news
stringlengths
299
12.4k
class
class label
3 classes
అసభ్యంగా మట్లాడారు.. క్లోస్ చేసింది అందుకే.. మళ్లీ ఓపెన్ చేస్తా (వీడియో) Highlights సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అనసూయ తన ఖాతాలని మూసివేసింది అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తు మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ మూసివేసిన తరువాత తొలిసారి స్పందించింది​ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అనసూయ తన పేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలని మూసివేసింది. అందం, అభినయం అన్నీ ఉన్నఅనసూయ అవకాశలు అంతగా అందిపుచ్చుకోలేక పోయింది. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రంగస్థలంలోరాంచరణ్ తో కలిసి నటిస్తుంది. ఆ మధ్యన జరిగిన ఓ ఇన్సిడెంట్ వలన అనసూయపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. నెటిజన్లు అనసూయని తిడుతూ కామెంట్లు పెడుతుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుతుంది. అనసూయ ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ మూసివేసిన తరువాత తొలిసారి స్పందించింది. తాను ఎందుకు తన అకౌంట్లని మూసివేయవలసి వచ్చిందో వివరణ ఇచ్చింది. ఓ అభిమాని సెల్ఫీ అడగగా అనసూయ అతడి మొబైల్ ని పగలగొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆ ఘటనలో తన తప్పు లేదని అనసూయ అన్నారు. తన గురించి తెలియకుండానే ఓ మీడియా వర్గం తనని దోషిగా నిలబెట్టి ప్రయత్నం చేసిందని అనసూయ అన్నారు. దీనితో అభిమానుల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళ్లాయి. వారు ఆగ్రహంతో అసభ్య కామెంట్లు పెడుతున్నారని అనసూయ అన్నారు. అందుకే తన సోషల్ మీడియా ఖాతాలని క్లోజ్ చేసానని అనసూయ అన్నారు. రంగస్థలం చిత్ర విడుదల తరువాత తిరిగి తన పేస్ బుక్, ట్విట్టర్ ని ఓపెన్ చేస్తానని అనసూయ అన్నారు.                                           https://www.facebook.com/telugufilmnagar/videos/1865123580227969/?t=0
0business
శ్రీమంతుడు రికార్డును రంగస్థలంతో దాటేస్తున్న చరణ్ Highlights శ్రీమంతుడు రికార్డును రంగస్థలంతో దాటేస్తున్న చరణ్ రామ్ చరణ్ సినిమాలకు యూఎస్ఏలో పెద్దగా మార్కెట్ ఉండదు అనేది ఇక పాత మాటే. ఇకపై ఆ మాట అనే సాహసం కూడా ఎవరూ చేయరేమో? చెర్రీ నటించిన 'రంగస్థలం' చిత్రం ఇక్కడ అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెళుతోంది. పలు టాలీవుడ్ రికార్డులను బద్దలుకొడుతూ సత్తాచాటుతోంది. తొలి 5 రోజుల్లో ఈ మూవీ కలెక్షన్ రూ. 2.5 డాలర్ మార్క్‌ను క్రాస్ అయింది. రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధికంగా 194 స్క్రీన్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డ ఈ చిత్రం తొలి వీకెండ్ పూర్తయ్యే నాటికి $1,939,890 వసూళ్లు నమోదు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే చెర్రీ గత చిత్రం ‘ధృవ' లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించింది. ప్రీమియర్ షోల ద్వారా గురువారం $706,612, శుక్రవారం $588,165, శనివారం $645,114 , ఆదివారం $426,685 వసూళ్లు రాబట్టి అదరగొట్టింది.  వారాంతం సెలవుల కారణంగా కలెక్షన్ల జోరు ప్రదర్శించిన ‘రంగస్థలం'.. సోమవారం వర్కింగ్ డే కారవడం, స్క్రీన్ల సంఖ్య కూడా తగ్గడంతో కలెక్షన్స్ కాస్త తగ్గాయి. సోమవారం ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద $109,000 వసూలు చేసింది. దీంతో టోటల్ గ్రాస్ $2,479,213 నమోదైంది. తొలి 4 రోజుల్లోనే ‘రంగస్థలం' మూవీ ‘అ...ఆ'($2,449,000), ఖైదీ నెం 150($2,447,000) లైఫ్ టైమ్ రికార్డులను అధిగమించింది. బాహుబలి, బాహుబలి 2, శ్రీమంతుడు తర్వాత ‘రంగస్థలం' అత్యధిక వసూళ్లు సాధించిన 4వ చిత్రంగా నిలిచింది.  యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద 5వ రోజు(మంగళవారం) కలెక్షన్లతో కలుపుకుని ఓవరాల్ వసూళ్లు $2,571,213 రీచ్ అయింది. త్వరలోనే ఈ చిత్రం శ్రీమంతుడు ($2,891,000) రికార్డును అధిగమిస్తుందని, లైఫ్‌టైమ్ రన్‌లో 3 మిలియన్ మార్కును అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. Last Updated 4, Apr 2018, 6:52 PM IST
0business
నాన్న మీరు సినిమాలు చేయొద్దు: స్టార్ హీరో కూతురు! Highlights సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన వయసు పెరిగే కొద్దీ క్రేజ్ మరింత పెరిగిపోతుంది. రీసెంట్ గా 'కాలా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రజినీ. తెలుగులో ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం హిట్ టాక్ లభించింది. అయితే ఇప్పుడు అతడిని సినిమాలు చేయడం మానేయమని కోరిందట ఆయన కూతురు ఐశ్వర్య. దానికి కారణం రజినీకాంత్ సినిమాలు మానేసి కుటుంబంతో సమయం కేటాయించాలని ఆమె భావిస్తోంది. అయితే సినిమాలు పూర్తిగా మానకుండా దశల వారీగా మానేయాలని ఆమె కోరుకుంటోంది. సినిమాల మీద ఆయన ఎక్కువ దృష్టి పెట్టడంతో కుటుంబంతో ఎక్కువగా గడపలేకపోతున్నారని ఆమె చెబుతోంది. ఇదంతా బాగానే ఉంది కానీ రజినీకాంత్ సినిమాలు మానేసి రాజకీయాల్లో బిజీ అవ్వాలనుకుంటున్న ఇలాంటి సమయంలో ఆమె కుటుంబంతో గడపమని కోరుతోంది. మరి రజినీకాంత్ ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి!
0business
kg gqs రూ.6283కోట్లతో గెయిల్‌ప్రాజెక్టు బెంగళూరు,జూన్‌ 26: బెంగళూరు నగరంలోని సిటీ గ్యాస్‌ పంపిణీ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వరంగంలోని గెయిల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయం 6283 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి సదానందగౌడ్‌, ఎరువులు రసాయనాల మంత్రి అనంత్‌కుమార్‌ వెల్లడిం చారు. ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం 1.32 లక్షల కుటుంబాలకు రానున్న ఐదేళ్లలో గ్యాస్‌ పంపిణీ జరుగుతుందని, సిఎపన్‌జి స్టేషన్‌ను కూడా ప్రారంభించిన మంత్రులు ఐదేళ్లలో మరో 50 స్టేషన్లు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పైప్‌గ్యాస్‌ప్రాజెక్టు ద్వారా 1.32 లక్షల కుటుం బాలు ప్రాజెక్టు మొత్తంగా 106.12 లక్షల నివా సితులకు మేలుచేస్తుందని గెయిల్‌ ప్రకటించింది. ఈప్రాజెక్టు 4395 కిలెమీటర్లవేర విస్తరించింది. పట్టణ, గ్రామీణ బెంగళూరులకు సైతం సేవ లందిస్తుంది. నెలామంగళ, దొడ్‌బల్లాపూర్‌, దేవనహళ్లి, హోసాకోటే, బెంగళూరు ఈస్ట్‌, బెంగ ళూరు నార్త్‌, బెంగళూరు సౌత్‌ అనేకల్‌ప్రాంతాల కుటుంబాలకు పైప్‌ల ద్వారా గ్యాస్‌ పంపిణీ జరుగుతుందన్నారు. అలాగే మరో 60 వరకూ సిఎన్‌జి స్టేషన్ల ఏర్పాటుద్వారా చౌక్ధరలకే ఇంధ నం అందించేందుకు గెయిల్‌ కృషిచేస్తోంది. ఈ ప్రాజెక్టును మొత్తం గెయిల్‌ ఇండియా చేపట్టింది.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV డిస్ప్లే‌పై ఫింగర్ ప్రింట్ సెన్సార్.. వివో ఎక్స్21 విడుదల భారత్‌లో మార్కెట్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో కొత్త మొబైల్స్‌ను తీసుకొస్తోంది. Samayam Telugu | Updated: May 29, 2018, 03:13PM IST భారత్‌లో మార్కెట్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో కొత్త మొబైల్స్‌ను తీసుకొస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వివో ఎక్స్21 ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. డిస్ప్లేపైనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండటం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. ఈ ఫీచర్‌తో వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. డిస్ప్లే కింద భాగంలో ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే సైజు 6.28 అంగుళాలు. అసలు అంచులనేవే లేకుండా పూర్తి ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేను దీనిలో అమర్చారు. అంటే ఐఫోన్ టెన్‌లో మాదిరిగా ఈ ఫోన్ ఫ్రంట్ లుక్ ఉంటుంది. ఈ వివో ఎక్స్21 స్మార్ట్‌ఫోన్ కేవలం ఫ్లిప్‌కార్ట్‌, వివో ఈ-స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మంగళవారం నుంచే సేల్ కూడా ప్రారంభమైంది. దీని ధర రూ.35,990. ఫ్లిప్‌కార్టులో లాంచ్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్‌పై అదనపు తగ్గింపు తదితర ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది. అయితే ప్రస్తుతం బ్లాక్ కలర్ వేరియంట్ అమ్మకాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే విడుదలైన వన్‌ప్లస్ 6, హానర్ 10 ఫోన్లతో ఇది పోటీ పడనుంది. వివో ఎక్స్21 స్పెసిఫికేషన్లు
1entertainment
Visit Site Recommended byColombia హిట్ ట్రాక్‌లో ఉన్నప్పుడే హీరోలకు కాసుల పంట పండుతుంది. హిట్ సినిమాల సంగతి పక్కన పెడితే అసలు సినిమాలే లేకపోవడంతో రవితేజ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు అగ్ర హీరోలతో సమానంగా పారితోషికం అందుకున్న కిక్‌ నుండి రవితేజ తేరుకోకపోవడంతో రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలు వెనక్కితగ్గారు. దీంతో ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే రావడంతో ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రవితేజ తన పాత మార్కెట్ రేటుని పక్కన పెట్టేడంతో నిర్మాతలు అతనితో సినిమాలను చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. దిల్ రాజు నిర్మాతగా ఓ భారీ ప్రాజెక్ట్ సినిమాతో మాస్ మహారాజా మెరవనున్నాడని టాక్. పటాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో రవితేజ న్యూ మూవీ చేస్తున్నాడట. అనిల్‌ చెప్పిన స్టోరీ రవితేజకి బాగా నచ్చి వెంటనే ఓకే అనేసాడట. ఇక ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడం మరో విశేషం. ఎందుకంటే ఇంతకు ముందు వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో రవితేజతో ఓ మూవీ స్టార్ట్ చేసాడు దిల్ రాజు. తరువాత అది సెట్స్ మీదకి వెళ్ళకుండా ఆగిపోయింది. రవితేజ తన మార్కెట్ కి మించి రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో దిల్ రాజు ఆ ప్రాజెక్ట్ ఆపేసిన సంగతి తెలిసిందే.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిందంటూ ప్రశంస Kamal Haasan- PV Sindhu చెన్నై: ఇండియన్ టెన్నిస్ స్టార్ పీవీ సింధు ప్రముఖ సినీ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమలహాసన్ ను కలుసుకుంది. చెన్నైలోని ఎంఎన్ఎం పార్టీ కార్యాలయానికి వెళ్లి కమల్ తో భేటీ అయింది. తన కార్యాలయానికి వచ్చిన సింధును కమల్ ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆమెతో కలిసి లంచ్ చేశారు. అనంతరం కమల్ మాట్లాడుతూ, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ను గెలిచి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిందంటూ సింధుపై ప్రశంసల జల్లు కురిపించారు. సింధు మాట్లాడుతూ, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని చెప్పింది. ఈ సమావేశానికి సింధుతో పాటు ఆమె తల్లి కూడా వచ్చారు. తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/
2sports
Hyderabad, First Published 12, Sep 2019, 10:18 AM IST Highlights గ్యాంగ్ లీడర్’ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.28.20 కోట్లు జరిగిందని ట్రేడ్ టాక్. ఈ మొత్తం రికవర్ చేసి డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి తీసుకెళ్లాలంటే సినిమా సూపర్ హిట్ కావాలి. వసూళ్లు ‘ఎమ్ సి ఎ’ లెవల్లో ఉండాలి. అప్పుడే నాని మార్కెట్ రూ.35 నుండి 40 కోట్లకు పెరుగుతుంది స్థిరపడుతుంది.   ఈ శుక్రవారం గ్యాంగ్‌ లీడర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు హీరో నాని, ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు.ఇందులో రివెంజ్‌ రైటర్‌ పార్థసారథి పాత్రలో నటించారు నాని. తన గ్యాంగ్‌తో కలిసి విలన్ పై ఎలా పగ తీర్చుకున్నాడు పార్ధసారథి. ఇందుకోసం ఎలాంటి స్కెచ్‌లు వేశాడు? విలన్ నుంచి ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్టు చుట్టూ తిరిగే ఈ సినిమాపై క్రేజ్ ఇప్పటికే క్రియేట్ అయ్యింది. కామెడీ రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు విక్రమ్‌ కె కుమార్ దర్శకుడు.  ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు నాని. ఈ చిత్రంతో తన మార్కెట్ స్థాయిని మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు. ఆయన గత చిత్రం ‘జెర్సీ’ మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ  కలెక్షన్స్ పరంగా చూస్తే వర్కవుట్ కాలేదు. కేవలం రూ.29 కోట్లకు దగ్గర్లో ఆగిపోయింది. దీంతో ఆయన కొంత నిరుత్సాహానికి గురయ్యారనే చెప్పాలి. ఇక ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.28.20 కోట్లు జరిగిందని ట్రేడ్ టాక్. ఈ మొత్తం రికవర్ చేసి డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి తీసుకెళ్లాలంటే సినిమా సూపర్ హిట్ కావాలి. వసూళ్లు ‘ఎమ్ సి ఎ’ లెవల్లో ఉండాలి. అప్పుడే నాని మార్కెట్ రూ.35 నుండి 40 కోట్లకు పెరుగుతుంది స్థిరపడుతుంది.  గ్యాంగ్‌లీడర్‌తో  అది సాధించగలుగుతాడా? చిత్రం కొన్నవారికి గిట్టుబాటు కావాలంటే ఈ సినిమా గట్టిగా ఆడాల్సిందే. పాజిటివ్ టాక్ వస్తే అది పెద్ద కష్టమేమీ కాదు. నాని హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్‌లీడర్‌’. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిల్లాలు నాని గ్యాంగ్‌ సభ్యులుగా నటించారు.  Last Updated 12, Sep 2019, 10:18 AM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV విరాట్ కోహ్లి కంటే రోహిత్ శర్మనే బెటర్..! పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే ఓపెనర్ రోహిత్ శర్మనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ TNN | Updated: Dec 26, 2017, 04:10PM IST విరాట్ కోహ్లి కంటే రోహిత్ శర్మనే బెటర్..! పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే ఓపెనర్ రోహిత్ శర్మనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అభిప్రాయపడ్డారు. కోహ్లి అభిమానులు ఈ మాటని ఒప్పుకోకున్నా ఇది మాత్రం వాస్తవమని ఆయన పునరుద్ఘాటించారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా డబుల్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ .. టీ20లో మెరుపు శతకం సాధించిన విషయం తెలిసిందే. అతని జోరుతో భారత్ జట్టు శ్రీలంకపై 2-1తో వన్డే సిరీస్‌ని.. 3-0తో టీ20 సిరీస్‌ని చేజిక్కించుకుంది. తాజాగా సందీప్ పాటిల్ ఓ టీవీ ఛానల్‌‌తో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘విరాట్ కోహ్లి అభిమానులు ఈ మాటని ఒప్పుకోకపోవచ్చు. కానీ.. కోహ్లి కంటే రోహిత్ శర్మనే మెరుగైన బ్యాట్స్‌మెన్. విరాట్ కోహ్లి కూడా గొప్ప ఆటగాడే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. అతను భారత్ జట్టు అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మెన్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం కోహ్లి కంటే రోహిత్ శర్మ కొంచెం ముందు ఉన్నాడు’ అని పాటిల్ వివరించారు. వన్డే, టీ20 జట్టులో మెరుగ్గా రాణిస్తున్న రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టు జట్టులోనూ సుస్థిర స్థానం సంపాదించుకుని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. రోహిత్ వేగవంతమైన షాట్ సెలక్షన్ వన్డే, టీ20లకి (తెలుపు బంతి) బాగా నప్పుతుందని.. టెస్టుల్లో (ఎరుపు బంతి) మాత్రం క్యాచ్‌లు వెళ్లిపోతాయంటూ గత కొంతకాలంగా మాజీ క్రికెటర్లు విమర్శస్తున్న విషయం తెలిసిందే.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Visit Site Recommended byColombia ఆ తరవాత ‘డ్రైవర్ రాముడు’ సినిమా మొదలుపెట్టారు. టీజర్ కూడా విడుదల చేశారు. కానీ, ఆ సినిమా ఏమైందో ఎప్పుడొస్తుందో తెలీదు. అయితే, ఇప్పుడు ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు శంకర్ సిద్ధమవుతున్నారు. శంకర్ హీరోగా కాచిడి గోపాల్‌రెడ్డి దర్శకత్వంలో ఎస్.కె.పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా సురేష్ కొండేటి, ఎడవెల్లి వెంకట్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘2+1’. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను దసరా కానుకగా, సురేష్ కొండేటి పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 6న విడుదల చేస్తున్నారు. Also Read: తెలంగాణ గవర్నర్‌ను కలిసిన చిరంజీవి.. ‘సైరా’ చూడండంటూ ఆహ్వానం ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కాచిడి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘శంకర్‌ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నాం. మాస్ క్యారెక్టర్‌తో పాటుగా క్లాస్ టచ్ ఉన్న స్టూడెంట్ పాత్ర ఈ సినిమాకి హైలెట్‌గా నిలుస్తుంది. మరో పది సంవత్సరాల పాటు గుర్తుండిపోయే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలు ఈ సినిమాలో శంకర్ పోషించారు. దర్శకుడిగా నా మొదటి సినిమాకు శంకర్ లాంటి మంచి హీరో దొరకడం, నిర్మాతలు నన్ను నమ్మి దర్శకుడిగా అవకాశం ఇవ్వడం నా అదృష్టం’’ అని అన్నారు. See Photo story: ‘కార్తీకదీపం’ నల్ల పిల్ల అసలు అందాలివిగో హీరో శంకర్ మాట్లాడుతూ.. ‘‘నన్ను కొత్త యాంగిల్‌లో చూపించబోతున్న దర్శకుడు గోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ‘శంభో శంకర’ సినిమా తర్వాత ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌లో సురేష్ కొండేటి గారితో మళ్లీ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మంచి ప్రొడక్షన్ వాల్యూ‌స్‌తో ప్రతిష్టాత్మకంగా, నా కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. Also Read: ‘సైరా’ 2 వేల కోట్లా? తమ్మారెడ్డి సెటైర్లపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం ఇప్పటి వరకు 80 శాతం సినిమా షూటింగ్ పూర్తయిందని, త్వరలో ప్రారంభమయ్యే షెడ్యూల్‌లో మూడు పాటలు, కొన్ని సన్నివేశాల చిత్రీకరణతో మిగిలిన 20 శాతం షూటింగ్ పూర్తవుతుందని నిర్మాతలు వెల్లడించారు. కాగా, ఈ సినిమాలో శంకర్‌కు జోడీగా రుబికా, ఆక్సాఖాన్ నటిస్తున్నారు. హరిగౌర సంగీతం సమకూరుస్తున్నారు. మొటం సతీష్ సినిమాటోగ్రాఫర్. నందమూరి హరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 10, May 2019, 11:09 AM IST Highlights మహర్షి సినిమా ఈ సారి పాజిటివ్ బజ్ తో రిలీజయినప్పటికీ అజ్ఞాతవాసి రికార్డ్ ను బ్రేక్ చేయలేకపోయింది.  అజ్ఞాతవాసి కి మినిమమ్ యావరేజ్ టాక్ వచ్చి ఉంటె ఏ రేంజ్ లో హిట్టయ్యేదో మొదటి రోజు కలెక్షన్స్ చుస్తే ఎవ్వరికైనా అర్ధమవుతుంది. కానీ మొదటి రోజే డిజాస్టర్ టాక్ రావడంతో ఊహించని విధంగా కలెక్షన్స్ ను అందుకున్న ఆ సినిమా అదే స్థాయిలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే మహర్షి సినిమా ఈ సారి పాజిటివ్ బజ్ తో రిలీజయినప్పటికీ అజ్ఞాతవాసి రికార్డ్ ను బ్రేక్ చేయలేకపోయింది.  పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్ ను నమోదు చేసినప్పటికీ డే 1 లో మొత్తంగా ఏపీ - తెలంగాణ కలెక్షన్స్ ని చూసుకుంటే మహేష్ సినిమా అనుకున్నంతగా రాబట్టలేకపోయింది. అసలైతే సినిమా తెలుగు రాష్ట్రలో 30 కోట్ల షేర్స్ ను రాబడుతుందని టాక్ వచ్చింది.. కానీ 24.67 కోట్ల దగ్గర కలెక్షన్స్ ఆగిపోయియాయ్.  అజ్ఞాతవాసి ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 26.36 కోట్ల షేర్స్ ను రాబట్టింది. ఇక అరవింద సమేత 26.60 కోట్లతో నాన్ బాహుబలి రికార్డ్స్ లో మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత వినయవిధేయ రామ 26.03 కోట్లతో మూడవ స్థానంలో ఉంది. వీటి తరువాత మహేష్ మహర్షి 26.67కోట్లతో నాలుగవ స్థానాన్ని అందుకుంది. బాహుబలి 2 మొదటి రోజు ఏపీ తెలంగాణాలో 42.87 కోట్ల షేర్స్ ను అందించింది.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రణ్‌బీర్ కపూర్ తల్లితో మాట్లాడిన కత్రినా తల్లి రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ బ్రేకప్‌పై ఆందోళన చెందుతున్న వారిలో కత్రినా తల్లి సుజానే టర్కోట్ ముందుంటారు. TNN | Updated: Feb 4, 2016, 04:51PM IST రణ్‌బీర్ కపూర్ తల్లితో మాట్లాడిన కత్రినా తల్లి రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ బ్రేకప్‌పై ఆందోళన చెందుతున్న వారిలో కత్రినా తల్లి సుజానే టర్కోట్ ముందుంటారు. రణ్‌బీర్ 'లవ్ నెస్ట్‌'లోంచి తిరిగి తన ఇంటికెళ్లిపోవడంతో కత్రినా సైతం అతడితో బ్రేకప్ అవడానికే సిద్ధపడింది. దీంతో ఒంటరైపోయిన తన కూతురు కత్రినా ఏమైపోతుందో ఏమోనని టెన్షన్ పడిన సుజానే వెంటనే రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్‌కి ఫోన్ చేసి మాట్లాడిందట. రణ్‌బీర్ - కత్రినాలతో మాట్లాడి ఆ ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేయమని కోరిందట ఆమె.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV యూట్యూబ్‌లో 'ధృవ' సీన్ రామ్‌చ‌ర‌ణ్‌ తేజ్ లేటెస్ట్ మూవీ 'ధృవ' మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ లోపు ఈ సినిమాలోని ఓ ఆసక్తికర సీన్ యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది... TNN | Updated: Dec 7, 2016, 02:07PM IST యూట్యూబ్‌లో 'ధృవ' సీన్ మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ తేజ్ లేటెస్ట్ మూవీ ' ధృవ ' మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ లోపు ఈ సినిమాలోని ఓ ఆసక్తికర సీన్ యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది. ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ సభ్యులే ఈ సీన్ యూట్యూబ్‌లో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్‌ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా, సీనియర్ నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌‌పై, డైరెక్ట‌ర్ సురేంధర్ రెడ్డి `ధృవ` సినిమాను తెరకెక్కించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తని ఓరువన్' సినిమాకి రీమేక్‌‌గా వస్తున్న 'ధృవ'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరో నవదీప్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. 'ధృవ' సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమీజా సూపర్ హిట్ సంగీతాన్ని అందించారు. నవంబర్ 9న ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ 9వ తేదీన 'ధృవ' ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
విదేశీ పెట్టుబడులు, మార్కెట్‌ ధోరణులే కీలకం కీలక కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈవారంలోనే ఈవారం మార్కెట్‌ మంత్రాంగం ముంబై : విదేశీ సంస్థా గత ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్‌ రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్ల ధోరణులు ఈ వారంలో మార్కెట్లకు కీలకంగా మారుతున్నాయి. యాక్సిస్‌ బ్యాంకు, మారుతిసుజుకి ఇండియా, భారతి ఎయిర్‌టెల్‌, ఎస్‌బ్యాంకు, ఐసిఐసిఐబ్యాంకు,హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌, వేదాంత, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, ఎసిసి, అల్రాటెక్‌ సిమెంట్‌ వంటి మరికొన్ని కంపెనీలు తమతమ నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక ఏప్రిల్‌నెల సహ ఉత్పన్నాల కాంట్రాక్టులు ముగుస్తుండటంతో ఈ వారం కొంత అనిశ్చితి ఎదురవుతుంది. డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ఈనెల 28తో ముగుస్తాయి. ఇక పార్లమెంటు సమావేశాలు ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. బడ్జెట్‌ సమావేశాల్లో రెండో విడత సమావేశాలుగా భావించాలి. ఇక అంతర్జాతయంగా చూస్తే అమెరికా ఫెడ్‌ రిజర్వు తన రెండురోజుల విధానసమీక్ష ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభిస్తుంది. 26,27తేదీల్లోనే వడ్డీరేట్ల పై నిర్ణయం ప్రకటిస్తుందని అంచనా. జపాన్‌ పరంగా బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ తన రెండురోజుల ద్రవ్యవిధాన సమీక్ష ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహిస్తుంది. అలాగే ముడిచమురుధరలు కూడా ఈ వారం కొంత కీలకం అవుతాయి. ప్రత్యేకించి నాలుగో త్రైమాసిక ఫలితాలు అంతర్జాతీయ మార్కెట్‌ ధోరణులే ప్రధాన భూమిక పోషిస్తాయని చెప్పవచ్చు. ఎంపికచేసిన షేర్లలో అర్ధవంతమైన లాభాల స్వీకరణ కూడా ఉంటుంది. ట్రేడర్లు అప్రమత్తంగా ఉంటారు. నిఫ్టీ 8000 స్థాయి వద్ద గట్టి ప్రతిఘటన ఎదుర్కొంటుంది. అదే విధంగా బ్రెంట్‌, ముడిచమురు ప్రభావంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, చమురుగ్యాస్‌ అన్వేషణ సంస్థల షేర్లు నడుస్తాయని చెప్పవచ్చు.
