమానులను అలరించడానికి వచ్చేసాడు.బాబీ డైరెక్షన్ లో 'జై లవ కుశ' మొదలైనప్పటినుండి 'జై లవ కుశ' లో ఎన్టీఆర్ 'జై' పాత్రలో పూర్తి నెగెటివ్ షేడ్స్ లోనే కనబడుతాడని ప్రచారం జరుగుతుంది అయితే ఆ ప్రచారం నిజమే అని ఇప్పుడు ఈ' జై' టీజర్ చూస్తుంటే స్పష్టంగా అర్ధమవుతుంది. సుర... సుర... సుర... అంటూ కారులోనుండి కాలు బయటికి పెట్టి తన ఇష్ట దైవం రావణాసురుడికి దణ్ణం పెడుతూ నడిచొచ్చే 'జై' పాత్రలో ఎన్టీఆర్ సూపర్ పెరఫార్మెన్సుతో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఎన్టీఆర్ 'ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణుడ్ని సంపాలంటే.. సముద్రమంత ధ. ధ ధ ధ ధైర్యం ఉండాలా' అంటూ ఎన్టీఆర్ నత్తితో చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. అయితే ఎన్టీఆర్ ని ముందు అనుకున్నట్టుగానే డైరెక్టర్ బాబీ మాస్ లుక్ తోనే 'జై' టీజర్ లో పరిచయం చేసాడు. విలన్ కుండాల్సిన అన్ని లక్షణాలు ఎన్టీఆర్ లో కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. మరి 'జై' పాత్రతో అదరగొట్టిన ఎన్టీఆర్ మిగతా కేరెక్టర్స్ ఎలా వుండబోతూన్నాయో అనే క్యూరియాసిటీని అందరిలో పెంచేసాడు. ఇకపోతే 'జై లవ కుశ' బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అనే చెప్పాలి. మరి 'జై' టీజర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వచ్చే లవ, కుశ టీజర్స్ పై మరింత ఆసక్తి అంచనాలు ఏర్పడిపోయాయంటున్నారు అభిమానులు. |
https://www.telugupost.com/crime/police-case-filed-against-on-youtuber-bigg-boss-5-fame-sarayu-1353062 | యూ ట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ సరయూపై కేసు నమోదు7 ఆర్ట్స్.. ఈ యూ ట్యూబ్ ఛానల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ఛానల్ లో వచ్చే కంటెంట్, భాష పై గతంలో పెద్ద రచ్చే జరిగింది. జరిగితే జరిగింది కానీ.. ఈ యూ ట్యూబ్ ఛానల్ వల్ల సరయు కి యమా క్రేజ్ వచ్చింది. అలా యూ ట్యూబర్ గా ఫేమస్ అయి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో హౌస్ లోని ఎంట్రీ ఇచ్చి, మొదటి వారమే ఎలిమినేట్ అయింది. కాగా.. ఇప్పుడు సరయు మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవలే ఆమె స్టార్ట్ చేసిన హోటల్ ప్రమోషన్ లో భాగంగా ఓ సాంగ్ విడుదల చేసింది. ఆ పాటలో హిందువులను కించపరిచేలా తీశారంటూ సరయుపై రాజన్న సిరిసిల్ల పీఎస్ లో కేసు నమోదైంది.Also Read : జేఎన్టీయూలో ర్యాగింగ్.. 12 మంది సస్పెండ్సరయు, మరికొంతమంది హోటల్ ప్రచార పాటలో గణపతి బప్పా మోరియా అని రాసి ఉన్న బ్యాండ్ ను తలకు కట్టుకుని హెటల్ లోకి వెళ్తారు. ఈ సన్నివేశంలో దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవించి హోటల్స్ దర్శిస్తారనే సంకేతాన్ని పంపుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాజన్న సిరిసిల్ల పోలీసులు, ఆ కేసును బంజారాహిల్స్ పీఎస్ కు బదిలీ చేశారు. పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/యంగ్-టైగర్-కి-స్పష్టత-వచ్-14398/ | ప్రస్తుత తరం తెలుగు కథానాయకులలో అన్నీ వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందగలిగిన, వైవిధ్యమైన పాత్రలు పోషించగలిగే అరుదైన నటులలో కచ్చితంగా అగ్ర స్థానం తారక్ సొంతం. అతి పిన్న వయసులో యమ ధర్మ రాజు పాత్ర పోషించిన నటుడిగా చరిత్రలో నిలిచిపోయాడు తారక్. కానీ తారక్ స్టామినా నిరూపించుకునే రికార్డ్స్ మొన్నమొన్నటి వరకు సృష్టించలేకపోయాడు. ఇటీవల విడుదల ఐన తారక్ చిత్రం జనతా గ్యారేజ్ ఆయన కెరీర్ ట్రాక్ రికార్డు గా నిలవటమే కాక తెలుగు చలన చిత్రాలలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడవ స్థానం సంపాదించుకుంది.ఈ భారీ విజయమే తారక్ ని తదుపరి చిత్రానికి కథ ఎంపిక విషయంలో సందిగ్ధంలో పడేసింది. వరుసగా కథలు వింటున్న తారక్ మరే చిత్రాన్ని అంగీకరించలేదు. పూరి జగన్నాథ్, వక్కంతం వంశి, అనిల్ రావిపూడి, హరి వంటి ప్రముఖులు చెప్పిన కథలు విని తిరస్కరించటం జరిగిపోయింది. ఒకప్పుడు సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ తరువాత వరుస వైఫల్యాలు ఎదురు ఐన చేదు అనుభవం పునరావృతం కాకూడదు అని జాగ్రత్తలు వహిస్తున్న తారక్ కి తదుపరి చిత్రం పై స్పష్టత వచ్చేది ఎప్పుడో మరి... మరో పక్క తన సమకాలీన కథానాయకుల ఏడాదికి రెండేసి చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటే కథ చర్చలతో ఇంత కాలం గడిపేస్తున్న తారక్ విజయాలు అందుకున్నా అగ్ర స్థానం దక్కించుకోవటం కష్టమని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/legendary-actor-mammootty-sister-ameena-passes-away-at-70-1494370 | సీతారామంతో తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టిన దుల్కర్ సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దుల్కర్ తండ్రి మమ్ముట్టి మలయాళంలో స్టార్ హీరో అనే సంగతి తెలిసిందే..! ఆయన సోదరి చనిపోయారు. మమ్ముట్టి సోదరి అమీనా కన్నుమూశారు. ఆమె వయసు 70. గత కొంతకాలంగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆమె కంజిరపల్లి పరాయిక్కల్ కుటుంబానికి చెందిన దివంగత సలీమ్ భార్య. ఆమెను నసీమా అని కూడా పిలిచేవారు. బుధవారం (సెప్టెంబర్ 13) అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.ఈ ఏడాదిలోనే మమ్ముట్టి కుటుంబంలో పలు విషాదాలు చోటు చేసుకున్నాయి. ఆమె తల్లి ఫాతిమా ఇస్మాయిల్ ఏప్రిల్ 21న మరణించారు. తాజాగా సోదరి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమీనా మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమ, మమ్ముట్టి అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మమ్ముట్టి 'బ్రహ్మయుగం' అనే చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 7 ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఇటీవలే మమ్ముట్టి తన 72వ పుట్టినరోజు జరుపుకున్నారు. |
https://www.telugupost.com/movie-news/hello-guru-premakosame-first-day-collections-93484/ | త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రామ్ - అనుపమపరమేశ్వరం జంటగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన హలో గురు ప్రేమ కోసమే చిత్రం ఈ దసరా కానుకగా నిన్న గురువారం విడుదలైంది. సినిమా మొదటి షోకే ప్రేక్షకులనుండి మిక్స్ డ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాతో రామ్ యావరేజ్ హిట్ అందుకున్నాడనే చెప్పాలి. సినిమాలో రామ్ ఎనర్జీ నటన, అనుపమ క్యూట్ లుక్స్, కామెడీ, కొన్ని డైలాగ్స్ పరంగా బావున్నప్పటికీ... రొటీన్ కథ, దేవిశ్రీ మ్యూజిక్, ఎడిటింగ్, త్రినాథ రావు డైరెక్షన్, ఎక్కడా ఆసక్తికరంగా ట్విస్ట్ లు లేకపోవడంతో సినిమాకి యావరేజ్ టాక్ పడడం జరిగింది. ఇక రామ్ హలో గురు ప్రేమ కోసమే చిత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.82 కోట్లు కొల్లగొట్టింది. ఏరియా వైజ్ గా మొదటిరోజు కలెక్షన్స్ మీకోసం.ఏరియా షేర్స్ (కోట్లలో)నైజాం 1.55సీడెడ్ 0.50నెల్లూరు 0.13కృష్ణా 0.29గుంటూరు 0.35వైజాగ్ 0.48ఈస్ట్ గోదావరి 0.27వెస్ట్ గోదావరి 0.25ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 3.82 కోట్లు |
https://www.telugupost.com/movie-news/rashmika-mandanna-started-promoting-her-role-in-mahesh-babu-movie-142436/ | మహేష్ సినిమా లో రష్మిక మందన్న హీరోయిన్. అయితే ఆ విషయంలో రష్మిక ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. కారణం మొదటిసారి ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తుంది కాబట్టి. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం రష్మిక ఎగ్జైట్మెంట్ ని బాగా లైట్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే సరిలేరు నీకెవ్వరూ సినిమా నుండి మహేష్ తో పాటుగా విజయశాంతి, ప్రకాష్ రాజ్, లాంటి లుక్స్ వదులుతున్నప్పటికీ.. హీరోయిన్ రష్మిక లుక్ మాత్రం వాడడం లేదు. టీజర్ లో కానీ పోస్టర్స్ లో కానీ రష్మిక లుక్ రివీల్ చెయ్యలేదు. దానికి రష్మిక హార్ట్ అయినట్లుగా వార్తలు రావడం, అల వైకుంఠపురము టీజర్ లో హీరోయిన్ పూజ ని హైలెట్ చేసేసరికి రష్మిక కి కోపం రావడంతో.. హడావుడిగా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ నుండి మహేష్ – రష్మిక ల రొమాంటిక్ లుక్ బయటికి వదిలాడు. అయినా రష్మిక మందన్న శాంతపడకుండా…. తనకి తానే సరిలేరు నీకెవ్వరూ గురించి ప్రమోట్ చేసుకోవడానికి రెడీ అయ్యింది. అందులో భాగంగానే హీ ఈజ్ సో క్యూట్ అంటూ మండే విడుదల కాబోయే సాంగ్ ప్రోమోకి రష్మిక డాన్స్ మూమెంట్స్ తో ఇరగదీస్తూ ఓ వీడియో చెయ్యడం, దాన్ని సరిలేరు టీం అధికారికంగా వదలడం జరిగింది. అయితే రష్మిక ఇలా డాన్స్ ని దబిడిదిబిడి చేస్తూ.. తనపై ఫోకస్ ని క్రియేట్ చేసుకోవడానికి ఇలా ప్రోమో చేసింది. సరిలేరు సినిమా విడుదలకు దగ్గరవుతున్నప్పటికీ.. రష్మిక మందన్న ని పట్టించుకోకపోవడంతో.. రష్మిక ఇలా ప్లాన్ చేసుకుంది. తప్పక టీం కూడా రష్మిక వీడియో ని వదిలింది. లేదంటే.. రష్మిక ఇలా డాన్స్ చేసే వీడియో ని టీం వదిలేది కాదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. మరి రష్మిక ఈ సినిమాలో నటిస్తూ.. టాప్ లెవల్ కి వెళదామని కలలు కంటుంటే… అనిల్ అండ్ బ్యాచ్ మాత్రం ఆమె కలలు మీద నీళ్లు చల్లుతున్నారనిపిస్తుంది. |
https://www.telugupost.com/crime/akanksha-dubey-commits-suicide-rumoured-boyfriend-actor-samar-singh-is-untraceable-1468959 | భారతీయ చిత్రపరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భోజ్ పురికి చెందిన యువనటి ఆకాంక్ష దూబే (25)బలవన్మరణానికి పాల్పడింది. యూపీలోని వారణాసిలో ఓ హోటల్ లోని గదిలో ఆకాంక్ష ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం రాత్రి షూటింగ్ నుంచి వచ్చిన ఆకాంక్ష సారనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమేంద్ర హోటల్ కు చేరుకుంది. ఆదివారం హోటల్ గదిలో ఉరికి వేలాడుతూ కనిపించగా.. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆకాంక్ష దూబే 1994, అక్టోబర్ 21న యూపీలోని మీర్జాపూర్ లో జన్మించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉండే ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కాగా.. బలవన్మరణానికి ముందు ఆకాంక్ష స్వయంగా ఓ వీడియో సాంగ్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో సాంగ్లో ఆకాంక్ష భోజ్పురి సూపర్స్టార్ పవన్ సింగ్తో కలిసి నటించింది. భోజ్పురి పరిశ్రమలో రాకేష్ మిశ్రా మ్యూజిక్ వీడియో ‘తు జవాన్ హమ్ లైకా’తో నటిగా కెరీర్ ను ప్రారంభించింది. తర్వాత.. ఆకాంక్ష ప్రతి భోజ్పురి స్టార్తో బుల్లెట్ పై జీజా, కార్వతి వంటి అనేక భోజ్పురి మ్యూజిక్ వీడియోల్లో పని చేసింది. భోజ్పురిలో ముజ్సే షాదీ కరోగి, వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్ వంటి చిత్రాల్లో నటించింది. కాగా.. ఆమె సమర్ సింగ్ అనే నటుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు సమాచారం. |
https://www.telugupost.com/movie-news/is-comedy-ok-for-akhil-165319/ | అఖిల్ అక్కినేని మొదటి సినిమాకే మాస్ హీరో అవుదామని కలలు కన్నాడు. తర్వాత రెండు సినిమాలు చేసినా కనీసం క్లాస్ హీరో కూడా అవ్వలేదు. అఖిల్, మిస్టర్ మజ్ను, హలో వరసగా మూడు ప్లాప్స్ అయ్యాక ఇప్పుడు ప్లాప్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా చేస్తున్నాడు. హీరోయిన్ పూజ హెగ్డే కున్న క్రేజ్ వలన ఈ బ్యాచిలర్ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. లేదంటే అఖిల్ నాలుగో సినిమా కొనే బయ్యర్లే కరువయ్యేవారే. ఆ విషయం అలా ఉంటే.. తాజాగా అఖిల్ కామెడీ దర్శకుడితో సినిమా కి కమిట్ అవుతున్నాడని టాక్ వినబడుతుంది. యావరేజ్ అయినా, హిట్ అయినా ఇప్పటివరకు అపజయమే ఎరగని అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 స్క్రిప్ట్ రాసుకుని వెంకీ – వరుణ్ కోసం wait చెయ్యాలో మధ్యలో మరో మూవీ మొదలు పెట్టాలో తెలియక తికమలో ఉన్నాడు. మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసాక అనిల్ రావిపూడి ఎఫ్ 3 కథ మీదే కూర్చున్నాడు. కానీ వరుణ్ – వెంకీ డేట్స్ ఇవ్వాలంటే మరో ఏడాది ఖచ్చితంగా పడుతుంది. ఈలోపు మరో మూవీ ప్లానింగ్ లో అనిల్ వున్నాడట. తాజాగా అక్కినేni యంగ్ హీరో అఖిల్ – అనిల్ రావిపూడి కాంబోలో కామెడీ మూవీ ప్లానింగ్స్ తెర వెనుక జరుగుతున్నాయనే టాక్ వినబడుతుంది. అనిల్ రావిపూడి ఎప్పటిలాగే దిల్ రాజు బ్యానేర్ లోనే అఖిల్ మూవీ చేస్తాడని..ఇది కూడా కామెడీ ఎంటర్టైనర్ గానే ఉండబోతుందని సోషల్ మీడియా టాక్. అయితే అఖిల్ కి కామెడీ సెట్ అవుతుందా? లేదా అని అక్కినేని అభిమానులు కంగారు పడుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/అంగరంగ-వైభవంగా-ఎన్టీయార-64931/ | ప్రతి తెలుగువాడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం "ఎన్టీయార్" బయోపిక్. నందమూరి నటవారసుడు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీయార్ గా టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం హైద్రాబాద్ లోని రామకృష్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఎన్.బి.కె స్టూడియోస్ పతాకంపై వారాహి చలన చిత్రం మరియు విబ్రి మీడియా సంయుక్త సమర్పణలో తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్టీయార్ నట ప్రస్థానంలో అత్యంత కీలక చిత్రమైన "దానవీరసూర కర్ణ" చిత్రంలోని కీలకమైన సన్నివేశాన్ని బాలయ్య అదే గెటప్ లో రీక్రియేట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.బాలయ్యపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దేశ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు క్లాప్ కొట్టగా.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. నందమూరి మోహనకృష్ణ స్క్రిప్ట్ ను చిత్రబృందానికి అందించారు.ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. "ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భం. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా తెలుగుదనానికి నిండుదనాన్ని, తెలుగువారికి ఒక గుర్తింపు, తెలుగు తేజాన్ని ప్రపంచానికి చాటిజెప్పి, తెలుగు పౌరుషాన్ని దేశ రాజకీయ ముఖచిత్రంలో వెలిగించి, తాను ఒక వెలుగు వెలిగి, ఆ వెలుగులో తెలుగువారందరికీ అనేక సందేశాలు, మేలు చేసిన స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి చరిత్రను సినిమాగా తీయడం అనేది తెలుగువారికి గర్వకారణం. నిజానికి ఉపరాష్ట్రపతిగా నేను ఇటువంటి ప్రారంభోత్సవాలకు రాకూడదు.. కానీ ఎన్టీయార్ మీద అపారమైన గౌరవంతో నేను ఈ వేడుకకు విచ్చేశాను. మార్చి 29 అనేది ఎన్టీయార్ గారికి చాలా ప్రత్యేకమైన రోజు. చరిత్రలో నిలిచిపోవడంతోపాటు ఆ చరిత్రను అందరికీ తెలియజేయడం చాలా ఉత్తమం. తండ్రి జీవనపాత్రను కుమారుడు పోషించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. మనుషుల్ని ప్రభావితం చేయగల ఈ సినిమా అనే మాధ్యమం ద్వారా ఎన్టీయార్ చరిత్రను ప్రపంచానికి తెలియజేయడం కోసం బాలకృష్ణ నడుం కట్టడం ప్రశంసనీయం. రామారావుగారు నటనలో, రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు కానీ.. ఎన్టీయార్ ఆహార్యం చూస్తే చాలనిపిస్తుంది. మనం రామారావుగారికి ట్రిబ్యూట్ ఇవ్వాలంటే అందరూ తెలుగులో మాట్లాడాలి, తెలుగు సంస్కృతిని ఆచరించాలి. నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలకృష్ణకు అభినందనలు. రామారావుగారి అభిమాని కానివాడు తెలుగు చిత్రసీమలో లేడు. ఈ సినిమా విజయవంతం అవ్వాలని, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సినిమా రూపొందాలని కోరుకొంటున్నాను" అన్నారు.రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. "ఎన్నో జన్మల పుణ్యం చేసుకొంటే తప్ప ఎన్టీయార్ గారితో సినిమా తీసే అవకాశం రాదు. ఆయన బయోపిక్ లో నటిస్తున్న బాలయ్య, సినిమా తీస్తున్న తేజ కూడా అదృష్టవంతులే. ఈ సినిమాలో ఒక్క శాట్ అయినా డైరెక్ట్ చేసే అవకాశం నాకు కావాలి" అన్నారు.అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "తెలుగువారికి ప్రత్యేకమైన గుర్తింపు లేని సమయంలో తెలుగు, తమిళులు అందరూ "మదరాసీలుగా"గా పిలవబడుతున్న మనకు.. "మేం తెలుగువాళ్లం" అని గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీయార్. అటువంటి మహత్తరమైన చరిత్ర సృష్టించిన రామారావుగారి చరిత్రను తెరమీదకు తీసుకురావడమే పెద్ద సాహసం. ఆ సాహసం చేయగల దమ్మున్న మనిషి బాలకృష్ణ మాత్రమే. రెండు సంవత్సరాల క్రితం ఈ సినిమా కోప్రొడ్యూసర్ విష్ణు "ఎన్టీయార్" కథ చెప్పినప్పుడు ఈ కథ బాలయ్య తప్ప ఎవరూ చేయలేరన్నాను. ఈనాడు అది నిజం కావడం ఆనందంగా ఉంది" అన్నారు.చిత్ర దర్శకులు తేజ మాట్లాడుతూ.. "రామారావుగారికి నేను పెద్ద అభిమానిని, ఆయన బయోపిక్ కి దర్శకత్వం వహించే అవకాశం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. మొదట నాకీ అవకాశం వచ్చినప్పుడు "నేను దీనికి కరెక్ట్ కాదేమో" అన్నాను. కానీ విష్ణు మాత్రం "మీరే కరెక్ట్, మీరు చేయండి" అన్నారు. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఎన్టీయార్ గారి సినిమాకి దర్శకత్వం వహించే అద్భుతావకాశం రాదు. ఈ సినిమాని బాగా తీయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది కథ కాదు చరిత్ర, ఆ చరిత్రను ఆరు సినిమాగా తీయొచ్చు. దసరాకి సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. "మా "ఎన్టీయార్" చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసినవారందరికీ పేరుపేరునా కృతజ్నతలు తెలియజేసుకొంటున్నాను. ఈమధ్య ఎవర్ని పడితే వారిని మహానుభావులంటున్నారు. కానీ.. నా దృష్టిలో ఎన్టీయార్ గారు మాత్రమే మహానుభావులు. నిన్న జరిగింది ఈరోజు మర్చిపోయే ఈరోజుల్లో ఎన్టీయార్ జీవిత చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాలనుకోవాలని విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి ముందుకు రావడం అనేది అభినందనీయం. అయితే... ఆయన సినిమాలో మా కుటుంబ సభ్యులందరూ ఉండాలనుకొని కొంత సమయం తీసుకొని ఈ చిత్రాన్ని నేడు ప్రారంభించాం. ఆయన జీవితం మొత్తం సినిమాగా తీయాలంటే అయిదారు గంటలు వస్తుంది. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా వస్తుంది. మార్చి 29న "పాతాళభైరవి" చిత్రాన్ని రీమాస్టర్ చేసి ప్రింట్స్ పెంచడం, "లవకుశ, దేశోద్దారకులు" రిలీజ్ అవ్వడమే కాక "తెలుగుదేశం" పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడం అదే రోజున "ఎన్టీయార్" బయోపిక్ ను నా పరిచయ చిత్రమైన "తాతమ్మ కల"ను నిర్మించిన రామకృష్ణ స్టూడియోస్ లోనే ఈ చిత్రాన్ని ప్రారంభించడం, ఆ చిత్రంలో నేను నాన్నగారి పాత్ర పోషించడం అనేది విశేషం" అన్నారు.చిత్ర సహనిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి మాట్లాడుతూ.. "ఎన్టీయార్ బయోపిక్ లో నేను భాగస్వామి కావడం ఎన్నో జన్మల ప్రతిఫలం. ఎన్టీయార్ గారి "దానవీరసూర కర్ణ" చిత్రంలో మూడు పాత్రలు పోషించడమే కాక ఆ చిత్రానికి దర్శకత్వం కూడా వహించి చరిత్ర సృష్టించడమే కాక సాంకేతికత అంతగా అందుబాటులో లేని సమయంలో 44 రోజుల్లో ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. అదే తరహాలో బాలయ్య "గౌతమీపుత్ర శాతకర్ణి" లాంటి చిత్రాన్ని 81 రోజుల్లో పూర్తి చేశారు. కేవలం కథ కోసమే దాదాపు సంవత్సరన్నర కాలం వెచ్చించాం. దసరాకి "ఎన్టీయార్" బయోపిక్ తో మీ ముందుకు వస్తున్నాం" అన్నారు.సీనియర్ నటీమణి జమున మాట్లాడుతూ.. ""అక్బర్ సలీం అనార్కలీ"... |
https://www.telugupost.com/movie-news/big-boss-telugu-season-3-winner-rahul-sipligunj-bought-a-benz-car-144557/ | బిగ్ బాస్ హౌస్ నుండి విన్నర్ గా బయటికొచ్చేసరికి రాహుల్ కి ఇల్లుకూడా లేదని హౌస్ లోనే చాలాసార్లు చెప్పాడు. విన్నర్ అయితేమంచి ప్లాట్ కొని తల్లితండ్రులకి గిఫ్ట్ ఇస్తానని చెప్పేవాడు. సో బిగ్ బాస్ విన్నరయ్యాక రాహుల్ ఆ ప్రైజ్ మనీ తో సొంత ఇల్లు కొంటాడేమో అనుకున్నారు అంతా.. అయితే బిగ్ బాస్ విన్నర్ గా బయటికొచ్చిన రాహుల్ కి క్రేజ్ ఓ లెక్కలో ఉంది… సింగర్ గా కొత్త భారీబడ్జెట్ సినిమాల్లో పాటలు పడుతున్న రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ సోషల్ మీడియాలో ను ఎక్కువైంది. గత బిగ్ బాస్ విన్నర్స్ కి రాని క్రేజ్ ని మూడో సీజన్ విజేత రాహుల్ సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా రాహుల్ కెరీర్ పరుగులుపెడుతుంది.. దానికి తగ్గట్టే మనోడు డ్రెస్సింగ్ స్టైల్ అన్ని మార్చెయ్యడమే కాదు. ఓ బెంజ్ కారు కొని సోషల్ మీడియాలో ఆ కారు ఫొటోస్ తో పాటుగా నా బేబీ అంటూ ఆ కారుని అభిమనులకు పరిచయం చేసాడు. అయితే రాహుల్ తల్లితండ్రులకి ప్లాట్ కొనిస్తా అని .. ఇల్లు కొనడం మానేసి బెంజ్ కారు కొన్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. గత రెండు రోజులుగా రాహుల్ కొత్త కారు కొన్నావ్… ప్లాట్ ఎందుకు కొనలేదంటూ నెటిజెన్స్ రాహుల్ ని ప్రశ్నిస్తున్నారు. అయితే రాహుల్ సిప్లిగంజ్ మాత్రం తాను ఇల్లు కొన్నాకే కారు కొన్నా అని.. అయితే కొన్న ప్లాట్ చేతికి రావడానికి 7 నెలల సమయం పడుతుంది అని.. ఈలోపు బెంజ్ కారు కొనుకున్నా అంటూ చెబుతున్నాడు. ఆల్రెడీ ఫ్లాట్ తీసేసుకున్నాను .. అది చేతికి రావడానికి ఏడు నెలలు పడుతుంది. ఈలోగా కారుకి కూడా గాలమేశాను అంటూ ట్వీట్ ఏసాడు . |