1entertainment
Sep 06,2015 ఆంధ్రప్రదేశ్‌కూ 'అమ్మ' ఉప్పు చెన్నై: 'అమ్మ' ఉప్పు ఇక దేశమంతటా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం తమిళనాడుకే పరిమితమైన 'అమ్మ' ఉప్పును త్వరలో దేశ మంతటా అమ్మకాలు సాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తమిళనాడు సాల్ట్‌ కార్పోరేషన్‌ అధికారులు శనివారం ఇక్కడ వెల్లడించారు. తమిళనాడులో ప్రస్తుతం ఒక కిలో ఉప్పును రూ 3.50లకే అమ్ముతున్నారు. శుద్ధి చేసిన ఈ అయోడైజ్‌డ్‌ ఉప్పును 5, 25 కేజీల ప్యాక్‌లో దేశంలోని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, హరియాణ రాష్ట్రాల్లో అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్పత్రులు, హోటళ్లకు, ఇతర సంస్థలకు ఈ ఉప్పును సరఫరా చేస్తారు. తమిళనాడులో ఆగస్టు 29 వరకు 6,760 మెట్రిక్‌ టన్నుల అమ్మ ఉప్పును విక్రయించినట్లు అధికారులు వెల్లడించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
నాగచైతన్యతో మరోసారి రొమాన్స్ చేయనున్న పూజా హెగ్డే Highlights డీజే దువ్వాడ జగన్నాథం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన పూజా హెగ్డే డీజే హిట్ తో తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఛాన్స్ గతంలో నాగచైతన్య సరసన ఒక లైలా కోసంలో నటించిన పూజ మరోసారి చందు మొండేటి సినిమాలో చైతూ తో రొమాన్స్ చేయనున్న పూజ హెగ్డే   డీజే సినిమాలో పూజ పాత్రలో తనదైన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన హీరోయిన్ పూజా హెగ్డే. ఈ డీజే గర్ల్ యువసామ్రాట్ నాగచైతన్య సరసన మరోసారి నటించబోతోంది. ఇప్పటికే డీజే సక్సెస్ తో యమా క్రేజ్ సంపాదించిన పూజ.. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు నాగచైతన్య సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసి తెలుగు ఇండస్ట్రీలో సెటిలయ్యేందుకు బాటలు వేసుకుంటోంది. పూజ బాలీవుడ్ లో క్రిష్ హృతిక్ రోషన్ సరసన నటించినా.. తెలుగు ఇండస్ట్రీపైనే ఎక్కువ కాన్ సెంట్రేట్ చేస్తున్నట్లు చెప్తోంది.   పూజ గతంలో నాగచైతన్ సరసన ఒక లైలా కోసం చిత్రంలో హిరోయిన్ గా నటించింది. తాజాగా కార్తికేయ, ప్రేమమ్ లాంటి వరుస హిట్లతో దూకుడు మీదున్న చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో చైతూ సరసన మరోసారి పూజ నటిస్తోంది.   ప్రస్థుతం యుద్ధం శరణంతో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైతున్న నాగచైతన్య ఆ తర్వాత.. సమంతతో పెళ్లి వేడుకల కోసం రెండు నెలలపాటు బ్రేక్ తీసుకోనున్నాడు. వివాహం తర్వాత అన్ని పనులు ముగించుకుని చందు మొండేటి చిత్రంలో నటించనున్నాడు. ఇదే చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. Last Updated 25, Mar 2018, 11:51 PM IST
0business
Hyderabad, First Published 11, Mar 2019, 8:14 PM IST Highlights   పెళ్ళైన కొత్తలో అంటూ మొదటి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప్రియమణి బాగా దగ్గరైపోయింది. ఆ తరువాత యమదొంగ సినిమాతో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది అనుకుంటే బేబీ మెల్లమెల్లగా మాయమైపోయింది. ఇక డీ షో ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకుల దగ్గరకు వచ్చిన ఈ బ్యూటీ మా ఎన్నికల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.  పెళ్ళైన కొత్తలో అంటూ మొదటి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప్రియమణి బాగా దగ్గరైపోయింది. ఆ తరువాత యమదొంగ సినిమాతో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది అనుకుంటే బేబీ మెల్లమెల్లగా మాయమైపోయింది. ఇక డీ షో ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకుల దగ్గరకు వచ్చిన ఈ బ్యూటీ మా ఎన్నికల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.  హీరోయిన్ గా అవకాశాలు లేకపోయినా వచ్చినా ఆఫర్స్ చేస్తూ తెలుగు ఇండస్ట్రీపై ఉన్న ప్రేమను ఓటు హక్కు ద్వారా చూపించేసింది. అయితే మిగతా హీరోయిన్స్ ఎవరు ఎక్కువగా కనిపించకపోవడంతో ఇప్పుడు వారిపై సినీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురు కుర్ర హీరోలు స్టార్ హీరోలు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనలేదు.  ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సోషల్ మీడియాలో మెస్సేజ్ లు ఇచ్చే స్టార్ లు సొంత ఇండస్ట్రీలో ఒట్టు హక్కును వినియోగించుకోకపోవడం జనాలను ఆశ్చర్యనికి గురి చేస్తోంది.  Last Updated 11, Mar 2019, 8:14 PM IST
0business
nikhil siddhartha's arjun suravaram gets a release date `అర్జున్‌ సురవరం`కి మోక్షం.. ఈ సారైనా వస్తాడా? నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ అర్జున్‌ సురవరం. చాలా కాలంగా వాయిద పడుతూ వస్తున్న ఈ సినిమాను నవంబర్‌ 29న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్‌ ప్రకటించారు. Samayam Telugu | Updated: Oct 26, 2019, 01:48PM IST నిఖిల్‌ సిద్ధార్థ్‌ యంగ్ హీరో నిఖిల్‌కి ఈ మధ్య కాలం అస్సలు కలిసి రావటం లేదు. ఈ మధ్యకాలంలో ఈ హీరో నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్‌ ముందు నిరాశపరిచాయి. 2016లో రిలీజ్‌ అయిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా తరువాత నిఖిల్ నటించిన ఏ సినిమా కూడా సక్సెస్‌ కాలేదు. వరుసగా కేశవ, కిరాక్‌ పార్టీ సినిమాలతో నిరాశపరిచాడు నిఖిల్. ఆ తరువాత ఎన్నో ఆశలతో అర్జున్‌ సురవరం సినిమాను చేశాడు. తమిళ్‌లో సూపర్‌ హిట్ అయిన కనితన్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేశాడు. ఈ సినిమాకు ముందుగా ముద్ర అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అయితే టైటిల్‌ విషయంలో వివాదం తలెత్తడంతో తప్పని సరి పరిస్థితుల్లో టైటిల్‌ను అర్జున్‌ సురవరంగా మార్చారు. అయితే నిఖిల్ కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. Visit Site Recommended byColombia సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించినా అనుకున్న సమయానికి రిలీజ్‌ చేయలేకపోయారు. ముందుగా ఈ సినిమాను మేలోనే రిలీజ్ చేయాలని భావించినా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఒక దశలో జనం కూడా నిఖిల్ సినిమా ఒకటి రిలీజ్‌కు ఉన్న విషయమే మర్చిపోయారు. అయితే తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. Also Read: `సూపర్‌ మచ్చి` అంటున్న మెగాస్టార్ చిన్నల్లుడు నవంబర్‌ 29న అర్జున్‌ సురవరం ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో చాలా సార్లు ఇలా రిలీజ్‌ డేట్‌ ప్రకటించి తరువాత సినిమాను వాయిదా వేశారు. మరి ఈ సారైనా అనుకున్నట్టుగా సినిమా రిలీజ్‌ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేశాస్తున్నారు సినీ జనాలు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు టి. సంతోష్ దర్శకుడు. ఠాగూర్‌ మధు సమర్పణలో రాజ్‌ కుమార్ ఆకెళ్ల ఈ సినిమాను నిర్మించారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సామ్‌ సీఎస్‌ సంగీతమందిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, సత్య, తరుణ్ అరోరాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
0business
dsp music indicates flop and hit? దేవి శ్రీ దరువు తేడా పడుతుందా? ఒకప్పుడు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అంటే ఖచ్చితంగా సినిమా ఆడియో సూపర్ హిట్ అనే నమ్మకం అందరిలో ఉండేవి. పదే పదే ఆయన పాటలు వింటూనే ఉండేవారు. కానీ TNN | Updated: Sep 10, 2017, 05:51PM IST ఒకప్పుడు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అంటే ఖచ్చితంగా సినిమా ఆడియో సూపర్ హిట్ అనే నమ్మకం అందరిలో ఉండేవి. పదే పదే ఆయన పాటలు వింటూనే ఉండేవారు. కానీ గత కొన్ని రోజులుగా ఈ పరిస్థితి లేదు. 'ఖైదీ నెంబర్ 150' తప్ప దేవి ఈ ఏడాది మ్యూజిక్ అందించిన ఏ సినిమా పాటలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. అయితే సినిమాలు హిట్ కావడంతో కాస్తో కూస్తో ఆయన పాటలు మొగుతున్నాయి. కానీ గతంలో మాదిరి ఇష్టంతో ఆయన పాటలు వినే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఈ ఏడాది ఆయన సంగీతం సమకూర్చిన 'నేను లోకల్','రా రండోయ్ వేడుక చూద్దాం' సినిమాల పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఇక రీసెంట్ గా విడుదలైన 'జయ జానకి నాయక' సినిమా పాటలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా విడుదలైన ' జై లవకుశ ' పాటలు అభిమానులను ఊహించిన స్థాయిలో లేవనే చెప్పాలి. ఒకటి రెండు పాటలు తప్ప మిగతావి ఇంతకు ముందులా మళ్లీ మళీ వినాలనిపించేలా లేవు. కాగా జై లవకుశలో నాలుగు పాటలే కాకుండా ఇంకో సాంగ్ కూడా ఉందని.. ఎలక్ట్రానిక్ ఫోక్‌‌తో ప్రయోగాత్మకంగా కంపోజ్ చేస్తున్నట్టు తెలపారు దేవిశ్రీ. ఆ సాంగ్ ఎలా ఉంటుదన్న సంగతి పక్కనపెడితే.. ఇదివరకు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసే దేవి ఇప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించేస్తున్నాడు. అవి కాకుండా స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాడు. దీంతో ఆయన మ్యూజిక్ క్వాలిటీపై ఎఫెక్ట్ పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దేవి ఈ పరిస్థితిని అధిగమిస్తాడో లేదో చూడాలి.
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Suresh 138 Views DINESH KARTHIK DineshKarthik ముంబాయి: భారత్‌ క్రికెట్‌ జట్టులో దినేష్‌ కార్తీక్‌ ప్రతిభ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవల వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన జట్టులో చోటు దక్కించుకున్న దినేష్‌. ఈ పర్యటనలో భాగంగా నిర్ణయాత్మక ఐదో వన్డేలో అర్థ సెంచరీ చేశాడు, తర్వాత జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో 48 పరుగులు నమోదు చేశాడు. దీంతో మూడేళ్ల తర్వాత తన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన పునరాగమనాన్నిఘనంగా చాటుకున్నట్టయింది. ఒక మీడియా ఛానల్‌ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దినేష్‌ కార్తీక్‌ విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో తనకు టెస్ట్‌ మ్యాచ్‌లో తిరిగి ఆడాలనే అభిప్రాయాన్ని తెలిపారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎటువంటి ఒత్తిడికి గురికావడంలేదని, నాకిచ్చిన పనిని సమర్థవంతంగా చేయడం పైనే దృష్టి సారిస్తున్నట్లు, 2019 ప్రపంచ కప్‌లో ఆడాలనే ఆకాంక్షనులక్ష్యంగా పెట్టుకున్నానని కార్తీక్‌ తెలిపారు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Ind vs Aus 2nd ODI: తొమ్మిదేళ్ల తర్వాత ధోనీ గోల్డెన్ డక్.. మళ్లీ ఆసీస్‌పైనే చివరిసారిగా 2010లో వైజాగ్‌లో ఆసీస్‌తో జరిగిన వన్డేలో గోల్డెన్ డక్ అయిన ధోనీ.. 9ఏళ్ల తర్వాత అదే జట్టుపై తొలి బంతికే వెనుదిరగడం గమనార్హం. Samayam Telugu | Updated: Mar 6, 2019, 10:23AM IST Ind vs Aus 2nd ODI: తొమ్మిదేళ్ల తర్వాత ధోనీ గోల్డెన్ డక్.. మళ్లీ ఆసీస్‌పైనే హైలైట్స్ నాగ్‌పూర్ వన్డేలో ధోని నిరాశపరిచాడు. 9ఏళ్ల తర్వాత తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరగాడు. అయితే 300, 400, 500 వన్డే విజయాలు సాధించిన జట్టులో సభ్యుడిగా మాత్రం రికార్డు నెలకొల్పాడు. భారత క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీది ఓ ప్రత్యేక స్థానం. కెరీర్‌ తొలినాళ్లలో పొడవాటి జుట్టుతో యూత్ ఐకాన్‌‌గా మారిన ధోనీ.. మైదానంలో హెలికాప్టర్ షాట్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తించేవాడు. టీమిండియా బెస్ట్ ఫినిషర్లలో ఒకడైన ధోనీ ఇప్పటికీ జట్టుకు వెన్నుముకగానే ఉన్నాడు. ఆటలో జోరు తగ్గినప్పటికీ తన వ్యూహాలతో జట్టును గెలిపిస్తూ అభిమానులతో జేజేలు కొట్టించుకుంటున్నాడు. ఆ మధ్యలో ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోనీ ఆసీస్ పర్యటనలతో వరుస హాఫ్ సెంచరీలతో మళ్లీ ట్రాక్ ఎక్కాడు. న్యూజిలాండ్ పర్యటనలోనూ సత్తా చాటాడు. స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న 5వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనూ అర్థ శతకంతో జట్టును గెలిపించాడు.
2sports
pandia హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు న్యూఢిల్లీ: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియాతో జరిగే వార్మప్‌ మ్యాచ్‌లో పాల్గొనే భారత ఏ జట్టుని బిసిసిఐ ప్రకటించింది. భారత ఎ జట్టుకు టీమిం డియా యువఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.సెలక్షన్‌ కమిటీ ప్రకటించిన జట్టు ఈ మధ్య కాలంలో రంజీ ట్రోఫిలో సత్తా చాటిన అనేక మంది ఆటగాళ్లకు చోటు దక్కింది. ఆసీస్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆడే భారత ఎ జట్టు లో హైదరాబాద్‌ యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ చోటు దక్కించుకున్నాడు.22 సంవత్సరాల సిరాజ్‌ ఈ రంజీ సీజన్‌ల 9మ్యాచ్‌ లాడి 41 వికెట్లు తీసు కున్నాడు.మరోవైపు ఈ రంజీ సీజన్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ప్రియాంక్‌ పంచల్‌,సర్వీసెస్‌ బ్యాట్స్‌మెన్‌ రాహుల్‌ సింగ్‌, రిషబ్‌ పంత్‌,ఇషాన్‌ కిషన్‌,బాబా ఇంద్రజిత్‌ వంటి ఆటగాళ్లు భారత్‌ ఎజట్టులో చోటు దక్కించు కున్నారు. ముంబైలోని బ్రబౌర్న్‌స్టేడియం వేదికగా ఈనెల 16నుంచి 18 వరకు మూడు రోజులపాటు వార్మప్‌ మ్యాచ్‌ జరు గనుంది.ఈ వార్మప్‌ మ్యాచ్‌ కోసం రంజీ ట్రోఫీ¶ిలో అత్యుత్తమ ప్రదర్శనచేసిన యువ ఆటగాళ్లను జట్టు లోకి తీసుకున్నారు.నాలుగు టెస్టుమ్యాచ్‌ల సిరీస్‌ లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 23న పుణేలో ప్రారంభం కానుంది. భారత ఎ జట్టు హార్థిక్‌ పాండ్యా(కెప్టెన్‌), అఖిల్‌ హెర్వాద్కర్‌, ప్రియాంక్‌ పంచల్‌,శ్రేయస్‌ అయ్యర్‌,అంకిత్‌ బాన్నే,రిషబ్‌ పంత్‌,ఇషాన్‌ కిషన్‌,షాబాద్‌ నదీమ్‌, కృష్ణప్ప గౌతమ్‌,కుల్‌దీప్‌ యాదవ్‌,నవదీప్‌ షైని, అశోక్‌ దిండా, రాహుల్‌ సింగ్‌, బాబా ఇంద్రజిత్‌.
2sports
Hyderabad, First Published 9, Mar 2019, 11:39 AM IST Highlights రాంచీ వేధికగా.. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీం ఇండియా ఆర్మీ క్యాప్ లను ధరించిన సంగతి తెలిసిందే. రాంచీ వేధికగా.. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీం ఇండియా ఆర్మీ క్యాప్ లను ధరించిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా టీం ఇండియా ఈ క్యాప్ లను ధరించింది. హోదాలో ఉన్న టీమిండియా కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ.. మ్యాచ్‌కు ముందు తన సహచరులకు బీసీసీఐ లోగోలతో ఉన్న ఈ ప్రత్యేక క్యాప్‌లను అందించాడు. దీంతో కోహ్లీసేన వీటిని ధరించే మ్యాచ్ ఆడింది. అంతేకాదు, మూడో వన్డేలో తమకు దక్కిన మ్యాచ్‌ ఫీజును కూడా ఆటగాళ్లంతా జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇస్తున్నట్టు కెప్టెన్‌ కోహ్లీ తెలిపాడు. అయితే.. దీనిపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్మీ క్యాప్ లు ధరించి మ్యాచ్ ఆడటం ఏమిటని ప్రశ్నించింది. ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఫావద్ చౌదరి ఈ ఘటనపై మాట్లాడుతూ.. బీసీసీఐపై చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేయాలని పాక్ క్రికెట్ బోర్డును కోరారు.  ‘‘భారత జట్టు ఆర్మీ క్యాప్‌లు ధ‌రించి క్రికెట్ ఆడ‌డం స‌రికాదు. క్రికెట్‌ను రాజ‌కీయం చేస్తున్న బీసీసీఐపై అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చ‌ర్య‌లు తీసుకోవాలి. టీమిండియా ఆటగాళ్లు ఆర్మీ క్యాప్‌లు ధ‌రించిన అంశాన్ని పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయాలి’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
2sports
Visit Site Recommended byColombia సౌరవ్‌ తండ్రి చండీదాస్‌ గంగూలీకి కోల్‌కతాలో ప్రముఖ వ్యాపారి. ఆ కుటుంబానిది విలావంతమైన జీవితం. సంపన్నుల పిల్లలు చదివే పాఠశాలలోనే గంగూలీ సోదరులు చదువుకునేవారు. ఇద్దరూ చురుకైన విద్యార్థులే. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. అయితే ఎప్పుడు చూపులు కలిశాయో గానీ మన కోల్‌కతా ప్రిన్స్ పక్కింటి అమ్మాయి డోనా ప్రేమలో మునిగిపోయాడు. డోనా, సౌరవ్‌వి పక్కపక్క ఇల్లే. వారిద్దరూ ఒకరికి ఒకరు తెలిసినా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఇంటి ముందు నుంచి వెళ్లేటప్పుడు సౌరవ్‌ను గమనించేది డోనా. ఫుట్‌బాల్‌ ఆడుతున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఆమెపై చూపులతోనే బాణాలు విసిరేవాడు మన దాదా. క్రమంగా ఆమె ఆకర్షణలో పడిపోయిన అతడు స్నేహితులతో కలిసి అప్పుడుప్పుడు డోనా చదివే పాఠశాలకూ వెళ్లేవాడు. ఎప్పుడు కలిసినా వారు మాత్రం చూపులతోనే మాట్లాడుకునేవారు. క్రమంగా సౌరవ్‌కు క్రికెట్, డోనా ఈ రెండో లోకమైపోయాయి. డోనా ప్రేమను గెలుచుకున్న అతడు.. క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపికైన దాదా తన ఆరంగ్రేట టెస్టులోనే సెంచరీ చేసి హీరో అయిపోయాడు. ఇండియా ఆ సిరీస్ కోల్పోయినా టీమిండియా భవిష్యత్ ఆశాకిరణంగా మాత్రం గంగూలీ అందరి మన్ననలు పొందాడు. క్రికెటర్‌గా నిరూపించుకున్నాక డోనాను తన జీవితంలోకి ఆహ్వానించేందుకు సిద్ధమయ్యాడు. అయితే అన్ని కథల్లోలాగానే వీరి ప్రేమకు పెద్దలు నో చెప్పారు. కారణం వారి మధ్యనున్న తగాదాలే. గంగూలీ కుటుంబంతో డోనా తండ్రి సంజీవ్‌ రాయ్‌కు తగాదాలున్నాయి. ఒకప్పుడు వీరంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. వ్యాపారంలో పార్టనర్స్. అప్పట్లో వీరి ఇళ్ల మధ్య గోడ ఉండేదే కాదు. అయితే వ్యాపారంలో గొడవలు రావడంతో విడిపోయారు. ఇళ్ల మధ్య గోడ కూడా కట్టేసుకున్నారు. కొద్దికాలానికే మిత్రులు కాస్తా.. శత్రువులుగా మారిపోయారు. అయితే సౌరవ్ తన ప్రేమ విషయంలో తల్లిదండ్రులు ఒప్పించగలిగినా.. డోనా తండ్రి మాత్రం ససేమిరా అన్నాడు. అప్పుడే దాదా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన మిత్రుడు బెనర్జీతో ఓ ప్లాన్ వేశాడు. ఎవరికీ తెలియకుండా డోనాను రిజిస్ట్రార్ మ్యారేజ్ చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. అయితే గంగూలీ అక్కడికి వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా గుమిగూడారు. దీంతో వారి పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత రిజిస్ట్రార్‌ను బెనర్జీ తన ఇంటికే పిలిపించి వారిద్దరి పెళ్లి జరిపించాడు. తర్వాత సౌరవ్, డోనా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. వీరి సీక్రెట్ మ్యారేజీ గురించి మొదట ఎవరికీ తెలియలేదు. కొందరు జర్నిలిస్టులు తెలుసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. రిజిస్ట్రార్‌ను ఆరా తీసినా లాభం లేకపోయింది. వీరి పెళ్లి జరిగినట్లు పత్రికల్లో అప్పుడప్పుడూ వార్తలు వస్తుండేవి. వాటిని రెండు కుటుంబాలు ఖండించేవి. అయితే పక్కా ఆధారాలు సేకరించిన ఓ విలేకరి ఓ రోజు బెంగాల్ పత్రికలో ఫస్ట్ పేజీలో కథనం ప్రచురించాడు. దీంతో పరిస్థితి చేయి దాటిపోయి రహస్యం బయటపడింది. గంగూలీ కుటుంబసభ్యులు ఈ వివాహాన్ని అంగీకరించినా.. డోనా తండ్రి మాత్రం ఆగ్రహించాడు. సీక్రెట్‌గా చేసుకున్న ఈ పెళ్లి అంగీకరించేది లేదని పట్టుబట్టాడు. ఆ తర్వాత అందరూ నచ్చజెప్పడంతో మెత్తబడ్డాడు. దీంతో 1997, ఫిబ్రవరి 21న సౌరవ్, డోనా పెళ్లిని ఇరు కుటుంబాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించాయి. ఈ దంపతులు నేడు 23వ దాంపత్య వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మొత్తానికి మన దాదా క్రికెట్లోనే కాదు.. ప్రేమలోనే దూకుడు ప్రదర్శించి నచ్చిన అమ్మాయిని జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు.
2sports
Vaani Pushpa 98 Views pmc bank , Rbox deposits pmc bank ముంబయి: ఆర్‌బిఐ ఆంక్షలు ఎదుర్కొంటున్న పిఎంసి బ్యాంకులో రిజర్వుబ్యాంకు అధికారుల క్రెడిట్‌సొసైటీ 105 కోట్లు డిపాజిట్లు పెట్టినట్లు అంచనా. బ్యాంకు ఖాతాదారులు విత్ర్‌డ్రాలను రోజుకు వెయ్యికి మించి చేయకూడదని ఆర్‌బిఐ నిబంధనలు విదించిన నేపథ్యంలో పంజాబ్‌మహారాష్ట్ర బ్యాంకు కార్యకలాపాలపై నిశిత దృష్టిని దర్యాప్తుసంస్థలు పెట్టాయి. రిజర్వుబ్యాంకుకు అధికారుల సహకార రుణపరపతి సొసూటీ (ఆర్‌బాక్స్‌)కు ఈ బ్యాంకులో 105 కోట్లవరకూ ఫిక్సెడ్‌ డిపాజిట్లు ఉన్నాయని తేలింది. ఆర్‌బాక్స్‌కు 96 కోట్ల మేర 2018 చివరినాటికి డిపాజిట్లు ఉన్నాయని, అప్పటినుంచి 9శాతంపెరిగాయని అన్నారు. సహకార సొసైటీ పెట్టుబడులు 478.64 కోట్ల ఫిక్సెడ్‌డిపాజిట్లలో ఇదొక భాగంగాతేలింది. స్వల్పకాలిక డిపాజిట్లు ఒక ప్రైవేటు బ్యాంకుల్లో ఉంచడం ఇదే మొదటిసారి. 473.36 కోట్లు ఫిక్సెట్‌ డిపాజిట్లలో ఐదుకోట్లు స్వల్పకాలిక డిపాజిట్‌గా ఉంది. 2784 వాటాలను వెయ్యిరూపాయలు చొప్పున ముంబయి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో కొనుగోలుచేసింది. అన్ని డిపాజిట్లు వివిధ సహకార బ్యాంకుల్లోనే ఉంచినట్లు సమాచారం. 2019 మార్చి 31వ తేదీనాటికి పిఎంసి బ్యాంకులోనే ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత 100 కోట్లు భారత్‌ సహకార బ్యాంకులో ఉంచింది. ఈ సొసైటీని 1967లో ఏర్పాటుచేసారు. రిజర్వుబ్యాంకు అధికారుల అవసరాలకోసం ఈ సొసైటీ ఆవిర్భవించింది. మహారాష్ట్ర సహకార సొసైటీలచట్టం 1960 ప్రకారం ఏర్పాటుచేసారు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/
1entertainment
RAYEES బాక్సింగ్‌లో రయీస్‌కు స్వర్ణo హైదరాబాద్‌: జాతీయ సబ్‌ జూనియర్‌ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు మొహహ్మద్‌ రయీస్‌ స్వర్ణం సాధించాడు. ఎల్‌బి స్టేడియంలో జరిగిన 46-48 కేజీల ఫైనల్‌ బౌట్‌లో రయీస్‌ 5-0తో బికాస్‌ (త్రిపుర)ఫై ఏక పక్షంగా విజయం సాధించాడు. మిగతా బౌట్లలో తెలంగాణ కుర్రాళ్లు రజతంతో తృప్తిపడ్డారు. 42- 44 కేజీల విభాగంలో కె.ఆంజనేయులు 0-5తో మీసాల రవి (జార్ఖండ్‌) చేతిలో, 52-54 కేజీల కేటగిరీ ఫైనల్లో మధుసూదన్‌ యాదవ్‌ 0-5తో అజ§్‌ు పటేల్‌ (రాజస్తాన్‌) చేతిలో పరాజయం చవిచూశారు. ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్లలో జెర్రిపోతుల భానుప్రకాశ్‌, నెల్లి అభిరామ్‌ టైటిల్స్‌ సాధించగా బాలగణేష్‌ రన్నరప్‌గా నిలిచాడు. 36-38 కేజీల ఫైనల్లో భాను ప్రకాశ్‌ 5-0తో సాహిల్‌ సుభా (ఉత్తర ప్రదేశ్‌)పై, 40-42 కేజీల తుదిపోరులో అభిరామ్‌ 5-0తో రూపేశ్‌ కుమార్‌ (రాజస్తాన్‌)పై విజయం సాధించారు. 32-34 కేటగిరీ టైటిల్‌ పోరులో బాల గణేస్‌ 0-5తో మనీశ్‌ సింగ్‌ (ఢిల్లీ) చేతిలో కంగుతిన్నారు.