https://www.telugupost.com/movie-news/prabhas-rejected-a-role-in-padmavat-84455/ | బాహుబలితో బహు పాపులర్ అయిన ప్రభాస్ ప్రస్తుతం మరో బిగ్ ప్రాజెక్ట్ అయినా సాహో సినిమాలో నటిస్తున్నాడు. గత ఏడాది ప్రారంభమైన సాహో సినిమా ఈ ఏడాది చివరి నాటికీ కూడా విడుదలయ్యే ఛాన్స్ అయితే కనబడడం లేదు. ప్రస్తుతం షూటింగ్ ప్రాసెస్ లో ఉన్న సాహో సినిమా భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ వారు దేశంలోని పలు భాషల్లో నిర్మిస్తున్నారు బాహుబలి తో వరల్డ్ వైడ్ గా పేరు సంపాదించినా ప్రభాస్ సాహో చిత్రంపై అందరిలోనూ అమితాసక్తి ఉంది. అందుకే సాహో సినిమాని కూడా ఇండియా వైడ్ గా విడుదల చెయ్యడానికి భారీ ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.అయితే బాహుబలి టైం లోనే ప్రభాస్ కి బాలీవుడ్ లో ఒక బిగ్ ప్రాజెక్ట్ లో ఆఫర్ రావడం... దానిని ప్రభాస్ రిజెక్ట్ చెయ్యడం జరిగిందనే టాక్ ఒకటి ఇప్పుడు వినబడుతుంది. అది కూడా సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన పద్మవత్ చిత్రంలో అనేది టాక్. పద్మవత్ చిత్రంలో పద్మావతికి భర్తగా నటించిన షాహిద్ కపూర్ ప్లే చేసిన మహారవల్ రతన్ సింగ్ పాత్రకి దర్శకుడు సంజయ్ లీల బన్సాలి ప్రభాస్ ని సంప్రదించగా ప్రభాస్ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ల కాంబోలో వచ్చిన పద్మవత్ చిత్రం ఎన్ని కాంట్రవర్సీలతో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే ప్రభాస్ ఈ చిత్రాన్ని ఎందుకు రిజెక్ట్ చేసాడో గాని... ఒక చారిత్రాత్మక చిత్రంలో నటించే ఛాన్స్ మాత్రం మిస్ చేసుకున్నాడనే చెప్పాలి. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఫిలిం లో చెయ్యడం అంటే మామలు విషయం కాదు. కానీ ప్రభాస్ మాత్రం షాహిద్ చేసిన మహా రావల్ రతన్ సింగ్ రోల్ కి పెద్దగా పేరుండదని చెయ్యలేదో.. లేదంటే కాల్షీట్స్ లేక చెయ్యలేదో కానీ మంచి ఆఫర్ ని మాత్రం మిస్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇప్పట్లో లేకపోయినా.. సాహో తర్వాత పక్కగా బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ తో కలిసి ఒక మూవీ చేస్తాడనేది మాత్రం తెలిసిన విషయమే. |
https://www.telugupost.com/crime/bengaluru-youth-kills-girlfriend-at-birthday-party-for-not-showing-her-whatsapp-chats-to-him-1472105 | వాళ్లిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి ఇళ్లలో పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఉద్యోగ రీత్యా ఇద్దరూ బెంగళూరులో ఉంటున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 14) ప్రేయసి పుట్టినరోజును ఘనంగా చేసిన అతను.. ఆమె కేక్ ను కట్ చేసిన కత్తితోనే గొంతు కోసి హతమార్చాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిందీ దారుణ ఘటన.వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన నవ్య- ప్రశాంత్ లు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి ఇళ్లలోనూ పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేదు. అయినా సరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగ రీత్యా ఇద్దరూ బెంగళూరులో ఉంటున్నారు. శుక్రవారం నవ్య బర్త్ డేను ఇద్దరూ ఘనంగా జరుపుకున్నారు. నవ్య, ప్రశాంత్ ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. ఇంతలో నవ్యకు ఓ కాల్ వచ్చింది. కాసేపు మాట్లాడి పెట్టేశాక వాట్సాప్ లో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఎవరితో ఇంతసేపు చాట్ చేస్తున్నావ్ అని ప్రశాంత్ అడిగినా చెప్పలేదు.ముఖం కడుక్కుని వస్తానని బాత్రూంకు వెళ్లిన నవ్య.. లోపల వాట్సాప్ చాట్ చేస్తూ ఉండిపోయింది. దీంతో మండిపడ్డ ప్రశాంత్.. చాట్ వివరాలు చూపెట్టాలని నిలదీశాడు. వాట్సాప్ లో చాటింగ్ తన వ్యక్తిగత అంశమని, అది చూపించేది లేదని నవ్య తెగేసి చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదైంది. కోపంతో ఊగిపోయిన ప్రశాంత్ కేక్ కోసిన కత్తితో నవ్యపై దాడి చేశాడు. మెడపై విచక్షణారహితంగా పొడవడంతో నవ్య అక్కడికక్కడే చనిపోయింది. గంటల తరబడి మృతదేహం పక్కనే కూర్చున్న ప్రశాంత్.. తొలుత శవాన్ని మాయం చేయాలని భావించాడు. తర్వాత ఆ ఆలోచనను విరమించుకుని నేరుగా రాజగోపాల్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయి.. జరిగిందంతా పోలీసులకు వివరించాడు. తన ప్రియురాలిని చంపేశానంటూ కత్తిని పోలీసులకు అప్పగించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులో పడి ఉన్న నవ్య డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు. |
https://www.telugupost.com/movie-news/బాబాయ్-కోసం-త్యాగం-చేస్త-38590/ | సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985 'చిత్రం సరవేగంగానే షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. మొన్నామధ్య వేసవి ఎండలు అధికంగా ఉండడంతో షూటింగ్ కొన్ని రోజులు వాయిదా వేయడం, ఇంకా వేరే కారణాలతో ఈ చిత్రం దసరాకి రావాల్సిందల్లా వచ్చే ఏడాది సంక్రాతి బరిలోకి వెళ్ళిపోయింది. ఇదే విషయాన్నీ రంగస్థలం టైటిల్ ఎనౌన్సమెంట్ తో పాటే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రం సంక్రాంతికన్నా ముందే వచ్చేస్తుందని ప్రచారం మొదలైంది.అయితే ఇలా రామ్ చరణ్ రంగస్థలం సంక్రాతి కన్నా ముందుకు జరగడానికి కారణం ఉందట. అదేమిటంటే చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాబోలో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పుడు ఈ దసరాకి విడుదలవుతుంది అని అన్నారు. కానీ ఈ చిత్రం విడుదల తీరుపై చాలా కన్ఫ్యూషన్ నెలకొని ఉంది. అసలు షూటింగ్ మొదలుపెట్టుకుని ఇన్ని రోజులైనా ఇప్పటికి టైటిల్ పెట్టలేదు సరి కదా కనీసం ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన చిన్న అప్ డేట్ కూడా మీడియాలో రాలేదు. అంటే ఈ చిత్రం ఖచ్చితంగా దసరాకు రావడంలేదని అంటున్నారు.అయితే పవన్ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికే విడుదల చెయ్యాలని మేకర్స్ తోపాటు డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నవేళ చరణ్ తన సినిమాని సంక్రాతి బరినుండి తప్పించి డిసెంబర్ లో విడుదల చెయ్యాలని భావిస్తున్నాడట. అందుకే రంగస్థలం ని త్వరిత గతిన పూర్తి చేసి డిసెంబర్ లో క్రిష్టమస్ నాటికల్లా విడుదల చేసేసి సంక్రాతి సీజన్ ని బాబాయ్ కోసం వదిలెయ్యాలనే నిర్ణయానికి చరణ్ వచ్చాడంటున్నారు. మరి రంగస్థలం హీరోయిన్ సమంత కూడా పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకోకుండా వెంటనే షూటింగ్స్ లో జాయిన్ అవుతానని చెప్పేసింది. సో దీన్ని బట్టి చరణ్ డిసెంబర్ నే పక్కా చేస్తున్నాడనిపిస్తుంది. కానీ ఈ విషయమై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చెయ్యాల్సి వుంది. |
https://www.telugupost.com/movie-news/that-car-is-not-belongs-to-prabhas-says-pr-team-1365368 | హైదరాబాద్ : ట్రాఫిక్ పోలీసులు నాసిరకం నంబర్ ప్లేట్లు, బ్లాక్ ఫిల్మ్లపై స్పెషల్ డ్రైవ్ను చేపట్టారు. గత రెండు వారాల్లో 1,000 కేసులు బుక్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నందున బ్లాక్ ఫిల్మ్ను తొలగించాలని పోలీసులు కారు యజమానులను కోరారు. అందులో భాగంగా పలువురు సెలెబ్రెటీలకు చెందిన కార్లకు ఫైన్స్ వేస్తూ ఉన్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన కథనాలు వైరల్ అవుతూనే ఉన్నాయి.తాజాగా మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు నటుడు ప్రభాస్ కారుపై హైదరాబాద్ నగర పోలీసులు శనివారం కేసు నమోదు చేసి జరిమానా విధించారనే వార్తలు వచ్చాయి.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో నంబర్ ప్లేట్, బ్లాక్ ఫిల్మ్ కారణంగా కారును ఆపారని వార్తలు వచ్చాయి. సబ్ ఇన్ స్పెక్టర్ కారుకు రూ.1600 జరిమానా విధించినట్లు వార్తలు వచ్చాయి. వాహనంలో ప్రభాస్ లేడని తెలిపారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ప్రభాస్ పీఆర్ టీమ్ చెబుతోంది.బ్లాక్ ఫిలింతో పాటు కాలం చెల్లిన ఎంపీ స్టిక్కర్ను వేసుకున్నందుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ. 1600 జరిమానా విధించారనే వార్తలు నిజం కాదని ప్రభాస్ పీఆర్ టీం స్పష్టతనిచ్చింది. ఈ ఫేక్ న్యూస్పై ప్రభాస్ వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు. కారు ప్రభాస్ పేరు మీద లేదని, ఆయన బంధువు నరసింహరాజు పేరు మీద ఉందంటూ దానికి సంబంధించిన పత్రాలను సమర్పించారు. ఆ కారుకి, ప్రభాస్కి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేశారు. దయచేసి గమనించగలరని పీఆర్ టీం చెప్పుకొచ్చింది. |
https://www.telugupost.com/movie-news/గొప్పలు-చెప్పుకునే-అవకాశ-32026/ | చిత్ర పరిశ్రమలో హిపోక్రసీ రాజ్యమేలుతుంటుందని అందరికి తెలిసిన సత్యమే. ఇక్కడ హోదా, స్థాయి లాంటివి అన్ని అవకాశం ముందు చిన్నవిగానే కనిపిస్తుంటాయి. ఎవరి కెరీర్ లలో వాళ్ళు బిజీగా వుండే స్టార్స్ కూడా సమకాలీన ట్రెండ్ సెట్టర్ సినిమాలని, నటీనటుల్ని పొగుడుతూ వారితో కానీ ఆ సినిమాతో కానీ ఎలాంటి అనుబంధం లేనప్పటికీ వారికి ఆ సదరు నటీనటులకు మధ్య అవినాభావ సంబంధం ఉందని, తన మిత్రులు ఇంత కీర్తి ఘడించటం ఆనందంగా ఉందని చెప్తూ గొప్పలు పోతూ ట్రెండీ స్టార్స్ అభిమానుల బలాన్ని గెలుచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం ట్రెండ్ మొత్తాన్ని మార్చేసిన చిత్రం బాహుబలి ది కంక్లూషన్. ఈ చిత్రం గురించి చిత్ర సీమకి చెందిన ప్రముఖులందరూ తమ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందించారు. కాగా బాహుబలి ది కంక్లూషన్ లో కథానాయకుడైన ప్రభాస్ కి సర్వత్రా క్రేజ్ పెరిగిపోగా ఆయనతో గతంలో ఏ నిరంజన్ చిత్రంలో నటించిన కంగనా రనౌత్ మాత్రం తన గత పరిచయం వాడి ప్రభాస్ క్రేజ్ ని తన ఇమేజ్ పెంచుకోవటానికి ఆపాదించుకునే ప్రయత్నాలు చెయ్యలేదు. తాజాగా కంగనా రనౌత్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ ప్రస్తావన తెస్తూ యాంకర్ ప్రభాస్ తో మీ అనుబంధం ఎలా వుంది అని ప్రశ్నించగా, ఏ నిరంజన్ సెట్స్ లో మొదలైన తమ పరిచయం అదే చిత్రం సెట్స్ కి మాత్రమే పరిమితం ఐయ్యిందని ఆ తరువాత తమ మధ్య పరస్పర పలకరింపులు కూడా ఏమి జరగలేదని నిజాయితీగా చెప్పి మరొక సారి తన స్వభావం చాటుకుంది కంగనా రనౌత్. |
https://www.telugupost.com/movie-news/rgv-lakshmis-ntr-movie-release-112973/ | సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తీసుకున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ లైఫ్ లోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇచ్చిన తరువాత నందమూరి ఫామిలీ మధ్య వచ్చిన గ్యాప్, ఎన్టీఆర్ రాజకీయాల్లో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంత బాగానే ఉన్నా ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది టెన్షన్ గా మారింది. ఎన్టీఆర్ బయోపిక్ నుండి వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు రెండూ డిజాస్టర్స్ అవ్వడంతో ఈ సినిమాను కొన్ని ఏరియాస్ లో కొనడానికి కొంతమంది బయ్యర్లు మొగ్గు చూపటం లేదని అంతర్గత సమాచారం. ట్రైలర్ బాగున్నప్పటికీ స్టోరీ మొత్తం రివీల్ చేసేశారని వారి వాదన. రిలీజ్ డేట్ మార్చాలని… అయితే మరో వైపు కొనుగోలు చేసిన కొన్ని ఏరియాల బయ్యర్లు.. రిలీజ్ డేట్ మార్చమని వర్మని రిక్వెస్ట్ చేసినట్టు టాక్. ఈ చిత్రం రిలీజ్ కి ఒక రోజు ముందు అల్లు శిరీష్ ఏబీసీడీ, సువర్ణ సుందరి, ప్రేమ కథా చిత్రం 2 లాంటి మీడియం రేంజ్ చిత్రాలు విడుదల అవుతున్నాయి. అలానే లక్ష్మీస్ ఎన్టీఆర్ కి వారం ముందుగా ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ సినిమా రానుంది. ఇన్ని సినిమాల మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా రిలీజ్ అయితే థియేటర్స్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని భావించిన బయ్యర్లు రిలీజ్ డేట్ ను మార్చవలసిందిగా కోరారట. అయితే వర్మ మాత్రం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు టాక్. |
https://www.telugupost.com/telangana/with-the-fight-between-brs-and-congress-in-telangana-the-bharatiya-janata-party-is-at-a-loss-as-to-what-to-do-1549223 | తెలంగాణలో బీజేపీ ఇప్పుడు చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పోరు జరుగుతుండటంతో భారతీయ జనతా పార్టీ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ లు జనంలోకి వెళుతున్నాయి. కానీ బీజేపీకి మాత్రం ఎలాంటి అజెండా లేకుండా పోయింది. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ప్రజల్లోకి వెళుతూ పార్టీలను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు హడావిడిచేస్తున్నాయి. కానీ బీజేపీకి మాత్రం ఏం చేయాలన్న దానిపై ఒక స్పష్టత లేదు. స్థానికసంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బీజేపీ నేతలు ఇలా వ్యవహరిస్తుండటం కొంత క్యాడర్ ను అయోమయంలోకి నెడుతుంది.అజెండా దొరకక...రుణమాఫీ అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రైతులకు ఇచ్చిన మాట మేరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. విడతల వారీగా మూడు సార్లు రుణమాఫీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు పదిహేనో తేదీలోపు కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చేసింది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం రుణమాఫీ పూర్తిగా జరగలేదంటూ నియోజకవర్గాల స్థాయిలో ఆందోళనలకు దిగింది. గత ఎన్నికల్లో గ్రామాల్లో పట్టుకోల్పోయిన కారు పార్టీ రైతుల మద్దతుతో మళ్లీ బలం పెంచుకోవాలని చూస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దయెత్తున సభను పెట్టి రాహుల్ ను పిలిచి రుణమాఫీపై వివరణ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. ఆ రెండు పార్టీలూ...ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ లు పోటాపోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి వెళుతున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఇటు హస్తం పార్టీ అటు కారు పార్టీ అడుగులు వేస్తుండగా కమలం పార్టీ మాత్రం ఎలా వెళ్లాలన్న దానిపై రూట్ మ్యాప్ దొరకడం లేదు. మీడియా సమావేశాలకు తప్ప క్షేత్రస్థాయిలో ఆందోళనలకు అది దిగడం లేదు. కేంద్రంలో అధికారంలోకి మూడో సారి వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్న బీజేపీ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో కార్యకర్తలు దిక్కులు చూస్తున్నారు. ఏ కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి వెళ్లాలో వారికే క్లారిటీ లేదు. దీంతో పాటు నాయకత్వంలో ఇబ్బందులు కూడా పార్టీని ఈ పరిస్థితిని తెచ్చి పెట్టాయి. ఇద్దరు మంత్రులున్నా...తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు. ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు. అయినా ఫలితం లేదు. ఎవరిది వారే యమునా తీరే అన్న చందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా తెలంగాణ గురించి పట్టించుకోవడమే మానేసినట్లు తెలిసింది. కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుందని గతకొద్దికాలంగా జరుగుతున్న ప్రచారం కార్యరూపం దాల్చలేదు. హైడ్రా కూల్చివేతలపై కూడా నేతల మధ్య కో-ఆర్డినేషన్ లేకపోవడంతో నవ్వుల పాలవుతున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ హైడ్రా కూల్చివేతలను తప్పుపడితే, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమర్థించడం చూస్తుంటే సమన్వయం నేతల మధ్య ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. |
https://www.telugupost.com/movie-news/rrr-movie-updates-112758/ | గత ఏడాది నవంబర్ లో అతి భారీ అంచనాల మధ్య అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా మొదలైన #RRR షూటింగ్ ఇప్పుడు జెట్ స్పీడుతో సాగుతుంది. మొదటి షెడ్యూల్ తర్వాత జక్కన్న కాస్త గ్యాప్ తీసుకుని కొడుకు కార్తికేయ పెళ్లి చేసేసి.. మళ్లీ జనవరి 20 కల్లా రామ్ చరణ్ తో సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టేసాడు. అయితే మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన రాజమౌళి.. సెకండ్ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై సోలో సీన్స్ ని తెరకెక్కించాడు. సినిమా 1947 బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కుతుండడంతో ఆ కాలం నాటి సెట్స్ కి రాజమౌళి అధిక ప్రాధాన్యతనిస్తున్నాడు. హీరోయిన్లపై నో క్లారిటీ ఇక సెకండ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ కి గ్యాప్ ఇచ్చిన రాజమౌళి మూడో షెడ్యూల్ లో మాత్రం రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ తోనూ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసాడట. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ ని కాస్త చిన్నవిగా చేసిన ఆయన మూడో షెడ్యూల్ ని మాత్రం 40 రోజుల పాటు కేరళలో చిత్రీకరిస్తాడట. #RRR ఇప్పుడు మొదటిసారి హైదరాబాద్ బోర్డర్ దాటి కేరళ వెళుతుంది. ఇక కేరళలోని కొన్ని ప్రత్యేకమైన లొకేషన్లలో #RRR సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు తీయబోతున్నాడట. ఇక ఈ సినిమాలో ప్రధానంగా డైలాగ్స్ హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ పలికే డైలాగ్స్ చాలా కొత్తగా ఉంటాయట. లుక్ వదులుతాడా..? హీరోయిన్స్ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న రాజమౌళి మూడో షెడ్యూల్ నాటికి హీరోయిన్స్ ని రివీల్ చేస్తాడో లేదో అనే క్యూరియాసిటీ మాత్రం ప్రేక్షకుల్లో పోలేదు. ఇక ఎన్టీఆర్, చరణ్ కలిసి ఒకే షెడ్యూల్ లో పాల్గొంటే మెగా, నందమూరి ఫాన్స్ కి పండగే. ఇకపోతే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మేకోవర్ అవుతున్న విషయం కళ్యాణ్ రామ్ 118 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు బయటపడింది. కాస్త లావుగా, గుబురు గెడ్డంతో ఎన్టీఆర్ న్యూ లుక్ లో కనిపించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నాడట. మొదటి నుండి రామ్ చరణ్ కూడా కొత్త హెయిర్ స్టైల్ నార్మల్ లుక్ లో, ఎన్టీఆర్ న్యూ లుక్ లోను కనిపిస్తారని చెబుతున్నారు. మరి రాజమౌళి సినిమాలు మొదలు పెట్టాక ఆ సినిమాలోని కీలక పాత్రలు చేసే నటుల పుట్టిన రోజుల సందర్భంగా వారి లుక్స్ వదలడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ నెలలో పుట్టినరోజు జరుపుకోబోయే #RRR హీరో రామ్ చరణ్ కి రాజమౌళి ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలి. |
https://www.telugupost.com/top-stories/telangana-brs-to-announce-first-list-of-candidates-today-1490710 | తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ మేరకు గులాబీ అధినేత కేసీఆర్ అన్నినియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు పరిశీలించి ఎన్నో వడపోతలు చేసి తొలి జాబితాను ఈ మధ్యాహ్నం విడుదల చేయనున్నారు. దీంతో నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎలక్షన్లో గులాబీ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేయనున్నారో తేలిపోనుంది. జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఎవరెవరికి సీటు ఊడుతుంది..? వస్తుందా? అనేది తేలిపోనుంది. ప్రస్తుతం తెలంగాణ ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అధికారులతో పాటు గతంలో పనిచేసిన అధికారులకు సైతం ఎమ్మెల్యే అభ్యర్థులు వందలసార్లు కాల్ చేస్తున్నారు. ఈ సారి టికెట్ ఊడుతుందా..? వస్తుందా..? అనే సందిగ్ధంలో ఉన్నారు ఆశావాహులు.ఈ సారి జాబితాలో ఎవరెవరు పేర్లు ఉంటాయన్నది తెలుసుకుంటున్నారట. అయితే ఈ పొలిటికల్ ఫోన్లు భరించలేక కొంత మంది ఇంటెలిజెన్స్ పోలీసులు తమ ఫోన్లను స్వీచ్ఛాఫ్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. కేసీఆర్ ఒకేసారి 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న నేపథ్యంలో చాలామంది ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు.. తమ పేరు జాబితాలో ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఇంటలిజెన్స్ వర్గాలకు ఫోన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే గులాబీ బాస్ మాత్రం అన్ని సర్వేల ఆధారంగా, వారి పని తీరు అధారంగా టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చేయించిన ఇంటెలిజెన్స్ సర్వేలో తమ పనితీరు ఏ రకంగా ఉంది.. టికెట్ వస్తుందా లేదా.? అన్న ప్రశ్నలతో నేతలు అధికారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు నేతలు. బీఆర్ఎస్ మొదటి అభ్యర్థుల లిస్టు బయటికి వస్తున్న నేపథ్యంలో రెండు రోజుల నుంచి ఫోన్లు మోత మొగుతున్నాయని పలువురు అధికారులు చెబుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/పవన్-అభిమానులు-గేదెలా-27511/ | పవన్ అభిమానులు గేదెల కంటే ఘోరమని సంచలన కామెంట్లు చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ ట్వీట్ చేశారు. గేదెల కన్నా చర్మం గట్టిగా ఉంటుందని, పవన్ ఫ్యాన్స్ కు అది కూడా ఉండదన్నారు వర్మ. పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు నిన్న అన్ని థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అభిమానులు గుడ్డిగా, మూగగా, వెర్రి భ్రమల్లో ఉండటం వల్ల వాళ్ల నాయకులు కూడా అలానే తయారయ్యారన్నారు వర్మ. పవన్ నటించిన కాటమరాయుడు సినిమా చూడటం కంటే ఓ బూతు సినిమా చూడటం మేలని తనకు ఓ వృధ్దుడు ట్వీట్ చేశారని వర్మ పేర్కొన్నారు. అంతేకాకుండా పవన్ పై వ్యక్తిగత కామెంట్ కూడా చేశారు వర్మ. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కంటే ఓ మంచి సినిమా చేస్తే మంచిదని తనతో ఎవరో చెప్పారని వర్మ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్లపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. బాహుబలి సినిమా ట్రైలర్ చూసైనా అలాంటి మంచి సినిమా చేయాలన్నారు. |
https://www.telugupost.com/movie-news/kajal-agarwal-record-in-instagram-118383/ | తెలుగు హీరోయిన్స్ కు సోషల్ మీడియాలో మాములు క్రేజ్ లేదు. ముఖ్యంగా మన స్టార్ హీరోయిన్స్ కి. ఇప్పుడు వారంతా ఇంస్టాగ్రామ్ పై పడ్డారు. ఇంస్టాగ్రామ్ లో మన టాలీవుడ్ బ్యూటీలలో అందరికంటే ముందు ఉన్నది చక్కనైన చందమామ కాజల్ అగర్వాల్. ఆ తరువాత రకుల్, సమంత ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో కాజల్ ఇప్పుడు ఒక సూపర్ రికార్డ్ నెలకొల్పింది. టాలీవుడ్ హీరోయిన్స్ లో మొదటి సారిగా 10 మిలియన్ ఫాలోయర్లను సాధించింది కాజల్ మాత్రమేనని సమాచారం. సెకెండ్ ఉన్న రకుల్… టాలీవుడే కాదు సౌత్ మొత్తంలో ఏ హీరోయిన్ కీ ఇంస్టాగ్రామ్ లో ఈ రేంజ్ ఫాలోయింగ్ లేదట. అందుకే కాజల్ ను తన ఫ్యాన్స్ ఇంస్టాగ్రామ్ క్వీన్ గా పిలుచుకుంటున్నారు. కాజల్ తరువాత స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ 7.3 మిలియన్ల ఫాలోయర్స్ తో ఉంది. ఇక సమంతకు 6.5 మిలియన్ల ఫాలోయర్లు మాత్రమే ఉన్నారు. తన ఇంస్టా ఫాలోయర్స్ 10 మిలియన్ మార్క్ సాధించిన సందర్భంగా కాజల్ విషెస్ చెప్పింది. ‘‘మీ ప్రేమ.. మీ మద్దతే నా ప్రపంచం. అందరికీ మిలియన్ల కిస్సులు’’ అంటూ పోస్ట్ చేసింది. |
https://www.telugupost.com/movie-news/పవన్-భార్య-మళ్లీ-పెళ్లి-45076/ | బద్రి, జానీ సినిమాలల్లో పవన్ కళ్యాణ్ తో నటించిన రేణు దేశాయ్... ఆ తర్వాత పవన్ తో సహజీవనం చేసి బాబు పుట్టాక పవన్ కళ్యాణ్ ని కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి అయ్యాక వారికి మరొక పాప పుట్టింది. అయితే ఇద్దరు పిల్లలున్న పవన్, రేణు లు అనుకోకుండా విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. పిల్లలిద్దరి బాధ్యతలతో రేణు దేశాయ్ గడుపుతుండగా.. పవన్ మాత్రం మరో ఆమెతో సహజీవనం కొనసాగిస్తున్నాడు. అప్పుడప్పుడు తన పిల్లలదగ్గరికి వెళ్లి వారి ఆలనాపాలనా చూస్తున్నాడు కూడా పవన్.ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే కాకుండా స్వాతంత్ర్య మహిళగా కూడా ఎదిగిన రేణు దేశాయ్.. ఇన్నాళ్లకు బులితెరమీద నీతొనే డాన్స్ చేస్తా అనే ప్రోగ్రాం ద్వారా అభిమానులకు దగ్గర కాబోతుంది. ఈ విజయదశమి సందర్భంగా రేణు దేశాయ్ జడ్జ్ గా వస్తున్న ఈ డాన్స్ షో మొదలైంది. ఈ షో ఓపెనింగ్ రోజున రేణు మంచి డాన్స్ పెరఫార్మెన్సు తో తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసింది. అయితే ఈ షోలో కనబడే ముందు ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేణు దేశాయ్ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. అదేమిటంటే రేణు దేశాయ్ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందట. అసలు గతేడాది వరకు మరో పెళ్లి ఆలోచనే రాలేదని చెబుతున్న రేణు ఇప్పుడు మరో పెళ్లి ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా వివరిస్తుంది. అసలు ఏడాది క్రితం వరకు తనకి పెళ్లి ఆలోచనే లేదు అని.... ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు తనకంటూ ఎవరైనా ఉంటే కొంచెం సహాయంగా ఉంటుందని అనిపించిందని చెబుతుంది. అసలు తనని ఆసుపత్రికి తీసుకెళ్లడం కానీ.... తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి మన అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుందని అనిపించిందని...... తనకి ఒంట్లో బాగలేకపోతే రెండుమూడు సార్లు ఆమె అక్కవచ్చి ఉదయం 3 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలోనే రేణుకి మరో పెళ్లి ఆలోచన వచ్చిందట.అలాంటి సమయంలోనే రేణు మరో పెళ్లి గురించి ఆలోచన మొదలు పెట్టిందట. నా అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుందని...... ఆ ఇన్సిడెంట్కు ముందు నో మ్యారేజ్.. నో లవ్.. నో రిలేషన్ షిప్.. నోమోర్ అనుకున్నా. కానీ ఒంట్లో బాగాలేనప్పటి నుంచి ఆలోచన మారుతోంది.... అంటూ చెప్పిన రేణు ఆ పెళ్లి రాత రాసిపెడితే అవుతుందని.. ఆ టైం ఎప్పుడొస్తుందో చూద్దామని.. తన మరో పెళ్లి నిర్ణయాన్ని ఆ దేవుడికే వదిలేసింది. |
https://www.telugupost.com/movie-news/వరస-చిత్రాలతో-నేచురల్స్-707/ | 'భలే భలే మగాడివోయ్' అనే ఒక్క చిత్రం నాని కెరీర్ను మార్చేసింది. ఆ స్దాయిలో ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలవడంతో నాని రాత్రి రాత్రి నేచురల్ స్టార్గా మారిపోయాడు. కాగా ప్రస్తుతం ఆయన తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. దాని తర్వాత 'ఉయ్యాలజంపాల' ఫేమ్ విరించి వర్మతో ఓ చిత్రం ఒప్పుకున్నాడు. తాజాగా ఆయన మరో చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చాడు. 'భలే మంచి రోజు' తో మంచి టాలెంట్ ఉన్న దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణసంస్ధ భవ్యక్రియేషన్స్ నిర్మించనుంది. తనకు వచ్చిన క్రేజ్ను సద్వినియోగం చేసుకుంటూ బాగా నచ్చిన కథలనే నాని ఎంచుకుంటున్నాడని, తనకు ఎంతో నచ్చితే గానీ ఏ చిత్రానికి ఓకే చెప్పడం లేదని ఫిల్మ్నగర్ వర్గాలు అంటున్నాయి. మరి నాని తన కెరీర్ గ్రాఫ్ను ఎలా పెంచుకుంటాడో? లేదో? చూడాల్సివుంది. |
https://www.telugupost.com/movie-news/release-of-prabhas-role-in-spirit-rebel-star-as-police-in-spirit-1347186 | వరుస పాన్ ఇండియా సినిమాలతో యంగ్ రెబల్ స్టార్, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ బిజీ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలు విడుదలకు రెడీ అవుతుండగా.. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ ని పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యాడు. సలార్ తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఒక్క టైటిల్ తోనే ఫ్యాన్స్ లో అంచనాలను పెంచేసిన ఈ సినిమా గురించి.. దర్శకుడు మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు. ఇప్పుడిదే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది.Also Read : ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన ఆదిపురుష్ నిర్మాత భూషణ్ కుమార్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో స్పిరిట్ లో ప్రభాస్ రోల్ ని రివీల్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ టిపికల్ పోలీస్ కాప్ గా కనిపిస్తాడట. ఇప్పటి వరకూ ప్రభాస్ చేయని రోల్ ఇదే. మొదటిసారి స్పిరిట్ లో పోలీస్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడని ప్రకటించినప్పటి నుంచి నెట్టింట్లో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన హీరో పోలీస్ లుక్ లో ఎలా ఉండబోతున్నాడో చూసేందుకు ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. Also Read : కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ హైకోర్టు.. ప్రత్యక్ష విచారణలు బంద్ |
https://www.telugupost.com/movie-news/బుల్లి-తెర-పై-కూడా-మెగా-స్-33567/ | వెండితెరపై దశాబ్దాల కాలంగా అగ్ర కథానాయకుడి స్థానంలో కొనసాగుతూ తన తరువాతి తరం వారసులు హీరోలుగా చెలామణి అవుతున్న తరుణంలో కూడా వారికి గట్టి పోటీ ఇస్తూ అగ్ర స్థానంలోనే కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని నిరూపిస్తూ ఖైదీ నెం.150 వసూళ్లతో సంచలన రికార్డ్స్ నమోదు చేశారు చిరంజీవి. దాదాపు తొమ్మిది సంవత్సరాల విరామం తరువాత యువ తరం తారలకు పోటీగా, ఒక రీమేక్ కథతో 100 కోట్ల రూపాయల షేర్ మార్క్ దాటినా క్రెడిబిలిటీ మెగా స్టార్ కే దక్కింది. ఖైదీ నెం.150 సృష్టించిన ప్రకంపనలు కేవలం బాక్స్ ఆఫీస్ కి మాత్రమే పరిమితం కాలేదు. తాజాగా మొన్నటి ఆదివారం టెలివిషన్ లో ప్రసారమైనప్పుడు కూడా ప్రేక్షకులు ఖైదీ నెం.150 ని అమితంగా ఆదరించారని టిఆర్పి రేటింగ్స్ రుజువు చేస్తున్నాయి. ఒక వైపు ఐఫా అవార్డ్స్ కార్యక్రమం, మరో వైపు రాజమౌళి ఇంటర్వ్యూ ఇతర చానెల్స్ లో ప్రసారం అవుతున్న సమయంలో కూడా స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ఖైదీ నెం.150 కే అధిక టిఆర్పి రేటింగ్స్ దక్కటం విశేషం. ఆ చిత్రంలో మాస్ ని ఉర్రుతలు ఊగించిన రత్తాలు రత్తాలు, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటలని చిత్ర ప్రసారం సమయంలో రెండు సార్లు ప్రసారం చేయటం కొసమెరుపు. |
https://www.telugupost.com/movie-news/mehreen-own-dubbing-87282/ | టాలీవుడ్ లో ఇటీవలికాలంలో ఎక్కువ శాతం హీరోయిన్స్ తమ సినిమాలకి ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’లో కీర్తీ సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ ఓన్ డబ్బింగ్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ ఏడాది రిలీజ్ అయినా 'మహానటి' సినిమాలోనూ కీర్తి సురేష్ తో పాటు సమంత తమ సొంత గొంతులు వినిపించారు. అలానే ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ’తో పూజా హెగ్డే కూడా సొంత గొంతు వినిపించబోతోంది.లిస్ట్ లో చేరనున్న మెహరీన్..అయితే తాజా సమాచారం ప్రకారం ఈ లిస్ట్ లోకి మరో హీరోయిన్ చేరబోతోంది. బబ్లీ గర్ల్ మెహరీన్ కౌర్ ఓన్ డబ్బింగ్ చెప్పుకోడానికి రెడీ అయిందంట. నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఆరు సినిమాలపైనే చేసింది. కానీ ఏ సినిమాకి డబ్బింగ్ మాత్రం చెప్పుకోలేదు. ప్రస్తుతం ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ‘ఎఫ్2’లో వరుణ్ తేజ్కి జోడీగా నటిస్తుంది.పాత్రకు న్యాయం చేయడానికే...ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశపడుతుందంట. మరి దీనికి మేకర్స్ ఒప్పుకుంటారో? లేదో? చూడాలి. ఇందులో ఆమెది ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అట. దీంతో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటే ఆ పాత్రకు న్యాయం చేయొచ్చని భావిస్తోందట. గతంలో ఈమె చేసిన సినిమాల్లో డైలాగులకు లిప్ సింక్ సరిగా అవ్వదనే విమర్శ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటుందట మెహరీన్. |
https://www.telugupost.com/crime/in-uttar-pradesh-a-class-10th-student-opened-fire-on-a-teacher-who-he-thought-was-angry-with-him-1440423 | ఉత్తర్ప్రదేశ్ లో ఘాతుకం జరిగింది. తనపై కోపడ్డారని భావించిన ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు జరిపాడు. మొత్తం మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్ లోని సీతాపూర్ లో చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని మరొక విద్యార్థితో గొడవ పడ్డాడు. ఇది చూసిన ఉపాధ్యాయుడు ఇద్దరినీ మందలించి సర్ది చెప్పి ఇంటికి పంపించివేశారు.మూడు రౌండ్లు కాల్పులు...దీంతో అందులో ఒక విద్యార్థి తనను మందలించిన టీచర్ పై కోపం పెంచుకున్నాడు. ఒక నాటు తుపాకీని తెచ్చి టీచర్ పై కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లు కాల్పుల జరిపారని ప్రతక్ష్య సాక్షులు చెబుతున్నారు. దీంతో పడిపోయిన టీచర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఉపాధ్యాయుడి ప్రాణాలకు ముప్పు లేదని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం లక్నో ఆసుపత్రిలో ఉపాధ్యాయుడు చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి కాల్పులు జరిపిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. |
https://www.telugupost.com/crime/terrible-accident-happened-in-chhattisgarh-fifteen-people-died-in-this-accident-1529867 | ఛత్తీస్గడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఉగాది వేళ ఈ ప్రమాదం కొన్ని కుటుంబాల్లో విషాదం నింపింది. బస్సు గోతిలోపడటంతో పన్నెండు మంది మరణించారు. మరో పన్నెండు మంది వరకూ గాయపడ్డారు. ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రయివేటు సంస్థ తమ ఉద్యోగులను బస్సులో తీసుకెళుతుండగా నిన్న రాత్రి కేడియా వద్ద బస్సు గోతిలో పడింది. డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను తమ ఇంటికి చేరవేసేందుకు నిన్న రాత్రి బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురయింది.ప్రమాద సమయంలో...ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 30 మంది ఉద్యోగులు ఉన్నారు. రోడ్డు పక్కనే ఉన్న నలభై అడుగుల గోతిలో పడటంతో 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. క్షతగాత్రులకు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఉగాది వేళ ఆ ఉద్యోగుల ఇళ్లలో ఈ ప్రమాదం విషాదం నింపింది. |
https://www.telugupost.com/movie-news/nidhi-agarwal-is-busy-with-new-projects-137242/ | మజ్ను చిత్రం తో యూత్ లుక్స్ ని తన వైపు తిప్పుకుని ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో సౌత్ లో లీడింగ్ స్టార్ గా మారిన నిధి అగర్వాల్ కొత్త ప్రాజెక్టులతో బిజీ అయ్యింది. ఫేమస్ ర్యాప్ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ బాద్షాతో కలిసి కొత్త ఆల్బమ్ చేయబోతోంది ఈ భామ. అద్భుతమైన మ్యూజిక్ అండ్ లిరిక్స్ కి నిధి స్టెప్స్ వేయబోతోంది. బాద్ షా, నిధి కాంబినేషన్ ఇండస్ట్రీని ఊపేస్తుందంటున్నారు ఫ్యాన్స్. ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత నిధి అగర్వాల్ ఫుల్ ఫాంలో ఉంది. సౌత్ లో అన్ని భాషల్లో దర్శకుల చూపు నిధి వైపు చూస్తున్నాయి. కమర్షియల్ చిత్రాలకు ఆప్ట్ హీరోయిన్ గా నిధి ఫేమస్ అయ్యింది. త్వరలో తమిళంలో జయం రవితో కొత్త మూవీ చేస్తుంది. తెలుగు లో ఒక పెద్ద ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసింది. త్వరలోనే ఆ వివరాలు తన ట్విట్టర్ ద్వారా తెలియజేయనుంది నిధి అగర్వాల్. |
https://www.telugupost.com/movie-news/nag-old-look-165795/ | నాగార్జున ఇప్పటికి నవ మన్మధుడే. కొడుకు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ సినిమా రంగంలోకి వచ్చినా నాగ్ అందం ముందు దిగడుపే అనేట్టుగా నాగార్జున మెయింటినెన్స్ ఉంటుంది. ఇప్పటికి యంగ్ లుక్స్ లోనే నాగార్జున కనిపిస్తాడు. చక్కటి ఫిట్నెస్, మంచి శరీరం, అందానికి అందం అన్ని నాగ్ సొంతం. ఆలాంటి నాగార్జునని ముసలివాడిగా చూడడం అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. కానీ బిగ్ బాస్ సీజన్ 4 కోసం నాగార్జున ముసలి గెటప్ ఎత్తాడు. బిగ్ బాస్ సీజన్ 4 మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతుంది. దానికోసం ఓ ప్రోమో షూట్ జరిగింది. నాగార్జున కరోనా సోకకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ లో పాల్గొంటున్నాడు. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో నాగార్జున అందరికి షాకిచ్చాడు. వయసు మళ్ళిన ముసలాడీలా… తెల్లని మీసాలు మరియు నెరిసిన జుట్టుతో.. నాగ్ ముసలివాడైపోయాడు. ఆ ముసలి గెటప్ లో నాగార్జున ఒక స్కోప్ పట్టుకొని కంటెస్టెంట్స్ ను వీక్షిస్తున్నట్టుగా ఆ ప్రోమోలో కనిపిస్తున్నాడు. మరి ఎప్పుడూ అందంగా కనబడే నాగ్ ని అలాంటి ముసలి అవతారంలో చూసి అక్కినేని ఫాన్స్ షాకవుతున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ 4 కోసం నాగార్జున శని, ఆదివారాలు బుల్లితెర మీద సందడి చెయ్యడానికి రాబోతున్నాడు. |
https://www.telugupost.com/movie-news/బాలీవుడ్-సినిమా-హిట్-అయి-58706/ | టాలీవుడ్ లో తక్కువ కాలంలో ఎక్కువ హిట్స్..ఎక్కువ డిజాస్టర్స్ చవి చూసింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కానీ టాలీవుడ్ ఈ మధ్య ఆమెకు అంతగా ఆఫర్స్ ఏమి రావట్లేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పాప ఫోకస్ మొత్తం బాలీవుడ్ మూవీ అయ్యారి సినిమాపైనే వుంది.టాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుందని టాక్ వచ్చినా అవి ఇంకా ఆఫీసియల్ గా బయటికి రాలేదు. అయితే ప్రస్తుతం ఆమె చూపు అయ్యారి సినిమాపైనే ఉంది. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. ఇప్పటికే ఈ ప్రొమోషన్స్ లో బిజీగా వుంది రకుల్. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆమెకి నిద్ర పట్టేలా లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.ప్రస్తుతం రకుల్ చేతిలో ఈ సినిమా కాకుండా కోలీవుడ్ హీరో సూర్యతో ఒక్క సినిమా...అలానే బాలీవుడ్ లో ఇంకొ మూవీ ఉన్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో ఒక్క మూవీ అయినా ఉండివుంటే బాగుండు అని అందరు అనుకుంటున్నారు. రకుల్ కి చేద్దాం అని ఆలోచన వున్న స్పైడర్ డిజాస్టర్ అవ్వడంతో అమ్మడుకి టాలీవుడ్ లో ఆఫర్స్ ఏమి రావడంలేదు. బాలీవుడ్ అయ్యారి సినిమాతో హిట్ కొట్టి..టాలీవుడ్ లో 'ఐ యామ్ బ్యాక్' అంటుందేమో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/director-maruthi-with-banny-155503/ | దర్శకుడు మారుతీ ప్రేమ కథా చిత్రం అప్పటినుండి స్టార్ హీరో అల్లు అర్జున్ తో సినిమా చేస్తా అంటాడు కానీ.. అది వర్కౌట్ అవ్వడం లేదు. మాములుగా బన్నీ – మారుతి ఫ్రెండ్స్. అందుకే అల్లు అర్జున్ తో గీత ఆర్ట్స్ లో ఏదైనా మంచి కథతో సినిమా చెయ్యాలి అనుకుంటాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం మారుతికి అవకాశం ఇవ్వడం లేదు. ఎందుకంటే మారుతీ ఇప్పటివరకు స్టార్ రేంజ్ చేరుకోలేదు. యంగ్ హీరోలతో తప్ప మారుతీ ఇంతవరకు ఓ స్టార్ హీరోను పట్టలేకపోయాడు. ఓ స్టార్ కథను తేలేకపోయాడు. అయితే తాజాగా కరోనా లాక్ డౌన్ తో ఫ్రీ అయిన మారుతీ – అల్లు అర్జున్ లు వాట్స్ఆప్ లో మాట్లాడుకుంటారట. ఈ విషయాన్నీ మారుతీ స్వయంగా చెబుతున్నాడు. బన్నీ తాను రోజు వాట్స్ఆప్ లో చాట్ చేసుకుంటామని… అల్లు అర్జున్ తనకి జోక్స్ పంపుతుంటే.. తాను కూడా ఫన్నీ గా ఉండే జోక్స్ ని బన్నీకి పంపుతుంటా అని.. తామెప్పుడూ వాట్స్ ఆప్ లో టచ్ లోనే ఉంటామని చెబుతున్నాడు. మంచి కథ దొరికే త్వరలోనే బన్నీతో సినిమా అంటూ మరోసారి మారుతీ చెప్పాడు. మరి మారుతీ చెప్పడమే కానీ.. అల్లు అర్జున్ ఎక్కడా మారుతితో సినిమా అని చెప్పాడు. కానీ మారుతీ మాత్రం అల్లు అర్జున్ తో సినిమా చేస్తా అంటూనే ఉంటాడు. అసలు అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ కి పెరిగిపోయాడు. ఇక మారుతికి అల్లు అర్జున్ ఇప్పట్లో దొరికేలా కనిపించడం లేదు.. |
https://www.telugupost.com/movie-news/syeraa-leaked-dialogue-85881/ | మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సైరా నరసింహారెడ్డి చిత్రం టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. టీజర్ ప్రక్షకుల్లో మంచి సినిమా పట్ల క్యూరియాసిటిని బాగా పెంచేసింది. అయితే ఈ సినిమాకి పరుచూరి సోదరులతో పాటు సాయిమాధవ్ కూడా తోడవడంతో.. అదరగొట్టే పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయనిపిస్తుంది. తాజాగా సై రా రైటర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ సై రా పవర్ ఫుల్ డైలాగ్ ఒకటి లీక్ చేసాడు. ఆ డైలాగ్ వింటేనే ఉర్రూతలూగడం ఖాయంగా కనపడుతోంది.పరుచూరి లీక్ చేయడంతో...పరుచూరి లీక్ చేసిన ఆ డైలాగ్ చిరంజీవి నోటి వెంట వస్తుంది. ఇంతకీ ఆ పవర్ ఫుల్ డైలాగ్ ఎంటంటే... ‘‘చేతులు వెనక్కి విరిచి కట్టేశాం. ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది. ఏంటిరా.? ఆ ధైర్యం.. చావు భయం లేదా నీకు.?’’ అని బ్రిటిష్ అధికారి అంటే.. ‘‘చచ్చి పుట్టినవాడిని.. చనిపోయిన తర్వాత కూడా బతికే వాడిని. చావంటే నాకెందుకురా భయం...’’ అంటూ చిరు చెప్పే డైలాగ్ సినిమాకే హైలెట్ అంటున్నారు పరుచూరి గోపాలకృష్ణ. మరి చూస్తుంటే సినిమాలో ఈ మాదిరి పవర్ ఫుల్ డైలాగ్స్ మరిన్ని ఉండేలా కనబడుతున్నాయి. ఇప్పుడు పరుచూరి లీక్ చేసిన సై రా డైలాగ్ సోషల్ మీడియాలో దావానంలా తెగ వైరల్ అయ్యింది. |