2sports
ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ గ్యాలరీ First Published 22, Sep 2017, 4:51 PM IST ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ గ్యాలరీ ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ గ్యాలరీ ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ గ్యాలరీ ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ గ్యాలరీ ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ గ్యాలరీ ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ గ్యాలరీ ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ గ్యాలరీ ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ గ్యాలరీ ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ గ్యాలరీ ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ గ్యాలరీ ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ గ్యాలరీ ప్రభాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ గ్యాలరీ Recent Stories
0business
internet vaartha 184 Views కాన్‌బెర్రా : ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు వరుస వన్డేలలో భారత్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే.కాగా నాలుగవ వన్డేను భారత్‌ చేజేతులారా జారవిడుచుకుంది. ఆరవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా పైన విమర్శలు వస్తున్నాయి.జడేజా తీరును భారత సారథి ధోనీ కూడా తప్పుబట్టాడు.జడేజా సహచర బ్యాట్స్‌మెన్‌తో సరిగా సమన్వయం చేసుకోవాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.జడేజా అనుభవం కలిగిన ఆటగాడని,అతను టెయిలెండర్లతో సమన్వ యం చేసుకోవాల్సి ఉండేదని పేర్కొన్నాడు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV చైతూ-తమన్నాల '100% లవ్' తమిళ్ రీమేక్ నాగచైతన్య, తమన్నాల కెరీర్ ఆరంభంలో ఆ ఇద్దరూ జంటగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 100% లవ్ మూవీ టాలీవుడ్... TNN | Updated: May 6, 2017, 03:20PM IST నాగచైతన్య, తమన్నాల కెరీర్ ఆరంభంలో ఆ ఇద్దరూ జంటగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 100% లవ్ మూవీ టాలీవుడ్ ఆడియెన్స్‌‌ని విశేషంగా ఆకట్టుకుంది. సుకుమార్ తెరకెక్కించిన భిన్నమైన ప్రేమాకథా చిత్రాల్లో ఒకటైన ఈ '100% లవ్' త్వరలోనే కోలీవుడ్‌లో రీమేక్ కానుంది. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ కమ్ యాక్టర్ జీవీ ప్రకాశ్ హీరోగా సెప్టెంబర్‌లో కానీ లేదా అక్టోబర్‌లో కానీ సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ రీమేక్ ద్వారా చంద్రమౌళి అనే సినిమాటోగ్రాఫర్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. పొన్ విలంగు లాంటి సినిమాతోపాటు జీ బూమ్ బా వంటి టీవీ సీరియల్స్‌‌కి పనిచేసిన చంద్రమౌళికి సుకుమార్‌తో మంచి పరిచయం వుంది. ఆ స్నేహంతో వున్న చనువుతోనే '100% లవ్'ని తమిళంలో రీమేక్ చేయాలనే ఆలోచన వచ్చిన సమయంలో ఆ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ చంద్రమౌళికి దక్కింది. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ఫ్రెడ్ మర్ఫీ వద్ద పనిచేసిన చంద్రమౌళికి సినిమాటోగ్రాఫర్‌‌గా మంచి పేరుంది కానీ సినిమా డైరెక్షన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. చెన్నై ఎక్స్‌ప్రెస్, దిల్‌వాలే, సింగం వంటి చిత్రాలకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన డుడ్లె '100% లవ్' రీమేక్‌కి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు.
0business
Hyderabad, First Published 1, Jul 2019, 9:08 AM IST Highlights సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గరుడవేగ సినిమా అనంతరం యువ  దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో చేసిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే రాజశేఖర్ పై ఉన్న ఒక కాంట్రవర్సీ సందేహంపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.    సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గరుడవేగ సినిమా అనంతరం యుప్వ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో చేసిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే రాజశేఖర్ పై ఉన్న ఒక కాంట్రవర్సీ సందేహంపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.  రాజశేఖర్ షూటింగ్ కి లేట్ గా వస్తారని చాలా మంది దర్శకులు ఆరోపణలు చేశారు. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే కల్కి షూటింగ్ సమయంలో ఆయనెప్పుడూ ఆలస్యంగా రాలేదని షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు కొన్ని రోజులు రాజశేఖర్ ఫ్యామిలీతో ట్రావెల్ అయినట్లు చెప్పాడు.  వారితో జర్నీ చాలా బాగా నడిచిందంటూ.. వాళ్ళతో వర్క్ చేయడం సౌకర్యంగానే ఉందని చాలా హ్యాపీగా అనిపించిందని ప్రశాంత్ వివరణ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇప్పట్లో క్లారిటీ ఇవ్వలేనని చెప్పిన ప్రశాంత్ కల్కి సినిమా ఫుల్ కలెక్షన్స్ చూసి అనంతరం ఏ సినిమా చేయాలన్న విషయంపై ఆలోచిస్తానని తెలిపారు.   Last Updated 1, Jul 2019, 9:10 AM IST
0business
మామయ్య మూవీలో కోడ‌లు స‌మంత Highlights నమో వేంకటేశాయ మూవీతో బిజీ బిజీగా ఉన్న నాగార్జున  త‌రువాత ఓంకార్ రాజుగారి గ‌ది 2 లో న‌టించ‌నున్న నాగార్జున‌ రాజు గారి గ‌ది 2 లో హిరోయిన్ గా న‌టించ‌నున్న సమంత    ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు సందడి చేయనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా రన్ రాజా రన్ ఫేం సీరత్ కపూర్ ను ఎంపిక చేయగా మరో కీలక పాత్రకు స్టార్ హీరోయిన్ సమంతను ఫిక్స్ చేశారు. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. గతంలో నాగార్జున, సమంతలు మనం సినిమాలో కలిసి నటించారు. రాజుగారి గది 2లో కూడా నాగ్, సమంత పాత్రలు మనం తరహాలోనే ఉండే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
0business
TEAM INDIA భారత్‌-ఆస్ట్రేలియా సిరీస్‌కు పాతరూల్స్‌ న్యూఢిల్లీ: క్రికెటర్లలో క్రమశిక్షణ, ఆటలో నాణ్యత పెంచేందుకు ఐసిసి క్రికెట్‌లోకి కొత్త రూల్స్‌ని ఈ నెలలో ప్రవేశపెట్టనుంది. అయితే…సెప్టెంబర్‌ 17 నుంచి జరగనున్న భారత్‌, ఆస్ట్రేలియా సిరీస్‌కు మాత్రం ఈ రూల్స్‌ నుంచి మినహాయింపు లభించింది. మైదానంలో దురుసుగా ప్రవర్తించిన క్రికెటర్‌పై తక్షణమే అంపైర్లు చర్య తీసుకోవడం, బ్యాట్‌ పరిమాణంలో ఆంక్షలు, డిఆర్‌ఎస్‌లో మార్పులు తదితర రూల్స్‌ ఇందులో ఉన్నాయి. సెప్టెంబర్‌ 28నుంచి ఈరూల్స్‌ అమలులోకిరానున్నట్లు ఐసిసి ప్రకటిం చగా.. అక్టోబర్‌ 13 వరకు జరగనున్న భారత్‌,ఆస్ట్రేలియా సిరీస్‌కి మాత్రం ఇవి వర్తించవని తాజాగా వెల్లడించింది. సెప్టెంబర్‌ 28 నుంచి జరగనున్న శ్రీలంక-పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లకి ఐసిసి కొత్త రూల్స్‌ వర్తిస్తాయి. కానీ…ఈనెల మధ్యలోనే ఆరంభమయ్యే భారత్‌- ఆస్ట్రేలియా సిరీస్‌కి మాత్రం ఇవి వర్తించవు. ఈ సిరీస్‌ అక్టోబర్‌ మధ్య వరకు కొనసాగినా…ఒకే సిరీస్‌లో రెండు రూల్స్‌ ఉండకూడదనే ఉద్దేశ్యంతో మినహాయింపు ఇస్తున్నాం..అని ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త రూల్స్‌లో డిఆర్‌సిని అంపైర్‌ కాల్‌గా పేరు మారుస్తున్నారు. ఆటగాళ్లు ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే…ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల తరహాలో అంపైర్లు క్రికెటర్లని మైదానం నుంచి వెలుపలికి పంపించేయవచ్చు.క్రీజులోని బ్యాట్స్‌మెన్‌ ఒకసారి వచ్చి…బెయిల్‌ పడుతున్న సమయంలో బ్యాట్‌ లేదా పాదం గాల్లో ఉన్నా ఇకపై ఔట్‌ కాదు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV వైరల్: కొక్కొరొక్కోడితో చెర్రీ! కోడిపుంజుతో చరణ్ తీసుకున్న ఫోటోను ఆయన సతీమణి ఉపాసన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. TNN | Updated: May 6, 2017, 05:04PM IST కోడిపుంజుతో చరణ్ తీసుకున్న ఫోటోను ఆయన సతీమణి ఉపాసన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కోడిపుంజుతో కలసి చెర్రీ దిగిన ఈ ఫోటో అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటూ వాట్సాప్, ట్విట్టర్‌‌లలో వైరల్‌గా మారింది. కోడిపుంజుతో ఫోటోలో స్పెషాలిటీ ఏంటని ఆలోచిస్తున్నారా? ఈ కోడిని చరణ్‌కు ఆయన అభిమానులు బహుమతిగా ఇచ్చారట. ఇటీవల సుకుమార్ సినిమా షూటింగ్ కోసం గోదావరి జిల్లాకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో కొందరు గ్రామస్తులు చరణ్‌కు ఎంతో అభిమానంతో ఓ కోడి పుంజును బహుమతిగా అందించినట్లు తెలుస్తోంది. వారంత అభిమానంతో ఆ కానుక ఇవ్వడంతో చరణ్ కాదనలేకపోయాడు. అసలే జంతు ప్రేమికులైన చరణ్, ఉపాసనాలు వెంటనే ఆ కోడిపుంజుని తమ ఫామ్ హౌస్‌కు షిఫ్ట్ చేసేశారు. అక్కడ విభిన్న జాతులకు చెందిన గుర్రాలు, పెట్ డాగ్స్, ఇలానే చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫ్యామిలీలోకి కొత్తగా కోడిపుంజు వచ్చి చేరింది. ఓ వైపు అపోలో హాస్పిటల్స్, మరో వైపు చరణ్ సినిమాలు, వీలు దొరికినప్పుడల్లా తన పెంపుడు జంతువులతో గడుపుతూ ఉపసన చాలా బిజీగా మారిపోయింది. మొదట్లో చరణ్ సినిమాకు సంబంధించిన వ్యవహారాల్లో ఆమె ఎక్కువగా కనిపించేది కాదు. కానీ ఈ మధ్య షూటింగ్ స్పాట్స్‌కు వెళ్ళి అక్కడ వాతావరణాన్ని కూడా గమనిస్తోంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ కోడలు అనిపించుకుంటుంది ఉపాసన.
0business
Apr 26,2015 ప్రారంభమైన ఇన్నోవేటివ్‌ డిజిటల్‌ ఇండియా ఛాలెంజ్‌           అహ్మదాబాద్‌ : సాంకేతికతకు, ఆవిష్కరణలకు పెద్ద పీట వేసి భారత్‌ను డిజిటల్‌ ఇండియాగా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యంగా శనివారం అహ్మదాబాద్‌లో ఇంటెల్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డిఎస్‌టి-ఇన్నోవేట్‌ ఫర్‌ డిజిటల్‌ ఇండియా ఛాలెంజ్‌ సదస్సు ప్రారంభమైంది. నేషనల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎంటర్‌ ప్యూనర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీ హెచ్‌కె మిట్టల్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ శర్మ, సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ఇంక్యూబేషన్‌ ఎంటర్‌ ప్యూనర్‌ షిప్‌ చైర్‌ పర్సన్‌ రాకేష్‌ బసంత్‌, ఇంటెల్‌ సౌత్‌ ఏషియా విభాగం మేనేజింగ్‌ డైరెక్టర్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ గ్రూప్‌ ఉపాధ్యక్షుడు దేబ్‌జానిఘోష్‌లు పాల్గొన్న ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి హర్షవర్దన్‌, కేంద్ర టెలికాం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హర్షవర్దన్‌ మాట్లాడుతూ... భారత సాంకేతికతో ఇంటెల్‌కు దీర్ఘకాలిక అనుబంధం ఉందన్నారు. ప్రయివేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో ఇన్నోవేటివ్‌ డిజిటల్‌ ఇండియా లాంటి కార్యక్రమాలు బాగా జరుగుతాయనడానికి ఇది చక్కని ఉదాహరణ అన్నారు. టెలికాం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ..డిజిటల్‌ ఇండియా విజయవంతం కావాలంటే ఒక స్థిరమైన స్థానిక సాంకేతికతో కూడిన ఎకోసిస్టమ్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్‌ ఇండియా దృష్టి కోణానికి అనుగుణంగా ఇంటెల్‌, డిఎస్‌టి, మైగవ్‌ అండ్‌ టు ఎండ్‌ ఛాలెంజ్‌ ద్వారా వాస్తవిక రూపాన్ని తీసుకొస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఇంటెల్‌ ఈ కార్యక్రమాన్ని భారతదేశంలోని ప్రతీ ఇంటికి సాంకేతిక ఫలాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సహకారంతో నిర్వహిస్తోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Mar 08,2016 గృహ రుణాలపై డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అవగాహన హైదరాబాద్‌ : గృహ రుణాలు అందించే దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీిహెచ్‌ఎఫ్‌ఎల్‌) ఈ రంగం రుణాలపై అవగాహన కల్పించే కార్యక్రమం తీసుకుంది. రుణాలపై అనుమానాలను నివృత్తి చేయడానికి వీడియో ఆధారిత చైతన్యం కల్పిస్తున్నామని డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ సిఇఒ హర్షిల్‌ మెహత ఒక్క ప్రకటనలో పేర్కొన్నారు. 5 లక్షల పైగా ఖాతాదార్లకు చేర్చాలని నిర్ధేశించుకున్నామని తెలిపింది. ప్రతి మాసం కొత్త వీడియోలను ఆవిష్కరించనున్నామన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
మన ప్రజల్లో నిజాయితీ ఉంది.. -పన్ను పరిధిని పదికోట్ల మందికి విస్తరించండి - చెల్లింపుదారుల్లో విశ్వాసాన్ని నింపండి - ఐటీ శాఖ అధికారుల సమావేశంలో ప్రధాని న్యూీఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల్లో విశ్వాసం నింపేలా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించారు. దీనికి తోడు ఇప్పుడున్న ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్యను ప్రస్తుతమున్న 5.43 కోట్ల స్థాయి నుంచి 10 కోట్ల స్థాయికి చేర్చేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఇక్కడ 'రజస్వ జ్ఞాన సంగమ్‌' పేరిట ఇక్కడ ఏర్పాటు చేసిన పన్ను వసూళ్ల శాఖ అధికారుల రెండు రోజల సమావేశంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. పన్ను చెల్లింపుదారుల విశ్వాసాన్ని పొందేందుకు గాను వారి పట్ల అధికారులు నమ్రత బుద్ధితో వ్యవహరించాలని కోరారు. ఇది దేశంలో పన్ను పరిధిని పది కోట్ల మందికి విస్తరిచేందుకు దోహదం చేస్తుందని వివరించారు. మేటి పన్ను వసూళ్ల నిర్వహణకు గాను ఆదాయం, జవాబుదారీతనం, నిజాయితీ, సమాచారం, డిజిటైజేషన్‌ అనే అయిదు మూల స్తంభాలను ఆధారం చేసుకొని ముందుకు సాగాలని ఆయన అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. ఇవి దేశంలోని ప్రజలకు సమర్థమంతమైన పరిపాలనను అందించేందుకు దోహదం చేస్తాయని అన్నారు. పన్ను పరిధిని దాదాపు రెట్టింపు చేసేందుకు గాను అధికారులకు ప్రధాని ఎలాంటి కాలపరిమితిని విధించలేదని తెలిపారు. మన దేశ ప్రజలు నిజాయితీలేని వారు కారని మోడీ అన్నారు. పన్ను వసూళ్లలో సరళీకరణ విధానాలను తీసుకురావడం ద్వారా వారు స్వచ్ఛందంగా పన్ను చెల్లింపు వైపునకు దృష్టి పెట్టేలా చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందుకు కేంద్రం ప్రవేశపెట్టిన 'గివిట్‌అప్‌' పథకానికి స్పందించి దాదాపు కోటి మంది స్వచ్ఛందంగా ఎల్‌పీజీ సిలండర్లను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశ ప్రజలు గొప్ప అశయాలతో ముందుకు సాగుతున్నారన్న ప్రధాని వాటిని నిజం చేసేందుకు స్వచ్ఛందంగా సాయమందించేందుకు వారు ఎప్పుడు ముందుంటారని అన్నారు. ప్రధాని సూచించి మార్గం భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖ అధికారులకు దిశానిర్దేశకంగా పనిచేస్తాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా తెలిపారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Mahela Jayawardene appointed as Mumbai Indians head coach ముంబై ఇండియన్స్‌కు కొత్త కోచ్ వచ్చాడోచ్.. ప్రధాన కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా జట్టుకు సేవలు అందించాలని భావిస్తుండటంతో అతడి స్థానంలో నూతన కోచ్‌ను ముంబై జట్టు నియమించింది. TNN | Updated: Nov 19, 2016, 10:02AM IST ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే‌ ఎంపికయ్యాడు. ప్రస్తుత ప్రధాన కోచ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్థానంలో మహేల బాధ్యతలు చేపట్టనున్నాడు. తనను ముంబై జట్టు ప్రధాన కోచ్‌గా నియమించడం పట్ల జయవర్దనే సంతోషం వ్యక్తం చేశాడు. 2017 ఐపీఎల్ సీజన్ నుంచి మహేల బాధ్యతలను చేపడతాడని ముంబై ఇండియన్స్ జట్టు తన వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. రికీ పాంటింగ్ 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జట్టు ఆశించిన రీతిలో రాణించకపోవడంతో రోహిత్‌కు బాధ్యతలు అప్పగించాడు. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ తొలిసారిగా ఐపీఎల్ టైటిల్‌ను గెలుపొందింది. We welcome one of the most elegant & graceful batsmen of the modern era, @MahelaJay as the new Head Coach of Mumbai Indians. #WelcomeMahela pic.twitter.com/wFlulxw4iM — Mumbai Indians (@mipaltan) November 18, 2016 పాంటింగ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక, టోర్నీ ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై ఇండియన్స్ రెండోసారి టైటిల్‌ను సాధించింది. పాంటింగ్ ఆస్ట్రేలియా టీ20 జట్టు కోచ్ పదవి కోసం పోటీలో ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా జట్టు ప్రదర్శన తీసికట్టుగా మారడంతో ఆయన తన జట్టుకు సేవలు అందించాలని భావిస్తున్నాడు. సమీప భవిష్యత్తులోనే క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్ల చైర్మన్ పదవిని సైతం పాంటింగ్ చేపట్టే అవకాశం ఉంది. ఈ కారణంగా పాంటింగ్ సేవలను ముంబై జట్టు కోల్పోనుంది. దీంతో అతడి స్థానంలో జయవర్దనేను ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. జయవర్దనే గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచి టస్కర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఢాకా డైనమైట్స్ తరఫున ఆడుతున్నాడు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV సల్మాన్‌కు ‘లోఫర్, ఇడియట్’ దర్శకుడి సపోర్ట్ కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలి జైలు పాలైన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి క్రమంగా మద్దతు పెరుగుతోంది. Samayam Telugu | Updated: Apr 6, 2018, 08:20PM IST కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలి జైలు పాలైన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు సానుభూతిని తెలపగా.. తెలుగు పరిశ్రమ నుండి ప్రముఖ రచయిత, దర్శకుడు కోన వెంకట్ సల్మాన్‌కు సపోర్ట్‌గా నిలిచారు. తాజాగా ఈ జాబితాలో చేరారు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. గత 20 ఏళ్లుగా ఈ దేశంలో వేలాది కృష్ణజింకలను వేటాడుతున్నారు. అలాగే ప్రతిరోజూ ఆవులు, మేకలు, పందులను కోట్ల సంఖ్యల్లో చంపేసి తినేస్తున్నారు. మరి వాటి మాటేంటని వాటిని పట్టించుకోరా? అది విషయం కాదా? అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారాయన. అయితే ఈ ట్వీట్‌లో ఎక్కడా సల్మాన్ ఖాన్ పేరును ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే పూరీ ట్వీట్‌పై జంతుప్రేమికులు ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. In last 20 years thousands of blackbucks got killed in india, those are not a matter .. Everyday we kill cows , go… https://t.co/6m56HcO7xJ — PURI JAGAN (@purijagan) 1522937901000
0business
internet vaartha 204 Views హైదరాబాద్‌ : నగరంలో మూడు రోజులపాటు ఇన్‌సైడర్‌ఎక్స్‌ 2016 హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ప్రారంభించారు. టిఆర్‌ఎస్‌ ఎంపి కె కవిత హైటెక్స్‌లో ఈ ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. అవార్డు విన్నింగ్‌ఆర్కిటెక్ట్‌ ప్రతాప్‌ జాదవ్‌, ఐఐఐటి ప్రెసిడెంట్‌ తదితరులు పాల్గొన్నారు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇంటీరియర్‌ డిజైనర్స్‌ హైదరాబాద్‌ విభాగం 20 సంవ  త్సరాలు పూర్తిచేసుకున్నందుకుగాను ఈ ఏడాదిఈప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రదర్శనలో భాగంగా భారీ సంఖ్య లో ఆర్కిటెక్ట్స్‌లు, డిజైనర్లు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈప్రదర్శనలో ప్లానింగ్‌, ఇంటీరియర్‌డిజూఐన్‌ రంగానికి అనుగుణంగా అధు నాతన డిజైన్లు ప్రదర్శించినట్లు హెచ్‌ఆర్‌సి చైర్‌ పర్సన్‌ సోనా చత్వాని వెల్లడించారు. ట్రిపుల్‌ఐడి హైదరాబాద్‌ప్రాంతీయ విభాగం 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ షో విజయ వంతం అయింది. ఇంటీరియర్‌ డిజైన్‌లకు సంబంధించి 200కుపైగా బ్రాండ్లు, 130కి పైగా స్టాల్స్‌తో ఏర్పాటు చేశామన్నారు. అధిక సంఖ్యలో ఆర్కిటెక్ట్‌ లు, ఇంటీరియర్‌ డిజైనర్లు, డిజైన్‌ సంబంధిత వృత్తి నిపుణులు రక్షణ రంగం, ప్రభుత్వ కార్పొరేట్‌ప్రము ఖులు హోమ్‌ బిల్డర్స్‌ పాల్గొనడం జరిగిందన్నారు. కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల్లోఈరంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని చత్వాని వెల్లడించారు. ఇండియన్‌ ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్స్‌తెలంగాణ, దిక్రాప్ట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎపి, తెలంగాణ, ఐఎస్‌హెచ్‌ ఆర్‌ఎఇ డెక్కన్‌ విభాగం, ఇండియన్‌ ప్లంబింగ్‌ అసోసి యేషన్‌, ఐఎన్‌టిఎస్‌సిహెచ్‌ ఎఫ్‌ఎస్‌ఎఐ తదితర సం స్థలు ఇన్‌సైడర్‌షోకు పూర్తితోడ్పాటును అందించాయి.