https://www.telugupost.com/crime/firing-incident-of-bjp-mla-in-maharashtra-has-created-a-stir-1518610 | మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే కాల్పుల జరిపిన ఘటన కలకలం రేపింది. శివసేన ఎమ్మెల్యేపై కాల్పులు జరిపారు. ముఖ్యమంత్రి ఏక్నాధ్ షిండే వర్గానికి చెందిన గణ్పత్ గైక్వాడ్ కు మరో నేత మహేశ్ గైక్వాడ్ కు మధ్య గత కొంతకాలంగా భూవివాదం జరుగుతుంది. మహేశ్ గైక్వాడ్ కూడా శివసేనకు చెందిన నేత. ఈ స్థల వివాదంలో ఇద్దరూ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు.స్థల వివాదంలో...ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. గణ్పత్ గైక్వాడ్ మహేశ్ పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. మహేశ్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహేశ్ పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. దీంతో మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. |
https://www.telugupost.com/crime/minor-girl-stripped-gang-assault-in-uttar-pradesh-1440030 | యూపీలో ఆడపిల్లలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ముక్కుపచ్చలారని పిల్లల నుంచి పండు ముసలి వరకూ ఎవర్నీ వదలట్లేదు మృగాళ్లు. రోడ్డుపైనే కాదు.. ఇంట్లో ఆడపిల్ల ఒంటరిగా కనిపించడమే పాపమైపోయింది. ఇటీవల అక్కడ దళిత మైనర్ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసి చెట్టుకు వేలాడదీసిన ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన సోషల్ మీడియా ద్వారా వెలుగులోకొచ్చింది. సామూహిత అత్యాచారానికి గురైన బాలిక.. స్పృహలోకి వచ్చాక రోడ్డుపై నగ్నంగా.. తీవ్ర రక్తస్రావంతో ఇంటికి చేరుకోవడం కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే.. మొరాదాబాద్ జిల్లా భోజ్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల బాలిక.. సెప్టెంబర్ 1వ తేదీన పక్క గ్రామంలో జరుగుతున్న సంత చూడడానికి వెళ్లింది. బాలిక తిరిగి ఇంటికి వస్తుండగా నలుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి.. నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లారు. బాలికను వివస్త్రను చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలిక స్పృహ కోల్పోగా.. నిందితులు పరారయ్యారు. కొద్దిసేపటికి మెలకువ వచ్చిన బాలిక నగ్నంగానే ఇంటికి వెళ్లింది. అలా వెళ్తున్న బాలికకు దుస్తులిచ్చి ఆదుకోవాల్సిందిపోయి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్ అయి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసే విషయంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే బాధితురాలు, కుటుంబంతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి, ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయలేదని కొందరు అంటున్నారు. వారంరోజుల తర్వాత ఎస్ఎస్పీ హేమంత్ కుటియాల్ను కలవగా.. అప్పుడు కేసు పెట్టారని మరికొందరు చెప్తున్నారు. తన మేనకోడలిపై అత్యాచారం జరిగిందని ఓ వ్యక్తి సెప్టెంబర్ 7న ఫిర్యాదు చేశాడని మేము దర్యాప్తు ప్రారంభించాం కానీ.. అలాంటిదేమీ లేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారని మొరాదాబాద్ ఎస్పీ సందీప్ కుమార్ మీనా తెలిపారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేశామని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. |
https://www.telugupost.com/movie-news/regina-new-film-73286/ | హీరోయిన్ రెజినాకు గత ఏడాది అంతగా కలసి రాలేదు. కృష్ణ వంశి డైరెక్షన్ లో 'నక్షత్రం' సినిమాలో గ్లామర్ పాత్ర చేసినప్పటికీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూ ఉండగానే అ! లో చాలా టిపికల్ రోల్ చేసింది. అందులో పర్లేదు అనిపించుకున్నా, ఆమెది అందులో లీడ్ రోల్ కాదు. అయితే ఇప్పుడు రెజినా ఆశలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్న 'మిస్టర్ చంద్రమౌళి' మీదే ఉన్నాయి.మరీ సర్టిఫికేట్ ఇలా ఎలా ఇచ్చారు..?గతంలో ఎన్నడూ లేని విధంగా రెజినా ఇందులో చాలా హాట్ గా కనిపించనుంది. వీటికి సంబంధించి ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఎ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అంటే వీడియోస్ లో చూపించిన విధంగా సినిమాలో ఏమి లేవని అర్ధం అవుతున్నాయి.తెలుగులోకి వచ్చేనా..ఒక కీలక పాత్రలో విశాల్ మాజీ లవర్ వరలక్ష్మి ఇందులో నటించింది. ఇక హీరో కార్తీక్ మన తెరకు పరిచయం ఉన్న వ్యక్తే. మణిరత్నం తీసిన 'కడలి' ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా దారుణంగా పరాజయం పాలవ్వడంతో మళ్లీ వేరే సినిమా ఏది డబ్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసే విషయం ఏది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ టీం నమ్మినట్టు తమిళ్ లో ఈ సినిమా హిట్ అయితే తెలుగులో డబ్ చేసే అవకాశం ఉందని టాక్. |
https://www.telugupost.com/movie-news/that-is-not-true-165806/ | అఖిల్ అక్కినేని మూడు సినిమాల ప్లాప్స్ అయ్యి మైండ్ బ్లాంక్ అయ్యింది. మొదటి సినిమాకే మాస్ హీరో అవుదామనుకుంటే.. అది అట్టర్ ప్లాప్ కాగా.. రెండో సినిమా, మూడో సినిమాని క్లాసిక్ లవర్ బాయ్ లా అయినా సక్సెస్ అవుదామనుకుంటే హలో, మిస్టర్ మజ్ను కూడా ప్లాప్స్ అయ్యాయి. ఇక చేసేది లేక ప్లాప్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. కొద్దిగా షూటింగ్ మిగిలి ఉండగా కరోనా మహమ్మారి బ్యాచిలర్ షూటింగ్ కి అడ్డం పడింది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించడం, అఖిల్ లుక్స్ అన్ని సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. అయితే తాజాగా అఖిల్ సై రా దర్శకుడు సురేందర్ రెడ్డితో నెక్స్ట్ సినిమా చెయ్యబోతున్నాడంటూ సోషల్ మీడియా న్యూస్. కిక్ దర్శకుడు అఖిల్ కి కిక్ ఇస్తాడా? సై రా దర్శకుడైన అఖిల్ ని గాడిలో పెడతాడా? రేసు గుర్రంలా అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హిట్ కొడతాడా? అంటూ రకరకాల న్యూస్ లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా సురేందర్ రెడ్డి తో అఖిల్ సినిమా లేదని… మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలయ్యాకే అఖిల్ నెక్స్ట్ సినిమాపై ప్రకటన వస్తుంది అని.. ప్రస్తుతం అఖిల్ – సురేందర్ రెడ్డి కాంబోపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలంటూ…. అక్కినేని కాంపౌండ్ నుండి న్యూస్ వచ్చినట్లుగా మీడియా టాక్. అఖిల్ మోస్ట్ బ్యాచ్లర్ సినిమా విడుదలయ్యాక అది హిట్ అయ్యాకే.. ఏ జోనర్ లో సినిమా చెయ్యాలో ఆలోచిస్తారని అంటున్నారు. అందుకే ఏ దర్శకుడికి అఖిల్ ఇంకా కమిట్ అవ్వలేదని అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/surya-movies-banned-155425/ | లాక్ డౌన్ వలన థియేటర్స్ ఇప్పటిలో తెరుచుకునే అవకాశంలేదు. ఎట్టలేదన్న ఒక ఆరు నెలలు టైం పడుతుంది. ఒకవేళ ఆరు నెలలు తరువాత థియేటర్స్ ఓపెన్ అయినా కొంత కాలం పాటు ఆశించిన స్థాయిలో రెవెన్యూ ఉండదంటున్నారు కొంతమంది ప్రొడ్యూసర్స్. కానీ చిన్న సినిమా నిర్మాతలు మాత్రం వడ్డీ భారం తట్టుకోలేక ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో నేరుగా రిలీజ్ చేసేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ముఖ్యంగా తమిళ పరిశ్రమ నుండి ముందుగా జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్ మగల్ వందాల్’ సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈసినిమా రిలీజ్ ను థియేటర్స్ లో చేయకుండా నేరుగా ఓటీటీల్లో ఎలా రిలీజ్ చేస్తారని ఆ సంఘం ప్రశ్నించింది. జ్యోతిక సినిమాను కచ్చితంగా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ కండిషన్ పెట్టారు ఆ సంఘం. తమ మాట కాదని ప్రైమ్లో రిలీజ్ చేస్తే.. భవిష్యత్తులో సూర్య సినిమాలతో పాటు అతడి నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ నుంచి వచ్చే ఏ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ కానివ్వమని ఆ సంఘం ప్రతినిధులు ఓ ప్రకటనలో హెచ్చరించారు. గతంలో ఇలానే కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ను నేరుగా ఆన్ లైన్ లో రిలీజ్ చేయాలనీ చూసారు కానీ అప్పుడు కూడా తమిళనాడు థియేటర్ల సంఘమే అడ్డు పడడంతో ఆ సినిమాను థియేటర్ రిలీజ్ చేశారు. మరి థియేటర్స్ సంఘం మాట విని జ్యోతిక సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/సమంత-కి-ఎన్ని-కష్టాలు-వచ్-58816/ | సమంత పెళ్ళైన తర్వాత కూడా సినిమాలు, షూటింగ్స్ అంటూ తెగ హడావిడి చేస్తూనే ఉంది. తెలుగు, తమిళంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతుంది. సమంత కి పెళ్ళైనా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం సమంత తెలుగులో రామ్ చరణ్ కి జోడిగా రంగస్థలం, సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న మహానటి సినిమా లో మరో కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే తమిళంలో కూడా రెండు మూడు సినిమాలతో బిజీగా వుంది. అయితే రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమా మొదలైన కొత్తల్లో రాజమండ్రిలో వేసవి తాపానికి వడదెబ్బ తిన్న సమంత అప్పుడు కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా సమంత వర్షంలో తడుస్తూ షూటింగ్ చేస్తూ కష్టపడుతుంది. ఆ విషయాన్నీ సమంతే స్వయంగా చెబుతుంది. తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న సూపర్ డీలక్స్ చిత్రం కోసం సమంత రాత్రివేళల్లో షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన వర్షంలో జరిపే షూటింగ్లో పాల్గొనాల్సి వస్తోందట. చెన్నైలోని టెన్సకి ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందట. అక్కడ షూటింగ్ స్పాట్ లో దిగిన ఫోటోని ఇంస్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ఆ పిక్ పై రాజమహేంద్ర వరంలో మండుటెండలో షూటింగ్ లో పాల్గొన్నాను. అలాగే ఇప్పుడు టెన్సకిలో రాత్రిళ్లు వర్షంలో జరుగుతున్న చిత్రీకరణలో పాల్గొంటున్నాను. దేవుడా... నాతో ఎందుకు ఇలాంటి ఆటలు ఆడుతున్నావ్ అంటూ పోస్ట్ చేసింది.మరి అలా సమంత ఏడుస్తున్న పిక్ చూసి సమంత హార్ట్ కొర్ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. తమ అభిమాన నటికి ఎన్ని కష్టాలో అంటున్నారు. మాములుగా సమంత కి పని మీద ఎంత శ్రద్దో వేరే చెప్పక్కర్లేదు. మరి షూటింగ్ లో ఎన్ని కష్టాలను అయినా నవ్వుతూ భరించేస్తుంది. కాకపోతే ఇలా అందరిని ఆటపట్టించడానికి... అలాగే తన కష్టాన్ని అందరితో పంచుకోవడానికి మాత్రమే ఈ పిక్ ని పోస్ట్ చేసిందంటున్నారు అభిమానులు. |
https://www.telugupost.com/movie-news/varun-tej-vankatesh-f2-101646/ | విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో దిల్ రాజు బ్యానర్ లో 'పటాస్' ఫేమ్ అనిల్ రావిపూడి 'F2' అనే మల్టి స్టారర్ ని తెరకెక్కిస్తున్నాడు. మొన్ననే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసి ఈ సంక్రాంతికి మేమే హిట్ కొట్టేది అని హింట్ ఇచ్చారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ డీల్ చేయడంలో ఎక్స్ పర్ట్ అనేది తన గత చిత్రాలు చూస్తే అర్ధం అవుతుంది. కేవలం టీజర్ చూస్తూనే సినిమాలో కామెడీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధం అయిపోతుంది. ఇందులో వెంకీ - వరుణ్ లు తోడల్లుళ్లుగా నటించారు. పెళ్లికి ముందు మగవాళ్లు ఏమనుకుంటారు.. పెళ్ళైన తర్వాత ఎం తెలుసుకుంటారు అనేది ఈ ఇద్దరితో అనిల్ బాగానే చేయించాడని అర్ధం అవుతుంది. పెళ్లికి ముందు పెళ్లాలతో ఎలా ఉండాలో మాకు తెలుసు అనుకున్న వీళ్లకి ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయో సినిమాలో చూడాలి. వెంకీకి జోడిగా తమన్నా.. వరుణ్ కి జోడిగా మెహ్రీన్ నటిస్తున్నారు.తోడల్లుళ్లు ఇరగదీస్తారా..?కాన్సెప్ట్ పాతదైనా అనిల్ ఏదో ఒక మ్యాజిక్ చేసేసి సినిమాను హిట్ చేసేస్తాడు అనే నమ్మకం అయితే ఉంది. అంతా బాగానే ఉంది కానీ వెంకీ కామెడీ టైమింగ్ విషయంలో వరుణ్ తేజ్ అందుకోగలడా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వెంకీ కామెడీని పండించడంలో ఎక్స్ పర్ట్. ఎటువంటి సీన్ ఇచ్చినా అవలీలగా చేసే వెంకీతో వరుణ్ కామెడీ చేయగలడా? అని అంటున్నారు. ఇద్దరూ తోడల్లుళ్లు కాబట్టి.. దాదాపు వెంకీ, వరుణ్ కాంబినేషన్ లో ఎక్కువ కామెడీ సీన్స్ ఉండే అవకాశం ఉంది. పైగా వరుణ్ ఇప్పటివరకు సరైన కామెడీ టైమింగ్ ఉన్న సినిమాలు చేయలేదు. అన్ని సీరియస్ పాత్రలు ఉండే సినిమాలే చేసుకొచ్చాడు. మరి వరుణ్ వెంకీని అందుకోగలడా అంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే. |
https://www.telugupost.com/telangana/speculations-are-rife-that-former-pcc-president-uttam-kumar-reddy-will-be-made-the-high-command-chief-minister-of-telangana-1549951 | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం అనేక మంది ప్రయత్నిస్తుంటారు. పార్టీలో సీనియర్ నేతల దగ్గర నుంచి సామాజికవర్గాల వారీగా లీడర్లు ఢిల్లీలో లాబీయింగ్ ఉపయోగించి ఒక్కసారైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అనుకుంటారు. అది సహజం. ప్రాంతీయ పార్టీల్లో ముఖ్యమంత్రి పదవి ఆశించడం కుదరదు. అది అత్యాశే. కానీ జాతీయ పార్టీలో మాత్రం ఎవరికైనా సాధ్యమే. ఏదైనా జరగొచ్చు. అందుకు కారణం హస్తనలో హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపితే వారే ముఖ్యమంత్రి పదవిని చేపడతారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం పాళ్లు ఒకింత ఎక్కువ కావడంతో అది మరింత ఎక్కువగా కనిపిస్తుంది.రెండున్నరేళ్ల తర్వాత...ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ముఖ్యమంత్రి మార్పిడి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డిని రెండున్నరేళ్ల తర్వాత ఆ పదవి నుంచి తప్పించి సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యంత దురదృష్టవంతుడు. పీసీసీ చీఫ్ గా ఉన్న రెండు టర్మ్ లు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. దీంతో ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారు. దీంతో దూకుడు మీదున్న రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేసింది. రేవంత్ అడుగుపెట్టిన వేళావిశేషమో, బీఆర్ఎస్ పై వ్యతిరేకతో తెలియదు కాని కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. గాంధీ కుటుంబంతో...దీంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎంతమంది సీనియర్ నేతలు పోటీ పడినా రేవంత్ వైపు పార్టీ హైకమాండ్ మొగ్గు చూపింది. తనకు ముఖ్యమంత్రి పదవి వస్తుందన ఆశించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరాశకు గురయ్యారు. ఆయన మంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ రిలేషన్ తోనే ఉత్తమ్ ను ఈ టర్మ్ లో ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ఇటీవల ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా అద్దం పడుతున్నాయి. శపథం నెరవేరలేదా?ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా అవుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం ఇప్పుడు పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. అందుకే ఉత్తమ్ గడ్డం తీయలేదంటున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత తాను గడ్డం తీస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం చేశారు. అయితే ఇంతవరకూ ఆయన గడ్డం తీయకపోవడంపై కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. కానీ రేవంత్ ను తొలగించే సాహసాన్ని హైకమాండ్ చేస్తుందా? అన్నదే ప్రశ్న. ఎందుకంటే రేవంత్ పార్టీలో బలంగా పాతుకుపోయారు. ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉంటున్నారు. వారిని తరచూ కలుస్తూ గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు. మరి ఉత్తమ్ ఆశలు నెరవేరుతాయా? కోమటిరెడ్డి జోస్యం ఫలిస్తుందా? అన్నది చూడాల్సి ఉంది. |
https://www.telugupost.com/movie-news/message-from-lavanya-to-advocate-dileep-sunkara-at-mid-night-1543801 | సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారంలో మరో ఊహించని ఘటన చోటు చేసుకుంది. తనను మోసం చేశాడంటూ ఇటీవల లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె శుక్రవారం అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్కు మెసేజ్ పంపించింది. తాను వెళ్లిపోతున్నట్టు అందులో పేర్కొంది. వెంటనే స్పందించిన అడ్వకేట్ డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ‘‘రాజ్ లేని లైఫ్లో నేను ఉండలేను. బతకలేను. అన్నీ కోల్పోయాను. అందరి వల్ల నేనే మోసపోయాను. రాజ్ తల్లిదండ్రులు కూడా నా చావుకు కారణం. రాజ్ మొత్తం మారిపోయాడు. నా చావును కోరుకున్నాడు. మాల్వీ మల్హోత్రా నా చావుకు ప్రధాన కారణం. నా కుటుంబం, దిలీప్ సుంకర, మీడియాకు నా క్షమాపణలు’’ అంటూ లావణ్య అడ్వకేట్కు సందేశం పంపించింది. ఆయన వేగంగా స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తానేంటో తెలిసిన వారే తనను తప్పుబట్టారని లావణ్య వాపోతోంది.రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది లావణ్య. రాజ్తరుణ్తో తనకుకు పదేళ్ల క్రితమే పెళ్లయిందని, పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని లావణ్య చెప్పుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం రాజ్తరుణ్ నాకు అబార్షన్ చేయించాడని ఆరోపించింది. మెడికల్ రిపోర్ట్స్ను కూడా పోలీసులకు అందించానని తెలిపింది. |
https://www.telugupost.com/movie-news/syeraa-narasimha-reddy-climax-111066/ | మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. యంగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నా ఈ సినిమా క్లైమాక్స్ ఇంతవరకు ఫైనల్ చేయలేదట దర్శకనిర్మాతలు. నరసింహారెడ్డి నిజజీవితం ఆధారంగా క్లైమాక్స్ తీస్తే సాడ్ ఎండింగ్ తో సినిమాని ముగించాల్సి వస్తుందని అప్పుడు ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించే అవకాశం ఎక్కువ ఉందని దీన్ని పక్కన పెట్టేసి వేరేది రాసుకున్నారట. ఆయన మరణంతో కాకుండా ఆయన స్ఫూర్తితో మళ్లీ ఎవరెవరు తిరుగుబాటు చేశారనే అంశాల ఆధారంగా క్లైమాక్స్ ఉంటే బాగుటుందని అనుకున్నారు కానీ దాన్ని సరిగా ఫైనల్ చేయలేదట. అదే క్లైమాక్స్ ఫైనల్ ఇప్పుడు క్లైమాక్స్ తీయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దీన్నే ఫైనల్ చేసి తెరకెక్కించాలని తాజాగా చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార, ప్రత్యేక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోస్ నటించడం విశేషం. రామ్ చరణ్ తన సొంత బ్యానర్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. |
https://www.telugupost.com/politics/chandrababu-said-that-the-second-phase-of-the-manifesto-will-be-released-on-dussehra-day-but-that-doesnt-seem-possible-1498590 | తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తొలి విడత మ్యానిఫేస్టోను విడుదల చేశారు. ఈ ఏడాది మే 28వ తేదీన ఆయన టీడీపీ తొలి మ్యానిఫేస్టోను విడుదల చేస్తూ ఆరు గ్యారంట్లీను ప్రజల ముందు ఉంచారు. మలి విడత మ్యానిఫేస్టో ఉంటుందని అప్పుడే చంద్రబాబు ప్రకటించారు. దసరా రోజున మహిళల సమక్షంలో విడుదల చేస్తామని తెలిపారు. దసరాకు ఇక పెద్దగా సమయం లేదు. ఈ లోపు మ్యానిఫేస్టోను ఓకే చేసి ప్రకటించే అవకాశం లేదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.అరెస్టయి జైలులో...స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒకవేళ బెయిల్ వచ్చినా ఇప్పటికిప్పుడు హడావిడిగా మ్యానిఫేస్టోను విడుదల చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పకడ్బందీగా మ్యానిఫేస్టోను రూపొందించేందుకు స్వయంగా చంద్రబాబు కసరత్తు చేయాల్సి ఉంది. ఈ నెల 24వ తేదీన దసరా కావడంతో ఇంకా పది నుంచి పన్నెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో దసరాకు మలి విడత మ్యానిఫేస్టో సాధ్యం అయ్యే అవకాశాలు లేవు.తొలి విడత...తొలి విడత మ్యానిఫేస్టోను మే 28న మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించారు. ఆరు గ్యారంటీలను ఆయన ప్రజల ముందు ఉంచారు. పేదలను సంపన్నులను చేయడం, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికీ నీరు, రైతులకు ప్రతి ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సాయం, మహాశక్తి పథకం కింద పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే వీలు కల్పిస్తూ తొలి విడత మ్యానిఫేస్టోను ప్రకటించారు.పవన్ తో చర్చించి...మ్యానిఫేస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావించే సమయంలో ఆయన స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయ్యారు. మరో వైపు జనసేనతో పొత్తు కూడా జైలులో ఉన్నప్పుడే అధికారికంగా ఖరారయింది. దీంతో పవన్ కల్యాణ్తో కలసి ఆయన మలి విడత మ్యానిఫేస్టోను విడుదల చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. తాను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మ్యానిఫేస్టోపై పవన్ తో చర్చించిన తర్వాతనే విడుదల చేస్తారా? లేదా తాను ముందుగా చెప్పినట్లే దసరా రోజున కొన్ని పథకాలతో రిలీజ్ చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది. ఎక్కువ భాగం మ్యానిఫేస్టో విడుదల వాయిదా పడే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. |