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV అమితాబ్ సహా ఇతరులపై కన్నేసిన ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పనామా పేపర్ లీక్స్ వ్యవహారంలో గత ఏడేళ్లకి సంబంధించిన కేసుల్ని తిరిగి రీఓపెన్ చేసేందుకు అవసరమైన అనుమతి కోసం TNN | Updated: Apr 28, 2016, 12:53AM IST పనామా పేపర్ లీక్స్ వ్యవహారంలో గత ఏడేళ్లకి సంబంధించిన కేసుల్ని తిరిగి రీఓపెన్ చేసేందుకు అవసరమైన అనుమతి కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కోర్టుల్ని కానీ లేదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని కానీ ఆశ్రయించవచ్చని తెలుస్తోంది. ఇటువంటి కేసుల్లో ట్యాక్స్ ఎగవేతలకి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఏమైనా లభించే అవకాశం వుందని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అనుమానం వ్యక్తంచేస్తోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టాల ప్రకారం గత ఏడేళ్లకు చెందిన కేసులని మాత్రమే తిరిగి ఓపెన్ చేసే వెసులుబాటు వుంటుంది. పనామా పేపర్ లీక్స్‌లో ఆరోపణలు వినిపిస్తున్న వారిలో అమితాబ్ వంటివారికి ఇప్పటికే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కొన్ని తాజా ప్రశ్నలతో కొత్తగా మరో ప్రశ్నావళిని రూపొందించి పంపించింది. ఈ వివాదంలో అమితాబ్ పేరుని ప్రముఖంగా ప్రస్తావించిన పనామా పేపర్ లీక్స్... ఆయన విదేశాల్లో రెండు కంపెనీలకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని, టెలీ కాన్ఫరెన్స్‌ల ద్వారానే కంపెనీ వ్యవహారాలు చక్కబెడుతుంటారనే ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వివాదంలో అమితాబ్ పాత్ర ఎంతమేరకు వుందని తెలుసుకునేందుకుగాను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఆయనకి ఈ కొత్త ప్రశ్నావళిని పంపించిందని సమాచారం.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV క్రిస్ గేల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన 16 ఏళ్ల అఫ్ఘాన్ కుర్రాడు! క్రిస్ గేల్ అరవీర భయంకర బ్యాట్స్‌మన్. తనదైన రోజున ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. సిక్సుల మీద సిక్సులు బాదుతూ చెలరేగిపోతాడు. Samayam Telugu | Updated: Mar 28, 2018, 05:50PM IST క్రిస్ గేల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన 16 ఏళ్ల అఫ్ఘాన్ కుర్రాడు! క్రిస్ గేల్ అరవీర భయంకర బ్యాట్స్‌మన్. తనదైన రోజున ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. సిక్సుల మీద సిక్సులు బాదుతూ చెలరేగిపోతాడు. అలాంటి ఈ వెస్టిండీస్ ఓపెనర్‌ను 16 ఏళ్ల అఫ్ఘానిస్తాన్ స్పిన్నర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అతని పేరు ముజీబ్ ఉర్ రహ్మాన్. ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచుల్లో భాగంగా మార్చి 15న వెస్టిండీస్, అఫ్ఘానిస్తాన్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ క్రిస్ గేల్ ఒకే ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. ముజీబ్ విసిరిన అద్భుత గూగ్లీకి గేల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. Visit Site Recommended byColombia నేడు (మార్చి 28న) ముజీబ్ 17వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా క్రిస్ గేల్‌ను అతను క్లీన్ బౌల్డ్ చేసిన వీడియోను ఐసీసీ తన ‘క్రికెట్ వరల్డ్ కప్’ ట్విట్టర్ అకౌంట్‌లో ఉంచింది. ముజీబ్ ఈ మ్యాచ్‌లో మొత్తం మూడు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితి చేయడంలో కీలకపాత్ర పోషించాడు. What a moment at #CWCQ this was! Chris Gayle bowled for 1 by a 16-year-old! He's 17 today - Happy Birthday to Afgh… https://t.co/PLpxxINOTw — Cricket World Cup (@cricketworldcup) 1522236600000 మార్చి 25న జరిగిన మరో మ్యాచ్‌లోనూ అఫ్ఘానిస్తాన్ చేతిలో వెస్టిండీస్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనూ గేల్ వికెట్‌ను ముజీబ్ తీయడం విశేషం. అఫ్ఘాన్ బౌలర్ల ధాటికి విండీస్ 204 పరుగులకే చాపచుట్టేసింది. స్వల్ప లక్ష్యాన్ని అఫ్ఘానిస్తాన్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 40.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్, వికెట్ కీపర్ మహమ్మద్ షాజాద్ 84 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో విజయంతో అఫ్ఘానిస్తాన్ 2018 ప్రపంచకప్‌కు కూడా అర్హత సాధించింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Visit Site Recommended byColombia ఈ విషయం నాకు కాస్త లేటుగా తెలిసింది. నాకు కరెక్ట్ టైమ్‌లో తెలిస్తే విషయం వేరేలా ఉండేది. సాధినేని యామిని అనే టీడీపీ మహిళా నాయకురాలు మీద జనసేన కార్యకర్తలు ట్రోల్ చేశారు. ట్రోల్ చేయడం అనేది తప్పేంకాదు. కాకపోతే నిజంగా బాధపెట్టేవిగా ఉంటే పరువునష్టం దావా వేయొచ్చు అది సుప్రీం చెప్పింది. అరెస్ట్‌ చేయకూడదని కోర్టులు చెబుతున్నాయి. ఒకసారి అరెస్ట్‌ చేసి మళ్లీ మళ్లీ స్టేషన్‌ల చుట్టూ తిప్పుతున్నారు. ఇలా చేయడం ద్వారా జనసేన కార్యకర్తల మనస్తైర్యాన్ని దెబ్బకొడుతున్నట్టు భ్రమ పడుతున్నారు తెలుగు దేశం పార్టీ. దీనికి మీ అబ్బాయి లోకేష్, పార్టీ హెడ్‌గా చంద్రబాబు, ఏపీ హోం మినిష్టర్ చినరాజప్ప బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్లు ఏమైనా మర్డర్లు చేశారు, దేశ ద్రోహం చేశారా? టెర్రరిస్టులా.. మానభంగాలు చేశారా.. ఎందుకంతగా రియాక్ట్ అవుతున్నారు. అధికారంలో ఉన్న మీ నాయకురాలిని ఒక్కమాట అంటే ఇంత దారణంగా వ్యవహరిస్తారా? మీరు మా జనసేన కార్యకర్తల్ని ఎన్నిమాటలు అంటున్నారు. ఎన్నిరకాలుగా హించిస్తున్నారు. దోషుల్ని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. అరెస్ట్ చేయడం వరకే మీ పని. థర్డ్ డిగ్రీ ప్రయోగించి రక్తాలు కారేలా కొట్టడమా. సాధినేని యామిని వీళ్ల దగ్గరకు వచ్చి ఆమె కూడా కొట్టినట్టు తెలుస్తోంది. మీ అరాచకాలు ఇంత దారుణంగా ఉన్నాయి. మీకు కాలం దగ్గర పడింది. వచ్చే ఎన్నికలే మీకు సరైన సమాధానం చెబుతాయి. మా తమ్ముడు జనసేన పార్టీ అధ్యక్షుడు కాబట్టి అతనికి ఇబ్బందులు కలగకూడదని పార్టీలో జాయిన్ కాలేదు. కాని నేను జనసేన అభిమానిని. ఇంకోసారి జనసైనికులపై ఇలాంటి దాడులకు పాల్పడితే.. నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతా. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని హెచ్చరిస్తున్నా. నేను ఓన్లీ ఆన్ లైన్ వారియర్ మాత్రమే కాదు. నాకు బయటకు వచ్చి పోరాడే శక్తి ఉంది. నాకు వయసు ఉంది. భయం లేదు. ఇకపై ఎవరైనా జనసేనను భయపెట్టాలని ప్రయత్నిస్తే.. నేను ప్రత్యక్షంగా వచ్చి కూర్చుంటా. వాళ్ల కోసం పోరాడతా. మీరు నన్ను కొట్టినా చంపేసినా నేను రెడీ. రండి.. చంపేస్తారా? వచ్చి చంపేయండి. ఒక మంచిపని కోసం చచ్చిపోవడానికి రెడీ. కాని మీలాగా అధికారం చేతిలో ఉంది కదా అడ్డదారిలో వెళ్లం. జనసైనికులు మీ పార్టీని ఎదుర్కొంటారు. వాళ్ల వెనుక నేను ఉన్నాను. బీకేర్ ఫుల్.. ఏదైనా న్యాయంగా పోరాడదాం. రాబోయే ఎలక్షన్స్‌లో మీరు గెలిచినా.. మేం గెలిచినా.. జగన్ గెలిచినా.. న్యాయంగానే పోరాడదాం. అంతేకాని పగలు, ప్రతీకారాలు పెట్టుకుని.. ఇలా చేయడం దారుణం. ఇదేనా న్యాయం ఇదేనా చట్టం.. సాధినేని యామినికి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పినట్టు పోలీస్‌లు కొడతారా? ఆమె పోలీస్‌ల ముందు జనసేన కార్యకర్తల్ని చెంపపై కొడుతుందా? ఒక వేళ చంపేయమంటే చంపేస్తారా? మేం కూడా లా చదువుకున్నాం. దీన్ని పెద్ద ఇష్యూ చేయొచ్చు. కాని చేయదల్చుకోలేదు. మీరు మర్యాదగా ఆ బాధితుల్ని క్షమించమని కోరండి. ఇలాంటి అడ్డదారులలో వెళ్లకండి. మీడియా ఎలాగూ వీటిని ప్రసారం చేయదు. ఎందుకంటే ఛానల్స్ అన్నీ చంద్రబాబుకి సపోర్ట్. కాని మాకు సోషల్ మీడియా ఉంది. ఖచ్చితంగా మా వాయిస్ వినిపిస్తాం’ అంటూ టీడీపీ నాయకురాలు సాధినేని యామినికి గట్టి కౌంటర్ ఇచ్చారు నాగబాబు. X
0business
చేనేతకు మైక్రోపాఫ్ట్‌ చేయూత.. - రి-వైవ్‌ పేరుతో ఈ-కామర్స్‌ ఫోర్టల్‌ ప్రారంభం నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తెలంగాణలోని చేనేతకారులకు చేయూతను అందించేందుకు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని చేనేత వృత్తిదారులు తమ కార్యకలాపాలను మరింతగా విసృత పరుచుకునేందుకు, మెరుగైన వినియోగదారులకు చేరువయ్యేలా సంస్థ రి- వైవ్‌ డాట్‌ ఇన్‌ పేరుతో సరికొత్త ఈ-కామర్స్‌ ఫోర్టల్‌ను ప్రారంభించింది. చేనేతకారులు సహజ రంగులను ఉపయోచి రూపొందించిన మేటి డిజైన్లను ఈ పోర్టల్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నట్టుగా మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఆర్‌ అండ్‌ డీ విభాగం ఎండీ అనిల్‌ బన్సాలీ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని చేనేత క్లస్టర్లకు ఈ పోర్టల్‌ సేవలను అందుబాటులోకి తేనున్నట్టుగా బన్సాలీ తెలిపారు. దీనికి తోడు లాభదాయకత ఆశించని ఎన్‌జీవోల ద్వారా చేనేతకారులకు నిర్వహణ మూలధనం లభించేలా కూడా ఈ కొత్త ప్రాజెక్టులో చర్యలు చేపట్టనున్నట్టుగా ఆయన తెలిపారు. కొత్త ప్లాట్‌ఫాం ద్వారా భారత చేనేత గొప్పదనాన్ని విస్తరించి చేనేతకారుల మార్కెట్‌ను విస్తరింపజేసేందుకు వీలు పడుతుందని బన్సాల్‌ వివరించారు. దీంతో వారి సాధికారికతకు ఇది తోడ్పడగలదని తెలిపారు. చేనేత ఉత్పత్తులకు క్యాడ్‌ మరియు రంగులు అద్దేందుకు గాను చేనేతకారులకు శిక్షణనిచ్చేందుకు గాను మైక్రోసాఫ్ట్‌ సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సంస్థతో జట్టుకట్టినట్టుగా తెలిపారు. తొలి విడుతగా శిక్షణ పొందిన వంద మందికి ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మైక్రోసాఫ్ట్‌ చర్యతో చేనేతకారులు తమంతట తాము నిలదొక్కుకొనేందుకు, చేతివృత్తిదారులకు తగిన ఉపాధి కల్పించేందుకు వీలు కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌ అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
SQASHJ ఆసియా స్క్వాష్‌ ఫైనల్‌కు భారత్‌ హాంకాంగ్‌: ఆసియా జూనియర్‌ స్క్వాష్‌ చాంపియన్‌ షిప్‌ లో టాప్‌ సీడ్‌ భారత బాలుర జట్టు ఫైనల్‌ చేరుకుంది. సెమీస్‌లో భారత్‌ 2-0తో హాంకాంగ్‌పై విజయం సాధించింది.మరో సెమీస్‌లో పాక్‌ను 2-1తో మట్టి కరి పించిన రెండవ సీడ్‌ మలేసియాతో భారత్‌ ఫైనల్లో తలపడనుంది.సెమీస్‌లో భారత ఆటగాడు రంజిత్‌ సింగ్‌ 11-4,5-11,11-8,11-6 తేడాతో చాన్‌ చిహోపై గెలు పొందాడు. హోరాహోరీగా జరిగిన మరో పోరులో లైచెక్‌ నమ్‌ను 13-11,11-13, 11-5, 8-11,11-5తో వెలవాస్‌ సెంథాల్‌ కుమార్‌ ఓడించాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV వజ్రాలు కావాలా నాయనా.. ఇవిగో! మీకు వజ్రాలు కావాలా? అయితే ఈ నెల 17 వరకూ వెయిట్ చేయాల్సిందే! TNN | Updated: Feb 11, 2017, 03:04PM IST శ్రీపాద ఎంటర్‌ టైన్మెంట్‌ పతాకంపై కిషోర్‌ కుమార్‌ కోట నిర్మించిన చిత్రం ‘వజ్రాలు కావాలా నాయనా’. అనిల్‌ బూరగాని, నేహాదేశ్‌ పాండే, నిఖిత బిస్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించగా పి.రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 17న గ్రాండ్‌గా విడుదల‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత కిషోర్‌ కుమార్‌ కోట మాట్లాడుతూ... ‘‘కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ బ్యానర్‌‌ని స్థాపించాను. అందులో భాగంగా కొంత మంది నటీనటులను , సాంకేతిక నిపుణునులను మా సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. నేను రాసుకున్న కథకు తగ్గట్లుగా నటీనటులను ఎంపిక చేశాము. నా కథకు దర్శకుడు పూర్తి న్యాయం చేశాడు. ఖర్చుకు వెనకాడకుండా అద్భుతమైన లొకేషన్స్‌లో టెక్నికల్‌ వాల్యూస్ తో సినిమాను రిచ్‌గా అన్ని వర్గా ల ప్రేక్షకులకు నచ్చే కామెడీ థ్రిల్లర్‌గా రూపొందించాం. టైటిల్‌కు ఇప్పటికే మంచి క్రేజ్‌ వచ్చింది.సంగీత దర్శకుడు జాన్‌ పొట్ల ట్యూన్స్‌, సురేష్‌ గంగుల ,రవికిరణ్‌ లిరిక్స్‌ బాగా కుదరడంతో ఇటీవల మ్యాంగ్‌ మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. శివప్రసాద్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, పి.అమర్‌ కుమార్‌ కెమెరా వర్క్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. సెన్సార్‌ సభ్యులు సినిమా ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉందంటూ ప్రశంసించడంతో సినిమాపై మంచి నమ్మకం ఏర్పడింది. ట్రైలర్స్‌కు యూట్యూబ్‌లో మంచి కాంప్లిమెంట్స్‌ లభించాయి. డిస్ట్రిబ్యూటర్స్‌ నుంచి బిజినెస్‌పరంగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అన్ని ఏరియాల్లో బిజినెస్‌ పూర్తయింది. అత్యధిక థియేటర్స్‌లో ఈ నెల 17న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం’’అన్నారు నిర్మాత.
0business
లోథా సంస్కరణలకు కట్టుబడి ఉన్నట్లు  అఫిడవిట్‌ దాఖలయ్యేదాకా నిధుల విడుదల వద్దు సుప్రీం కోర్టు ఆదేశం తీర్పు 17కు వాయిదా న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బిసిసిఐ)కి కొంత ఊరట లభించింది. కాగా లోధా కమిటీ సిఫార్సుల అమలు విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు 17 వరకు వాయిదా వేసింది. జస్టిస్‌ లోథా కమిటీ సంస్కరణల అమలుపై ఒక్క రోజులోగా బిసిసిఐ హామీ ఇవ్వాలని లేదంటే పాలక వర్గం వేటు తప్పదని అత్యున్నత న్యాయస్థానం కఠిన హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం విచారణ కొనసాగించింది. లోథా సంస్కరణలకు కట్టుబడి ఉన్నట్లు రాష్ట్ర సంఘాలు అఫిడవిట్‌ దాఖలు చేసేంత వరకు ఆయా సంఘాలను నిధులు విడుదల చేయరాదని స్పష్టం చేసింది.ఇప్పటి వరకు 13 రాష్ట్ర సంఘాలకు 16.72 కోట్ల చొప్పున ఇచ్చిన నిధులను సంస్కరణలపై తీర్మానం చేసేంత వరకు ఖర్చు చేయరాదని ఆదేశించింది.కాగా రాష్ట్ర సంఘాలకు నిధులు విడుదల చేసేటపుడు బిసిసిఐ పారదర్శకత విధానం అవలంభించాలి. ఒక్క రాత్రిలోగా మీరు 400 కోట్లు ఎలా విడుదల చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. లోథా సిఫార్సులు అమలు చేస్తే భారత్‌పై నిషేదం విధిస్తారో లేదా అంతర్జాతీయ క్రికెట్‌ మండలిత సంప్రదింపుఉలు చేపట్టారా? దీనిపై పది రోజుల్లో వ్యక్తిగత అఫిడవిట్లు దాఖలు చేయాలని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సహా మరో అధికారి రత్నాకర్‌ షెట్టిని కోర్టు ఆదేశించింది.లోదా సిఫార్సులు అమలు చేయడం పట్ల తమకు విముఖత లేదని ఈ సందర్బంగా బిసిసిఐ సుప్రీం కోర్టుకు విన్నవించింది. అయితే కొన్ని సాంకేతిక అడ్డంకులు మాత్రమే ఉన్నాయని వాటిని తొలగిస్తామని ధర్మానసం తెలిపింది.కాగా జస్టిస్‌ లోథా ప్రతిపాదనలు అమలుల జాప్యం చేస్తున్న భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బిసిసిఐ)కి ఇప్పుడు సుప్రీంకోర్టు సెలవులు కలిసొచ్చాయి.కాగా సుప్రీంకోర్టుకు సెలవులు రావడంతో ఆ తీర్పు ఈనెల 17వ తేదీ వరకు వాయిదా పడింది. బిసిసిఐని శుక్రవారం విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు మరోసారి మందలించింది.లోథా కమిటీ సిఫారసులు అమలు చేస్తామంటూ తీర్మానం చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్మానాన్ని రాష్ట్ర శాఖలు అమోదించడంతో పాటు లోథా కమిటీకి,కోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేయాలంటూ కోర్టు పేర్కొంది.బిసిసిఐ వ్యతిరేకంగా లోథా కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై తుది తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం వెలువరించే అవకాశం ఉందని భావించారు. అయితే సుప్రీంకోర్టుకు సెలవులు రావడంతో మరో పది రోజుల పాటు ఆ తీర్పు వాయిదా పడింది.దీంతో ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న బిసిసిఐకి లోథా ప్యానెల్‌ ప్రతిపాదనలపై మరింత కసరత్తు చేసే సౌలభ్యం లభించింది. ఇది బిసిసిఐకి కొంత ఊరట కల్గించినా ఇప్పటికే ఆరంభమైన రంజీ ట్రోఫీ నిర్వహణపై ఎటువంటి స్పష్టత రాలేదు.ప్రస్తుతం ఈ టోర్నమెంట్‌ను ఎలా నిర్వహించాలి అనే దానిపై ఎటువంటి ప్రణాళిక లేదని అసోసియేషన్‌ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. ఒకవేళ రంజీ టోర్నీ నిర్వహించడానికి ఏమైనా ఇబ్బందులు తలెత్తినా అది కూడా వాయిదా పడక తప్పదనే సంకేతాలిచ్చారు.
2sports
షాక్.. ఎన్టీఆర్ బయోపిక్ నుండి తేజ అవుట్ Highlights షాక్.. ఎన్టీఆర్ బయోపిక్ నుండి తేజ అవుట్ ఎన్టీఆర్ బయోపిక్ నుండి వైదొలిగిన డైరెక్టర్ తేజ. ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న తనయుడు బాలక్రిష్ణ .  భారీ స్టార్ క్యాస్ట్ తో తెరుకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్. అసలు విషయంలోకి వెళితే.. సినిమా మే నెల నుండి స్టార్ట్ కానున్న సమయంతో తేజు ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగాడు. తేజు ఈ సినిమా స్ట్రిప్ట్ వర్క్ కోసం ఆరు నెలలు కష్టపడ్డాడు. కథను ఓ పట్టాన తీసుకువచ్చాడు. బాలక్రిష్ణ స్ట్రిప్ట్ విషయంలో కొంచెం అసంతృప్తికరంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రెజర్ తట్టుకోలేక గత 15 రోజులుగా తేజ మదనపడుతున్నాడట. గత 15 రోజులుగా బాలయ్యకు ఇదే సంగతి చెప్పుకొచ్చాడంట. ఎట్టకేలకు ఎన్టీఆర్ బయోపిక్ నుండి వైదొలిగాడు అని సమాచారం. మరో రెండు మూడు రోజులలో అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్న తేజ. Last Updated 25, Apr 2018, 7:21 PM IST
0business
నయన్ కు పెళ్లి వయసొచ్చిందని గుర్తు చేస్తున్నాడు! Highlights దక్షినాది స్టార్ హీరో నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ త్వరలోనే పెళ్లి  దక్షినాది స్టార్ హీరో నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి విహార యాత్రలకు వెళ్ళడం, పుట్టినరోజు వేడుకలు కలిసి జరుపుకోవడం వంటి విషయాలతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి. గతంలో చాలా సార్లు పరోక్షంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వెల్లడించారు. మొన్నామధ్య ఒక కార్యక్రమంలో విగ్నేష్ ను నయన్ తన ఫియాన్సీ(కాబోయే భర్త) అని వ్యాఖ్యానించడంతో వీరి ప్రేమ నిజమేననే విషయం అందరికీ తెలిసింది. తాజాగా విగ్నేష్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూస్తే త్వరలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతుందనే సందేహాలు కలుగుతున్నాయి. ''హే.. నాకు పెళ్లి వయసొచ్చింది, నీకోసం ఎదురుచూడనా?' అంటూ తమిళంలో నయన్ తో దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టాడు విగ్నేష్. నిజానికి ఈ పదాలు నయన్ నటిస్తోన్న 'కొలమావు కోకిల' అనే తమిళ చిత్రంలో ఒక పాటలోవి. ఆ పాటను చిత్రబృందం విడుదల చేసిన సందర్భంగా విగ్నేష్ ఈ విధంగా స్పందించాడు. దీంతో త్వరలోనే ఈ జంట ఒక్కటయ్యేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం నయన్ తెలుగులో 'సై.. రా' అనే సినిమాలో నటిస్తోంది.   Last Updated 18, May 2018, 2:46 PM IST
0business
Apr 03,2018 శిఖా శర్మపై ఆర్‌బిఐ అభ్యంతరం..! ముంబయి : దేశంలోనే రెండో అతిపెద్ద ప్రయివేటు రంగ బ్యాంకు యాక్సిస్‌ బ్యాంకు సిఇఒ శిఖా శర్మ పదవీకాలం పొడిగింపునపై ఆర్‌బిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెకు తిరిగి బాధ్యతలు అప్పగిం చడంపై పునరాలోచించాలని యాక్సిస్‌ బ్యాంకు బోర్డుకు ఆర్‌బిఐ సూచించినట్లు సమాచారం. యాక్సిస్‌ బ్యాంకు బాధ్యతలు నాలుగోసారి కూడా శిఖా శర్మకు అప్పగిస్తూ ఆ బ్యాంకు బోర్డు నిర్ణయం తీసుకుంది. అమె పదవీ కాలం పొడగింపునపై ఆలోచించాలని ఈ మేరకు బ్యాంకు ఛైర్మన్‌ సంజీవ్‌ మిశ్రాకు ఆర్‌బిఐ లేఖ రాసినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో మొండి బాకీలు, మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని బ్యాంకుల ఎగ్జిక్యూటివ్‌ అపాయింట్‌ మెంట్ల విషయంలో జాగ్రత్త వహించాలని ఇప్పటికే పలు బ్యాంకులకు ఆర్‌బిఐ సూచించింది. మరోవైపు దీనిపై వ్యాఖ్యానించడానికి యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రతినిధి నిరాకరించారు. శిఖాశర్మ 2009లో తొలిసారి సిఇఒగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడుస్లారు తిరిగి నియామకం అయ్యారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyd Internet 213 Views GAMBER GAMBER ఢిల్లీ: భార‌త ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) మేనేజింగ్‌ కమిటీలో ఆయనను ప్రభుత్వ నామినీగా క్రీడల శాఖ ఎంపిక చేసింది. డీడీసీఏ ప్రతిష్ఠను పెంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని ఈ సందర్భంగా గంభీర్‌ పేర్కొన్నారు. ట్విటర్‌ ద్వారా కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇంతకు ముందు ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఆటగాడిగా గౌరవం దక్కింది. ఇప్పుడు డీడీసీఏ ప్రతిష్ఠను పెంచే సమయం వచ్చింది. డీడీసీఏ మేనేజింగ్‌ కమిటీలో ప్రభుత్వ నామినీగా ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా. రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌కు ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు.
2sports
శరణ్యకు పెళ్లి TNN| Jul 14, 2015, 10.27 AM IST విలేజ్ లో వినాయకుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి శరణ్యా మోహన్. ఎక్కడా గ్లామర్, ఎక్స్ పోజింగ్ కు తావివ్వకుండా, కట్టూ బొట్టూ విషయంలో చాలా కఠినంగా ఉండే కథానాయిక శరణ్య. అందుకే హీరోయిన్ తరవాత చెల్లెలి పాత్రలతో సరిపెట్టుకుంది. ఇప్పడు తను పెళ్లి కూతురు కాబోతోంది. ఈ కేరళ కుట్టికి ఈమెకు దంత వైద్యుడిగా పనిచేస్తున్న అరవింద్ కృష్ణన్ తో నిశ్చితార్థమైంది. త్వరలో వివాహం. ఈ విషయాన్ని తనే స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించింది. తన జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుందాం.