https://www.telugupost.com/movie-news/sreenu-vaitla-multistarer-movie-118479/ | శ్రీను వైట్లతో సినిమా అంటేనే హీరోలంతా ఆమడ దూరం పారిపోతున్నారు. ఈమధ్యన శ్రీను తెరకెక్కించిన సినిమాల ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఏ సినిమా తీసినా అట్టర్ ఫ్లాప్ అవడంతో హీరోలెవరూ శ్రీను వైట్లకి ఛాన్స్ ఇచ్చేలా కనబడడం లేదు. కానీ తనకి గతంలో హిట్ ఇచ్చిన మంచు విష్ణు, శ్రీను వైట్లకి మరో ఛాన్స్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యాడు. ప్రస్తుతం తన కెరీర్ కూడా ఇబ్బందుల్లోనే ఉంది. విష్ణు నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అవుతున్నాయి. ఆచారి అమెరికా యాత్ర తర్వాత మళ్లీ ఓటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం మంచు విష్ణు మార్కెట్ పూర్తిగా శూన్యం. మరి ఇలాంటి సమయంలో ఢీతో తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీను వైట్లకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాడు విష్ణు. మనోజ్ ను తీసుకొని… అయితే ఏమాత్రం క్రేజ్ లేని శ్రీను వైట్ల, క్రేజ్ తగ్గిపోయిన మంచు విష్ణు కలిసి సినిమా చేస్తే ట్రేడ్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ ఎలాంటి ఆసక్తి ఉండదు. ఎంతగా శ్రీను వైట్ల – విష్ణు కాంబోలో గతంలో వచ్చిన ఢీకి సీక్వెల్ అన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ సినిమా మీద ఎలాంటి హైప్ క్రియేట్ కాదు. అందుకే శ్రీనూ వైట్లకి సన్నిహితులు ఒక ఉచిత సలహా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అదేమిటంటే శీను – విష్ణు కాంబోలో రాబోయే సినిమాలో మరో హీరోకి కూడా ప్లేస్ ఇస్తే అప్పుడు సినిమా మీద ఇంట్రెస్ట్ పెరుతుందని చెబుతున్నారట. అయితే ఆ హీరోగా ఎవరో ఎందుకు… ప్రస్తుతం సినిమాలు వదిలేసి ఖాళీగా ఉన్న మనోజ్ ని విష్ణు సినిమాలో నటింపజేస్తే సినిమాకి క్రేజ్ వస్తుందని శ్రీను వైట్లకి సన్నిహితులు సూచిస్తున్నారట. దీనిపై శ్రీను వైట్ల ఆలోచనలో పడినట్లుగా టాక్. |
https://www.telugupost.com/movie-news/సల్మాన్-చేతిలో-పడితే-పాత-45026/ | పూజ హెగ్డే తెలుగులో హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతుంది. ఇండస్ట్రీలోకి అడుగెట్టినప్పుడు మాత్రం ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకున్న అమ్మడు డీజే చిత్రానికి వచ్చేసరికి హాట్ హాట్ అందాలతో రెచ్చగొట్టింది. స్విమ్ సూట్ తో ఇరగదీసిన పూజ హెగ్డే కి డీజే చిత్రం హిట్ ఇవ్వకపోయినా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. కోటిన్నర భారీ పారితోషంతో పూజ హెగ్డే శ్రీనివాస్ సినిమాలో నటించడానికి ఒప్పేసుకుంది. అయితే బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్ పక్కన మోహింజదారో లో నటించిన పూజ హెగ్డే ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో బాలీవుడ్ అవకాశాల మీద ఆశలు వదులుకుంది..... గాని బాలీవుడ్ ని వదలకుండా ఫాషన్ షోలకి, అవార్డు ఫంక్షన్స్ కి హాజరవుతూ అక్కడ హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంటూనే అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.అయితే ఇప్పుడు తాజాగా సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం రేస్ 3 లో పూజ అవకాశం కొట్టేసినట్లుగా వార్తలొస్తున్నాయి. రేస్, రేస్ 2 సినిమాల్లో బాలీవుడ్ టాప్ హీరోయిన్లు నటించారు. కానీ ఇప్పుడు రేస్ 3 విషయంలో మాత్రం తక్కువ బడ్జెట్ ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలనుకుంటున్నారట. అయితే ఇలా తక్కువ బడ్జెట్ ఉన్న హీరోయిన్ ని సెలెక్ట్ చెయ్యడానికి కారణం రేస్ 3 కి నిర్మాత సల్మాన్ కావడమే అంటున్నారు. అందుకే సల్మాన్ ఖాన్ భారీ పారితోషకం తీసుకునే హీరోయిన్స్ ని పక్కన పెట్టి తక్కువ పారితోషకం ఉన్న హీరోయిన్స్ మీద కన్నేశాడట. అయితే ఆ లిస్ట్ మొదటగా పూజ ఉండడంతో పూజ హెగ్డే ని ఫైనల్ చేస్తే ఎలా ఉంటుందని చూస్తున్నాడట.మరి ఎందరో హీరోయిన్స్ కి మంచి లైఫ్ ఇచ్చిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు తన రేస్ 3 లో పూజ ని హీరోయిన్ ని తీసుకుని పూజ లైఫ్ ని కూడా బాలీవుడ్ లో సెటిల్ చేస్తాడేమో చూద్దాం. |
https://www.telugupost.com/movie-news/విడుదలకు-ముందే-వ్యతిరేఖత-33782/ | అల్లు అర్జున్ తాజా చిత్రం 'డీజే.. దువ్వాడ జగన్నాథం' జూన్ 23 న విడుదలకు సిద్ధమవుతోంది. నెలరోజుల ముందు నుండే సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర యూనిట్ ఇప్పటికే పాటలతో మార్కెట్లో సందడి చేస్తుంది. తాజాగా విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ లో దుమ్మురేపే వ్యూస్ తో సంచలనం సృష్టిస్తున్న డీజే చిత్రానికి ఇప్పుడు బ్రాహ్మణ సంఘాల నుండి వ్యతిరేఖత ఏర్పడుతుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బ్రహ్మణుడిగా కనిపిస్తాడని ఫస్ట్ లుక్ లోనే రివీల్ చేశారు. అయితే ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు రిలీజైన పాటలపై దుమ్మెత్తి పోస్తున్నాయి.‘అస్మిక యోగ తస్మిక భోగ’ అనే పాటలో బూతు పదాలను ఉపయోగించారని ఆరోపిస్తూ బ్రాహ్మణ సంఘాలు సెన్సార్బోర్డుకు ఫిర్యాదు చేశాయి. బ్రాహ్మణులను హీనంగా చూపడం సినిమావాళ్లకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారు. రాసిన లిరిక్స్ ఏంటి? అందులోని పదాలేంటి? దాని అర్థం అసలు మీకు తెలుసా అంటూ నిర్మాతలపై ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు వారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఇలాంటి పాటలు రాయడం ఏమిటి అని వారి ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. అలాగే సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. మరి బ్రాహ్మణ సంఘాల ఆరోపణలు డీజే యూనిట్ అసలు పట్టించుకుంటుందా? లేదంటే లైట్ తీసుకుని సినిమా ప్రమోషన్ కి బాగా పనికొస్తుందని పండగ చేసుకుంటుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/-1346993 | మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆచార్య. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా.. ఇప్పటి వరకూ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను, మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఆచార్య నుంచి మూడవ పాటను విడుదల చేశారు మేకర్స్. శానాకష్టం నీతో మందానికి అనే పార్టీ సాంగ్ ని విడుదల చేయగా.. ఈ పాటలో చిరుతో కలిసి రెజీనా స్టెప్పులేసింది. మణిశర్మ సంగీతంతో.. మాస్ లిరిక్స్ తో చిరు ఊరమాస్ స్టెప్పులు అదిరిపోయాయి.Also Read : లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి.. ! ఈ పాటకు వాయిస్సే హైలెట్ అని చెప్పాలి. రేవంత్, గీతామాధురిల హస్కీ వాయిస్ పాటను మరో రేంజ్ లో నిలబెట్టింది. ఇవాల్టి నుంచి ఈ పాట ప్రతి పార్టీలోనూ వినిపిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. కొణిదల ప్రొడక్షన్స్ ద్వారా రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. |
https://www.telugupost.com/crime/gang-rape-on-young-woman-in-vijayawada-1365925 | విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అబలల రక్షణకై ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని యాప్ లను అందుబాటులోకి తీసుకొచ్చానా మృగాళ్ల చెర నుంచి రక్షణ లేకుండా పోయింది. మొన్న కోదాడ, నిన్న గుంటూరు, నేడు బెజవాడ.. ఇలా ప్రతిరోజూ ఏదొక ప్రాంతంలో అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా బెజవాడలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది.పాయకాపురం వాంబే కాలనీకి చెందిన యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. రెండ్రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి ప్రభుత్వాస్పత్రి వెనుక యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువతిని గుర్తించి, చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతిపై దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకుల కోసం గాలిస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/arrest-warrant-on-tamil-hero-vishal-129232/ | తమిళ నటుడు విశాల్ అక్కడ ఏదొక ఇబ్బందులు ఎదురుకుంటూనే ఉన్నాడు. రీసెంట్ గా ఆయనకు లీగల్ నోటీసులు అందాయి. నడిగర్ సంఘం జనరల్ సెక్రెటరీ గా ఉన్న విశాల్ తన కార్యానిర్వాహక వర్గ జీతాలకు సంబంధిచిన పన్నులు, టీడీఎస్ సరిగా చెల్లించలేదని,అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈనేపధ్యంలో ఇన్ కం టాక్స్ అధికారులు అతన్ని విచారణకు అటెండ్ కావాలని ఆదేశించినా అతను అటెండ్ కాకపోవడంతో అధికారులు అతనిపై కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. కోర్ట్ దీనిపై విచారణ జరిపి విశాల్ త్వరలోనే విచారణకి అటెండ్ కావాలని లేని పక్షంలో అతని పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేయవలసిందిగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి విశాల్ అటెండ్ అవుతాడా లేదా అరెస్ట్ అవుతాడా చూడాలి |
https://www.telugupost.com/movie-news/బాలయ్యని-పడెయ్యడానికేనా-39041/ | బాలకృష్ణ - పూరి జగన్నాధ్ ల పైసా వసూల్ స్టంపర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ స్టంపర్ నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బాలకృష్ణ లాంటి స్టార్ను తన శైలికి తగ్గట్టుగా మార్చేసి, అదిరిపోయే లుక్లో బాలయ్య ని చూపించి అభిమానులు మెచ్చుకునే విధంగా చేసి సక్సెస్ అయ్యాడు పూరీ. ఈ స్టంపర్ లో బాలయ్య బాబు చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. పైసా వసూల్ స్టంపర్ చాలా కొత్తగా ఉందని టాలీవుడ్ లోని ప్రముఖులు పూరీని, బాలకృష్ణ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఇక ఈ స్టంపర్ చూసిన పూరి జగన్నాధ్ గురువుగారు... రామ్ గోపాల్ వర్మ అయితే పైసా వసూల్ స్టంపర్ సూపర్ సూపర్ డూపర్ అంటూ మెచ్చుకున్నాడు. బాలకృష్ణను ఫస్ట్ టైం ఇలాంటి లుక్లో చూస్తున్నానని, బాలయ్య మాత్రం చాలా బాగున్నాడని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. మరి వర్మ ట్వీట్ చూస్తుంటే పూరి కోసం చేసినట్టు లేదు. బాలకృష్ణ ని పడెయ్యడానికే వర్మ అలాంటి ట్వీట్ చేసాడంటున్నారు.ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యనఎన్టీఆర్ బయో పిక్ తీస్తానంటూ మీడియాలో తెగ హల్చల్ చేసాడు. కానీ వర్మ చెప్పిన వాటికీ బాలయ్య అసలు స్పందించనేలేదు. అందుకే వర్మగారు ఇప్పటివరకు నోరు మూసుకుని కూర్చుని ఇప్పుడు పైసా వసూల్ స్టంపర్ ని పొగిడేసి బాలయ్య బాబు దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నాడంటూ సోషల్ మీడియాలో తెగ సెటైర్స్ పడుతున్నాయి. |
https://www.telugupost.com/movie-news/అబ్బో-ఈ-గెటప్-లో-బాగానే-ఉన-32053/ | బాహుబలి కోసం ఆ టీమ్ సభ్యులు ఎంతగా కష్టపడితెనేమిటి ఆ సినిమాకి వస్తున్న ఆదరణ చూసి ఆ కష్టాన్ని ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ టీమ్ సభ్యులు. ఎంతో భారీగా తెరకెక్కిన బాహుబలి అంతే భారీగా కలెక్షన్స్ కొల్లగొడుతూ ఇండియాలో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక బాహుబలి ని చూసిన తర్వాత చాలామంది నిర్మాతలు పెద్ద ప్రాజెక్ట్ లు నిర్మించడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. ఇప్పటికే దుబాయ్ వ్యక్తి 1000 కోట్ల బడ్జెట్ తో మహాభారత ని నిర్మిస్తానని ఎనౌన్స్ కూడా చేసాడు. అలాగే రితేష్ దేశముఖ్ శివాజీ బయో పిక్ ని 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తానని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. మరోపక్క టాలీవుడ్ బడా నిర్మాత రామాయణాన్ని 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తానని మీడియా ముఖంగా అనౌన్స్ చేసాడు.అయితే ఇప్పుడు టాలీవుడ్ లో అల్లు అరవింద్ అనౌన్స్ చేసిన రామాయణంపై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ మొదలైంది. అంత భారీ బడ్జెట్ సినిమాకి ఇంకా డైరెక్టర్ ని గాని నటీనటుల్ని గాని ఇంతవరకు సెట్ చెయ్యలేదు. కానీ నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకెళుతుందని మాత్రం చెబుతున్నారు. అయితే ఇపుడు ఆ రామాయణంలో నటించే నటీనటులు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. అల్లు అరవింద్ తీయబోయే రామాయణంలో రామ్ చరణ్ రాముడిగా... రానా రావణాసురుడుగా ఫిక్స్ చేసేసారు మెగా ఫ్యాన్స్. ఇక రామ్ చరణ్ ని రాముడిగా కూడా ఫ్యాన్మేడ్ డిజైన్ ఒక దానిని తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ రాముడి గెటప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అల్లు అరవింద్ తీసే 3 డి రామాయణంలో నటీనటులు గురించి చెప్పేవరకు ఈ రకమైన ఊహాగానాలు ఫ్యాన్స్ చేస్తూనే ఉంటారు. మరి ఆ ఊహాగానాలకు అడ్డుకట్ట వేయాలంటే అల్ల అరవింద్ రామాయణంలో నటించే నటీనటులను త్వరగా ఎంపిక చేస్తే పోలా. |
https://www.telugupost.com/movie-news/veteran-actor-balayya-passed-away-he-died-at-his-residence-in-yusufguda-hyderabad-1364024 | సీనియర్ నటుడు బాలయ్య మృతి చెందాడు. యూసఫ్ గూడలోని తన నివాసంలో ఆయన మృతి చెందారు. బాలయ్య వయసు 94 సంవత్సరాలు. బాలయ్య దాదాపు మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. దాదాపు ఐదు దశాబ్దాల నుంచి బాలయ్య చిత్ర పరిశ్రమకు సుపరిచితుడు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించారు.దిగ్గజ నటులతో...తండ్రి, విలన్ పాత్రలను కూడా సమర్థవంతంగా పోషించి బాలయ్య ప్రేక్షకుల మదిలో నిలిచారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి దిగ్గజ నటులతో బాలయ్య నటించారు. బాలయ్య మల్లీశ్వరి, అన్నమయ్య, పార్వతీ కల్యాణం, యమలీల, శ్రీరామ రాజ్యం వంటి చిత్రాల్లో నటించారు. బాలయ్య దర్శకుడిగా, రచయితగా కూడా సినీ పరిశ్రమకు సుపరిచితుడు. బాలయ్య మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. |
https://www.telugupost.com/movie-news/నారా-రోహిత్-సినిమాకి-సమం-49880/ | సమంతా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ని కలిపి దున్నేస్తుంది. నాగ చైతన్యతో ప్రేమ పెళ్లి వంటి విషయాలతో బిజీగా వున్నా కూడా... చేతినిండా సినిమాల్తో బిజీగా వుంది.అసలు నాగ చైతన్య తో పెళ్లి అయిన కూడా సమంతా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. టాలీవుడ్, కోలీవుడ్ ఇప్పటికీ సమంతా ఇంటి ముందు క్యూ కడుతున్నారు. సమంతా అటు హీరోయిన్ గా బిజీ గా ఉంటూనే... మరోపక్క పలు సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. ప్రత్యూష ఫౌండేషన్ పేరు మీద ఎంతో మంది పిల్లలకి ఫ్రీ గా ఆపరేషన్స్ చేయిస్తుంది. అలాగే వారి ఆలనా పాలనా కూడా చూసుకుంటూ వారిపట్ల శ్రద్ద తీసుకుంటుంది.అయితే ఇప్పుడు తాజాగా సమంతా తన మేనేజర్ అయిన మహేందర్ కి డబ్బు సాయం కూడా చేసిందట. ఇంతకీ మేనేజర్ కి డబ్బు సహాయం చెయ్యడం ఏమిటా అనుకుంటున్నారా? అదేనండి సమంతా మేనేజర్ మహేందర్, నారా రోహిత్ ని హీరో గా పెట్టి 'బాలకృష్ణుడు' అనే సినిమాని నిర్మించాడు. ఈ సినిమా ఈ నెల 24 న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాని విడుదల చేయడానికి మహేందర్ కి దాదాపు మూడు కోట్ల రూపాయలు అవసరం అయ్యాయట. మరి మూడు కోట్లు అంటే మాటలను కాదు.అయితే ఆ మూడు కోట్ల రూపాయలను సమంతా మహేందర్ కి ఇచ్చి చివరి నిమిషంలో సినిమా విడుదల ఆగిపోకుండా చూసుకుందట. అలాగే పలు చోట్ల డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన వాటిల్లో కూడా సమంతా ఇన్వాల్వ్ అయ్యి సినిమా గురించిన ప్రతి విషయంలో శ్రద్ద తీసుకుందట. మరి ఈ లెక్కన సమంత ఇన్ డైరెక్ట్ గా నారా రోహిత్ 'బాలకృష్ణుడు'కి కి ప్రొడ్యూసర్ గా మారిపోయింది. |
https://www.telugupost.com/movie-news/trivikram-srinivas-son-rishie-manoj-photo-ggone-viral-1500786 | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రచయితగా డైలాగ్స్తో, దర్శకుడిగా తన టేకింగ్తో క్లాస్-మాస్ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నాడు. రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి పలు సీరియల్స్, సినిమాలకి రచయితగా పని చేసి, ఆ తరువాత 'నువ్వే నువ్వే' సినిమాతో దర్శకుడిగా కెరీర్ ని మొదలుపెట్టాడు. అక్కడి మొదలైన దర్శకత్వం.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ని డైరెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్టులు నమోదు చేసే స్థాయికి ఎదిగాడు.ఇప్పుడు ఆయన వారసుడు కూడా దర్శకుడిగా తెలుగు ఆడియన్స్ ని అలరించడానికి సిద్దమవుతున్నాడట. టాలీవుడ్ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి బంధువుల అమ్మాయి అయిన 'సాయి సౌజన్య'ని పెళ్లి చేసుకున్న త్రివిక్రమ్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీరు పెద్దగా మీడియా ముందు కనిపించరు. గతంలో కొడుకు ఫోటో ఒకటి బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యింది. త్రివిక్రమ్ కొడుకు పేరు 'రిషి మనోజ్'.తాజాగా సిరివెన్నెల తనయుడు యాక్టర్ రాజా.. త్రివిక్రమ్ కొడుకుతో ఉన్న ఫోటో షేర్ చేశాడు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో రాజా.. త్రివిక్రమ్ భార్య సౌజన్య, రిషి మనోజ్ తో కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో రిషి మనోజ్ గురించి చర్చ మొదలైంది. ఈక్రమంలోనే రిషి కూడా త్వరలో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.ప్రస్తుతం త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఫార్ట్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ప్రారంభించి సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి డీజే టిల్లు, సార్, మ్యాడ్ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. ఇక తమ తనయుడు రిషి మనోజ్ ని దర్శకుడిగా ఆ బ్యానర్ లోనే పరిచయం చేసే అవకాశం ఉంది. |
https://www.telugupost.com/movie-news/chandu-mondeti-next-film-113094/ | ఎక్కడైతే మొదలు పెట్టాడో అక్కడికే వచ్చాడు అంటే ఇదేనేమో. కార్తికేయ సినిమాతో హిట్ అందుకున్న చందు మొండేటి తరువాత మంచి అవకాశాలే వచ్చాయి. ఆ సినిమా హిట్ అవ్వడంతో చాలామంది నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చేసారు. కొంతమంది హీరోలు ఆఫర్ చేశారు. ఆలా చేసిందే ‘సవ్యసాచి’ సినిమా. నాగ చైతన్య హీరోగా తీసిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫిస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడం వల్ల చందూకి వరుస ఆఫర్స్ చేయజారాయి. అందులో ముఖ్యంగా నాగార్జున ప్రాజెక్ట్. మళ్లీ నిఖిల్ తోనే… నాగ్ తో ఎప్పుటి నుండో ఓ సినిమా చేద్దాం అనుకున్న చందూకు నాగ్ షాక్ ఇచ్చాడట. అలానే ‘శర్వానంద్’తో చేద్దాం అనుకుంటే తను మాత్రం, కనీసం కథ కూడా వినకుండానే ప్రస్తుతం తన డేట్లు ఖాళీ లేవు అని చెప్పేశాడట. కాబట్టి ఇంకా చేసేది ఏమీ లేక చందూ ఇప్పుడు తన మొదటి హీరో నిఖిల్ తో చేయడానికి సిద్ధం అయ్యాడు. చందూ ఎక్కడైతే కెరీర్ స్టార్ట్ చేసాడో అక్కడికే వెళ్లాడు. చూద్దాం ఈ సినిమాతో చందూ మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. |
https://www.telugupost.com/movie-news/rashmika-mandanna-2-166053/ | కన్నడ భామ రష్మిక తెలుగులోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. ఈ ఏడాది వరస హిట్స్ తో జోరు మీదున్న రష్మిక మందన్న పుష్ప సినిమా తో పాన్ ఇండియా లెవల్ కి వెళ్తుంది. అయితే తాను కెరీర్ మొదలు పెట్టిన కొత్తల్లో అంటే కిర్రాక్ పార్టీ విడుదలై సూపర్ హిట్ అయినప్పుడు తెలుగు నుండి మంచి ఆఫర్స్ తలుపు తట్టాయని… అయితే అప్పటికే రష్మిక సినిమాలు మానేద్దమని డిసైడ్ అయ్యిందట. తెలుగులో నటించడం అనేది అసలు సాధ్యం కాదనుకున్నాను. ఎందుకంటే తెలుగు భాష నాకు పరిచయం లేని భాష. దానితో తెలుగు వైపు రావాలన్న కోరిక, ఇంట్రెస్ట్ కూడా లేదని చెబుతుంది. ఇక కిర్రాక్ పార్టీ విజయం తర్వాత ఉత్సాహంతో ముందు కన్నడ సినిమాలు ఒప్పుకున్నాను. కాబట్టే రెండేళ్ల పాటు తెలుగు వైపు చూడలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత కిర్రాక్ పార్టీ సినిమా చూసిన వెంకీ కుడుములు ఛలో సినిమా అవకాశం ఇవ్వగా.. ఛలో సినిమాలో నా పాత్ర నచ్చి నేను ఆ సినిమా ఒప్పుకుని.. అలా తెలుగు సినిమాల్లోకి ఎంటర్ అయ్యా అని చెబుతుంది. తర్వాత వరస విజయాలతో తెలుగులో జెండా పాతేసాను అంటుంది. అలా తెలుగులోకి వచ్చిన నేను ఇప్పుడు ఆ జర్నీ చూస్తే ఓ కలల అనిపిస్తుంది అంటూ చెప్పుకొస్తుంది. |
https://www.telugupost.com/movie-news/nayan-negative-role-155319/ | ఆమధ్య రజినీకాంత్ నటించిన ‘నరసింహా’ సినిమా ఎంత హిట్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. అందులో రజినీతో పాటు రమ్య కృష్ణ ‘నీలాంబరి’గా గుర్తు ఉండిపోయే పాత్ర చేసింది. ఆ తరువాత అటువంటి పాత్ర చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. లేటెస్ట్ గా అటువంటి పాత్రే చేయడానికి నయనతార రెడీ అవుతుంది. రీసెంట్ గా సైన్ కూడా చేసింది నయన్. మలయాళ సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. మలయాళ సినిమా కాబట్టి పైగా సొంత గడ్డపై సినిమా అనే సరికి నయనతార ఆ పాత్రను చేయడానికి వెంటనే అంగీకరించిందని అంటున్నారు. రెమ్యూనరేషన్ విషయంలో కూడా పెద్ద గా పట్టించుకోకపోగా, ఈ సినిమా ప్రమోషన్స్ కి కూడా వస్తానని చెప్పిందట. సాధారణంగా నయన్ తన సొంత సినిమాల ప్రమోషన్స్ కి అసలు రాదు. కానీ ఈసినిమా ప్రమోషన్ కి వస్తా అంటుందంటే ఆమెకు ఆ పాత్ర ఎంత నచ్చి ఉంటుందో.. |
https://www.telugupost.com/movie-news/నన్ను-మోసం-చేసారు-65344/ | హీరోగా... విలన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రలు చేసి మనల్ని మెప్పించిన విలక్షణ నటుడు జగపతి బాబు. లేటెస్ట్ గా జగ్గు నటించిన రంగస్థలం సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. జగపతి బాబు ఇందులో విలన్ గా చేసి అందరి ప్రశంసలు పొందాడు. అయితే లేటెస్ట్ గా ఓ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానూ ఒక్కప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్నానని, అందుకు తన అలవాట్లు మాత్రమే కారణం కాదని..తన దగ్గర నుండి డబ్బు తీసుకున్నవారు చాలా మంది తిరిగి ఇవ్వకుండా మోసం చేసారని చెప్పారు. ఈ విషయంలో తప్పు తనదేనని, తన వద్ద ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నానని చెప్పారు. తానూ క్యాసినోలకు వెళ్లి జూదం ఆడటం వల్లే డబ్బును కోల్పోయినట్టు పలువురు భావిస్తున్నారని, అది అవాస్తవమని చెప్పారు.గతంలో డబ్బు విలువ తెలియకుండా ఖర్చు చేశానని, ఇప్పుడు విలువ తెలుసుకుని ఖర్చు పెడుతున్నానని అన్నారు. అప్పుడు ఇబ్బందుల్లో పడటం మంచిదే అనుకుంటున్నానని ఆలా జరిగివుండకపోతే ఇప్పుడు నేను ఇలా మల్లి తిరిగి డబ్బు సంపాదించుకునేవాడిని కాదేమో అని అన్నారు. ఇక బాహుబలి సినిమాలో తాను పోషించదగ్గ పాత్ర లేదని రాజమౌళి భావించి ఉండవచ్చని, అందుకే తాను ఆ చిత్రంలో భాగం కాలేకపోయానని అన్నారు. |
https://www.telugupost.com/movie-news/niharika-wedding-4-176403/ | మెగా కుటుంబం పెళ్లి రాజస్థాన్ లో మొదలై హైదెరాబాదులో ముగియబోతుంది. నిహారిక – చై పెళ్లి రాజస్థాన్ లో.. హైదెరాబాదులో రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరగబోతుంది. స్పెషల్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఈ పెళ్ళిలో స్పెషల్ గా కనిపించగా, అల్లు అర్జున్ అండ్ వైఫ్ స్నేహ, రామ్ చరణ్ అండ్ ఉపాసన క్యూట్ ఫొటోస్ పెళ్లి ఫొటోస్ కె హైలెట్ అనేలా ఉన్నాయి. నూతన వధూవరులు నిహారిక – చైతన్య ల ప్రతి మూమెంట్ ని ఫోటో గ్రాఫేర్స్ కెమెరాలో బంధించారు. పెళ్లి, పసుపు, మెహిందీ, సంగీత్ అబ్బో నిహారిక పెళ్లి చాలా వైభవంగానే జరిపించాడు నాగబాబు. ఇప్పుడు నిహారిక పెళ్లి ఖర్చు ఎంతవుతుందో అనేదానికన్నా నిహారిక వచ్చిన గిఫ్ట్స్ మీద ముచ్చట సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. మరి పెళ్లి ఎంత వైభవంగా జరిగింది కాదిక్కడ .. నిహారికకు వచ్చిన బహుమతులు విలువెంతుంటుంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియా ఫాన్స్ ఆరాలు మొదలు పెట్టారు. నిహారిక పెళ్లికి బహుమతులు కోట్లలో వచ్చినట్టుగా సోషల్ మీడియా టాక్. చిరు అయితే ఏకంగా మెగా డాటర్ నిహారికకు ఆమెకి నచ్చిన, నిహారిక సెలెక్ట్ చేసుకున్న కోట్లు విలువ చేసే ఆభరణాలు బహుమతిగా ఇచ్చాడని అంటున్నారు. మరోపక్క మెగా ఫామిలీస్ మొత్తం అంటే అల్లు అరవింద్, పవన్, చిరు, సాయి ధరమ్ ఫ్యామిలీస్ అన్ని కలిసి నిహారికకు కోట్లు విలువ చేసే బహుమతులు ఇచ్చారని.. ఆ కోట్లు ఎంత అంటే ఐదు కోట్ల మేర నిహారికకు పెళ్లి బహుమతులుగా వచ్చాయని.. పెళ్లి ఖర్చు కన్నా బహుమతుల విలువే ఎక్కువ ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలయ్యింది. మరి ఐదు కోట్ల బహుమతులు అంటే మెగా ఫ్యామిలీకి చాలా తక్కువే. కానీ చూసేవాళ్లకు అది మాములు విషయం కాదు. |
https://www.telugupost.com/movie-news/ramyakrishna-new-films-83652/ | రాజమౌళి తన బాహుబలి సినిమాకి శివగామిగా రమ్యకృష్ణని ఎంపిక చేసి అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు. రాజమాతగా.. నా మాటే శాసనం అంటూ భారీ పవర్ ఫుల్ డైలాగ్ తో అందరి మనసులను దోచేసిన రమ్యకృష్ణ కి మళ్లీ అలాంటి అదరగొట్టే పాత్ర రావడం అనేది కలే. కానీ తాజాగా మారుతీ దర్శకత్వంలో నాగ చైతన్య కి పొగరుబోతు అత్తగా శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుంది. అయితే శైలజ రెడ్డి అల్లుడు సినిమా పాత్ర శివగామిని మరిపిస్తుందని అంటున్నారు. కానీ బాహుబలిలో శివగామిగా రమ్యకృష్ణ నడక, నటన.. ఆ పాత్రలోని హావభావాలు అన్ని కూడా రమ్యకృష్ణ కి మంచి పేరు తీసుకొచ్చాయి. గతంలో రజనీకాంత్ నరసింహలో రమ్యకృష్ణ ఎంతగా హైలెట్ అయ్యిందో బాహుబలిలో శివగామిగా అంత కన్నా ఎక్కువే హైలెట్ అయ్యిందని చెప్పాలి. మరి ఇప్పుడు శైలజ రెడ్డి అల్లుడు సినిమాలోనూ రమ్యకృష్ణ పొగరుబోతు అత్తగా అధికారం చూపిస్తుందని.. ఈ సినిమాతో రమ్యకృష్ణ కి మరిన్ని రోల్స్ రావడం ఖాయమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.రమ్యకృష్ణ కోసం దర్శకనిర్మాతల క్యూఅలాగే రమ్యకృష్ణ అడిగిన పారితోషకం ఇవ్వడానికి కూడా దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు. మరి ప్రత్యేకించి రమ్యకృష్ణకి మంచి పవర్ ఉన్న పాత్రలను తమ సినిమాల్లో క్రియేట్ చేస్టున్నారు అంటే రమ్యకృష్ణ డిమాండ్ ఎంతగా పెరిగిందో అర్థమవుతుంది. ఇక తమ సినిమా గురించి కథ అనుకున్నదే తడువుగా రమ్యకృష్ణ డేట్స్ కోసం దర్శక నిర్మతలు క్యూ కడుతున్నారని టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో బిజీగా వున్నా రమ్యకృష్ణ డిమాండ్ ఈ రేంజ్ లో ఉందంటే.. సినిమాలో హీరోయిన్ ని సెట్ చేసే కన్నా ముందు రమ్యకృష్ణ డేట్స్ కోసం ఆరాటపడుతున్నారంటే తెలుస్తుంది ఆమె రేంజ్. తాజాగా రమ్యకృష్ణ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దర్శకుడు సాగర్ చంద్ర - వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమాలో కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించడం .. ఆమె ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాలోనూ రమ్యకృష్ణ రేంజ్ కి తగినట్టుగానే ఆమె పాత్ర వుంటుందట. |
https://www.telugupost.com/international/blaze-kills-at-least-40-people-at-migrant-detention-center-near-mexico-us-border-1469353 | మెక్సికో - అమెరికా సరిహద్దుల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 40 మంది బతుకులు సజీవ శిథిలమయ్యాయి. నేషనల్ మైగ్రేషన్ ఇనిస్టిట్యూట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అమెరికా బోర్డర్కు దగ్గరలోని ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన మెక్సికోలో కలకలం రేపింది. ప్రమాదంలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వలస ప్రజల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో మంటలు చెలరేగడంతో సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. గత రాత్రి 10 గంటల సమయంలో శిబిరంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో శిబిరంలో మొత్తం 68 మంది ఉన్నట్టు అధికారులు ప్రకటించారు.మెక్సికోలోని నేషనల్ మైగ్రేషన్ ఇనిస్టిట్యూట్ అనే ప్రభుత్వ సంస్థ వలసదారుల రెగ్యులేషన్ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. అమెరికా వెళ్లేందుకు జనం గుమిగూడినపుడు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడున్నవారిలో చాలామంది వెనిజులాకి చెందినవారని సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్సులలో ఆస్పత్రులకు తరలించారు. కాగా.. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఐఎన్ఎం వెల్లడించింది. |
https://www.telugupost.com/movie-news/there-is-no-character-in-trivikra-srinivas-movie-for-sunil-129416/ | త్రివిక్రమ్ కి సునీల్ అంతే ఎంత ఇష్టమో మనకి తెలిసిన విషయమే. సునీల్ హీరోగా నిలదొక్కుకోలేక, మళ్లీ తనకు పేరు తెచ్చిన కామెడీ పాత్రల పైనే ఇంట్రెస్ట్ చూపుతూ అరవింద సమేత లో చేసాడు. త్రివిక్రమ్ కూడా సునీల్ కి ఈ సినిమాతో ముందుకు వెళ్తాడు అని భావించాడు. కానీ ఆ పాత్ర పెద్ద గా క్లిక్ అవ్వలేదు. అందుకే సెకండ్ సినిమాతో అన్నా ఆ లోటు తీర్చుకుందామని అతనికి బన్నీ సినిమాలో ఓ పాత్ర ఇచ్చాడు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో సునీల్ పాత్ర లేనట్టే అని వార్తలు వస్తున్నాయి. మంచి రోజులొస్తాయనుకుంటే….. బన్నీ – త్రివిక్రమ్ సినిమాతో తన కెరీర్ కి మంచి రోజులు వచ్చినట్టే అనుకున్నాడు సునీల్. కానీ ఏం చేస్తాం ఆ అవకాశం లేదు. బన్నీ సినిమాలో రావురమేష్ నటించాల్సి వుంది. ఆ పాత్రతో పాటు సునీల్ పాత్ర వుంటుందని తెలుస్తోంది. అయితే రావు రమేష్ తో డేట్స్ క్లాష్ రావడంతో అతని ప్లేస్ లో హర్ష వర్ధన్ ను తీసుకున్నారు. హర్ష వర్ధన్ ని ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు పాత్రనే మార్చేసారని తెలుస్తోంది. దాంతో సునీల్ పాత్ర కూడా లేచిపోయిందని బోగట్టా. |
https://www.telugupost.com/crime/rtc-bus-hits-car-four-died-in-a-road-accident-at-mulugu-1355326 | ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా.. తాగుబోతుల వల్ల, ర్యాష్ డ్రైవింగ్, అతివేగం ఇలా రకరకాల కారణాల చేత జరిగే రోడ్డు ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫలితంగా వారి కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుతోంది. తాజాగా తెలంగాణలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. వారంతా ఎంతో సంతోషంగా, భక్తిగా మేడారం జాతరకు వెళ్లి వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని తిరిగి కారులో పయనమయ్యారు.Also Read : మహిళను ఎస్ఐ లాఠీతో కొట్టి? మార్గమధ్యంలో గట్టమ్మ గుడి సమీపంలోకి కారు రాగానే.. ఆర్టీసీ ఆ కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/ram-charan-gifted-1-gm-gold-to-who-worked-for-rrr-1363085 | ఆర్ఆర్ఆర్ టీమ్ కు బంగారం బహుమతిగా ఇచ్చిన చరణ్ ఆర్ఆర్ఆర్.. విడుదలైన తొలివారంరోజుల్లో రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి.. ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా చరిత్ర సృష్టించింది. ఇక రెండోవారం కూడా ఆర్ఆర్ఆర్ హవా కొనసాగుతోంది. వీకెండ్ లో రికార్డుస్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. సినిమా ఘన విజయం సాధించడంతో.. రాజమౌళి, తారక్, చరణ్ లు సహా.. నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాకు పనిచేసిన వర్కర్స్ కు బంగారం బహుమతిగా ఇచ్చారు. సినిమాకోసం పనిచేసిన వివిధ శాఖల వారిని ఉదయం అల్పాహారం కోసం పిలిపించి.. ఈ బహుమతి ఇచ్చారు. వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి చెందిన వారిని, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్లు ఇలా మొత్తం 35 మందికి ఒక్కో తులం చొప్పున బంగారు నాణేలను అందించారు. ఆ నాణేలపై రామ్ చరణ్ అని రాసి ఉంది. సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. |
https://www.telugupost.com/movie-news/viraj-ashwin-mayapetika-movie-releasing-on-ott-this-date-1493344 | విరాజ్ అశ్విన్ నటించిన 'బేబీ' సినిమా భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే..! ఆ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఇప్పుడు అతడు నటించిన మరో సినిమా కూడా ఓటీటీలో సందడి చేయబోతోంది. ఆ సినిమా 'మాయాపేటిక'. త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఆహాలో స్ట్రీమ్ అవ్వనుంది మాయాపేటిక సినిమా.థ్యాంక్యూ బ్రదర్ మూవీ డైరెక్టర్ రమేష్ రాపర్తి 'మాయాపేటిక' సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూన్ 30న థియేటర్లలోకి వచ్చింది. విరాజ్ అశ్విన్ తోపాటు సిమ్రన్ కౌర్, పాయల్ రాజ్పుత్ ఇందులో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవ్వనుంది. రిలీజైన రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. మాయాపేటిక సినిమా ఆరు చిన్న కథల ఆంథాలజీ. ఓ మొబైల్ ఫోన్ ద్వారా వీళ్లు కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలేమిటన్నది సినిమాలో చూపిస్తారు. |
https://www.telugupost.com/movie-news/మరీ-ఇంత-ద్వేషమా-17900/ | సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ని ద్వేషిస్తున్నాడట. ఈ విషయాన్ని సల్మాన్ స్వయం గా ట్వీట్ చేసాడు. మీరు విన్నది నిజమే ఈ మాట సల్మాన్ స్వయం గా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అమీర్ ఖాన్ తాజాగా నటించిన 'దంగల్' చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. విడుదలకి ముందే 'దంగల్' ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం విడుదలైన మొదటి షో కే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్లు లో దూసుకుపోతుంది. ఇప్పటికే క్రీడాకారుల జీవితకథలతో తెరకెక్కించిన చిత్రాలన్నీ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినవే ఎక్కువగా వున్నవి. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో నటించిన అమీర్ పై సల్మాన్ ద్వేషం కక్కుతున్నాడు. ద్వేషం అంటే నిజంగా కాదు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇద్దరు చాలామంచి స్నేహితులు. అయితే సల్మాన్ చాలా సరదాగా ఈ రోజు మా ఫ్యామిలీ అంత కలిసి దంగల్ సినిమా చూసింది.. ఇది 'సుల్తాన్' మూవీ కంటే బాగుంది. అమీర్ ఖాన్ నిన్ను వ్యక్తిగా వ్యక్తిగతంగా ప్రేమిస్తాను కానీ.. వృత్తిపరంగా మాత్రం ద్వేషిస్తున్నాను అంటూ చమత్కారం గా ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఇక ఇప్పుడు సల్మాన్ ట్వీట్ తో ఈ సినిమాపై ఉన్న చిన్న చిన్న అనుమానాలు కూడా పటాపంచలైపోతాయి. ఇంకా ఈ సినిమాపై అంచనాలను పెరిగి అన్ని బాలీవుడ్ చిత్రాల కలెక్షన్స్ ని క్రాస్ చేసి మొదటి స్థానానికి చేరుకుంటుందనేది అక్షర సత్యం గా కనబడుతుంది. |
https://www.telugupost.com/movie-news/హాట్స్ఆఫ్-ఆర్జీవీ-49701/ | సాధరణంగా సినిమా షూటింగ్ దిశలో వున్నపుడు కానీ, షూటింగ్ ఫినిష్ అయ్యాక కానీ ప్రొమోషన్స్ స్టార్ట్ చేస్తారు... చాలా మంది దర్శక నిర్మాతలు. కానీ ఆలా చేస్తే రామ్ గోపాల్ వర్మ ఎందుకు అవుతాడు. తన సినిమా స్టార్ట్ అవకముందే సినిమా ఎలా వుండబోతుందో ప్రొమోషన్స్ రూపంలో చెప్పేస్తాడు రాము. లేటెస్ట్ గా తాను నాగార్జునతో తీయబోయే సినిమాకు ఫస్ట్ పోస్టర్ తో రిలీజ్ కు ముందే సెన్సేషన్ కు తెరలేపాడు.ఫామిలీ సినిమాలు తీసి విసిగిపోయిన నాగార్జున.. రాము చెప్పిన కథ నచ్చి ఒకే చేసాడు. ఈ సినిమా షూటింగ్ కి కూడా రెడీ అయిపోయింది. అయితే రాము ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్న సందర్భంగా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఓ టేబుల్ పై పిస్టల్ - పోలీస్ టోపీ- ఏక్ గ్లాస్ చాయ్.. అంతే ఇంకా ఏమి లేవు. ఒక్క ఫోటోతోనే ఇంట్రస్ట్ క్రియేట్ చేశాడు ఆర్జీవీ. సోషల్ మీడియాలో కూడా ఈ ఫొటోకు ప్రశంసలు కురిపిస్తున్నారు.వీళ్లిద్దరి కాంబినేషన్ లో శివ, అంతం, గోవిందా.. గోవిందా సినిమాలు వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాల తరవాత వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. మాఫియా - పోలీస్ కథలను ఆర్జీవీ బాగా తీయగలడని నమ్మి ఛాన్స్ ఇచ్చాడు నాగ్. మరి నాగ్ ఆశించినట్టు వర్మగారు మంచి యాక్షన్ ఎంటర్ టెయినర్ తీయాలనే ఆశిద్దాం. |
https://www.telugupost.com/movie-news/venkatesh-daughter-marriage-95957/ | సీనియర్ హీరోలైన నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి పిల్లలకి దాదాపుగా వివాహాలు అయ్యాయి. చిరు ముగ్గురు పిల్లలకి ఎప్పుడో పెళ్లిళ్లు అయ్యాయి. ఇక బాలయ్య ఇద్దరు కూతుళ్లకి పెళ్లి అయ్యి కొడుకు మోక్షజ్ఞ మాత్రమే పెళ్లికి ఉన్నాడు. మోక్షజ్ఞ ఇంకా చిన్నోడే. ఇక నాగార్జున కూడా నాగ చైతన్యకి పెళ్లి చేశాడు. ఇక సీనియర్ హీరోస్ లో వెంకటేష్ తన పిల్లల పెళ్లిళ్లు చెయ్యాల్సి ఉంది. అయితే మొన్నీమధ్యనే వెంకటేష్ కూతురు ఆశ్రిత పెళ్లి జరగబోతున్నట్టుగా వార్తలొచ్చాయి. ఆశ్రిత ఎవరినో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతుందనే న్యూస్ హైలెట్ అయ్యింది.ముహూర్తం ఖరారు...అయితే ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డి మనవడితో జరగనున్నదట. సురెందర్ రెడ్డి మనవడు వెంకీ కూతురు ఆశ్రిత మంచి ఫ్రెండ్స్. తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడడంతో ఇటు వెంకీ ఫ్యామిలీ అటు సురెందర్ రెడ్డి ఫ్యామిలీ ఈ పెళ్లి విషయమై మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావడం... ఇరు పెద్దలు కలిసి పెళ్లికి ముహూర్తం పెట్టుకోవడం జరిగిందని చెబుతున్నారు. కార్తీక మాసం అంటే నవంబర్ 24న వెంకటేష్ కూతురు ఆశ్రిత వివాహం జరగనుందట. అయితే పెళ్లికి కేవలం 20 రోజులు మాత్రమే ఉండడంతో... ఇరు కుటుంబాల వారు ఆశ్రిత పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారని తెలుస్తుంది. పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తున్నట్లుగా చెబుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/నయనానందం-అంటున్నారు-65055/ | మలయాళం నుండి వచ్చి తెలుగు, తమిళంలోనూ ఏకబిగిన సినిమాలు చేస్తూ పాతుకుపోయిన నయనతార ప్రస్తుతం సౌత్ లో సూపర్ స్టార్ మాదిరిగా ఎదిగింది. అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా నయనతారకి గొప్ప పేరుంది. అత్యధిక డిమాండ్ గల భామగా నయనతార కి పేరుంది. చిన్న పెద్ద హీరోలతో జోడి కట్టే నయనతార లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కూడా పెట్టింది పేరు. నయనతార సోలోగా చేసిన సినిమా స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా కలెక్షన్స్ ని వసూలు చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంటరైనప్పటినుండి ఇప్పటివరకు వన్నెతరగని అందంతో అదరగొడుతున్న నయనతార ఇప్పటికీ టాప్ హీరోయిన్నే.అయితే నయనతార సినిమాల్లో ఎంతగా సక్సెస్ అయ్యిందో నిజ జీవితంలో మాత్రం అనేక లవ్ ఫెయిల్యూర్స్ తో ఇబ్బందులు పడింది. ఎట్టకేలకు కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో మాత్రం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం విగ్నేష్ శివన్ తో ఎప్పటినుండో కలిసుంటున్న నయనతార విగ్నేష్ ని పెళ్లాడేందుకు కూడా రెడీ గా వుంది. ఇప్పటికే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వీరిద్దరూ అతి త్వరలోనే పెళ్లాడబోతున్నారని 'ది హిందూ' దినపత్రిక నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో 'ఎక్స్లెన్స్' అవార్డును అందుకున్న నయనతార యాదృచ్చికంగా కన్ఫర్మ్ చేసేసింది.అయితే తాను తాజాగా నటించిన కర్తవ్యం సినిమా అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను మంచి విజయం సాధించింది. అందులో భాగంగానే నయనతార 'ది హిందూ' దినపత్రిక నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో 'ఎక్స్లెన్స్' అవార్డును కూడా దక్కించుకుంది. అయితే తన హాట్ అండ్ కూల్ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే నయనతార తాజాగా పోస్ట్ చేసిన ఒక పిక్ మాత్రం అందరిని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆ ఫొటోలో నయనతార ఎంతో పద్దతి గల అమ్మాయిగా ఆకట్టుకుంటుంది. ఆ ఫోటో చూసిన నయన్ అభిమానులు మాత్రం అబ్బా నయనానందం అంటూ తెగ షేర్స్ తో పాటు అందమైన కామెంట్స్ చేస్తూ నయనతార అందాన్ని పొగిడేస్తున్నారు |