0business
Mumbai, First Published 29, Oct 2018, 8:21 AM IST Highlights భారతదేశ పారిశ్రామిక రంగంలో అడుగు పెట్టాలని కలలు కంటున్న లక్ష్మీ పుత్రుడు.. ఆర్సెలర్ మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టల్ నాలుగో దఫా ఎస్సార్ స్టీల్ బిడ్ ద్వారా కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లు రుయా ఫ్యామిలీ ఆటంకాలు కల్పిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముచ్చటగా మూడుసార్లు భారత దేశ ఉక్కు (స్టీల్) పరిశ్రమలో అడుగు పెట్టాలని కలలు గన్న స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ ఇటీవల గెలుచుకున్న ‘ఎస్సార్ స్టీల్’ బిడ్ సాకారం చేస్తుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఎస్సార్ స్టీల్ సంస్థ బిడ్ ను ఖరారు చేస్తూ రుణదాతల కమిటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రుయా కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘ఎస్సార్’ స్టీల్స్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో దివాళా దశకు చేరుకున్నది. దీంతో రుణ బకాయిల వసూళ్ల కోసం రుణదాతలు ఆహ్వానించిన బిడ్లలో ఆర్సెలర్ మిట్టల్ బిడ్ సానుకూలంగా ఉంది.  అంతా దాదాపు పూర్తయిపోయినట్లేనని భావిస్తున్న తరుణంలో రుయాల కుటుంబం ‘కొలికి’ పెట్టింది. ఇప్పటి దాకా గమ్మున ఉన్న ‘రుయా’లు రుణ బకాయిలన్నీ తామే చెల్లిస్తామని సదరు రుణదాతల కమిటీకి లేఖ సమర్పించారు. గతంలో రుయాలు అనుసరించిన వైఖరితో విసిగిపోయిన బ్యాంకర్లు ఆర్సెలర్ మిట్టల్ బిడ్ ఖరారు చేసేశారు.  కానీ ఇక్కడే తిరకాసు మొదలవుతున్నది. ఆర్సెలర్‌ మిట్టల్‌ బిడ్‌ను రుణదాతల కమిటీ అంగీకరించడంపై ఎస్సార్‌ గ్రూప్‌ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గతవారం ఎస్సార్‌ స్టీల్‌ను టేకోవర్‌ చేసేందుకు రూ.42వేల కోట్లతో ఆర్సెలార్‌ మిట్టల్‌ దాఖలు చేసిన బిడ్‌ను రుణదాతల కమిటీ అంగీకరించింది.  అదే సమయంలో ఎస్సార్‌ ప్రమోటర్లైన రుయా కుటుంబం దాఖలు చేసిన రూ.54,389కోట్ల బిడ్‌ను తిరస్కరించింది. తమ బిడ్‌ను అంగీకరిస్తే రుణదాతలకు పూర్తి మొత్తం అందేదని ఎస్సార్‌ గ్రూప్‌ చెబుతోంది. దీంతో దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.  ఎస్సార్‌ గ్రూప్‌ ఎస్సార్‌ స్టీల్‌ రుణదాతలకు చెల్లింపులు చేస్తే దాదాపు రూ.1.25లక్షల కోట్ల రుణాలను చెల్లించినట్లు అవుతుంది. ఇప్పటికే ఎస్సార్‌ గ్రూప్‌ అమెరికాలోని ఏజీస్‌ కార్యకలాపాలను విక్రయించడం ద్వారా రూ.4,200 కోట్లు, ఎస్సార్‌ ఆయిల్‌ను విక్రయం ద్వారా రూ.72,000 కోట్లు, ఏజీస్‌ విక్రయం ద్వారా రూ. 2,400 కోట్లు విక్రయించి అప్పులు తీర్చారు. ఎస్సార్‌ గ్రూప్‌ వ్యాపార విస్తరణ కోసం 2010 నుంచి 2015 వరకు రూ. 1.2 లక్షల కోట్లను వెచ్చించింది. ఇదిలా ఉంటే ఆర్సెలర్ మిట్టల్ సీఈఓ లక్ష్మీ మిట్టల్ ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశ ప్రగతి ప్రక్రియలో తామూ భాగస్వాములు కావాలని కలలు కంటున్నట్లు చెప్పారు. తాము ఇప్పటివరకు ఎటువంటి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును భారతదేశంలో పొందలేకపోయామన్నారు. కానీ ఎస్సార్ స్టీల్స్ బిడ్ గెలుచుకోవడం ఆనందాన్నిస్తుందన్నారు. కానీ ఈ బిడ్ తుదకంటా ఖరారయ్యే వరకు రకరకాల చిక్కుముళ్లను విప్పాల్సి ఉంది. ఎస్సార్ స్టీల్ తన స్వాధీనమైతే నూతన టెక్నాలజీతో ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని లక్ష్మీ మిట్టల్ చెప్పారు. ఎస్సార్ స్టీల్ రూపురేఖలు మార్చేందుకు తనకు ప్రత్యేక విజన్ ఉన్నదంటారాయన. Last Updated 29, Oct 2018, 8:21 AM IST
1entertainment
క్రిష్ కు 'ఎన్టీఆర్' చేయడం ఇష్టం లేదా? Highlights దివంగత నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందించాలనుకున్నాడు. దీనికోసం ముందుగా దర్శకుడు తేజతో కలిసి వర్క్ మొదలుపెట్టడం, సినిమా షూటింగ్ ఆరంభంలోనే తేజ ఆ సినిమాను వదిలిపెట్టి వెళ్లడం జరిగిపోయాయి దివంగత నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందించాలనుకున్నాడు. దీనికోసం ముందుగా దర్శకుడు తేజతో కలిసి వర్క్ మొదలుపెట్టడం, సినిమా షూటింగ్ ఆరంభంలోనే తేజ ఆ సినిమాను వదిలిపెట్టి వెళ్లడం జరిగిపోయాయి. దీంతో తేజ స్థానంలో బాలకృష్ణ.. దర్శకుడు క్రిష్ ను రంగంలోకి దించాడు. నిజానికి క్రిష్ కు ఈ సినిమా చేయడం ఇష్టం లేదట. కానీ బాలకృష్ణ ఫోర్స్ చేయడంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వక తప్పలేదు. ఈ సినిమా సెట్స్ లోకి రాకముందే తను కమిట్ అయిన 'మణికర్ణిక' సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. ఆ సినిమా షూటింగ్ బ్యాలన్స్ ఉన్న కారణంగానే 'ఎన్టీఆర్' సెట్స్ లో జాయిన్ అవ్వడానికి సమయం తీసుకున్నాడు. మొత్తం షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు 'ఎన్టీఆర్' షూటింగ్ మొదలుపెట్టాడు. బలవంతంగా ఈ సినిమాను డైరెక్ట్ చేయాల్సి వస్తున్నా.. తప్పక బాలకృష్ణ కోసం క్రిష్ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కాస్టింగ్ ను సెలెక్ట్ చేస్తూనే కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. అయితే ఇప్పుడు 'మణికర్ణిక' సినిమా క్రిష్ కు కొత్త తలనొప్పులు తీసుకొస్తుందని సమాచారం. ఆ సినిమాకు రైటర్ గా పని చేసిన విజయేంద్రవర్మ సినిమాలో కొన్ని సన్నివేశాలు సరిగ్గా రాలేదని వాటిని మళ్లీ రీషూట్ చేయాలని అంటున్నాడట. దీంతో ఇప్పుడు క్రిష్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఓ పక్క ఈ షూటింగ్ వదిలేసి 'మణికర్ణిక' కోసం వెళ్లలేడు. అలా అని ఆ సినిమాను వదిలేయలేక క్రిష్ సతమతమవుతున్నట్లు సమాచారం.  Last Updated 13, Jul 2018, 4:14 PM IST
0business
కొండెక్కిన రెజీనా బాలీవుడ్ డ్రీమ్స్.. ఇక్కడా ఏం లేదు Highlights బాలీవుడ్ చిత్రంలో ఆంఖే2 లో రెజీనాకు అవకాశం భారీ హంగామాతో ప్రారంభించిన యూనిట్ ప్రస్థుతం షూటింగ్ నిలిచిపోయి సందిగ్దంలో ఆంఖే2 అందం, అభినయం రెండూ కలగలిపిన హీరోయిన్స్ లో రెజీనా కసాండ్రా కూడా ఉంటుంది. అయితే కేరీర్ ప్రారంభమై ఇన్నేళ్లయినా ఆమె టాలెంటుకు, అందానికి తగ్గ అవకాశాలు మాత్రం దక్కలేదనే చెప్పాలి. తెలుగులో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ డమ్ పెంచుకుంటున్న టైంలో వరుస ఫ్లాపులు ఆమెను అమాంతం కింద పడేశాయి. అయితే అదే సమయంలో కొన్ని తమిళ అవకాశాలు రావడంతో తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లి ఈ చెన్నై చిన్నది కాస్త రిలాక్స్ అయింది.   కెరీర్ ట్రాక్ పై ఉండగానే క్రితం ఏడాది ఆమెకు ఓ బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కింది. అదే.. ఆంఖే-2. అనీస్ బజ్మి దర్శకత్వంలో విపుల్ షా నిర్మించ తలపెట్టిన సినిమా ఇది. ఈ సినిమాకు కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని గత ఏడాది ఓ రేంజిలో చేశారు. ఆ వేడుక కోసం రెజీనా చాలా సెక్సీగా తయారై రావడం.. స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుండగా.. ఆమె డ్రెస్ కాస్త ఊప్స్ మూమెంట్ క్రియేట్ చేయడంతో అదో హాట్ టాపిక్ కావడం మీకంతా గుర్తుండే ఉంటుంది. ఆ దెబ్బతో బాలీవుడ్లో రెజీనా పేరు బాగానే చర్చనీయాంశమైంది.   అయితే ఇంత హంగామా చేసి మొదలుపెట్టిన సినిమా ఇప్పుడు ఆగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. కారణాలేంటో తెలియలేదు కానీ.. ‘ఆంఖే-2’ అస్సలు ముందుకు కదలట్లేదట. కొంత భాగం షూటింగ్ చేసి మధ్యలోనే ఆపేసినట్లు తెలుస్తోంది. రెజీనా ఇంకా ఈ సినిమా షూటింగ్‌లో కూాడా పాల్గొనలేదట. మొత్తానికి ఓ క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులో అవకాశం దక్కినట్లే దక్కి చేజారిపోయింది రెజీనాకు. దీంతో ఆమె బాలీవుడ్ కలలకు బ్రేక్ పడినట్లే అయింది. ఇక తెలుగు తమిళ భాషల్లో కూాడా పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో రెజీనా కెరీర్ పై అనుమానాలు తలెత్తుతున్నాయి Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0business
Jan 13,2019 యెస్‌ బ్యాంక్‌ బోర్డు చైర్మెన్‌గా బ్రహ్మదత్‌ న్యూఢిల్లీ: తమ బ్యాంక్‌ బోర్డు చైర్మెన్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి బ్రహ్మదత్‌ను(70) నియమిం చుకున్నట్టుగా దేశంలో నాలుగో అతిపెద్ద ప్రయివేటు బ్యాంకింగ్‌ సంస్థ యెస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. బ్యాంక్‌ బోర్డుకు తాత్కాలిక చై ర్మెన్‌గా దత్‌ను నియమించుకొనేందుకు గాను భారతీయ రిజర్వు బ్యాంక్‌ సమ్మతి తెలిపినట్టుగా యెస్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దత్‌ ఈ పదవిలో 2020 జులై4 వరకు కొనసాగనున్నట్టుగా బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. 2013 నుంచి దత్‌ యెస్‌ బ్యాంక్‌ బోర్డులో స్వతంత్ర డైరెక్టరుగా సేవలందిస్తున్నారు. గడిచిన 5.5 యేండ్ల కాలంగా ఆయన బ్యాంక్‌కు చెందిన వివిధ సబ్‌ కమిటీలలో తన వంతు సేవలను అందించినట్టుగా బ్యాంక్‌ యెస్‌ బ్యాంక్‌ తెలిపింది. ఐఏఎస్‌ అధికారిగా దత్‌ దాదాపు 37 సంవత్సరలపాటు కర్ణాటక ప్రభుత్వంలోను, కేంద్ర ప్రభుత్వంలోను పని చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Towny App ఒక్క యాప్‌తో ఎన్నో సేవలు న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: ఒకే ఒక యాప్‌తో ఎన్నో సేవలు లభించనున్నాయి. కాగా ఈ సేవలంది స్తున్నది మరెవ్వరో కాదు ఏపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన టౌనీయాప్‌. మీ ఫోన్లో ఈ యాప్‌ ఉంటే అన్ని సేవలు గుప్పిట్లోకి వస్తాయి.ఆహరం నుంచి ఆరోగ్య సేవలు, వినోదం నుంచి ఈవెంట్స్‌ వరకు మొబైల్‌ రిపేర్లు, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువుల మరమ్మతులు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల సేవలను ఈ యాప్‌ ద్వారా పొందవచ్చు. కాలు కదపకుండానే ఈ సేవలన్నీ లభిస్తాయి. రిక్వెస్ట్‌ పంపిన 30 నిముషాల్లోనే సర్విస్‌ ప్రొవై డర్లు మీకు సేవలు అందిస్తారు. అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కూడా ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. టౌనీ యాప్‌ ద్వారా ఎవరికైనా సేవలు అందించేందుకు ఎవరికైనా ఆసక్తి ఉంటే క్యాష్‌ టు టాలెంట్‌ ఆప్షన్‌లో పేరు నమోదు చేసుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్‌లో 27 పట్టణాల్లో ఈ యాప్‌ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకుని సేవలు పొందండి.యాప్‌ ఓపెన్‌ చేయగానే సుమారు 200 పైగా సేవల ఆప్షన్లు వస్తాయి. వాటిలో మీకు కావాల్సిన సేవను సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆ సేవలకు అయ్యే ఫీజు వివరాలు వస్తాయి. దానికి మీరు అంగీకరిస్తే మీ పరిధిలో సేవలు అందించే వారి వివరాలు పిక్‌ యువర్‌ పైలట్‌ అని వస్తాయి. అందులో ఒకటి ఎంపిక చేసుకుంటే వారి ఫోన్‌ నంబర్లు చిరునామా వస్తాయి. అనంతరం యాప్‌ లేదా ఫోన్‌ ద్వారా రిక్వెస్టు పంపించాలి.
1entertainment
అవకాశాలిస్తామంటూ నన్ను కూడా పడకగదికి రమ్మన్నారు-శ్రద్ధాదాస్ Highlights సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్ కెరీర్ తొలినాళ్లలో తనను కూడా అవకాశాలిస్తామని పడకగదికి పిలిచారన్న శ్రద్ధ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలన్నింటిలో కాస్టింగ్ కౌచ్ వుందన్న శ్రద్ధ సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధాదాస్. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన ఆర్య - 2, కరుణాకరన్ దర్శకత్వంలో డార్లింగ్ , దిల్ రాజు మరో చరిత్ర చిత్రాల్లో నటించింది. చూస్తూనే పదేళ్ల కెరీర్‌ పూర్తి చేసుకుంది. స్టార్ డమ్ విషయంలో కాస్త వెనుకపడ్డా.. పలు భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.   ప్రస్తుతం హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన బాబూ మొషాయ్ బందూక్ బాజ్ చిత్రం సెన్సార్ కోరల్లో ఇరుక్కుంది. పలు సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 48 కట్స్ సూచించింది. దాంతో సెన్సార్ బోర్డుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు తెలుగులో రాజశేఖర్ సరసన పీఎస్వీ గరుడవేగ సినిమాలో నటిస్తోంది. కెరీర్ లో అనుకున్నంత సక్సెస్ ఇంకా రాలేదంటున్న శ్రద్ధ ఇప్పటికీ అవకాశాలు అందుకోవడంతో మాత్రం ముందుంటోంది. అయితే కెరీర్ తొలినాళ్లలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదుర్కొన్నానంటోంది శ్రద్ధ.   దీనికి సంబంధించి మాట్లాడుతూ... కెరీర్ తొలినాళ్లలో ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాను. వేషాల కోసం పడకగదికి రమ్మని బలవంతం చేశారు. అవకాశాల కోసం నేను ఎప్పుడూ దిగజారలేదు. నేను ఒప్పుకోకపోవడంతో సినిమాల నుంచి నన్ను తొలగించారు. చాలాసార్లు అనేక సమస్యలు ఎదుర్కొన్నాను. నా పాత్ర నిడివిని చాలా సందర్భాల్లో తగ్గించారు. సినిమాల్లో కనిపించకుండా చేశారు. ఇవన్నీ సినిమా పరిశ్రమలో సర్వ సాధారణం. అంది.   అంతేకాదు ఇది ఏ ఒక్క పరిశ్రమకో పరిమితం కకాలేదని, క్యాస్టింగ్ కౌచ్... తమిళ, కన్నడ, మలయాళ, హిందీ పరిశ్రమల్లో కూడా కనిపిస్తుంది అంది. అన్ని పరిశ్రమల్లోనూ అవకాశం ఇస్తామని చెప్పి.. పడకగదికి రమ్మనేవాళ్లు చాలామంది ఉంటారు. నా కెరీర్ మొదట్లో ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాను. హీరోయిన్ గా రాణించాలనుకునే ప్రతివారికి ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయని తన అనుభవాలు గుర్తు చేసుకుంది శ్రద్ధ. Last Updated 25, Mar 2018, 11:41 PM IST
0business
"లక్ష్మీస్ వీరగ్రంథం" తరహాలో "శశిలలిత" తీస్తాడట.. ఎప్పుడో? Highlights జయలలిత జీవితంలో శశికళ పాత్రపై సినిమా ఈ సినిమాను తెరకెక్కించనున్న కేతిరెడ్డి జగదీశ్ లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంతో పాటు తెరకెక్కిస్తానన్న కేతిరెడ్డి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో నందమూరి తారకరామారావు, లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా లక్ష్మీస్ వీరగ్రంథం అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ కేతిరెడ్డే జయలలిత-శశికళపై సినిమా తీస్తానని ప్రకటించారు. ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ‘శశిలలిత’ అనే టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు చెప్పిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి... ఈ సినిమా దర్శకత్వ, నిర్మాణ బాధ్యతల్ని తానే నిర్వర్తించనున్నట్లు వెల్లడించారు.   ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే సెట్స్‌ పైకి వస్తుందన్నారు. లక్ష్మీపార్వతి జీవితం, శశికళ జీవితం ఒకటేనని, సేవకురాలిగా ఒకరి జీవితంలోకి ప్రవేశించిన వీరు.. ఎలా చక్రం తిప్పారనే ఇతివృత్తంగా ఈ సినిమా కథలు ఉంటాయన్నారు. ఇద్దరి లక్ష్యం రాజ్యాధికారం మాత్రమే అనే అంశాలతో తీయనున్న సినిమాలు ఇవి అన్నారు. ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’, ‘శశిలలిత’ సినిమాలలో నేటి సమకాలీన రాజకీయాలు, యాదార్థ సంఘటనలు చూపించనున్నామన్నారు.   ‘జయలలిత జీవితంలో శశికళ ప్రవేశం, ఆసుపత్రిలో జరిగిన ప్రతి సంఘటన అంటే.. సెప్టెంబరు 22 నుంచి డిసెంబరు 5 వరకు జరిగిన ప్రతి సన్నివేశం ఈ సినిమలో చూపిస్తామ్నారు.  ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’లో ‘విశ్వరూపం’, ‘గరుడవేగ’ ఫేం నటి పూజా కుమార్‌ లక్ష్మీపార్వతి పాత్రలో నటించనున్నారని ఈ సందర్భంగా తెలిపారు. శశికళ, జయలలిత పాత్రల కోసం హీరోయిన్లను త్వరలోనే ఎంపిక చేస్తామని చెప్పారు. ఇదిలావుంటే  వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. జయలలిత-శశికళపై సినిమా తీస్తానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. Last Updated 25, Mar 2018, 11:58 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసు:జులై 10 వ‌ర‌కూ చిదంబ‌రం అరెస్టు వ‌ద్దు ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరానికి మరోసారి ఊరట లభించింది. Samayam Telugu | Updated: Jun 5, 2018, 12:59PM IST ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరానికి మరోసారి ఊరట లభించింది. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసుకు సంబంధించి ప్ర‌త్యేక న్యాయ‌స్థానంలో విచార‌ణ‌కు హాజరయ్యారు. ఎయిర్‌ సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో భాగంగా ఈడీ అధికారులు... చిదంబ‌రం అరెస్టు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన‌ను విచారణ‌కు హాజ‌రు కావాల్సిందిగా పాటియాలా హౌస్ కోర్టు గ‌త నెల‌లో ఆదేశించిన‌న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కేసులో చిదంబ‌రం ఇదివ‌ర‌కే యాంటిసిపేట‌రీ బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేశారు. దీనికి సంబంధించి త‌న వాద‌న‌ను వినిపించేందుకు ఈడీ మ‌రింత స‌మ‌యాన్ని కోరింది. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబ‌రం ఈ కేసుకు సంబంధించిన ఆయనను జూలై 10వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) చిదంబరాన్ని ప్రశ్నించనున్నది. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు వెలువడడం గమనార్హం. మరోవైపు ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ కూడా ఈనెల 10న విచారణకు హాజ‌రు కావ‌ల్సి ఉంది.
1entertainment
- లాభాల్లో 3 శాతం ఉద్యోగులకు - ఆర్థికశాఖ వద్ద ప్రతిపాదన - రేట్ల కోత ఉండకపోవచ్చు: ఎస్‌బీఐ న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్‌ సంస్థ 'స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా' (ఎస్‌బిఐ) తమ లాభాల్లో 3 శాతం ఉద్యోగులకు ఇవ్వాలని యోచిస్తోంది. అంకితభావంతో పని చేసే వారిని, నైపుణ్యం ఉన్న వారిని ప్రోత్సహించడానికి ఈ చర్య దోహదపడుతుందని బ్యాంక్‌ భావిస్తోంది. ఇదే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖకు కూడా ప్రతిపాదించామని ఎస్‌బిఐ ఛైర్‌పర్సన్‌ అరుంధతి భట్టచార్య తెలిపారు. నిత్యం అనేక సవాళ్లను ఎదుర్కొని పని చేసే ఉద్యోగులకు లాభాల్ని పంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో పని చేసే వారికంటే ప్రైవేటు బ్యాంకుల్లో పని చేసేవారు పొందే జీతాలు అధికంగా ఉంటున్నాయన్నారు. నేటి పరిస్థితుల్లో మూడు శాతం లాభాలు పంపిణీ తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు. ఆగస్టులో 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్‌బీఐ) నిర్వహించనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని భట్టచార్య అభిప్రాయపడ్డారు. తాను ఎలాంటి వడ్డీ రేట్ల తగ్గింపును అంచనా వేయడం లేదని ఆమె తెలిపారు. గత మాసంలో టోకు ద్రవ్యోల్బణం సూచీ సానుకూలంగా ఉన్నప్పటికీ, రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా అహార ధరలు పెరగడంతో, సిపిఐ గణంకాల్లో హెచ్చుదల చోటు చేసుకోవడంతో వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చని భట్టచార్య అభిప్రాయపడ్డారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyd Internet 99 Views one plus 5t one plus 5t న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్‌ తాజాగా ప్లాగ్‌షిప్‌ వన్‌ప్లస్‌ 5టి ఫోన్‌ని న్యూయార్క్‌ వేదికగా లాంచ్‌ చేసింది. అతిపెద్ద స్క్రీన్‌, మెరుగైన కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 64జీబి, 128 జీబి స్టోరేజ్‌ వేరియంట్లలో ఇది మార్కెట్‌లోకి వచ్చింది. భారత్‌లో 64 జీబి వేరియంట్‌ ధర రూ.32,999 కాగా, 128 జీబి వేరియంట్‌ ధర 37,999 రూపాయలు. నవంబరు 21 సాయంత్రం 4:30 గంటల నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌కి విక్రయానికి వస్తోంది. అన్ని సేల్స్‌ ఛానల్స్‌ ద్వారా ఈ డివైజ్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌… సామ్‌సంగ్‌, యాపిల్‌, ఎల్‌ఎజి వంటి దిగ్గజ బ్రాండ్‌లకు చెందిన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌లకు గట్టి పోటీదారుగా నిలిచే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఇమేజ్‌లు తీయడం దీని ప్రత్యేకత.
1entertainment
Hyderabad, First Published 24, Oct 2018, 1:15 PM IST Highlights 'ఆర్‌ఎక్స్‌ 100' హీరోయిన్ కొత్త చిత్రం కమిటైంది,డిటేల్స్ నూతన నటుడు కార్తీకేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరో హీరోయిన్లుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్‌ ఎక్స్‌ 100.  ఈ సినిమాకు డివైడ్‌ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించింది. యూత్‌ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉండటంతో  మంచి వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం దర్శకుడు, హీరో ఇద్దరూ బిజీ అయ్యిపోయారు. అయితే హీరోయిన్ మాత్రం తెలుగులో ఒక్క సినిమాను ఓకే చేయలేదు. దాంతో అందరి దృష్టీ పై ఆమెపై పడింది.  ఆర్ ఎక్స్ 100 లో కోరికతో రగిలిపోతూ, లోలోపల కుట్రలు చేసే పాత్రలో హీరోయిన్ పాయల్ రాజ్ అద్భుతంగా నటించింది. ఆమె పూర్తి స్దాయి బిజీ అవుతుందని అంతా భావించారు. అంతేకాదు కొన్ని  వెబ్ సైట్స్ పాయల్ రాజ్‌పుత్ ఇప్పటికే మహేష్ సినిమాకి ఎంపికైనట్టు రాసేసాయి.  మరో ప్రక్క స్టార్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్‌ ఈ అమ్మడిని తన సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు ప్రచారం చేసారు. అయితే అవేమీ నిజం కాలేదు. ఆమె తన దాకా వచ్చిన ఏ అవకాసాన్ని మెటీరియలైజ్ చేసుకోలోకపోయింది. తెలుగులో అన్నీ అలాంటి పాత్రలే వస్తున్నాయని ఆమె రిజెక్ట్ చేసినట్లు సమాచారం.  ఈ నేపధ్యంలో ఆమె ఓ తమిళ సినిమా కమిటైనట్లు సమాచారం. ఈ విషయమై ఆమె ట్వీట్ చేసి కన్ఫర్మ్ చేసింది.  ఆ సినిమా పేరు ఏంజిల్. ఉదయనిధి స్టాలిన్ సరసన ఆమె నటించబోతోంది.  ఆ సినిమా హిట్ అయితే అక్కడ పూర్తి స్దాయి బిజీ అయిపోతుందనేది నిజం.   దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Last Updated 24, Oct 2018, 1:15 PM IST
0business
ఆర్‌కామ్‌- సిస్టెమా విలీనానికి సై! - అనుమతులు మంజూరు చేసిన టెలికాం శాఖ న్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగంలో మరో రెండు సంస్థల విలీనానికి సర్కారు సమ్మతి తెలిపింది. సిస్టెమా శామ్‌ టెలీసర్వీసెస్‌ (ఎస్‌ఎస్‌టీఎల్‌) వైర్‌లెస్‌ వ్యాపారాన్ని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌లో (ఆర్‌కామ్‌) విలీనం చేసేందుకు గాను టెలికాం శాఖ (డీవోటీ) సమ్మతి తెలిపింది. ఈ నెల 20న డీవోటీ నుంచి అనుమతులు లభించినట్టుగా సోమవారం ఆర్‌కామ్‌ వెల్లడించింది. దీంతో దేశంలో టెలికాం సర్వీసులు అందిస్తున్న సంస్థల సంఖ్య 10కి దిగిరానుంది. ఈ విలీనంతో ఎస్‌ఎస్‌టీఎల్‌ వైర్‌లెస్‌ వ్యాపారానికి సంబంధించిన ఆస్తులన్నీ ఆర్‌కామ్‌ చేతుల్లోకి రానున్నాయి. కొనసాగనున్న ఎంటీఎస్‌ బ్రాండ్‌.. విలీన ఒప్పందంలో భాగంగా ఎస్‌ఎస్‌టీఎల్‌ సంస్థ ఎంటీఎస్‌ బ్రాండ్‌తో తన సేవలను కొనసాగించనుంది. విలీనం తరువాత ఆర్‌కామ్‌లో ఎస్‌ఎస్‌టీఎల్‌కు 10 శాతం మేర వాటా లభించనుంది. తాజా విలీనంతో ఆర్‌కామ్‌కు కొత్తగా 20 లక్షల మంది ఎంటీఎస్‌ వినియోగదారులతో పాటు సాలీనా రూ.700 కోట్ల ఆదాయం లభించనుంది. దీనికి తోడు ఎస్‌ఎస్‌టీఎల్‌కు చెందిన విలువైన స్పెక్ట్రమ్‌ కూడా ఆర్‌కామ్‌ పరం కానుంది. దీంతో ఆర్‌కామ్‌ దేశ వ్యాప్తంగా అదనపు ఖర్చు లేకుండానే 4జీ, ఎల్‌టీఈ సేవలను విస్తరించేందుకు వీలు పడనుంది. విలీనంలో భాగంగా ఎస్‌ఎస్‌టీఎల్‌ సంస్థ ఆర్‌కామ్‌ స్పెక్ట్రమ్‌ను పుష్కర కాలం పాటు వాడుకొంటూ ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ, కోల్‌కతా, తూర్పు ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లలో తన సేవలను విస్తరించేందుకు వీలు పడనుంది. ఎస్‌ఎస్‌టీఎల్‌ నుంచి తీసుకున్న స్పెక్ట్రమ్‌కు గాను ఆర్‌కామ్‌ రానున్న ఎనిమిదేండ్ల పాటు రూ.390 కోట్ల సొమ్మును డీవోటీకి చెల్లించనుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ఎన్టీఆర్ వల్ల కూడా కాలేదు! Highlights కళ్యాణ్ రామ్ నటించిన 'నా నువ్వే' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది కళ్యాణ్ రామ్ నటించిన 'నా నువ్వే' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే చాలా రోజులుగా ఈ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లడం కోసం చిత్రబృందం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ బిజినెస్ పరంగా ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ రాలేదు. ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ ఇటువంటి సినిమాలలో నటించకపోవడం, మాస్ ఇమేజ్ ఉన్న హీరో సడెన్ గా ట్రాక్ మార్చి లవ్ స్టోరీతో వస్తుండడంతో బయ్యర్లలో సందేహాలు నెలకొన్నాయి. పైగా ఈ మధ్యకాలంలో కళ్యాణ్ కు సరైన హిట్ సినిమా కూడా పడలేదు. దీంతో తన తమ్ముడు ఎన్టీఆర్ ను ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానించి సినిమాపై బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ రావడం వలన సినిమా జనాల్లోకి కాస్త రీచ్ అయిందనే చెప్పాలి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపిస్తుందా? అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. ట్రైలర్, పోస్టర్లను బట్టి ఇదొక క్లాస్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్  టార్గెట్ గా ఈ సినిమాను రూపొందించారు. విడుదలకు ముందు అయితే సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు పైగా మరుసరి రోజు ఇంద్రగంటి 'సమ్మోహనం' సినిమా కూడా ఉంది. ఈ సినిమాతో పోలిస్తే 'సమ్మోహనం'పై మంచి అంచనాలైతే ఉన్నాయి.  కాబట్టి 'నా నువ్వే' సినిమా  తొలిరోజు పాజిటివ్ టాక్ తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కళ్యాణ్ ప్రయోగాన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి! Last Updated 13, Jun 2018, 11:21 AM IST
0business
Read More: కీరన్ పొలార్డ్ అతి తెలివి.. కంగుతిన్న అంపైర్ ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కి కోచ్‌గా పనిచేసిన ప్రవీణ్ ఆమ్రే మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలానే బంతిని కనెక్ట్ చేయడంలో రిషబ్ పంత్‌కి మంచి టైమింగ్ ఉంది. కానీ.. ఇప్పుడు అతను పూర్తి ఒత్తిడిలో ఉన్నాడు. దీంతో.. మ్యాచ్‌లో తన సహజసిద్ధమైన ఆట ఆడాలా..? లేదా రక్షణాత్మక ధోరణిలో ఆడి పరుగులు రాబట్టాలా..? అనే మీమాంసలో అతను పడిపోయాడు. ఈ తికమక కారణంగా బంతిని పంత్‌ సరిగా కనెక్ట్ చేయలేకపోతున్నాడు’ అని ప్రవీణ్ ఆమ్రే వెల్లడించాడు. Read More: IND vs BAN D/N Test: కోహ్లీసేన స్పెషల్ రిక్వెస్ట్ భారత్, బంగ్లాదేశ్‌ మధ్య ఆదివారం ముగిసిన టీ20 సిరీస్‌ని టీమిండియా 2-1తో చేజిక్కంచుకోగా.. గురువారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకాబోతోంది. ఈ సిరీస్‌‌కి పంత్‌ ఎంపికైనా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాపై సిరీస్‌లో వికెట్ కీపర్‌గా అదరగొట్టిన సాహా‌ని బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లోనూ కీపర్‌గా ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. Read More: భారత్‌లో బాల్ టాంపరింగ్‌.. అడ్డంగా దొరికిన క్రికెటర్ (వీడియో)   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV అమెరికాలో ఉద్యోగాలు చేయాల‌నుకునేవారికి శుభ‌వార్త‌ అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త అందించింది. వీసాల జారీని కఠినతరం చేసి విదేశీ ఉద్యోగుల వలసలను ఆపేసి ముప్పుతిప్పలు పెట్టిన ట్రంప్ ప్రభుత్వం స్థానిక పరిస్థితులను గుర్తించి వెనుకడుగు వేయాల్సి వచ్చింది. Samayam Telugu | Updated: May 29, 2018, 02:00PM IST హెచ్2-బీ వీసాల సంఖ్యను పెంచిన యూఎస్ ప్ర‌భుత్వం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త అందించింది. వీసాల జారీని కఠినతరం చేసి విదేశీ ఉద్యోగుల వలసలను ఆపేసి ముప్పుతిప్పలు పెట్టిన ట్రంప్ స్థానిక పరిస్థితులను గుర్తించి వెనుకడుగు వేయాల్సి వచ్చింది. 2018 సంవత్సరానికి జారీ చేసిన 66 వేల వీసాలకు అదనంగా మరో 15 వేల వీసాలను కూడా జారీ చేయనున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ ప్రకటించింది. దీంతో 2018 ఆర్థిక సంవ‌త్స‌రానికి జారీ చేసే మొత్తం వీసాల సంఖ్య 81వేల‌కు చేరింది. త‌ద్వారా అమెరికా వెళ్లాలని ఉవ్విళ్లూరే భార‌తీయుల‌కు మ‌రింత‌గా అవ‌కాశాలు ల‌భించిన‌ట్లే. సాధారణంగా హెచ్-2బీ వీసాలను వ్య‌వ‌సాయేత‌ర ప‌నివాళ్ల‌ కోసం జారీ చేస్తుంటారు. అంటే వ్యాపారులు తమ వ్యాపారాభివృద్ది కోసం నిపుణులైన విదేశీయులను ఈ వీసా ద్వారా అమెరికాకు రప్పించుకోవచ్చన్న మాట. దీంతో అక్క‌డి వ్యాపారులు లాభపడతారు. అయితే దేశీయ నిరుద్యోగిత పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఈ వీసాల జారీని కట్డ‌డి చేసేందుకు పూనుకొంది.