https://www.telugupost.com/movie-news/tamannahs-comments-on-tamil-hero-vijay-136761/ | మిల్క్ బ్యూటీ తమన్నా నటించిన ‘పెట్రోమాక్స్’ చిత్రం రిలీజ్ అయింది. అయితే ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా..తమిళ నటుడు విజయ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో విజయ్ గురించి మీ స్పందన ఏంటీ అంటూ తమన్నా ను మీడియా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. దీని సమాధానంగా తమన్నా ఇలా చెప్పింది… ” ఆయన గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. ఆయనతో నేను ఒక్క సినిమానే నటించాను. నాకు ఆయనకు మధ్య ఎక్కువ కమ్యూనికేషన్ జరగలేదు. షూటింగ్ కి వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండేది. అసలు ఏమి తెలియని ఆయన గురించి ఏం మాట్లాడగలను.. ఆయన గురించి ఏమీ తెలియకుండా ఎలా కామెంట్ చేయగలను” అంది. ఈ మాటలకు విజయ్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. విజయ్ ను ఫ్యాన్స్ ఎలా కొలుస్తారో అందరికి తెలిసిందే. ఆయనను దేవుడిలా కొలిచే ఫ్యాన్స్ ఫీలింగ్ ను తమన్నా హర్ట్ చేసింది. ఆయన గురించి తెలియదని తమన్నా చేసిన వ్యాఖ్యలకు వారు సీరియస్ అవుతున్నారు. సూపర్ స్టార్ అయినా విజయ్ గురించి తెలియకపోవడం ఏంటి అంటూ ఆమెపై సీరియస్ అవుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/sarkar-movie-story-77128/ | స్టార్ హీరో సినిమాలంటే రూమర్స్ క్రియేట్ అవ్వడం కామన్. అవి అప్పుడప్పుడు సినిమాకు ప్లస్ అవుతుంటాయి. ప్రస్తుతం చాలా సినిమాల కథల పట్ల గాసిప్స్ వస్తున్నాయి. అలానే లేటెస్ట్ గా తమిళ మూవీ 'సర్కార్' మూవీకి సంబంధించి ఓ రూమర్ బయటికి కి వచ్చి వైరల్ అవుతుంది. రీసెంట్ గా డైరెక్టర్ మురగదాస్.. మహేష్ బాబుతో 'స్పైడర్' సినిమాతో డిజాస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మురగదాస్.. హీరో విజయ్ తో 'సర్కార్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మూడురోజులు కిందటే రిలీజ్ అయ్యి సినిమాపై హైప్ ను క్రియేట్ చేసింది. ఇది ఒక పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమా.ఒకటే స్టోరీ లైన్ ఎంచుకున్నాడా..?దీనిపై వచ్చిన రూమర్ ఏంటంటే మహేష్...'భరత్ అనే నేను' సినిమా పాయింట్ నే మురగదాస్ ఎంచుకున్నాడట. విదేశాల్లో చుదువుకుంటున్న కుర్రోడు కొన్ని కారణాలు వల్ల ఇండియా వచ్చి ఇక్కడ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతాడు అనేదే భరత్ అనే నేను సినిమా స్టోరీ లైన్. సర్కార్ సినిమా స్టార్టింగ్ పాయింట్ కూడా ఇదేనట. విజయ్ అమెరికా నుండి చెన్నై వచ్చి తమిళనాడులో పాలిటిక్స్ లోకి ఎలా ఎంటర్ అయ్యాడు, రాజకీయాల్లో విజయాన్ని ఎలా సాధించాడు అనేది ప్రధాన అంశమని తెలుస్తోంది. |
https://www.telugupost.com/movie-news/who-cheated-tamanna-176558/ | హీరోయిన్స్ అంటే సెలబ్రిటీస్. వాళ్లకు కొన్ని అలవాట్లు ఉంటాయి. కానీ అభిమానుల నుండి సెలబ్రిటీస్ కి ప్రయివేసి ఉండదు. వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో జరుగుతుందో అనేది వాళ్ళకి కావాలి. ఇక వాళ్ళకీ హృదయం ఉంటుంది, మేమేమి బొమ్మలు కాదు అంటూ చాలామంది హీరోయిన్స్ ఫైర్ అవుతుంటారు. తాజాగా తమన్నా, సమంత సామ్ జామ్ షోలో చాలా విషయాలను పంచుకుంది. విజయ్ దేవరకొండ హీరో అయితే రూల్స్ మొత్తం పక్కనపడేసి ముద్దు సీన్స్ కి సై అంటానంటూ సంచలనంగా మాట్లాడిన తమన్నాని సమంత ఓ ప్రశ్న అడిగింది. తమన్నా మీ ఇన్స్టా లో మీరు కాఫీ ని ఇష్టపడతారు. అలాగే కవి, నటి అని ఉంది. మీరు కవితలు కూడా రాస్తారా. నాకసలు ఇప్పటివరకు తెలియదే అని అడిగిన సమంత కి తమన్నా షాకింగ్ సమాధానమే ఇచ్చింది. తమన్నా హృదయం బద్దలైనప్పుడే తాను కవిగా మారానని చెబుతుంది. ఎప్పుడైతే మన హృదయం బద్దలవుతుందో అప్పుడు మనం కవితలు కూడా రాస్తాం. ఈ విషయం నీకు కూడా తెలుసు అంటూ.. సమంత గతాన్ని కెలికేసింది. మన హృదయం ముక్కలయినప్పుడే మనం కవితలు రాస్తూ కవిగా మారతాం. ఈ సమాజంలో చాలామంది ఎదుటి వారి హృదయాలను ముక్కలు చేసే మనుషులు ఉంటారు అని తమన్నా అనగానే.. తమన్నా గుండె బద్దలు కొట్టిన ఆ మనిషి ఎవరు? వెంటనే కనిపెట్టాలంటూ కామెడీ చేసింది సమంత. |
https://www.telugupost.com/movie-news/taxiwala-release-84477/ | నిజానికి 'గీత గోవిందం' కన్నా ముందే విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అది జరగలేదు. 'టాక్సీవాలా' షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకుని..మే 18న రిలీజ్ అంటూ ప్రెస్ మీట్ లో కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఉన్నట్టుండి సినిమా వాయిదా పడిపోయింది. ఆ తర్వాత జూన్ లో రిలీజ్ అవుతుందన్నారు కానీ ఆగస్టు కూడా వచ్చేసింది. ఇంతవరకు ఈ సినిమా ఊసే లేదు.క్లారిటీ ఇచ్చిన విజయ్ఈలోపు ‘ట్యాక్సీవాలా’ను పక్కన పెట్టేసి 'గీత గోవిందం'ను రిలీజ్ చేశారు. 'టాక్సీవ్వాలా' టీం నుండి కూడా ఎవరూ ఈ సినిమాపై స్పందించకపోవటంతో.. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్న ప్రశ్నలు ప్రేక్షకులని వెంటాడుతున్న టైంలో హీరో విజయ్ ఈ సినిమా గురించి నోరు విప్పాడు. నిన్న జరిగిన 'గీత గోవిందం' ప్రమోషన్స్ లో ‘ట్యాక్సీవాలా’ పై క్లారిటీ ఇచ్చాడు.మళ్లీ పని చేయిస్తున్నందునే...గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జాప్యం వల్లే సినిమా వాయిదా పడిందన్నాడు. అంతకుముందు చేసిన వర్క్ మాకు నచ్చకపోవటంతో మళ్లీ మరోసారి మొత్తం పనిని చేయిస్తున్నామని అందుకే లేట్ అవుతుందని అని ఆయన అన్నాడు. ఎటువంటి హడావిడి లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నామని..అంతా ఓకే అనుకున్నాక కొన్ని రోజుల్లోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని విజయ్ తెలిపాడు. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా హిట్ అవుతుందనే నమ్మకం తనకు ఉందని విజయ్ అన్నాడు. |
https://www.telugupost.com/top-stories/there-was-a-fire-accident-in-secunderabad-seven-people-died-in-this-accident-1438428 | సికింద్రాబద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పాస్పోర్టు కార్యాలయం సమీపంలోని రూబీ లాడ్జిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెల్లార్ లో ఎలక్ట్రికల్ స్కూటర్ల బ్యాటరీలు పేలి లాడ్జిలోకి మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో ఉన్న ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా నలుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. గాయపడిన కొందరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.ఎలక్ట్రిక్ బ్యాటరలు...రూబీ హోటల్ మొత్తం 25 గదులున్నాయి. అందులో ఇరవైై మూడు మంది ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో విజయవాడకు చెందిన హరీశ్, చెన్నైకు చెందని సీతారామన్, ఢిల్లీకి చెందిన వీరేంద్ర ఉన్నట్లు పోలీసులు గుర్తంచారు. మిగిలిన వారు స్పృహకోల్పోయి లాడ్జిలో పడి ఉన్నారు. ఈ ఘటనలో పది మందికి పైగా తీవ్ర గాయాలపాలవ్వడంతో వారందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కొందరు లాడ్జిపై నుంచి కిందకు దూకారు. హోటల్ కు ఇన్, ఎగ్జిట్ ఒకే దారి ఉండటంతో తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/after-saira-tollywood-did-not-get-a-lot-of-films-137191/ | సైరా తరువాత టాలీవుడ్ లో చెప్పుకోవడానికి పెద్దగా సినిమాలు ఏమి రాలేదు. గోపీచంద్ చాణిక్య అలా వచ్చి అలా వెళ్లి పోయింది. ఇక ఈ వారం అంటే రేపు మూడు స్ట్రెయిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో మొదటిగా రాజు గారి గది 3. ఈ మూవీ పై పెద్దగా అంచనాలు లేవు. కానీ కామెడీ తో టైంపాస్ అయిపోతుందని సినీ లవర్స్ భావిస్తున్నారు. హీరోగా అశ్విన్ బాబు హీరోయిన్ గా అవికా గోర్ కి పెద్ద ఇమేజ్ లేకపోవడంతో ఈ సినిమా మౌత్ టాక్ బట్టి ఆడనుంది. ప్రేక్షకుల ఓటు దేనికో…..? ఇక సాయి కుమార్ కొడుకు ఆది నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కూడా ఇంచుమించు అంతే ఉంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. కాశ్మీరీ పండిట్ లా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన చిత్రంలా కనిపిస్తుంది. సినిమా బాగుందని టాక్ వస్తే తప్ప దీని కోసం ప్రేత్యేకించి థియేటర్స్ కి వెళ్ళరు జనాలు. అలానే ఈ రెండిటితో పాటు మరో చిన్న సినిమా కూడా అదే రోజు వస్తోంది. కృష్ణారావు సూపర్ మార్కెట్ అనే ఈ సినిమా గురించి ఎవరికి పెద్దగా అవగాహన కూడా లేదు. అసలు ఈ మూవీ రేపు రిలీజ్ అవుతుందని కూడా ఎవరికి తెలియదు అంటే ఈ సినిమా పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. సో సినీ లవర్స్ కి ఈ మూడు మూవీస్ లో ఏం నచ్చుతుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/raj-tharun-rajugadu-72020/ | యంగ్ హీరో రాజ్ తరుణ్ "రాజుగాడు" చిత్రం జూన్ 1 న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన పాటలకు, చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది. రాజ్ తరుణ్ తో 'ఈడో రకం ఆడో రకం', 'అందగాడు ', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వంటి విజయవంతమైన చిత్రాలనందించిన ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం కావడంతో "రాజుగాడు" పై భారీ ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రంతో సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో డా. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హిలేరియస్ కామెడీ తో ఫామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం అందించారు. ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లను త్వరలో జరపనున్నారు.తారాగణంరాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, రావు రమేష్, సిజ్జు, పృధ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్యా, ఖయ్యుమ్, అదుర్స్ రఘు, అభి ఫిష్ వెంకట్, గుండు సుదర్శన్, పూజిత, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కథ: ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్, మూల కథ: మారుతి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, స్టిల్స్: రాజు, మేకప్: రామ్గా, కాస్ట్యూమ్స్: శివ-ఖాదర్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్-రియల్ సంతోష్, కొరియోగ్రఫీ: రఘు-విజయ్, ఆర్ట్: కృష్ణ మాయ, చీఫ్ కో డైరెక్టర్: ప్రసాద్ దాసం, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రాఫర్: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర-డా.లక్ష్మారెడ్డి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంజనా రెడ్డి. |
https://www.telugupost.com/movie-news/balayya-meena-192633/ | బాలకృష్ణ – బోయపాటి అఖండ మూవీ షూటింగ్ కి కరోనా కారణంగా ఎలాంటి డిస్టబెన్స్ లేదు. యూనిట్ మొత్తం సేఫ్ జోన్ లో ఉండి అఖండ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నా.. ప్రస్తుతం అయితే మే 28 న అఖండ మూవీ రిలీజ్ అవడం కుదరదు. ఎందుకంటే అఖండ మూవీ రిలీజ్ చెయ్యడానికి థియేటర్స్ ఓపెన్ అవ్వాలిగా. అఖండ టీం ఎంతగా పోరాడినా సినిమాని రిలీజ్ చెయ్యడం కుదరదు. అఖండ మూవీ పోస్ట్ పోన్ చేసిన మేటర్ అధికారికంగా రాకపోయినా అదే ఫిక్స్. ఇక అఖండ మూవీ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటెర్టైనెర్ చెయ్యబోతున్నాడు.ఆ సినిమాలో బాలకృష్ణ కోసం గోపీచంద్ ఇద్దరు హీరోయిన్స్ కి ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. అందులో ఒకటి కోలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ అయితే మరొకరు సీనియర్ హీరోయిన్ మీనా అంటున్నారు. బాలకృష్ణ సినిమాలో శృతి నటిస్తుందా అన్న ప్రశ్నకి తనకి క్రాక్ తో పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ అడిగితే శృతి హాసన్ కాదనదు అనే నమ్మకం బాలయ్య ఫాన్స్ లో కలుగుతుంది. ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణ కి జోడిగా మీనా ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. గోపీచంద్ కూడా బాలయ్య రెండు కేరెక్టర్స్ లో చూపించబోతున్నాడట. ఆ రెండు కేరెక్టర్ లో బాలయ్య ఫ్యాక్షనిస్టు, పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ సినిమాకి ఇద్దరు హీరోయిన్స్ ఆవరసరమవుతున్నారట.ఇక మీనా-బాలయ్య కాంబో అనగానే వారు గతంలో నటించిన హిట్స్ గుర్తుకు రాగా.. ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవడం ఖాయం. ఇప్పటికే గోపీచంద్ మీనా ని సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తుంది. |
https://www.telugupost.com/movie-news/jahnavi-felt-bad-about-trolling-166554/ | హీరోయిన్స్ అయినా హీరోలయినా.. సోషల్ మీడియాలో వేరే అభిమానుల చేత ట్రోల్ల్స్ చేయబడతారు. తమకి నచ్చిన నటులను ట్రోల్ చెయ్యడంలో నెటిజెన్స్ కి మించిన వారు లేరు. సోషల్ మీడియాలో ఫాన్స్ వార్ లో ఇలాంటి ట్రోలింగ్స్ చూస్తుంటాం. కానీ బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మరణం తర్వాత సినీరంగ రంగ వారసులను సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులు తెగ ట్రోల్ చేసారు. కరణ్ జోహార్ లాంటివాళ్లు ట్రోలింగ్ కి భయపడి ఇంతవరకు బయటికి రాలేదు. అలియా భట్, సోనాక్షి, సోనమ్ కపూర్, సారా అలీ ఖాన్.. అబ్బో ఎవ్వరిని సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులు వదల్లేదు. ఆ సెగ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కి గట్టిగా తగిలింది. అలియా భట్, మహేష్ భట్ లకు సడక్ 2 ట్రైలర్ తోనే డిస్ లైక్స్ సెగ చూపించిన సుశాంత్ సింగ్ అభిమానులు.. శ్రీదేవి కూతురు జాన్వీ నటించిన గుంజన్ సక్సేనా సినిమాకి ట్రోలింగ్ తో సమాధానం చెప్పారు. ఈ సినిమా ఓటిటి ద్వారా విడుదలయ్యాక సినిమాలో విషయం లేదని, రివ్యూస్ అన్ని ఫేక్ అని, జాన్వీ కపూర్ నటన బాగోలేదని, గుంజన్ సక్సేనా పాత్ర పోషించే స్టేచర్ కానీ, మెచ్యూరిటీ కానీ, స్థాయి కానీ జాన్వీలో లేవంటూ కూడా విమర్శలు గుప్పించడమే కాదు.. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ని తెగ ట్రోల్ చేసారు నెటిజెన్స్. దానితో జాన్వీ కపూర్ చాలా అప్ సెట్ అయ్యిందట. తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన జాన్వీ కపూర్… గుంజన్ సక్సేనా సినిమాపై వచ్చిన ప్రతి రివ్యూనీ, అలాగే ప్రతి ట్రోల్ నీ తాను చూశానని చెప్పింది. ఆ ట్రోలింగ్ తనని చాలా అంటే చాలా బాధ పెట్టిందని… అసలుఈ సినిమాకు వచ్చిన క్రిటిసిజంపై తన తండ్రి బోని కపూర్ కూడా బాగా ఫీలయ్యారని చెప్పింది. మా నాన్న నా సినిమా ముందే చూశారు. నా నటన పట్ల ఆయనకు నమ్మకం వుంది. అందుకే నాపై వచ్చిన ట్రోల్ ని అయన అంతగా ఆయన పట్టించుకోలేదు.. కానీ నేనే ఈజీగా తీసుకోలేకపోయా అంటూ వాపోతుంది. |
https://www.telugupost.com/movie-news/no-one-invited-ntr-to-ntr-function-101829/ | మొన్నటివరకు ఎన్టీఆర్ - బాలయ్య కలుస్తారా..? కలవరా..? అని అనుకున్నారు. తీరా కలిశాకా ఎన్టీఆర్ ను బాలయ్య ఆ ఫంక్షన్ కి పిలుస్తాడా? బాలయ్యను ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కి పిలుస్తాడా అని మొదలయ్యాయి. అవును మరో వారం రోజుల్లో ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కృష్ణ జిల్లా నిమ్మకూరులో జరగనుంది. డిసెంబర్ 21న జరిగే ఈ ఫంక్షన్ కి నందమూరి ఫ్యామిలీ మొత్తం అటెండ్ అవ్వనుంది. నందమూరి ఫ్యామిలీ అంటే అందరూ వస్తారు కాబట్టి ఆ ఫంక్షన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తాడా..? అసలు ఆయనను ఆహ్వానిస్తారా..? ఎన్టీఆర్ పాటు తన తల్లిని కూడా పిలుస్తారా..? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.ఎన్టీఆర్ ని పిలవడం మాత్రం ఖాయంఅయితే తాజా సమాచారం ప్రకారం ఇంతవరకు ఎన్టీఆర్ కు ప్రీ రిలీజ్ ఆహ్వానం అందలేదని తెలుస్తుంది. ఎన్టీఆర్ తల్లిని పిలిచినా పలవకపోయిన ఎన్టీఆర్ ని అయితే కచ్చితంగా పిలుస్తారు అని బాలయ్య దగ్గరి సన్నిహితులు అంటున్నారు. మరో వారం టైం ఉంది కాబట్టి ఈ లోపల ఎన్టీఆర్ ను బాలయ్య పిలిచే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ ను ఎలాగూ పిలుస్తారు. బాలయ్య 'అరవింద సమేత' సక్సెస్ మీట్ కు వచ్చాడు కాబట్టి ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ వస్తాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ ను పిలిస్తే, ఆయన వెళ్తే మాత్రం ఫంక్షన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు. మరి బాలయ్య కు ఇది నచ్చుతుందో లేదో. |
https://www.telugupost.com/movie-news/producer-dil-raju-plans-110892/ | మహర్షి సినిమా తరువాత మహేష్.. సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలి కానీ అది సెట్ అవ్వలేదు. సుకుమార్ స్టోరీ ఇంకా ఫైనల్ అవ్వలేదు. రీసెంట్ గా సుకుమార్ కొంత టైం కావాలి అని అడగడంతో తెరపై అనిల్ రావిపూడి వచ్చాడు. ఆయన ఇటీవలే మహేష్ కు ఓ స్టోరీ వినిపించాడు. స్టోరీ విన్న మహేష్ వెంటనే ఓకే చేసాడట. త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కి మొదటి నుండి అనిల్ సుంకరనే నిర్మాత. పార్ట్ నర్ గా చేరిన దిల్ రాజు కానీ రీసెంట్ గా ఈ మూవీ నిర్మాత దిల్ రాజు భాగస్వామ్యం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య మాటలు జరిగినట్లు బోగట్టా. మొన్నటివరకు అనిల్ ఒక్కడే నిర్మాత అనుకున్నారు. కానీ ఇప్పుడు పార్టనర్ కింద దిల్ రాజు చేరాడు. మూడో బ్యానర్ కింద మహేష్ బాబు బ్యానర్ వుంటుందా? వుండదా? అన్నది ఇంకా తెలీదు. అనిల్ ప్రస్తుతం తన టీమ్ తో స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయిపోయారు. మహేష్ మహర్షి తరువాత నెల గ్యాప్ తీసుకుని అనిల్ తో సినిమా చేయనున్నాడు. |
https://www.telugupost.com/movie-news/అక్కడచేజారినా-ఇక్కడ-అంద-26357/ | చిరు కామ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150 ' లో ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ కేథరిన్ ని తీసుకున్నారు. కానీ ఏవో కారణాలతో ఆమె 'ఖైదీ..' ఐటెం సాంగ్ నుండి తప్పుకుంది. కేథరిన్ స్థానంలోకొచ్చిన లక్ష్మి రాయ్ 'ఖైదీ..' ఐటెం సాంగ్ లో భీబత్సం గా రెచ్చిపోయి మంచి పేరు కొట్టేసింది. పాపం కేథరిన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకుందని అందరూ అనుకున్నారు. కానీ కేథరిన్ తలపొగరు వల్లే 'ఖైదీ...' ఐటెం ఆమె చేజారిందనే ప్రచారం జరిగింది. ఇక కేథరిన్ ఇక్కడ తెలుగులో అవకాశాలు లేక అక్కడ కోలీవుడ్ లో కాస్త బిజీ అయ్యింది. అయితే ఇప్పుడు ఆమెకు టాలీవుడ్ లో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చిందని ప్రచారం మొదలైంది. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బెల్లం కొండా సురేష్ కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ - బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ కి జోడిగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా... శృతి హాసన్ ఐటెం లో నటించనుందని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారమయ్యాయి. కానీ ఇప్పుడు ఆ ఐటెం సాంగ్ లో డాన్స్ చేసే అవకాశాన్ని కేథరిన్ కొట్టేసిందని అంటున్నారు. ఇక బెల్లంకొండ సురేష్, అయన కొడుకు నటించే చిత్రాల కోసం టాప్ హీరోయిన్స్ నే ఐటమ్స్ కి కొడుక్కి జోడిగా సెలక్ట్ చేసుకుని వారికి భారీగా పారితోషకాల్ని ఆఫర్ చేస్తుంటాడని టాక్. అంటే ఈ లెక్కన కేథరిన్ కు, శ్రీనివాస్ చిత్రంలో ఐటెం సాంగ్ చెయ్యడానికి భారీగా రెమ్యునరేషన్ ముట్టజెబుతున్నారన్నమాట.ఇక చిరు ఖైదీ... లో ఛాన్స్ మిస్ అయితేనేమిటి ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో ఐటెం లో కనిపించి బాగా చేతినిండా సంపాదించడానికి కేథరిన్ సిద్ధమైందన్నమాట. మరి కేథరిన్ కి ఇక తెలుగు అవకాశాలు రావన్న వారు ఇప్పుడేం మాట్లాడతారో చూద్దాం. |
https://www.telugupost.com/top-stories/superstar-krishna-passed-away-doctors-confirmed-krishnas-death-early-today-1448164 | సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈ రోజు తెల్లవారు జామున కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటుతో కాంటినెంటల్ హాస్సిటల్ లో చేరిన కృష్ణ తుది శ్వాస విడిచారు. కృష్ణ మరణంతో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయంది. 1943 మే 31వ తేదీన కృష్ణ బుర్రిపాలెంలో జన్మించారు. కులగోత్రాల సినిమాతో తెరంగేట్రం చేసిన కృష్ణ 340 సినిమాలకు పైగా నటించారు.80 ఏళ్లుగా...వెండితెరపై డేషింగ్ అండ్ డేరింగ్ హీరోగా ఒక వెలుగు వెలిగిన కృష్ణ ఎందరినో అభిమానులను సంపాదించుకున్నారు. కృష్ణ మరణంతో తెలుగు సినీ రంగంలో ఒక జనరేషన్ ముగిసి పోయింది. తెలుగు సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేశారు. కృష్ణ హీరోగానే కాదు 16 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఎనభై ఏళ్ల వయసున్న కృష్ణ మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. |
https://www.telugupost.com/movie-news/మోడలింగ్-రంగంలో-ఉంటె-వది-51266/ | తెలుగు, తమిళంలో హీరోయిన్ గా ఎదగలేక నానా కష్టాలు పడుతూ ఇప్పుడు బికినీ ఫోటో షూట్స్ తో దర్శకనిర్మాతలు రెచ్చగొడుతూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నికిషా పటేల్.. తాను హీరోయిన్ గా మారానన్న ఒకే ఒక్క కారణంతో తన బాయ్ ఫ్రెండ్ తనని వదిలేసిపోయాడని చెబుతుంది. హీరోయిన్ గా మారడం వలనే తనని పెళ్లి చేసుకోవడానికి కూడా తన బాయ్ ఫ్రెండ్ ఇంట్రెస్ట్ చూపించడం లేదంటూ తన బాధను వెళ్లగక్కుతోంది. ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో నికిషా తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది.ఇలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తన వ్యక్తిగత జీవితాన్ని నష్ట పోయానని చెబుతుంది. అంతేకాకూండా ఈ మధ్యన హీరోయిన్స్ అంత క్యాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడుతున్నట్టే నికిషా కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి మీద నోరు విప్పింది. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి చోట ఉంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు లైంగిక వేధింపులు అనేది కామన్ అయిపోయాయి. హాలీవుడ్ లో హార్వే వ్యవహారం బయటకొచ్చిన తర్వాత నాన్న నాకు ఫోన్ చేశారు. టాలీవుడ్ లో ఇలాంటివి జరుగుతున్నాయా అని నన్ను అడిగారు. నా దగ్గర సమాధానం లేదు. కాస్టింగ్ కౌచ్ విషయానికొస్తే హాలీవుడ్ కు, టాలీవుడ్ కు పెద్ద తేడా లేదు అంటూ చెప్పిన తనని ఎవరైనా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.మరి నికిషా పాటిల్ కూడా హీరోయిన్ గా ఎదిగే క్రమంలో ఇలాంటి అవమానాలు ఎదుర్కుందా? లేదంటే నికిషా ఇలా కాస్టింగ్ కౌచ్ గురించిన విషయాలు మాట్లాడదు కదా అంటున్నారు. మరి హీరోయిన్స్ అంతా ఇలా సినిమా ఇండస్ట్రీస్ ని చీడ పురుగులా పట్టి పీడిస్తున్న కాస్టింగ్ కౌచ్ గురించి గొంతు చించుకుంటుంటే.. దానికి కారణమయిన వారు మాత్రం ఎంచక్కా తమ పనులు తాము చేసుకుపోతున్నారు. |
https://www.telugupost.com/movie-news/నాగ-చైతన్యతో-ఆ-భామా-45221/ | 'ప్రేమమ్, రారండోయ్ వేడుకచూద్దాం' చిత్రాలతో వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్యకు 'యుద్దం శరణం' చిత్రం మాత్రం తీవ్రంగా నిరాశను మిగిల్చింది. ఈ చిత్రం నిర్మాత సాయి కొర్రపాటికి కూడా భారీ నష్టాలనే మిగిల్చింది. కాగా ఈచిత్రం పరాజయాన్ని తన తదుపరిచిత్రం ద్వారా తుడిచిపెట్టాలని నాగచైతన్య భావిస్తున్నాడు. ఆయన ప్రస్తుతం చందుమొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' అనే ఇంట్రస్టింగ్ టైటిల్తోప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం టైటిలే కాదు.. పోస్టర్ కూడా ఎంతో కొత్తదనంగా ఉంది. మైత్రిమూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. ఇక ఈచిత్రంలో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలైంది. చివరకు ఓ బాలీవుడ్ సెక్సీ సుందరిని ఏరికోరి ఎంచుకున్నారట. టైగర్ ష్రాఫ్హీరోగా 'మున్నా మైఖేల్' చిత్రంలో నటించిన నిధి అగర్వాల్. ఈచిత్రం బాగా ఆడకపోయిన ఈ మొదటి చిత్రంద్వారా ఈమెకి మంచి సెక్సీ ఇమేజ్ వచ్చింది. ఇటీవలే దర్శకుడు చందుమొండేటి ఈ భామని కలిసి స్టోరీని వినిపించివచ్చాడట. ఆమె కూడా చందు ఇచ్చిన ఈ ప్రపోజల్కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలోహీరోయిన్ది విభిన్నకోణాలుండె ఓ కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. మొత్తానికి నాగచైతన్య 'సవ్యసాచి'పై ఎన్నో నమ్మకాలు పెట్టుకుని ఉన్నాడు. |
https://www.telugupost.com/movie-news/sita-ramam-movie-will-stream-on-amazon-prime-from-september-9th-1437449 | హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం సినిమా.. ఘన విజయాన్ని అందుకుంది. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా నెలరోజుల థియేట్రికల్ రన్ లో రూ.80 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో ఆకట్టుకుంది. మంచి కథ, కథనంతో ప్రేక్షకులను మెప్పించింది. ఓవర్సీస్ లోనూ సీతారామం ఆకట్టుకుంది. ఇప్పటికీ సీతారామం థియేటర్లలో సందడి చేస్తుండటం విశేషం.రష్మిక మందన్న, సుమంత్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్వప్నా సినిమాస్, వైజయంతి మూవీస్ బ్యానర్స్ పై సి. అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. తాజాగా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది అమెజాన్. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సీతారామం సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ లో సినిమా అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది. |
https://www.telugupost.com/movie-news/maharshi-movie-craze-120596/ | నిన్నమొన్నటివరకు మహేష్ మహర్షి సినిమా మీద ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. మహర్షి టీజర్, మహర్షి సాంగ్స్ అన్నీ ఎక్కడో విన్నట్టుగా, ఎక్కడో చూసినట్టుగా ఉన్నాయంటూ పెదవి విరుపులు వినిపించాయి. సినిమా విడుదల దగ్గర పడుతున్నా.. సినిమా మీద బజ్ క్రియేట్ మాత్రం కాలేదు. ఇక మధ్యలో నిర్మాతల మధ్యన విభేదాలంటూ మీడియాలో వార్తలు రావడంతో మహర్షి చుట్టూ నెగెటివిటి ఏర్పడింది. కానీ మహర్షి ఈవెంట్ దగ్గర నుండి.. మహర్షి ట్రైలర్ చూసాక సినిమా మీద మెల్లిగా అంచనాలు మొదలయ్యాయి. మహర్షి ట్రైలర్ కొత్తగా కనిపించడం, ప్రమోషన్స్ కూడా ఆకట్టుకునేలా ఉండడంతో సినిమా మీద ఇంట్రెస్ట్ మొదలైనది. హాట్ కేక్ లలా అమ్ముడవుతున్న టిక్కెట్లు ఇక ఆ క్రేజ్ ఎంతగా పెరిగింది అంటే.. మహర్షి సినిమా టికెట్స్ ఇలా బుక్ మై షోలో పెడుతున్నారో లేదో అలా బుక్ అవుతున్నాయి. దీంతో జెర్సీ సినిమా హవాకి, అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్రేకేసింది మహర్షి. ఇక అవెంజర్స్ క్రేజ్ కూడా ఈ వారాంతంలో అంతగా కనిపించడం లేదు. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ మొదటి వీకెండ్ లో బీభత్సంగా కనబడినా.. సోమవారం నుండి అవెంజర్స్ ఎండ్ గేమ్ హవా తగ్గుతూ కనబడింది. ఇక మహర్షి సినిమాకి మరో సినిమా పోటీ లేకపోవడం కూడా కలిసొచ్చే అంశం. కాగా మహర్షి సినిమా వచ్చిన రెండు వారాల వరకు మరో సినిమా లేకపోవడం, ఇక రెండు వారాలకు మీడియం రేంజ్ సినిమాలంటే సీత, అర్జున్ సురవరం లాంటి సినిమాలు తప్ప భారీ బడ్జెట్ చిత్రాలేమి బాక్సాఫీసు వద్దకు రాకపోవడం కూడా మహర్షికి కలిసొచ్చే అంశం. మహర్షికి హిట్ టాక్ పడిందా… ఇక నిర్మాతలకు కాసులే కాసులు. |
https://www.telugupost.com/crime/young-woman-raped-in-kodada-for-three-days-1365538 | కోదాడ : ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడ్రోజులపాటు అత్యాచారానికి పాల్పడి, చిత్రహింసలకు గురిచేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో చోటుచేసుకుంది. మూడ్రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం తెలియడంతో.. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కోదాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరిపి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకడు స్థానిక కౌన్సిలర్ కుమారుడిగా పోలీసులు గుర్తించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి పూల వ్యాపారం చేస్తుంటుంది. మూడ్రోజుల క్రితం ఇద్దరు యువకులు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి.. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఆమెతో తాగించారు. స్పృహకోల్పోయిన యువతిపై నిందితులు అత్యాచారం చేశారు. మూడ్రోజులుగా చిత్రహింసలకు గురిచేశారు. మూడు రోజుల తర్వాత యువతి ఇంటికి వచ్చింది. ఆమె ఒంటిపై ఉన్న గాయాలు చూసి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఏం జరిగింది అని అడగ్గా యువతి విషయం చెప్పింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి, పోలీసులను ఆశ్రయించారు. కాగా.. కౌన్సిలర్ కొడుకు ఈ కేసులో ఉండటంతో విషయాన్ని సైలెంట్ గా సెటిల్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. |
https://www.telugupost.com/andhra-pradesh/there-is-still-plenty-of-time-for-ycp-chief-ys-jagan-to-criticize-the-government-1542870 | వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఇంకా బోలెడంత సమయం ఉంది. దాదాపు 59 నెలల సమయం ఉంది. అయితే ముందుగానే ఆయన ఏం మాట్లాడినా పెద్దగా ఉపయోగం లేకపోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. దానికి ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టంకట్టారు. ఇచ్చిన హామీలు కూడా అలాగే ఉన్నాయి.వాటిని అమలుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ప్రభుత్వం ఏర్పడి ఇంకా 23 రోజులు కూడా కాలేదు. అప్పుడే హామీలు అమలు చేయలేదని అనడాన్ని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోరు. అందుకే కొంత గ్యాప్ ఇవ్వడం బెటర్ అన్నది అందరూ అంగీకరించే విషయమే.యాగీ చేసినా...ఇప్పుడు అరిచి గోల చేసినా, యాగీ చేసినా ఫలితం ఉండదు. ప్రజల నుంచి కూడా అప్పుడే మద్దతు కూడా లభించకపోవచ్చు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా కుదురుకోకముందే ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేయాలని అనడం గొంతుమీద కూర్చుని నొక్కడమేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ప్రభుత్వం తప్పులు చేసే వరకూ సమయం ఇవ్వాలి. అంతకు ముందు మీడియా ఎదుటకు వచ్చి విమర్శలకు కూడా ప్రతి విమర్శలు చేయని జగన్ ఇప్పుడు మైకుల ఎదుట మాట్లాడుతుండటాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ప్రభుత్వంపై ఏ విమర్శలు చేసినా అది అధికారంలో ఉన్న పార్టీకి పెద్దగా సూటిగా తగిలే అవకాశం లేదు. ఎదురుచూస్తున్న జనం...ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. తల్లికి వందనం కావచ్చు. రైతు భరోసా నిధులు కావచ్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మహిళలకు 2,500 రూపాయలు నెలకు ఇవ్వడం కానీ, నిరుద్యోగ భృతి అయినా ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. అయితే ప్రభుత్వం ఊపిరి తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ విమర్శలు చేసినా ప్రతి విమర్శలు గత ప్రభుత్వంపైనే ఈ ప్రభుత్వం చేసే వీలుంది. గత ప్రభుత్వం అన్నీ విధ్వంసం చేసిందని ఇప్పటికే శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేస్తూ కొంత జనం మైండ్స్ ను సెట్ చేసుకుంటూ వెళుతున్నారు.ఇప్పడు విమర్శలు చేసినా...జగన్ విమర్శలు చేసినా గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికే ఇబ్బందిగా మారిందని ఎదురుదాడికి దిగుతారు. అంతేకాదు.. మీడియా మద్దతు కూడా పెద్దగా లేని పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ అంతకంటే ఏం చేయలేని పరిస్థితి. అలాగని మౌనంగా ఉండమని కాదు కానీ, అప్పుడే దూకుడుగా వెళ్లినంత మాత్రాన అధికార పార్టీకి వచ్చే నష్టం అంటూ ఏమీ ఉండదని తెలుసుకోవాలి. ఇంకా చాలా రోజుల సమయం ఉంది. అధికారపార్టీకి మంచి పనులు చేస్తూ కొన్ని తప్పులు కూడా చేయక మానదు. అప్పుడప్పుడు ఎండగడుతూ వెళుతుంటే కొంత జనం విశ్శసిస్తారు. అంతే తప్పించి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దిగిపోతుందని శాపనార్థాలు పెట్టినా ప్రయోజనం లేదు. క్యాడర్ ను కాపాడుకోవడానికి అధికార పార్టీపై విమర్శలు చాలవు. వారి దగ్గరకు వెళ్లి తాను ఉన్నానన్న భరోసా ఇవ్వాలి. అప్పుడే క్రమంగా బలం పుంజుకునే వీలుంటుంది. |
https://www.telugupost.com/movie-news/బాగా-ఓపెన్-అయ్యాడు-27616/ | సంగీత దిగ్గజం కీరవాణి గతంలో నేను ఇక సంగీతం నుండి శాశ్వత విరామం తీసుకోబుతున్నాని చెప్పి సంగీత ప్రియులకి హోల్ సేల్ గా షాక్ ఇచ్చారు. అయితే ఆయన బాహుబలి ద కంక్లూజన్ సినిమా పూర్తవగానే ఆయనెక్కడ సంగీతం నుండి రిటైర్ అవుతారో అని కంగారు పడి ఆయన్ని ఇంకా సంగీతంలోనే కొనసామని చాలామంది మద్దతు తెలిపారు అలాగే కీరవాణి గారి కుటుంబ సభ్యులు కూడా ఆయన రిటైర్మెంట్ ఒప్పకోవడంలేదు. అయితే కీరవాణి తాను సంగీతం నుండి రిటైర్ అవ్వడానికి ఇంకా సమయం ఉందని... తనని ఇంకా సంగీత ప్రపంచంలో ఉండాలని 99 శాతం మంది కోరుకుంటున్నారని అందుకే తన శ్రేయోభిలాషుల కోసం అభిమానుల కోసం ఈ నిర్ణయాన్ని వాయిదా వేశానని ట్వీట్ చేసి సంగీత ప్రియులకి నెత్తిన పాలు పోశారు.అలాగే ఆయన మరి కొన్ని సంచలన ట్వీట్స్ చేసి విస్మయానికి గురిచేశారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా వుండే కీరవాణి మొదటిసారి ఇలా ట్వీట్ చేసి ఆశ్చర్యపరిచాడు. నేను 27 ఏళ్ళ క్రితం ఆ సంగీత జర్నీ స్టార్ట్ చేసానని... ఈ జర్నీలో కొంతమంది తనకు నచ్చినవారు వున్నారని మరికొంతమంది నచ్చనివారు కూడా వున్నారని చెప్పి ఆశ్చర్య పరిచాడు. కొంతమంది దర్శకులుకు నేను చెప్పే సలహాలు పాటించేవారని... కొంతమంది తన సలహాలు పట్టించుకునే వారు కాదని... అయినా అలాంటి దర్శకులతో నేను సినిమాలకు వర్క్ చేశానని ట్వీట్ చేశారు. అలాగే నేను రాజమౌళి ఒక్కడికే అంతటి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాను అంటే రాజమౌళి నేను ఎం చెప్పిన కాదనకుండా వినే వాడని...... అందుకే నేను స్వేచ్ఛగా తనకి మంచి మ్యూజిక్ ఇవ్వగలిగానని అన్నారు. అంతేకాకుండా తాను రిటైర్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాని ఆ సమయం ఎప్పుడు వస్తుందో? అని సంచలనాత్మ ట్వీట్స్ చేసాడు కీరవాణి. |
https://www.telugupost.com/movie-news/మరే-హీరోకి-లేని-క్రేజ్-51230/ | పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఫాన్స్ కి ఎలాంటి పూనకాలు వస్తాయో అందరికి తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరె హీరోకి లేని అభిమాన గణం పవన్ కళ్యాణ్ కి ఉందంటే.. అతిశయోక్తి కాదు. ఆయన గత సినిమాల ప్లాప్స్ ని ఫాన్స్ అస్సలు పట్టించుకోరు. పవన్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే ఆత్రుతలోనే ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మరియు పవన్ ఆప్తుడు అయినా త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు తిక్కకి లెక్కలేనంత ఉన్నాయంటే నమ్ముతారా..అజ్ఞాతవాసి కి విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలతోపాటే ఆసక్తి పెరిగిపోతుంది. ఇప్పటికే పబ్లిసిటీ కార్యక్రమాలను షురూ చెయ్యడానికి చిత్ర బృందం సమాయత్తమవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ ని వాడుకొని లాభాలు మూటగట్టుకోవాలని బడా కంపెనీలు ప్లాన్ చేశాయి. అందులో భాగంగానే చిత్ర బృందం తో కలిసి ప్రముఖ సెల్ కాన్ మొబైల్ కంపెనీ ఒక భారీ డీల్ ను సెట్ చేసుకునే ప్రయత్నం మొదలెట్టింది. దాదాపు 50 వేల ఫోన్లను #PSPK25 బ్రాండింగ్ మీద ఆ కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేయాలనీ చూస్తోంది. ఆ తర్వాత వచ్చే రిజల్ట్ ని బట్టి మరికొన్ని ఫోన్లను రిలీజ్ చేయనుంది.ఈ మొబైల్స్ ని కూడా #PSPK25 బ్రాండ్ నేమ్ తో రిలీజ్ చేయాలనీ కంపెనీ యాజమాన్యం ప్లాన్ చేస్తుంది. ఇక ఈ కంపెనీ ఆలోచనకి చిత్ర బృందం తోపాటు... దర్శకుడు త్రివిక్రమ్, హీరో పవన్ లు కూడా సానుకూలంగా వున్నారని తెలుస్తుంది. ఇకపోతే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మొబైల్ కంపెనీ తన పని మొదలెట్టడానికి రెడీగా ఉంది. |
https://www.telugupost.com/movie-news/prabhas-salaar-movie-collections-salaar-first-week-box-office-collections-are-in-the-range-of-460cr-1512220 | సలార్ మొదటి-వారం బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు 460 కోట్ల రేంజ్లో ఉన్నాయి. ప్రభాస్-ప్రశాంత్ నీల్ ల పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఇది బ్రేక్ఈవెన్కి ఇంకా కొంచెం దూరంలో ఉంది. సలార్ మొదటి-వారం బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు 460 కోట్ల రేంజ్లో ఉన్నాయి. సలార్ తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు అద్భుత కలెక్షన్స్ సాధించింది.. ఆఫీసులు, స్కూళ్లు తెరుచుకోవడంతో 6వ రోజు, 7వ రోజు కలెక్షన్స్ కాస్త డల్ అయ్యాయి. అయితే ఈ వీకెండ్స్ మరోసారి పుంజుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షేర్ GSTతో కలిపి 123 కోట్ల రేంజ్లో ఉంటుందని, గ్రాస్ 175 కోట్ల రేంజ్లో ఉంటుందని అంచనా. కర్ణాటకలో, ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి. కానీ 2వ రోజు నుండి డ్రాప్ మొదలైంది. కర్ణాటకలో సలార్ 1వ వారం గ్రాస్ దాదాపు 34.5 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ చిత్రం కేరళలో అదే ట్రెండ్ను కలిగి ఉంది. మొదటి వారం గ్రాస్ 13.5 కోట్ల రేంజ్లో ఉండగా.. తమిళనాడులో మొదటి వారం దాదాపు 18 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది.ఉత్తర భారతదేశంలో క్రిస్మస్ రోజు నుండి కలెక్షన్స్ పెరగడం మొదలైంది. సలార్ నార్త్ ఇండియా 1వ వారం గ్రాస్ 110 కోట్ల రేంజ్లో ఉంటుందని అంచనా. భారతదేశం మొత్తం మీద సాలార్ గ్రాస్ దాదాపు 350Cr+ ఉంటుంది. ఓవర్సీస్ లో 13 మిలియన్స్ [108కోట్లు] రేంజ్లో కలెక్షన్స్ ఉన్నాయి. |
https://www.telugupost.com/telangana/hyderabad-truck-overturns-on-orr-at-taramatipet-1365749 | అబ్దుల్లాపూర్మెట్ : అవుటర్ రింగురోడ్డుపై థమ్స్అప్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో అదే మార్గంలో ప్రయాణిస్తున్న వారు అక్కడ ఆగి థమ్స్అప్ సీసాలను ఎత్తుకెళ్లేందుకు తెగ ఆరాటపడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తారమతిపేట సమీపంలో థమ్స్అప్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న లారీ గత రాత్రి దాదాపు 8 గంటల సమయంలో ఓఆర్ఆర్పై వెళ్తూ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో థమ్స్అప్ బాటిల్స్ అన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు.ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు తమ వాహనాలను ఆపి రోడ్డుపై పడిన థమ్స్అప్ బాటిల్స్ను ఎత్తుకెళ్లారు. గాయాలతో మూలుగుతున్న డ్రైవర్, క్లీనర్ను ఏమాత్రం పట్టించుకోకుండా లారీలోని సరుకు మొత్తాన్ని ఖాళీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వాహనం అబ్దుల్లాపూర్మెట్ వైపు వెళుతుండగా చాలా వేగంగా డ్రైవింగ్ చేయడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, వాహనం తిరగబడిన వెంటనే గుమికూడిన జనం శీతల పానీయం సీసాలు పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు లారీని పక్కకు తరలించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. |
https://www.telugupost.com/movie-news/actress-poonam-tweets-72141/ | ఈ మధ్యన సినిమాల్లో ఎక్కువగా కనబడకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్ చల్ చేస్తోంది నటి పూనమ్ కౌర్. సినిమాల్లో అవకాశాలు రాక గ్లామర్ డోస్ పెంచినా పని జరక్క పోవడంతో.. పూనమ్ ఇప్పుడు తనకి అవకాశాలివ్వని కొందరిని టార్గెట్ చేస్తుంది. మొన్నామధ్యన పవన్ కళ్యాణ్ మీద ఇండైరెక్ట్ ట్వీట్స్ వేస్తూ అల్లాడించిన పూనమ్ కౌర్ ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ ని టార్గెట్ చేసింది. త్రివిక్రమ్ ని మైండ్ లో పెట్టుకుని ట్వీట్ల వర్షం కురిపిస్తుంది. అసలింతకీ పూనమ్ చేసిన ట్వీట్ ఏమిటంటే.. జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో ఏసేస్తాడు. జాగ్రత్త నమ్మకద్రోహి.. అంటూ చేసిన హాట్ ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ చర్చనీయాంశమైంది.ఆమె టార్గెట్ త్రివిక్రమేనా..?మరి ఈ ట్వీట్ చూస్తుంటే త్రివిక్రమ్ నే అన్నట్టుగా వుంది. అది ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. మరి పూనమ్ చేసిన ఆ ట్వీట్ లో జల్సా, అజ్ఞాతవాసి సినిమాలు చేసింది త్రివిక్రమ్ కదా. మరి ఆ సినిమాల్లో నటించింది పవన్ కళ్యాణ్ అయినప్పటికీ.. ఈ ట్వీట్ పవన్ ని కాదని త్రివిక్రమ్ మీదే చేసినట్టుగా అనిపిస్తుంది. మరి కత్తి మహేష్ ఆ మధ్యన ఛానల్స్ లో కూర్చుని పూనమ్ కౌర్ ఒక డైరెక్టర్, పవన్ కళ్యాణ్ వల్ల ఆత్మహత్య యత్నం చేసిందని.. ఆమెకి హాస్పిటల్ బిల్ కూడా పవన్ కల్యాణే కట్టాడని కూడా అన్నాడు. మరి అప్పట్లో ఆ వార్తలు ఎంత సంచలనమయ్యాయో.. ఇప్పుడు పూనమ్ చేసిన ట్వీట్స్ కూడా మరింత వేడెక్కిస్తున్నాయి.గతంలోనూ హాట్ ట్వీట్స్ఇక ఈ హాట్ ట్వీట్ కన్నా ముందుగా పూనమ్ కౌర్ ఇండస్ట్రీలోని ఒక టాప్ దర్శకుడు నాలుగు కుటుంబాల ప్రాపకం కోసం పాకులాడుతూ ఉంటాడని , ఒక హీరోయిన్ కోసం చాలా చేసాడని, నాకు హిట్ లేదు కాబట్టి తనను పట్టించుకున్నాడా? అంటూ పూనమ్ ఆవేశంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మరి పూనమ్ కౌర్ ఈ హాట్ హాట్ ట్వీట్స్ తో ఇప్పుడు అందరిలోనూ హాట్ టాపిక్ గా నిలిచింది. మొత్తానికి సినిమాల్లేకపోయిన ఇలాంటి హాట్ న్యూస్ లతో పూనమ్ తన ఉనికిని చాటుకుంటుంది. |