1entertainment
Suresh 143 Views కెర్బర్‌ విజయం న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్‌ అవతరించింది.కాగా రెండవ సీడ్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌(జర్మనీ),పదవ సీడ్‌ కరోలినా ప్లిస్కోవా(చెక్‌ రిపబ్లిక్‌)పై నెగ్గి యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించింది.దీంతో గత సంవత్సరం మాదిరిగానే యుఎస్‌ ఓపెన్‌లో కొత్త చాంపియన్‌ అవతరించి నట్లైంది. చివరిసారిగా 1996లో స్టెఫీగ్రాఫ్‌ తరువాత యుఎస్‌ ఓపెన్‌ నెగ్గిన జర్మనీ ప్లేయర్‌గా కెర్బర్‌ నిలిచింది. భారత కాలమానం ప్రకారంఆదివారం ఉదయం జరిగిన ఫైనల్లో నెంబర్‌ వన్‌ ర్యాంకర్‌ కెర్బర్‌ 6-3,3-6,6-4 తేడాతో చెక్‌ రిపబ్లిక్‌ భామ ప్లిస్కోవాపై విజయాన్ని సాధించింది.కాగా ఈ ఏడాది తొలి గ్రాండ్‌ స్లామ్‌ ఆస్రే ్టలియా ఓపెన్‌లో నెగ్గిన కెర్బర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టడంతో ఆమెను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.ఆ తరువాత కసితో వింబుల్డన్‌లో మెరుగైన ఆట తీరుతో రన్నరఫ్‌గా నిలిచి తన అభిమానుల్లో కెర్బర్‌ ఆశ రేకెత్తించింది.తాజాగా యుఎస్‌ ఓపెన్‌లో టాప్‌ ప్లేయర్స్‌ను బొల్తా కొట్టిస్తూ ఫైనల్‌ చేరి సెమీఫైనల్లో డిపెండింగ్‌ చాంపియన్‌ సెరెనాను ఓడించిన ప్లిస్కోవా మూడు సెట్ల పోరులో తన సత్తా ఏమిటో చూపించింది. కాగా ప్లిసోవా 17 అనవసర తప్పిదాలు చేసి తొలి సెట్‌ను కోల్పోయింది.అయినా రెండవ సెట్లో 17 విన్నర్లు సంధించి 6-4తో సెట్‌ గెలవడంతో మూడవ సెట్‌కు వెళ్లింది.మూడవ సెట్లో తక్కువ తప్పిదాలు చేసిన కెర్బర్‌ 4-4తో ఉన్న దశలో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా రెండు పాయింట్లు గెలిచి సెట్‌తో పాటు మ్యాచ్‌ నెగ్గింది.
2sports
Suresh 74 Views బిఎస్‌ఇ రూ.1300 కోట్ల ఐపిఒ నిధుల సమీకరణ ముంబై, సెప్టెంబరు 9: రూ.1200నుంచి 1300కోట్ల ఐపిఒ నిధులు సమీకరణకోసం బాంబే స్టాక్‌ ఎక్ఛేంజి సెబి వద్ద ముసాయిదా దరఖాస్తులు దాఖలుచేసింది. ఇప్పటికే స్టాక్‌ ఎక్ఛేంజిల్లో జాబితా అయిన ఎక్ఛేం జిగా ఆసియాలో అత్యంతప్రాచీనమైన ఎక్ఛేంజి ఐపిఒ పేపర్లను సెబివద్ద దాఖలుచేసింది. వాటాదారుల కు ఆఫర్‌ఫర్‌సేల్‌ పద్ధతిలో ఈ ఐపిఒను జారీచేయాలని నిర్ణయించింది. ఎన్‌ఎస్‌ఇ ఇప్పటికే ఐపిఒ న్రపణాళికలు ప్రకటించింది. బిఎస్‌ఇ మరికొంత ముందుగా డ్రాఫ్ట్‌పేపర్ల ను సెబి వద్ద దాఖలుచేసింది. సెబినుంచి గతంలోనే బిఎస్‌ఇ ఐపిఒ జారీ కి అనుమతిని సాధించింది. ప్రస్తుత షేర్‌ హోల్డర్లకు ఆఫర్‌ఫర్‌సేల్‌ పద్ధతి లో వాటాలను కేటాయించడం ద్వారా 1200 నుంచి రూ.1300 కోట్లు సమీకరించగలమని ధీమాగాఉంది. ఇప్పటికిప్పుడుఎక్ఛేంజి వద్ద తొమ్మిది వేల మందికిపైగా వాటాదారులు ఉన్నారు. బిఎస్‌ఇ ఎడెల్విసిస్‌ ఫైనాన్షి యల్‌ సేవల సంస్థ ఎజడ్‌బి పార్టనర్స్‌, నిషిత్‌ దేశా§్‌ు అసోసియేట్స్‌ న్యాయ సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ఎక్ఛేంజి ఇప్పటివరకూ నికరలాభాల్లో 40శాతం పెరిగింది. 52.72 కోట్లుగా తొలిత్రైమాసికంలో నమోదుచేసింది. సెబి ఇప్పటికే స్టాక్‌ ఎక్ఛేంజిలు, క్లియరింగ్‌ కార్పొరేషన్ల మార్గదర్శకాలను గడచిన జనవరి ఒకటవ తేదీనే ప్రకటించింది. కొత్తనిబంధనల ప్రకారంచూస్తే స్టాక్‌ఎక్ఛేంజిలు తమతమ వాటాలను ఎక్చేంజిల్లో ఐపిఒల నిమిత్తం జాబితా చేసుకునే అవకాశం ఉంది. సవరణల తర్వాత ఎక్చేంజి ఐపిఒ జారీకి అనుమతులకోసం దరఖాస్తుచేసింది. ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్ఛేంజిఆఫ్‌ ఇండియా ఒక్కటే ఎక్ఛేంజిల్లో జాబితా అయింది. బిఎస్‌ఇ ఎన్‌ఎస్‌ఇకి మంచి పోటీసంస్థగా నిలిచింది. సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్లు, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా, కోటక్‌ మహీంద్ర కేపిటల్‌, జెఎం ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ సెక్యూరిటీస్‌ ఐపిఒకు గ్లోబల్‌ సమన్వయకులుగా వ్యవహరిస్తున్నారు.
1entertainment
వియత్నాం, చైనా, థాయిలాండ్‌ దేశాలే భారత్‌కు పోటీ Rice export ముంబయి: దేశంనుంచి బియ్యం ఎగుమతులు ఏడేళ్ల కనిష్టానికి చేరాయి. డిమాండ్‌ లేకపోవడం, అత్యధిక ధరలు కూడా ఇందుకు కారణం అని ఎగుమతిదారులు కలవరం వ్యక్తంచేస్తున్నారు. ఆఫ్రికాదేశాలనుంచి తక్కువ డిమాండ్‌ వస్తోంది. అంతేకాకుండాప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. గతంలో ప్రభుత్వం ఎగుమతులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు ఇపుడులేవని వ్యాపారులు పేర్కొంటున్నారు. భారత్‌కు పోటీగా ఉన్న వియత్నాం, మైన్మార్‌దేశాలు ఇపుడు బియ్యం ఎగుమతులు పెంచుతున్నాయి. గత ఏడాదినిల్వలే క్లియర్‌కాని తరుణంలో రైతులనుంచి ఎక్కువ కొనుగోళ్లుచేయాలని కేంద్రం ఒత్తిడి కూడా వ్యాపారులను సతమతం చేస్తోంది. ఆఫ్రికాలో నిల్వలు పెరిగాయని ఓలమ్‌ ఇండియాస్‌ రైస్‌బిజినెస్‌ వైస్‌ప్రెసిడెంట్‌ నితిన్‌గుప్తా పేర్కొన్నారు. భారత్‌కు ఉన్న డిమాండ్‌కాస్తామ ఇపుడు మైన్మార్‌, చైనాలకు మళ్లింది. ఈ దేశాలధరలు భారత్‌ధరలతో కొంతమేర తక్కువ ఉండటమే ఇందుకుకారణమని అంచనా. బియ్యం ఎగుమతులు 10 నుంచి 11 మిలియన్‌ టన్నులుగా ఈ ఏడాది ఉండవచ్చని అంచనా. గత ఏడాది మార్చి 31 నాటికి 11.95మిలియన్‌ టన్నులు ఎగుమతులుచేసారు. అంతకుముందు 12నెలలతోపోలిస్తే7.2శాతం తగ్గింది. బాస్మతియేతర బియ్యానికి ప్రభుత్వం రాయితీలు కల్పించినా డిమాండ్‌ తగ్గింది. సౌదీ అరేబియా, ఇరాక్‌ ఇరాన్‌ దేశాలకు మాత్రం ప్రీమియం బాస్మతి బియ్యం ఎగుమతి అవుతోంది. నాన్‌బాస్మతి బియ్యం మాత్రం బంగ్లాదేశ్‌,నేపాల్‌, బెనిన్‌, సెనెగల్‌ దేశాలకు వెళుతున్నాయి. బియ్యం ఎగుమతులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు తాత్కాలికంగానే ఉంటాన్నాయి. గత మార్చి 25వ తేదీ వాటిని నిలిపివేసిందని బియ్యం ఎగుమతిదారులసంఘం అధ్యక్షుడు బివికృష్ణారావు పేర్కొన్నారు. భారత్‌ బియ్యం ఎగుమతులు ఏప్రిల్‌మేనెలల్లో 30శాతానికి పడిపోయాయి. ఏడాదిక్రితం 1.58 బిలియన్‌ టన్నులు షిప్‌మెంట్‌కు వెళ్లాయి. 50శాతంకి పైగా పడిపోయాయి. 7.12 మిలియన్‌టన్నులకు చేరాయి. అపెడా లెక్కలప్రకారంచస్తే ఎగుమతులు మరింత తగ్గుతున్నాయి. తెల్లబియ్యం భారత్‌నుంచి షిప్‌మెంట్‌ కావడం తగ్గింది. వియత్నాం, మైన్మార్‌ దేశాలు టనునకు 30డాలర్లు రాయితీకి అందిస్తున్నందున భారత్‌ బియ్యానికి ప్రపంచ మార్కెట్లలో డిమాండ్‌ తగ్గింది. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/
1entertainment
ఒక్కో మెయిల్‌ విలువ డెబ్భై కోట్లు ? - రూ. వంద కోట్ల అకౌంట్ల హ్యాకింగ్‌ ఫలితాన్ని అనుభవించబోతున్న యాహూ? - డీల్‌లో రూ. ఏడు వేల కోట్ల డిస్కౌంట్‌ను అడగనున్న వెరిజోన్‌ ! - యాహూ సెక్యూరిటీ అంత బలంగా లేదన్న ఇంటెల్‌ చీఫ్‌ - అయోమయంలో యాహూ యాజమాన్యం - ఆరు శాతం పడిపోయిన షేర్లు - సంచలనాలకు తెరతీస్తున్న యాహూ హ్యాకింగ్‌ ఉదంతం       నీరు ఎల్లప్పుడూ ప్రవాహంలో ఉంటేనే స్వచ్ఛతతో ఉంటుంది. అట్లాగే...టెక్నాలజీ కంపెనీలు సైతం పారుతున్న నీటి వలే మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, వినియోగదారుల నమ్మకాన్ని పొందుతూ రక్షణ, భద్రతాపరమైన చర్యలు తీసుకుంటేనే మనుగడను సాగిస్తాయి. ఒకప్పుడు ఫీచర్‌ ఫోన్ల రారాజుగా ఓ వెలుగు వెలిగిన నోకియా..స్మార్ట్‌ ఫోన్ల టెక్నాలజీని అందిపుచ్చుకోక చతికిలపడిన విషయం తెలిసిందే! ఇప్పుడు అటువంటి పరిస్థితే యాహూకి దాపురించింది. గూగుల్‌ రాకముందు సెర్చ్‌ ఇంజన్‌, మెయిల్స్‌ కి పెట్టింది పేరుగా ఉన్న యాహూ.. ఇప్పుడు తన ప్రాభవాన్ని మసకబార్చుకుని, భద్రతాపరమైన అంశాల్లో సైతం తన యూజర్ల విశ్వాసాన్ని కోల్పోయి మోడులా మిగిలే పరిస్థితికి చేరుకోబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. - కడవేర్గు 2008 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్‌ వంటి ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీ 'మిమ్మల్ని మేము కొనుగోలు చేస్తాము' అని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినా తిరస్కరించిన యాహూ కంపెనీ.. ఇప్పుడు క్రమక్రమంగా అదోపాతాళానికి దిగజారుతున్నది. మళ్లీ హ్యాకింగ్‌ బారిన పడిన యాహూ ఈ యేడు సెప్టెంబర్లో దాదాపు 50 కోట్ల మంది యూజర్ల డేటా హ్యాకింగ్‌కు గురైనట్టు వెల్లడించిన కొన్నాండ్లకే ఈ సారి ఏకంగా వందకోట్ల పైగా యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు చోరీ అయినట్టు యాహూ కంపెనీ ప్రకటించడం కార్పొరేట్‌ వర్గాల్ని విస్మయానికి గురిచేస్తున్నది. యాహూ మెయిల్‌ అకౌంట్లు మరోసారి హ్యాకింగ్‌కు గురయ్యాయని, ఈ హ్యాకింగ్‌ ఓ అనధికారిక థర్డ్‌ పార్టీ వల్లే జరిగినట్టు సదరు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, యాహూ ఉపయోగించే సాంకేతికత వ్యవస్థలో లూప్‌ హోల్స్‌ ఈ పరిణామాలకు తార్కాణమని ఇంటెల్‌ సెక్యూరిటీ సంస్థ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ స్టీవ్‌ గ్రాబ్‌మాన్‌ వ్యాఖ్యానించటం గమనార్హం. భారీ ఎత్తున యూజర్ల డేటా చేతుల్లో ఉన్న పెద్ద సంస్థలు ఈ తరహా దాడులను ఎదుర్కొనేందుకు కేవలం సాంకేతికతపైనే ఆధారపడకుండా.. అంతర్గతంగా భద్రత, వనరులను, వ్యవస్థలను సమర్ధంగా ఉపయోగి ంచుకోవాలని ఆయన సూచించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వెరిజోన్‌ ఏం చేయబోతుంది ? ఇంటర్నెట్‌ దిగ్గజ సంస్థ యాహూ ప్రధాన అసెట్స్‌ను వెరిజోన్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థ 4.83 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.32,491.41కోట్లు) కు ఈ యేడు జూలైలో కొనుగోలు చేసింది. సోషల్‌ నెట్‌ వర్కింగ్‌, మీడియా, డిజిటల్‌ రంగాల్లో రాణిస్తున్న గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి కంపెనీలను టార్గెట్‌ చేయడానికే వెరిజోన్‌ యాహూని కొనుగోలు చేసిందని అప్పట్లో విశ్లేషకులు పేర్కొన్నారు. యాహూ ముందటి మాదిరి కాకపోయినా ప్రస్తుతం 1 బిలియన్‌ గ్లోబల్‌ ఆడియన్స్‌ని కలిగి ఉంది. ఇందులో సుమారు 600మిలియన్‌ మొబైల్‌ వినియోగదారులున్నారు. అలాగే, యాహూమెయిల్‌కి నెలవారీగా 225మిలియన్‌ యాక్టివ్‌ యూజర్‌ బేస్‌ ఉంది. ఈ లెక్కలను చూసే సుమారు 4.83 బిలియన్‌ డాలర్లను వెచ్చించి మరీ వెరిజోన్‌ యాహూని కొనుగోలు చేసింది. అయితే, ఇప్పుడు యే అకౌంట్లను, యూజర్లను చూసి వెరిజోన్‌ యాహూని కొనుగోలు చేసిందో ఆ అకౌంట్ల సంరక్షణ, యూజర్ల నమ్మకాన్ని పోగొట్టుకుంటున్న యాహూపై తగిన విధంగా స్పందించాలని, డీల్‌ను పునరాలోచించే అవసరం ఎంతైనా ఉందని వెరిజోన్‌ కంపెనీ సిఎఫ్‌ఓ ఫ్రాన్‌శామో పేర్కొనడం యాహూని కలవరపరుస్తున్నది. అయితే ఇక్కడ మరో విషయం దాగుంది. మొదట జరిగిన హ్యాకింగ్‌ సమాచారాన్ని యాహూ తనకు తెలిసినా.. వ్యూహాత్మకంగా కొంత కాలం దాచి పెట్టింది. దీనికి కారణం..అప్పటికే వెరిజోన్‌ సంస్థతో యాహూ ఒప్పందం పురోగమన దశలో ఉండటమే! ఒకవేళ హ్యాకింగ్‌ విషయం బయటపెడితే, డీల్‌ కే ప్రమాదమని అందుకే ఒప్పందం ముగిసాక యాహూ మొదటి హ్యాకింగ్‌ వివరాలను మెల్లిగా ప్రకటించిందన్న విమర్శలు కూడా లేకపోలేదు. అంత డిస్కౌంట్‌ అడగనుందా ? యాహూ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న వెరిజోన్‌ సుమారు రూ.32,491.41కోట్లతో పెట్టుకున్న డీల్‌లో దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల డిస్కౌంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్టు వెరిజోన్‌ మీడియా విభాగమైన టెక్‌ క్రంచ్‌ పేర్కొంది. అంటే, ఈ లెక్కన యాహూ..కేవలం హ్యాకింగ్‌ ఫలితంగా.. ఒక్కో మెయిల్‌ కు రూ. 70కోట్లు పరోక్షంగా నష్టపోతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హ్యాకింగ్‌ ప్రకటన వెలువడగానే యాహూ షేర్లు ఆరు శాతం పడిపోవడం గమనార్హం. యాహూ-కొన్ని ఆసక్తికర విషయాలు గూగుల్‌ని అప్పట్లో యాహూ కొనుగోలు చేయాలనుకుంది. యాహూ దాదాపు 50 వెబ్‌ ప్రాపర్టీస్‌లో తన సేవలను అందిస్తున్నది. యాహూకి ప్రస్తుతం 1 బిలియన్‌ (వంద కోట్లు) గ్లోబల్‌ ఆడియన్స్‌ ఉండగా, వెరిజోన్‌ కి సుమారు 140 మిలియన్ల (14 కోట్లు) యూజర్స్‌ ఉన్నారు. ఆలిబాబాలో (31.2 బిలియన్‌ డాలర్లు), యాహూ జపాన్‌ (8.3 బిలియన్‌ డాలర్లు)లో ఉన్న యాహూ ఆస్తుల విలువ సుమారు 40 బిలియన్‌ డాలర్లు. యాహూను కొనుగోలు చేసేందుకు అమెరికా దిగ్గజ సంస్థ ఏటీ %డ% టీ , వారెన్‌ బఫెట్‌ వంటి ఉద్దండులు సైతం కూడా ఆసక్తి చూపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV జ్యోతిక ‘ఝాన్సీ’ థ్రిల్ కావాల్సిందే!! తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగులో ‘ఝాన్సీ’ పేరుతో విడుదలకు సిద్ధంగా ఉంది. Samayam Telugu | Updated: Aug 11, 2018, 06:59PM IST తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగులో ‘ఝాన్సీ’ పేరుతో విడుదలకు సిద్ధంగా ఉంది. కోనేరు కల్పన మరియు డి అభిరాం, అజయ్ కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఆగష్టు 17న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయినట్లు నిర్మాతలు ప్రకటించారు. సంచలనాల దర్శకుడు బాల తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమా తీశారు. విక్రమ్ నటించిన సేతు, సూర్య నటించిన నందా, సెన్సషనల్ హిట్ అయిన శివపుత్రుడు, విశాల్‌తో వాడు వీడు ఇలా ఎన్నో విజయాలు అందుకున్న బాలా.. జ్యోతికతో ‘నాచియార్’ తమిళనాడులో ఘన విజయం సాధించింది. జ్యోతిక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌‌లో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ఝాన్సీ పేరుతో ఆగష్టు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. జివి ప్రకాష్ కీలకపాత్రలో నటించగా.. ఇళయరాజా సంగీతాన్ని అందించారు.
0business
internet vaartha 174 Views చండీఘడ్‌ : బ్రిటన్‌ అమ్మాయితో నిశ్చితార్థం జరుగలేదని భారత హాకీ జట్టు కెప్టెన్‌ సర్థార్‌ స్పష్టం చేశాడు.కాగా తనతో నిశ్చితార్థం జరిగిందని,పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడంటూ భారత సంతతికి చెందిన బ్రిటన్‌ అమ్మాయి చేసిన ఆరోపణలను సర్థార్‌ ఖండించాడు. తనకు బ్రిటన్‌ అమ్మాయితో నిశ్చితార్థం జరగలేదని సర్దార్‌ స్పష్టం చేశాడు. కాగా ఆ అమ్మాయి తనకు తెలియదని చెప్పలేదు,ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదు చూడాలి,ఆ తరువాత సమాధానమిస్తా, గమ్‌ ఆడి వస్తున్నా తరువాత గేమ్‌పై దృష్టిసారించాలి అని చండీగఢ్‌ విమానాశ్రయంలో సర్థార్‌ పేర్కొన్నాడు.కాగా సర్థార్‌సింగ్‌ తనపై అత్యాచార యత్నం చేశాడని బ్రిటన్‌కు చెందిన అమ్మాయి లుధియానా పోలీసులకు పిర్యాదు చేసింది. తామిద్దరికి నిశ్చితార్థం జరిగిందని,అయితే పెళ్లి చేసుకోవడానికి సర్దార్‌ సింగ్‌ నిరాకరించాడని ఆరోపించింది.సర్థార్‌ బ్లాక్‌మెయిల్‌ చేశాడు, మానసికంగా,శారీరకంగా వేధించాడు అని ఆరోపించింది.సర్థార్‌ తండ్రి గుర్నం సింగ్‌ మీడయాతో మాట్లాడుతూ తన కుమారుడికి ఆ అమ్మాయి తెలుసునని,అయితే నిశ్చితార్థం జరుగలేదని పేర్కొన్నాడు.
2sports
Mar 28,2017 బీవోబీ నూతన కార్యాలయం ప్రారంభం నవతెలంగాణ,వాణిజ్యవిభాగం : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో తమ 76వ నూతన శాఖను సోమవారం ప్రారంభించింది. ఈ పారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జోనల్‌ హెడ్‌ పి నర్మింహా రావు, బెంగళూరు జోన్‌ జనరల్‌ మేనేజర్‌ పాల్గొని ఈ నూతన శాఖను ప్రారంభించా రు. ఈ సందర్భంగా జోనల్‌ హెడ్‌ రావు మాట్లాడుతూ.. తమ బ్యాంకు సేవలను అన్ని వర్గాలకు చేరువ య్యేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు. అలాగే తమ ఖాతా దారులను నగదు ఆధారిత లావాదేవీల నుంచి నగదు రహిత లావాదేవీలపై మళ్లీంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రీజినల్‌ హెడ్‌ టి.బాలకృష్ణన్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ డిఆర్‌ఎం జె.మొహపాత్ర, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, బ్రాంచీ హెడ్‌ సరత్‌చంద్రా పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Nov 14,2017 వచ్చే నెల నిర్మాణ ఉత్పత్తుల ప్రదర్శన హైదరాబాద్‌ : కొత్తకొత్త నిర్మాణ రంగ తయారీ ఉత్పత్తులను ప్రదర్శించే 'సీఐఐ ఎక్సాన్‌ 2017' వచ్చే నెల ఏర్పాటు కానుంది. డిసెంబర్‌ 12 నుంచి 16వ తేది వరకు బెంగళూరులో ఈ మెగా ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్టు 'ఎక్సాన్‌ 2017' స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ఆనంద్‌ సుందరేసన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు రోజుల పాటు ఈ మెగా ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద ఈ ప్రదర్శనలో ముఖ్యంగా నిర్మాణ రంగం ఉత్పత్తులు, ఆ రంగం టెక్నలాజీ ట్రేడ్‌ ఫెయిర్‌ను సీఐఐ నిర్వహిస్తుందన్నారు. ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన దాదాపు 1000 మంది ప్రదర్శకులు పాల్గొనన్నుట్టుగా తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV గేల్‌ను నగ్నంగా చూసి ఏడ్చేశా: మసాజ్ థెరపిస్టు వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌గేల్‌ తనకు మర్మాంగాన్ని చూపడంతో వెక్కివెక్కి ఏడ్చినట్టు మసాజ్‌ థెరపిస్ట్‌ లీన్‌ రసెల్‌ సిడ్నీ కోర్టుకు తెలిపింది. ఆ ఉదంతం తర్వాత తాను ఎంతో వేదనకు గురయ్యానని ఆమె పేర్కొంది. ఆస్ట్రేలియాలో జరిగిన 2015 ప్రపంచకప్‌ సందర్భంగా విండీస్‌ టీమ్‌కు రసెల్‌ మసాజ్‌ థెరపిస్టుగా పనిచేసింది. TNN | Updated: Oct 25, 2017, 09:20PM IST వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌గేల్‌ తనకు మర్మాంగాన్ని చూపడంతో వెక్కివెక్కి ఏడ్చినట్టు మసాజ్‌ థెరపిస్ట్‌ లీన్‌ రసెల్‌ సిడ్నీ కోర్టుకు తెలిపింది. ఆ ఉదంతం తర్వాత తాను ఎంతో వేదనకు గురయ్యానని ఆమె పేర్కొంది. ఆస్ట్రేలియాలో జరిగిన 2015 ప్రపంచకప్‌ సందర్భంగా విండీస్‌ టీమ్‌కు రసెల్‌ మసాజ్‌ థెరపిస్టుగా పనిచేసింది. డ్రెసింగ్‌ రూమ్‌లో ఎవరూ లేని సమయంలో గేల్‌ ఆమెకు మర్మాంగాన్ని చూపించి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆస్ట్రేలియా పత్రికలు గతేడాది వరస కథనాలు ప్రచురించాయి. సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌, ది ఏజ్‌, ది కాన్‌బెర్రా టైమ్స్‌ తదితర పత్రికల్లో 2016 జనవరిలో వచ్చిన కథనాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఆ పత్రికలన్నీ తన పేరు ప్రతిష్ఠలను మసకబార్చాలనే అలాంటి కథనాలను వండి వార్చాయని గేల్‌ పరువు నష్టం దావా వేశాడు. సహచర ఆటగాడు డ్వేన్‌ స్మిత్‌ కూడా ఈ ఉదంతంలో గేల్‌కు అండగా నిలిచాడు. ఆ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం (అక్టోబర్ 25) కోర్టుకు హాజరైన మసాజ్ థెరపిస్టు రసెల్ నాటి సంఘటనను వివరించింది.
2sports
internet vaartha 181 Views చెన్నై : భారతీయ స్టేట్‌బ్యాంకు పరిధిలోని ఐదు అనుబంధ బ్యాంకులు భారతీయ మహిళా బ్యాంకు విలీనంతో బ్యాంకుకు 16.6బిలియన్‌ రూపాయల ఖర్చు భారం పడుతుందని అంతర్జాతీయ క్రెడిట్‌రేటింగ్‌ ఏజె న్సీ మూడీస్‌ఇన్వెస్టర్‌ సర్వీస్‌ ప్రకటించింది. డాలర్లతో చూస్తే 250 మిలియన్‌ డాలర్లుఆర్థికభారం అవుతుందని అంచనా వేసింది. విలీనంపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు వ్యతిరేకతవ్యక్తంచేస్తున్నాయి. ఆరుబ్యాంకులపరంగా భారతీయ మహిళా బ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరా బాద్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ పటి యాలా, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ట్రావన్‌కూర్‌లు ఉన్నసంగతి తెలి సిందే. ఈవిలీనం ఎస్‌బిఐ ఖజానాపై పరిమిత ప్రభావంచూపు తుందనిఅంచనావేసింది. ఎస్‌బిఐ ఇప్పటికేఎస్‌బిహెచ్‌, ఎస్‌బిపి లను పూర్తిస్థాయి అనుబంధ బ్యాంకులుగా చేసుకుంది. మరో మూడు అసోసియేట్‌ బ్యాంకులను ఇదేహోదాకు తీసుకురావాల్సిఉంది. భారతీయ మహిళా బ్యాంకు పరంగా 2013లోనే ప్రారంభంఅయింది. ఎస్‌బిఐ మొత్తం ఆస్తుల్లో 0.1శాతం కూడా లేవు. సొంత నగదు నిల్వలతోనే ఈ లావాదేవీలను పూర్తిచేయాలని ఎస్‌బిఐ భావిస్తోంది. బ్యాంకు మొదటిశ్రేణి ఈక్విటీ 12 బేసిస్‌ పాయింట్లు మాత్రమే తగ్గుతుందని అంచనా. మూలధనీకరణ, స్థిరాస్తిప్రమాణాలపై ఈ విలీ నం అతితక్కువ ప్రభావం మాత్రమే ఉంటుందని ప్రకటించింది. ఐదు అససియేట్‌ బ్యాంకులు తమతమ ఆర్ధిక వనరులతో సొంతపరిపుష్టిపై నడుస్తున్నాయి. ఎస్‌బిఐ అసోసియేట్‌ బ్యాంకులు ఇదే బ్రాండింగ్‌, అదేలోగోతో ఉంటాయి. కార్యకలాపాలపరంగాచూస్తే ఈవిలీనంతో ఎస్‌బిఐపూర్తిస్థాయి అతిపెద్ద బ్యాంకు గా విస్తరిస్తుంది. విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో ఈబ్యాంకులు పనిచేసినా అన్నీ ఎస్‌బిఐ కిందకే వస్తాయి. భారీ మెట్రోలు,మధ్యశ్రేణి నగరాల్లో కూడా కొన్ని శాఖల్లో మార్పులు రావచ్చని మూడీస్‌ ప్రకటించింది.
1entertainment
చౌక ఫోన్‌ యుద్ధంలోకి బీఎస్‌ఎన్‌ఎల్‌ - జియోకు పోటీగా రూ.2000లకే..! - సన్నాహాలు మొదలు పెట్టిన సంస్థ న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా చౌక ధరల ఫీచర్‌ ఫోన్‌ యుద్ధంలోకి దిగింది. జియోతో పాటు ఇతర టెల్కోలు తక్కువ ధరకే ఈ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్న నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ తనదైన శైలిలో పోటీకి సిద్ధమయ్యింది. ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సదుపాయంతో కేవలం రూ.2000లకే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఫీచర్‌ ఫోన్‌ను తీసుకురానుంది. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థలు దీపావళి నాటికి చౌక ధరలో 4జీ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఇదే దిశగా కసరత్తు ప్రారంభించింది. తక్కువ ధరకే ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సదుపాయంతో ఫీచర్‌ ఫోన్‌ను తీసుకురానున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌ అనుపమ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇందుకోసం తాము లావా, మైక్రోమాక్స్‌ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. రెండు మొబైల్‌ తయారీ కంపెనీల భాగస్వామ్యంతో అక్టోబర్‌లో దీపావళి నాటికి ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోందని శ్రీవాస్తవ పేర్కొన్నారు. మార్కెట్‌లో ఉన్న ప్రస్తుత ఉచిత వాయిస్‌ ప్యాకేజీల కంటే ఎక్కువ మొత్తంలో అందిస్తామన్నారు బీఎస్‌ఎన్‌ఎల్‌కు దేశ వ్యాప్తంగా దాదాపు 10.5కోట్ల మంది వినియోగ దారులున్నారు. ధరల పోటీకి తెరలేపిన జియో ఇప్ప టికే వినియోగదారుల నుంచి ముందస్తు ఆర్డర్లను తీసుకుంది. మరోవైపు భారతీఎయిర్‌టెల్‌ రూ.2500 కు స్మార్ట్‌ఫోన్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఈ విభాగంలోకి ప్రవేశించడంతో పోటీ మరింత తీవ్రతరం కానుంది. అన్ని కంపెనీలు కూడా దీపావళికి ఈ చౌక ధరల ఫోన్లను అందుబాటులోకి తేవాలని నిర్దేశించుకున్నా యి. టెల్కోల మధ్య నెలకొన్న ఈ పోటీ తీవ్రత వల్ల దీపావళి పండుగ కంటే ముందస్తుగానే ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌ పూర్తిగా కుదుపులకు లోనుకానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో ఇప్పటికీ 57 శాతం మంది ఫీచర్‌ ఫోన్లను వినియోగిస్తున్నారని సైబర్‌ మీడియా రీసెర్చ్‌(సీఎంఆర్‌) ఇటీవలే ఒక రిపోర్టులో వెల్లడిచ్చింది. ఇందులో 85 శాతం మంది కూడా స్మార్ట్‌ఫోన్లకు మారడానికి ఆసక్తి చూపడం లేదని మొబైల్‌ మార్కెటింగ్‌ అసోసియేషన్‌్‌(ఎంఎంఏ), కంతర్‌ ఐఎంఆర్‌బీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
- ఆస్ట్రేలియా 'డోనర్‌' తెగదెంపులు - రుణం లభించకపోవడంతో వెనక్కి..! - కార్‌మైకెల్‌ ప్రాజెక్టుపై నీలినీడలు ముంబయి : ఆస్ట్రేలియాలోని బొగ్గు గని ప్రాజెక్టు విషయంలో అదానీ గ్రూపు తీవ్ర భంగపాటును ఎదుర్కొందని తెలుస్తోంది. ఈ దేశం క్వీన్స్‌లాండ్‌లోని కార్‌మైకేల్‌ గనికి విత్త సంస్థల నుంచి అప్పులు పుట్టకపోవడంతో ప్రాజెక్టు పురోగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఈ ప్రాజెక్టుకు అక్కడి ప్రజలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. గౌతమ్‌ అదానికి చెందిన ఈ ప్రాజెక్టు కోసం 2014లో అదానీ గ్రూపు కార్‌మైకెల్‌ గనుల నిర్వహణను ఆస్ట్రేలియా కంపెనీ డోనర్‌కు అప్పగించింది. ఇందుకోసం ఆ కంపెనీకి 2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.13,000 కోట్లు) ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు ఇరు కంపెనీలు ప్రకటించాయి. కాగా 2018 మార్చి 31 వరకు మాత్రం డోనర్‌ తన మద్దతును కొనసాగించనుంది. ఒప్పందం నుంచి డోనర్‌ వైదొలిగినప్పటికీ అదానీ తిరిగి ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్టు విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ రద్దు తమ అంకిత భావాన్ని దెబ్బతీయలేదని అదానీ గ్రూపు పేర్కొంది. ఇది కేవలం యాజమాన్య మార్పు మాత్రమేనని తెలిపింది. ఈ గని అభివృద్ధిని కొనసాగిస్తామని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి కూడా తీవ్ర వివాదం అవుతుంది. దీని వల్ల ఆ ప్రాంత పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని చాలా కాలం నుంచి అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెరిటేజీ దెబ్బతింటుందని వారి వాదన. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 800 మందిని తీసుకుంది. అయినప్పటికీ ఇది కష్టాల్లో ఉంది. ఎన్ని సవాళ్లు వచ్చినప్పటికీ భారత్‌, ఆస్ట్రేలియా ప్రభుత్వాల మద్దతుతో 2020 కల్లా ఉత్పత్తి సాధిస్తామని గత అక్టోబర్‌లో ఆ కంపెనీ ప్రకటించింది. ఏడాదికి ఈ ప్రాజెక్టుతో 60 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని అదానీ లక్ష్యంగా పెట్టుకుంది. కార్‌మైకెల్‌ ప్రాజెక్టుకు రుణాలు ఇవ్వడానికి అంతర్జాతీయ విత్త సంస్థలు వెనక్కి తగ్గాయి. ముందుగా ఎస్‌బీఐ నుంచి బిలియన్‌ డాలర్ల అప్పు పొందడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం దీనిపై వివాదాలు తలెత్తడంతో ఆ రుణం కూడా పెండింగ్‌లో పడిపోయిందని తెలుస్తోంది. చైనాకు చెందిన రెండు ప్రభుత్వ బ్యాంకులను అదానీ గ్రూపు రుణం కోసం అభ్యర్థించగా, తొలుత ముందుకు వచ్చినప్పటికీ తాజాగా అవి కూడా వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం అప్పులు పుట్టక, ఈ ప్రాజెక్టు తీవ్ర ఒత్తిడిలో ఉందని తెలుస్తోంది. అయినా అదానీ గ్రూపు ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తామని విశ్వాసం వ్యక్తం చేయటం గమనార్హం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Anuragh Takoor దేశ వ్యాప్తంగా చర్చ న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫార్సులు అమలు చేయలేదనే కార ణంగా బిసిసిఐ పదవి నుంచి ఉద్వానసకు గురైన అనురాగ్‌ ఠాకూర్‌ పేరు దేశ వ్యాప్తంగా ప్రధానంగా చర్చకు వస్తోంది. అసలు ఎవరీ అనురాగ్‌ ఠాకూర్‌? క్రికెట్‌తో అనురాగ్‌ ఠాకూర్‌ పరిచయం ఎలా ఏర్పడిందనే విషయాలను పరిశీలిద్దాం. హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌ కుమారుడు అనురాగ్‌.ప్రస్తుతం లోక్‌సభలో బిజెపి ఎంపిగా ఉన్నారు.మే 2008లో తొలిసారి లోక్‌సభకు ఎంపికయ్యాడు. 2016లో బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇతను 2014లో కూడా తిరిగి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.బిసిసిఐ అధ్యక్ష పదవిలో ఉన్న జగ్‌మోహన్‌ దాల్మియా ఆకస్మిక మరణంతో మే 2016లో బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.బిసిసిఐ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినపుడు అనురాగ్‌ వయసు 41 సంవత్స రాలు. 2017 జనవరి 2న అనురాగ్‌ను తొలగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకే ఒక ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌: అనురాగ్‌ ఠాకూర్‌ 2000 సంవత్సరం రంజీలో ఒకే ఒక్క ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడాడు.ఆ మ్యాచ్‌లో ఠాకూర్‌ పరుగులేమి చేయలేదు. ఏడు ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకున్నాడు.ఆ తరువాత అదే సంవత్సరం ఠాకూర్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌సంఘం అధ్యక్ష బాధ్యతలు స్వీకరిం చాడు.జాతీయ జూనియర్‌ సెలక్టర్‌ పదవికి అర్హతసాధించాలంటే ఒక్క ఫస్ల్‌ క్లాస్‌ మ్యాచ్‌ అయినా ఆడాలి. అనురాగ్‌ ఒక మ్యాచ్‌ అనుభవం ఉంది కాబట్టి అతను 2000 సంవత్సరంలోనే జూనియర్‌ నేషనల్‌ సెలక్టర్‌గా నియమిత ుయ్యాడు.ఆ తరువాత 2011లో అనురాగ్‌ బిసిసిఐ ఆఫీస్‌ బేరర్‌ అయ్యాడు. శ్రీనివాసన్‌ హయాంలో సంయుక్త కార్యదర్శి: బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ హయాంలో సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 2013లో ఐపిఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై అనురాగ్‌ వ్యతి రేకంగా మాట్లాడాడు.అవినీతి ఆటగాళ్లు,అధికారులకు ఉద్వాసన పలకాలంటూ డిమాండ్‌ చేశాడు.దీంతో 2015లో బిసిసిఐ అధ్యక్ష పదవినుంచి శ్రీనివాసన్‌ను సుప్రీం కోర్టు తొలగించింది. అనురాగ్‌ ఉద్వాసన బిసిసిఐ అధ్యక్షుడిగా జగ్‌ మోహన్‌ దాల్మియా నియమితుడయ్యాడు.ఆ సమయంలో ఠాకూర్‌ బిసిసిఐ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు.ఆ తరువాత దాల్మియా మరణంతో 2016,మే 22న అనురాగ్‌ ఠాకూర్‌ బిసిసిఐ అధ్యక్ష పదవిని చేపట్టాడు.లోధా కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలు చేయలేదనే కారణంతో బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి అనురాగ్‌ ఠాకూర్‌కు ఉద్వాసన పలికారు. ===
2sports
ఆంధ్రాబ్యాంకు మొత్తం వాణిజ్యం రూ. 3.06 లక్షల కోట్లు ఆర్‌బిఐ సమీక్షలో పెరిగిన నిరర్ధక ఆస్తులు నికర లాభాలపై భారీ ప్రభావం హైదరాబాద్‌ : రిజర్వుబ్యాంకు అనుసరించిన రానిబాకీల విధాన సమీక్ష ప్రభుత్వరంగ బ్యాంకులలాభాలను తగ్గించిందనే చెప్పాలి. బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బిఐ నుంచి అన్నిప్రైవేటు, ప్రభుత్వబ్యాంకుల లాభాల్లో గణనీయంగా పతనం కనిపించింది. ఆంధ్రాబ్యాంకు నికరలాభాల్లో డిసెంబరు త్రైమాసికంలో కేవలం 3 4కోట్లు మాత్రమే ఆర్జించింది. గత ఏడాది డిసెంబరు త్రైమాసికంలో 202 కోట్లు ఆర్జించిన బ్యాంకు 83.2శాతం లాభాల్లో పతనం చవిచూసింది. తిరిగి స్వల్పంగా కోలుకుని తొమ్మిది నెలలకాలానికిగాను 488కోట్ల నికరలాభం ఆర్జించింది. 7.7శాతం పెరి గింది. బ్యాంకు నికర ఆదాయవనరులు 4422 కోట్లు రూపాయలుగా ఉన్నాయి. తొమ్మిది నెలల కాలానికిగాను 12,983కోట్ల రూపాయలుగా ఉన్నట్లుబ్యాంకు ప్రకటించింది. వడ్డీయేతర ఆదాయం చూస్తే 379 కోట్లురాగా గత ఏడాదికంటే 2.8శాతం తగ్గింది. ఇక తొమ్మిదినెలల కాలానికిగాను 2.8శాతం స్వల్పంగాపెరిగి 1092 కోట్లు రూపాయలుగా ఉంది. వడ్డీఖరుచలకింద బ్యాంకు ఈత్రైమాసికంలో 3060 కోట్లు కాగా తొమ్మిదినెలలకాలానికిగాను 2.5శాతం పెరిగి 9162 కోట్లుకు చేరింది. ఇక నిర్వహణఖర్చులు గుదిబండగా మారాయి. 712 కోట్లు వరకూ ఉన్నాయి. తొమ్మిది నెలలకాలానికిగాను 2127కోట్లుగా ఉన్నట్లుఅంచనా. మొత్తం ఖర్చులు ఈత్రైమాసి కంలో 3772 కోట్లు కాగా తొమ్మిదినెలలకాలంలో 11,289కోట్లకు చేరాయి. బ్యాంకు నిర్వహణలాభం చూస్తే 1029కోట్లుగా ఉంది. బ్యాంకు తొమ్మిదినెలల కాలానికిగాను 2787 కోట్లుగా ఉంది. కేటాయింపులు ఇతర తక్షణ ఖర్చులకింద ఎక్కువ చేసింది. ఆర్‌బిఐ సమీక్షలో అన్ని బ్యాంకులు కేటాయింపులుఎక్కువ చూపించాయి. 995కోట్లు చూపింది. గతఏడాది ఇదేకాలంతో పోలిస్తే 38శాతం కేటాయింపులు పెంచింది. తొమ్మిది నెలల కాలానికిగాను 24.8 శాతం పెరిగి 2298 కోట్లుగా ఉన్నాయి. అయితే బ్యాంకు నికరవడ్డీ ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది. మూడోత్రైమాసికంలో 1362కోట్లు ఉంటే తొమ్మిదినెలల కాలానికిగాను 3821కోట్లు సాధించి 20.7శాతం వృద్ధిని నమోదు చేసింది. తొమ్మిదినెలల నికరలాభం మాత్రం 7.7శాతం వృద్ధిచెంది 453 కోట్లనుంచివ 488కోట్లకు పెరిగింది. డిసెంబరు 31వ తేదీనాటికి బ్యాంకు మొత్తం వ్యాపారం మూడు లక్షల ఐదువేల 770కోట్ల రూపాయలు జరిగింది. 17.2శాతం వృద్ధిని సాధించింది. కాసా నిష్పత్తి కూడా 27.2శాతానికి పెరిగిందని బ్యాంకు ప్రకటించింది. నగదు డిపాజిట్ల నిష్పత్తి మాత్రం 83.6శాతం నుంచి 80.1శాతానికి తగ్గింది. రిటైల్‌క్రెడిట్‌పరంగా 22,957కోట్ల రూపాయలు, మధ్యతరహా భారీకార్పొరేట్లకు 65,265కోట్లు రూపాయలు రుణపరపతి కల్పించింది. ఎంఎస్‌ఎంఇ రంగానికిగాను 25,757కోట్ల రుణాలిచ్చింది. మొత్తం 32.2శాతం వృద్ధిఎక్కువఉంది. స్థూలఅడ్వాన్సులు 1,35,971 కోట్ల రూపా యలుండగా మొత్తం డిపాజిట్లు 1,69,799కోట్ల రూపాయలుగా ఉన్నాయి. స్వల్పకాలిక డిపా జిట్లు లక్షా 23,595కోట్ల రూపాయలుగా ఉంది.  బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు ఏడుశాతంగా ఉన్నాయి. 9520.92కోట్లుగా ఉన్నాయి. నికరనిరర్ధక ఆస్తులు 5102.81 కోట్లుగా ఉన్నాయి. 3.89శాతంగా ఉంది. పునర్‌వ్యవస్థీకరించిన రుణాలు 13,750.56 కోట్లుగా ఉండగా 10.11 శాతం పెరిగినట్లు తేలింది. స్థూల నిరర్ధక ఆస్తులు గత ఏడాది ఇదేకాలంలో 5.99శాతం ఉంటే ఈ ఏడాది ఏడుశాతానికి పెరిగాయి. నికర రానిబాకీలు 3.70శాతంనుంచి 3.89శాతానికి పెరిగాయి. బ్యాంకు రెండోశ్రేణి బాండ్లజారీ ద్వారా 500 కోట్లు నిధులు సమీకరించింది. బ్యాంకుపరంగా మొత్తం 2748శాఖల్లో 807 శాఖలు గ్రామీణప్రాంతాల్లోను, సెమి అర్బన్‌ ప్రాంతాల్లో 746, పట్టణ ప్రాంతాల్లో 747 మెట్రోనగరాల్లో 448శాఖలున్నాయి. 3341 ఎటిఎంలుకూడా పనిచేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. బ్యాంకు మొత్తం డెలివరీఛానళ్లు 6127గా ఏర్పాటుచేశామని ఆంధ్రా బ్యాంకు వివరించింది. బ్యాంకు ప్రాధాన్యతా రంగాలకు 54,450 కోట్లు రుణాలిచ్చిందని వెల్లడించింది. గత ఏడాది ఇదేకాలంలో కంటే 12,023 కోట్ల రూపాయలుగా న్నాయి. వ్యవసాయ రుణాలు 21,913 కోట్లుగా ఉన్నాయి. మహిళా లబ్దిదారులకు రుణపర పతి కింద 2,27,835 స్వయం సహాయక బృందాలకు 5695 కోట్లు రుణాలిచ్చింది. మైనార్టీ వర్గాలకు 5013 కోట్లు రూపాయలు అందించింది. బ్యాంకు తన మొట్టమొదటి ఆర్‌సెట్టిని మెదక్‌జిల్లా సిద్ధిపేటలో ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
1entertainment
internet vaartha 442 Views ముంబై : ప్రముఖ చైనా కంపెనీ హువాయి తాజాగా తమ ఇబ్రాండ్‌ ఆనర్‌కు ప్రముఖ బాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను ప్రచారకర్తగా నియమించింది. ఆనర్‌ ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాలు జరుగుతున్న స్మార్ట్‌ ఫోన్లలో ఒకటి అని కంపెనీ ప్రకటించింది. హానర్‌ 5ఎక్స్‌, మానర్‌ హోల్లీ 2ప్లస్‌ అనేవి ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లలో అందుబాట్లో ఉన్నాయి. భారత్‌ మార్కెట్‌లో తనవాటాను బలోపేతం చేసుకునే లక్ష్యంతో ప్రచార వ్యూహం పెంచుతోంది. ఇందుకు సైనాను ప్రచారకర్తగా నియమించినట్లు బిజినెస్‌ గ్రూప్‌ అధ్యక్షుడు అలెన్‌వాంగ్‌ పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి, మార్కెటింగ్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే మార్కెట్‌ వృద్ధిని సాధించామని మరింత మార్కెట్‌ వాటా సాధించగలమని ఆయన పేర్కొన్నారు.
1entertainment
ఇక జియో వసూళ్లు షురూ - ఏప్రిల్‌ నుంచి ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ ఛార్జీల వర్తింపు - అన్ని ప్లాన్‌లలోనూ రోమింగ్‌లేని అపరమిత కాలింగ్‌ - వినియోగదారులను పెంచుకోవడమే లక్ష్యంగా అడుగులు - మెగా డాటా కోరుకునే వారికి కొత్త 'ప్లాన్‌' - సభ్యత్వానికి రూ.99.. నెలకు రూ.303తో 'జియో ప్రైమ్‌ప్లాన్‌' - టారీఫ్‌ల అధ్యయనానికి ప్రత్యేక వ్యవస్థ - పోటీ టారీఫ్‌ల కంటే 20% మెరుగైన సేవలను అందిస్తాం: ముఖేష్‌ అంబానీ ముంబయి: దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో సరికొత్త విప్లవానికి నాంది పలికిందని రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ అన్నారు. జియో వినియోగదారుల సంఖ్య 10 కోట్లకు చేరువైన నేపథ్యంలో ఆయన మంగళవారం ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడారు. రిలయన్స్‌ జియో కేవలం 170 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 10 కోట్ల మంది వినియాగదారులకు చేరువైందని వివరించారు. మార్చి 31తో ఉచిత ఆఫర్లు ముగియనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి వివిధ టారీఫ్‌లను అమలు చేయనున్నట్టుగా వెల్లడించారు. 'వెల్‌కమ్‌ ఆఫర్‌', 'న్యూ ఇయర్‌ ఆఫర్‌' పేరిట దాదాపు అయిదున్నర నెలలుగా జియో వినియోగదారులకు ఉచిత సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. జియో రాక తరువాత ప్రపంచంలోనే భారత్‌ మొబైల్‌ ఇంటర్‌నెట్‌ వాడకంలో ప్రథమ స్థానంలో నిలిచిందని వివరించారు. రోజులు గడుస్తున్న కొది నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తున్నట్టుగా ప్రకటించారు. అన్ని ప్లాన్‌లలోనూ రోమింగ్‌లేని అపరమిత దేశీయ కాలింగ్‌ సౌలభ్యాన్ని కొనసాగించనున్నట్టుగా ఆయన తెలిపారు. జియో వేదికగా ప్రతిరోజు 200 కోట్ల నిమిషాల వాయిస్‌, వీడియో కాల్స్‌ నమోదు అవుతున్నట్టు వివరించారు. గత 170 రోజుల కాలంలో సెకనుకు ఏడుగురు వినియోగదారులు జియో కుటుంబంలోకి వచ్చి చేరారని అన్నారు. దేశ వ్యాప్తంగా టెలికాం సంస్థలు అందిస్తున్న వివిధ ప్లాన్లను ఆఫర్‌లను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. పోటీ సంస్థల కంటే 20 శాతం మెరుగైన సేవలను అధిక డేటాను అందిచేలా జియో ప్లాన్లను సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. రోజూ తమ నెట్‌వర్క్‌ ద్వారా 5.5 కోట్ల గంటల వీడియోను అందిస్తున్నట్టుగా తెలిపారు. ఇదే వేదికపై మెగా డేటాను కొరుకొనే వారికోసం ఆయన జియో ప్రైమ్‌ప్లాన్‌ను ప్రకటించారు. సభ్యత్వం ఎలా తీసుకోవాలంటే.. జియో సరికొత్త ప్లాన్‌ను పొందాలనుకొనే వినియోగదారుడు జియో స్టోర్స్‌ లేదా జియో వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేర్లను నమోదు చేసుకోవచ్చు. యాప్‌ ద్వారా కూడా దీనిని పొందే సదుపాయం కలిగించనున్నారు. జియో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను మొదటి 10 కోట్ల మంది వినియోగదారులతో పాటు మార్చి 31 వరకు నెట్‌వర్క్‌లో చేరిన వారు ఈ పథకాన్ని పొందవచ్చు. మార్చి 1 నుంచి మొదలుకొని మార్చి 31 వరకు ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ రిజిస్ట్రేషన్లు తెరిచి ఉంటాయి. జియో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందిన వారు దాదాపు రూ.10,000 విలువైన ప్రయోజనాలను పొందేందుకు వీలుపడుతుందని అంబానీ వేదికపై వివరించారు. కుంగిన ప్రధాన టెలికాం షేర్లు.. రిలయన్స్‌ జియో టారీఫ్‌ల ప్రకటనతో పాటు కంపెనీ భవిష్యత్తు విస్తరణ గురించి సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం ప్రధాన టెలికాం షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ప్రధాన పోటీదారులు ఎయిర్‌టెల్‌, ఐడియా టెలికాం షేర్లు నష్టాలను మూట గట్టుకున్నాయి. బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్‌ స్టాక్‌ 4.02% తగ్గి రూ.360.55కు పడిపోయింది. రోజు మొత్తంమ్మీద 4.27 శాతం నష్టంతో రూ.359.60 కనిష్ట స్థాయిని తాకింది. మరోవైపు ఐడియా సెల్యులార్‌ 0.37 శాతం తగ్గి రూ.108.30కు పడిపోయింది. అందుబాటులోకి మరో 'ప్లాన్‌' వినియోగదారులు జియో వెల్‌కమ్‌, న్యూ ఇయర్‌ ఆఫర్‌లలో లభించిన అపరిమిత డేటా, ఉచిత కాల్స్‌, మెసేజ్‌ సౌలభ్యాన్ని కొనసాగించుకొనేందుకు వీలుగా కంపెనీ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైమ్‌ ప్లాన్‌ లాభాలను అందుకొనేందుకు గాను రూ.99 చెల్లించి ముందుగా సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏడాది కాలం పాటు అమలులో ఉంటుంది. అనంతరం మొబైల్‌ డాటా కోసం ప్రతి నెలా రూ.303లతో ఛార్జ్‌ చేయించాలి. ఈ పథకం కింద ప్రతి రోజు ఒక జీబీ డేటాను వినియోగించుకొనే సౌలభ్యం ఉంటుంది. అన్ని నెట్‌వర్క్స్‌కు చేసే కాల్స్‌ పూర్తిగా ఉచితం. జియో ప్రైమ్‌ లాభాలు వద్దనుకొనే వారి కోసం గతంలో ప్రకటించిన ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. వినియోగదారులు తమ అవసరం మేరకు ఆయా ఆఫర్లను ఎంచుకొని సేవలను వాడుకోవచ్చు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 22, Mar 2019, 7:52 PM IST Highlights ప్రభాస్ లాంటి హీరోతో సినిమా చేస్తున్నారు అంటే దర్శకులు యాక్షన్ పార్ట్ కోసం చేసే కసరత్తులు అన్ని ఇన్ని కావు. అభిమానులను దృష్టిలో పెట్టుకొని కొన్ని స్పెషల్ గా డిజైన్ చేయక తప్పదు. కానీ ఇప్పుడు జిల్ దర్శకుడికి ఆ టెన్షన్ లేకుండా చేస్తున్నాడట ప్రభాస్.  ప్రభాస్ లాంటి హీరోతో సినిమా చేస్తున్నారు అంటే దర్శకులు యాక్షన్ పార్ట్ కోసం చేసే కసరత్తులు అన్ని ఇన్ని కావు. అభిమానులను దృష్టిలో పెట్టుకొని కొన్ని స్పెషల్ గా డిజైన్ చేయక తప్పదు. కానీ ఇప్పుడు జిల్ దర్శకుడికి ఆ టెన్షన్ లేకుండా చేస్తున్నాడట ప్రభాస్.  బాహుబలి - సాహో వంటి సినిమాలు చేశాక ప్రభాస్ కి యాక్షన్ అంటే తెగ చిరాకొస్తుందట. యుద్ధ పోరాటాలు కార్ చేజింగ్స్ ఇలా గత ఆరేళ్లుగా ఎక్కువగా యాక్షన్ తోనే గడపడం ఎబ్బెట్టుగా అనిపించిందని టాక్. అందుకే తదుపరి సినిమాలో కొంచెం యాక్షన్ డోస్ కి గ్యాప్ ఇవ్వాలని పూర్తిగా ఎమోషన్ అండ్ డ్రామా కోణాల్లో ఉండేలా సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యాడు.  రాధాకృష్ణ తో చేయబోయే లవ్ స్టోరీలో ఒక రెండు భారీ యాక్షన్ సీన్స్ ను ప్రభాస్ తీయించేశాడట. ముందు ప్రభాస్ కోసం ఏళ్ల తరబడి స్క్రిప్ట్ రెడీ చేసుకొని పక్కాగా ప్లాన్ గీసుకున్న దర్శకుడికి అవసరం లేని చోట జొప్పించాలని ట్రై చేయవద్దు. సింపుల్ ఫైట్స్ తో కనిచ్చెయండి అని ప్రభాస్ తన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.   Last Updated 22, Mar 2019, 7:52 PM IST
0business
Shipping జపాన్‌లో టాప్‌ 3 షిప్పింగ్‌ కంపెనీల విలీనం న్యూఢిల్లీ, అక్టోబరు 31: జపాన్‌లోని మూడు టాప్‌ షిప్పింగ్‌ కంపెనీలు తమ కంటైనర్‌ కార్యకలాపాలు విలీనం చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. నిప్పన్‌ యూసెన్‌ ఖెకె, మిత్సుయి ఒఎస్‌కెలైన్స్‌ లిమిటెడ్‌, కవాసాకి కిసెన్‌ కైషా లిమిటెడ్‌ సంస్థలు మూడు కలిసి ఒక జాయింట్‌వెంచర్‌ను ఏర్పాటుచేస్తున్నాయి. దీనివల్ల సాలీనా వారికి 1.05బిలియన్‌ డాలర్ల ఖర్చు లు తగ్గుతాయని అంచనా వేస్తున్నాయి. ఈ జాయిం ట్‌ వెంచర్‌ ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద కంపెనీగా రికార్డు సాధిస్తుందని నిపుణుల అంచనా. ఈ రంగం లో జరుగుతున్న పునరేకీకరణ, ఎక్కువ ఒత్తిళ్లు సవాళ్లతో పాటు నిర్వహణ వ్యయాలను తట్టుకునేం దుకు ఈ మూడు భారీ కంపెనీలు ఈ నిర్ణయానికి వచ్చాయి. ఆర్థికవృద్ధిప్రపంచ వ్యాప్తంగా కూడా నీర సించింది. దీనివల్ల వందలాది ఓడలు నిరర్ధకంగా నిలిచిపోయాయి. 1950నుంచి 1960సంవత్సరాల నాటి పరిశ్రమ మందగమనం కనిపిస్తున్నట్లు నిపుణు ల అంచనా. వీటికితోడు గతఆగస్టులో దక్షిణకొరియా కు చెందిన హ్యాన్‌జిన్‌ షిప్పింగ్‌ కంపెనీ కుప్పకూల డం కూడా తోడయింది. మూడు కంపెనీలు విలీనం వల్ల ఖార్చులు నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతా యని ఈమూడు సంస్థలు ఒక్కటిగా కావడానికి కార ణం ఈ మూడుసంస్థల్లో ఏ ఒక్కటీ జీరో కాకుడ దన్న నిర్ణయమేనని నిప్పన్‌ యూసెన్‌ సంస్థ అధ్య క్షుడు తటాకి నైతో వెల్లడించారు. యూరోప్‌లో జరిగిన ఈ రంగం పునరేకీకరణ తరహాలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పోటీని తట్టు కునేందుకు ఈ నిర్ణయాలు తప్పవని కవాసాకి కిసెన్‌ అధ్యక్షుడు ఈజో మురాకా§్‌ు పేర్కొన్నారు. మరొక షిప్పింగ్‌ సంస్థ పరంగాచూస్తే సిఎంఎ సిజిఎం ఫ్రాన్స్‌సంస్థ సింగపూర్‌కు చెందిన నెప్ట్యూన్‌ ఓరి యంట్‌లైన్స్‌ను కొనుగోలు చేసే లక్ష్యంతో ఉంది. జర్మన్‌ కంటైనర్‌ షిప్పింగ్‌లైన్‌ హాపాక్‌ ల్లాయిడ్‌ ఎజి యునైటెడ్‌ అరబ్‌ షిప్పింగ్‌ కంపెనీలతో విలీనం అయ్యేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. అలాగే చైనా లో కాస్కో, చైనా షిప్పింగ్‌ గ్రూప్‌ రెండూ కలిసి చైనా కాస్కో షిప్పింగ్‌ కార్పొరేషన్‌గా విలీనం అయ్యాయి. ప్రపంచంలోనే నాలుగవఅతిపెద్ద కంటై నర్‌ షిప్పింగ్‌గా నిలిచింది. చైనా మర్చంట్స్‌గ్రూప్‌ కూడా రవాణాగ్రూప్‌ సినోట్రాన్స్‌ సిఎస్‌సి హోల్డిం గ్స్‌ కంపెనీగా నిలిచింది. ఈ రంగంలో వస్తున్న మందగమనాన్ని ముందుగానే గుర్తించిన కాస్కో హోల్డింగ్స్‌ ఈ ఏడాది నష్టం తప్పదని ముందుగానే హెచ్చరించింది. అలాగే మూడో త్రైమాసికంలో మార్కెట్‌ రికవరీని సాధించి మూలధన వనరులు పెంచుకోవడంలో విఫలంఅయింది. దక్షిణకొరియా లో ప్రభుత్వపరంగా షిప్‌ ఫైనాన్సింగ్‌ కంపెనీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ప్రాథమిక మూల ధన నిధిగా లక్ష కోట్ల వన్‌లు అంటే 871 మిలి యన్‌ డాలర్లు కేటాయించింది. కొరియన్‌ షిప్పింగ్‌ కంపెనీల మనుగడకోసం ఈ చర్య లు చేపట్టినట్లు ప్రకటించింది. ఇక కొత్తగా ఏర్పాటవుతున్న జపాన్‌జాయింట్‌ వెంచర్‌ లో అయితే 38శాతం నిప్పన్‌ యూసెన్‌ 31శాతం చొప్పున మిట్సుయిఒఎస్‌ఖె, కవా సాకి కిసెన్‌ కంపెనీల వాటాలుంటాయి. 2017 జూలై ఒకటవ తేదీకల్లా జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటవుతుందని, 2018 ఏప్రిల్‌ నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తా యని ప్రకటించింది.ఈమూడు కంపెనీల్లోప్రస్తుతం రెండువేలకుపైగా ఓడలున్నాయి. వీటిలో ట్యాంకర్లు, డ్రైకార్గో క్యారియర్లు, కంటైనర్‌ షిప్‌లు ఉన్నాయి. ప్రస్తుతం షేర్లు పదిశాతా నికిపైగా పెరిగాయి. నిప్పన్‌ యూసెన్‌ 9.9 శాతం, మిట్సుసయి ఒఎస్‌కె9.2శాతం, కవా సాకికిసెన్‌ 8.5శాతంచొప్పున పెరిగాయి. ఈ మూడుసంస్థలునిర్వహణనష్టాలు గడచిన ఆరు నెలలకు సంబంధించి ప్రకటించాయి. అలాగే పూర్తి సంవత్సరకాలపు వార్షిక అంచనాలను తగ్గించాయి.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఆ సెంటిమెంట్‌ను నమ్ముకున్న అర్జున్‌ సురవరం.. వర్క్‌ అవుట్‌ అవుతుందా! ఎన్నో వాయిదాల తరువాత ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు అర్జున్‌ సురవరం. సెంటిమెంట్‌ను నమ్ముకున్న నిఖిల్ ఈ సినిమా సక్సెస్‌ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. Samayam Telugu | Updated: Nov 17, 2019, 10:16AM IST అర్జున్‌ సురవరం చాలా కాలంగా రిలీజ్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినిమా అర్జున్‌ సురవరం . నిఖిల్‌ సిద్దార్థ్‌, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని చాలా కాలం అవుతుంది. అయితే టైటిల్‌ విషయంలో మొదలైన వివాదం తరువాత ఆర్ధిక సమస్యలు, సరైన రిలీజ్ డేట్‌ దొరక్కపోవటం లాంటి ఇబ్బందులతో వాయిదా పడుతూ వస్తోంది. Visit Site Recommended byColombia తాజాగా ఈ సినిమాను నవంబర్‌ 29న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సారి ఎలాంటి వెనకడుగు ఉండదు.. తప్పకుండా వస్తున్నాం అంటూ హీరో నిఖిల్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఇన్ని వాయిదాత తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న అర్జున్‌ సురవరం మెప్పిస్తాడా..? అసలు ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఆసక్తి ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కోలీవుడ్ సూపర్‌ హిట్ సినిమా కనితన్‌కు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్‌ వర్షన్‌కు దర్శకత్వం వహించిన టీఎన్‌ సంతోష్‌ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ముందుగా ఈ సినిమాకు ముద్ర అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అయితే ఆ టైటిల్‌తో మరో సినిమా రిలీజ్‌ కావటంతో తప్పని సరి పరిస్థితుల్లో టైటిల్‌ను అర్జున్‌ సురవరంగా మార్చారు. Also Read: వేడెక్కిస్తున్న వాణీ.. హాట్‌ ఫోటోషూట్లతో మత్తెక్కిస్తున్న బ్యూటీ 2019 సమ్మర్‌లోనే ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేశారు. మే 1న సినిమా రిలీజ్‌ అంటూ ప్రకటన కూడా ఇచ్చేశారు. అయితే కారాణాలు వెల్లడించకపోయినా రిలీజ్ వాయిదా పడింది. తరువాత మరో రెండు మూడు డేట్స్‌ ఇచ్చిన అవి అనుకున్నట్టుగా రిలీజ్ చేయలేకపోయారు. తాజాగా నవంబర్‌ 29 రిలీజ్‌ పక్కా అంటూ కన్‌ఫర్మ్ చేశారు. Also Read: యాంకర్‌కు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన నాగార్జున.. కారణం ఏంటంటే? అయితే గతంలో ఇలా వాయిదాలు పడి ఆలస్యంగా రిలీజ్ అయిన సినిమాలు కొన్ని విజయాలు సాధించాయి. అత్తారింటికి దారేది, అర్జున్‌ రెడ్డి, టాక్సీవాలా లాంటి సినిమాలు ఇలాగే రిలీజ్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొని తరువాత ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తన సినిమాకు కూడా వర్క్‌ అవుట్‌ అవుతుందన్న ఆశతో ఉన్నాడు నిఖిల్‌. మరి నిఖిల్‌ ఆశలు ఎంత వరకు నెరవేరతాయో తెలియాలంటే మాత్రం 29 వరకు వెయిట్‌ చేయాల్సిందే. Also Read: పిచ్చెక్కిస్తున్న పూజ.. ర్యాంప్‌ షోలో అందాలు ఆరబోసిన బ్యూటీ   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
US Dollars యప్‌టివిలో 50 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి హైదరాబాద్‌, అక్టోబరు 16: ఇంటర్నెట్‌ టివి సంస్థ యప్‌టివిలో కెకెఆర్‌కు చెందిన ఎమరాల్డ్‌ మీడియా 50 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. యప్‌టీవీలో వాటాను పొందింది. దక్షిణాసియా కంటెంట్‌ను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోనికి తెచ్చిన ఓవర్‌దిటాప్‌ వీడియో వేదిక యప్‌టివి 14భారతీయ ప్రాంతీయభాష ల్లో సైతం లైవ్‌టివి క్యాచప్‌ టివి, ఆన్‌డిమాండ్‌ సినిమాలను అందిస్తున్నది. అట్లాంటాలోని జార్జి యాలో కేంద్రం కలిగిన యప్‌టివి ప్రపంచం నలుమూలల ఉన్న 400 మిలియన్‌ దక్షిణాసియా కుటుం బాలకు సేవలందిస్తోంది. ఒక్కనెలలోనే గరిష్టంగా 20 మిలియన్లమంది సభ్యత్వం తీసుకున్నట్లు సిఇఒ ఉద§్‌ురెడ్డి తెలిపారు యప్‌టివి ప్రపంచ వ్యాప్తంగా 400 మిలియన్ల కుటుంబాలకు చేరువ అయింది.
1entertainment
Kolkata, First Published 18, Sep 2018, 4:36 PM IST Highlights ఈ మధ్య టీంఇండయా బ్యాంటింగ్ విభాగంలో కెప్టెన్ విరాట్ కోహ్లీపై అతిగా ఆధారపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లాండ్ టూర్ లోనూ ఇదే జరిగింది. కోహ్లీ ఒక్కడే బ్యాంటింగ్ లో రాణించి 5 టెస్టుల సీరీస్ లో 440 పరుగులు సాధించి  మ్యాన్  ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఈ దరిదాపుల్లో కూడా ఏ ఇండియన్ బ్యాట్ మెన్ పరుగులు లేవు. దీంతో పలువురు మాజీలు విరాట్ పై ఇంతలా ఆధాపరపటం మంచిది కాదని సూచించారు. అలాగే ప్రతిష్టాత్మక ఆసియా కప్ కు భారత జట్టులో కోహ్లీని ఎంపిక చేయకుండా విశ్రాంతి నివ్వడంపై కూడా వారు తప్పుబడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య టీంఇండయా బ్యాంటింగ్ విభాగంలో కెప్టెన్ విరాట్ కోహ్లీపై అతిగా ఆధారపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లాండ్ టూర్ లోనూ ఇదే జరిగింది. కోహ్లీ ఒక్కడే బ్యాంటింగ్ లో రాణించి 5 టెస్టుల సీరీస్ లో 440 పరుగులు సాధించి  మ్యాన్  ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఈ దరిదాపుల్లో కూడా ఏ ఇండియన్ బ్యాట్ మెన్ పరుగులు లేవు. దీంతో పలువురు మాజీలు విరాట్ పై ఇంతలా ఆధాపరపటం మంచిది కాదని సూచించారు. అలాగే ప్రతిష్టాత్మక ఆసియా కప్ కు భారత జట్టులో కోహ్లీని ఎంపిక చేయకుండా విశ్రాంతి నివ్వడంపై కూడా వారు తప్పుబడుతున్నారు. అయితే టీంఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం ఈ విషయంలో సెలెక్టర్లకు సపోర్టు చేశాడు. కోహ్లీ లేకున్నా ఆసియా కప్ లో బలమైన జట్టే బరిలోకి దిగుతోందని గంగూలీ తెలిపారు. విరాట్ కోహ్లీ లేకున్నా భారత జట్టు అత్యుత్తమ జట్టే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ తో జరగనున్న మ్యాచ్ లో కోహ్లీ లేకపోవడం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వ్యాఖ్యానించారు. దాయాదుల పోరులో ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయని గంగూలీ అన్నారు. అత్యుత్తమంగా ఆడిన జట్టే విజేతగా నిలుస్తుందని తెలిపారు. రోహిత్ సారథ్యంలోని ప్రస్తుత జట్టు బలంగానే కనిపిస్తోందని గంగూలీ స్పష్టం చేశారు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV 'ఫేస్‌బుక్‌' షేర్లు... ఒక్క రోజులో భారీనష్టం! రాజకీయ ప్రయోజనాల కోసం 'ఫేస్‌బుక్‌' నుంచి దాదాపు అయిదు కోట్ల మంది వినియోగదారుల సమాచారం లీకైందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. సంస్థ షేర్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. TNN | Updated: Mar 21, 2018, 02:56PM IST రాజకీయ ప్రయోజనాల కోసం 'ఫేస్‌బుక్‌' నుంచి దాదాపు అయిదు కోట్ల మంది వినియోగదారుల సమాచారం లీకైందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. సంస్థ షేర్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అమెరికా, బ్రిటన్‌ మీడియాల్లో ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా వార్తలు రావడంతో ఫేస్‌బుక్‌ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ట్రంప్‌ ఎన్నికల ప్రచారం కోసం పనిచేసిన కన్సల్టెన్సీకి ఫేస్‌బుక్‌ వినియోగదారుల వివరాలు ఎలా లభించాయని ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ను అమెరికా, యూరోపియన్‌ అధికారులు ప్రశ్నించనున్నారని వార్తలు రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ ఆరోపణల నేపథ్యంలో... కేంబ్రిడ్జ్‌ అనలిటికా సీఈవో అలెగ్జాండర్ నిక్స్‌ను విధుల నుంచి తొలగించారు. 2016లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారం సమయంలో సుమారు 5 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జ్‌ అనలిటికా డేటా అనలిస్ట్‌ కంపెనీ అక్రమంగా ఉపయోగించుకుందని ప్రచారం జరగడంతో... ఫేస్‌బుక్‌ షేరు విలువ 7 శాతానికి పడిపోయింది. 2014 మార్చి తర్వాత ఒక్క రోజులో ఇంతగా నష్టోవడం ఇప్పుడే. 2014మార్చిలో ఒక్క రోజులో షేరు విలువ 10.8 శాతం పడిపోయింది.
1entertainment
ధోనీ రిటైర్‌ కాబోతున్నాడా..? అంపైర్ల నుంచి బాల్ ఎందుకు తీసుకున్నాడు..? అర్థం అదేనా..? Highlights నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైర్ల నుంచి బాల్ తీసుకుని దానిని చూసుకుంటూ.. ముభావంగా పెవిలియన్ బాట పట్టాడు. ఆ సన్నివేశం చూసిన భారత అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో దారుణ పరాజయాన్ని మూటకట్టుకోవడంతో పాటు.. సిరీస్‌ను కోల్పోయింది. తొమ్మిది వరుస సిరీస్‌ల తర్వాత భారత్‌కు ఇదే తొలి సిరీస్ ఓటమి. విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత తొలి సిరీస్ ఓటమి. ఇది బాధపడాల్సిన విషయమే అయినా దీనికంటే ఎక్కువగా టీమిండియా అభిమానులు ఒక విషయం గురించి ఆందోళనకు గురవుతున్నారు. నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైర్ల నుంచి బాల్ తీసుకుని దానిని చూసుకుంటూ.. ముభావంగా పెవిలియన్ బాట పట్టాడు. ఆ సన్నివేశం చూసిన భారత అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు. ఎవరైనా గెలిచిన మ్యాచ్‌లో గుర్తుగా ఇలా తీసుకుంటారు కానీ ధోనీ ఓడిన మ్యాచ్‌లో బాల్‌ను అడిగి తీసుకోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టెస్టులకు వీడ్కోలు పలికే సమయంలో కూడా వికెట్ బెల్స్‌ను తీసుకెళ్లాడు.. తాజాగా అంపైర్ల నుంచి బంతిని తీసుకోవడం అభిమానుల్లో పెద్ద చర్చకు కారణమైంది. దీనిపై ట్విట్టర్‌లో తెగ ట్రోల్ చేస్తున్నారు.. ‘‘ బహుశా ధోని రిటైర్ అవ్వబోతున్నాడా..? అని  కొందరు..? ‘‘ ధోని వన్డే కెరీర్‌లో ఇంగ్లాండ్‌ గడ్డపై ఇదే చివరి మ్యాచా ’’ అని మరికొందరు.. అస్సలు  ‘‘ధోని ఎంపైర్ల నుంచి బాల్ ఎందుకు తీసుకున్నాడన్నది పెద్ద ప్రశ్నగా ’’ మారిందనంటూ కామెంట్ చేస్తున్నారు. ‘‘ ప్లీజ్ ధోని ఇలాంటి పని మరోసారి చేయొద్దని’’.. ‘‘ ధోని రిటైరవ్వడానికి ఇది సరైన సమయం కాదు.. దయచేసి రిటైర్‌మెంట్ ప్రకటించొద్దని... ‘‘ఆసియా కప్‌ ధోనీ చివరి వన్డే టోర్నమెంట్ అని.. ఇలా ఎవరికి తోచినట్లు వారు స్పందించారు. ధోని 2014లో టెస్టుల నుంచి తప్పుకున్నాడు.. 321 వన్డేలు, 93 టీ20లు ఆడాడు.. 321 వన్డేల్లో 51.25 సగటుతో 10,046 పరుగులు చేశాడు.. ఇందులో 67 అర్థ సెంచరీలున్నాయి.. అలాగే 93 టీ20లలో 37.17 సగటుతో 1487 పరుగులు చేశాడు. తాజాగా వన్డేల్లో 10,000 పరుగులు పూర్తి చేసిన 12వ భారత ఆటగాడిగా ధోనీ రికార్డుల్లోకి ఎక్కాడు.. అలాగే వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా 10,000 పరుగులు పూర్తి చేసి కుమార సంగక్కర సరసన నిలిచాడు. జట్టుకు వన్డే, టీ20, ఛాంపియన్స్ ట్రోఫిలను అందించిన ఏకైక కెప్టెన్. Last Updated 18, Jul 2018, 12:15 PM IST
2sports
Visit Site Recommended byColombia అనంతరం లక్ష్య ఛేదనకి దిగిన భారత జట్టు ఆదిలోనే మిథాలీ రాజ్ (6) వికెట్ కోల్పోయినా.. ఓపెనర్ స్మృతి మంధాన (62 నాటౌట్: 41 బంతుల్లో 8x4, 1x6) అజేయ అర్ధశతకంతో సత్తాచాటింది. 5.1 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 48/2తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (20: 31 బంతుల్లో 2x4) చివరి వరకూ పట్టుదలతో బ్యాటింగ్ చేసింది. వీరిద్దరూ మూడో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. భారత్ 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేసేంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు టోర్నీ ఫైనల్‌కి చేరగా.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్ నామమాత్రంగా ఈ మ్యాచ్‌ని ఆడింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పవన్ ఓ రాజైతే.. మేమంతా ఆయన సైన్యం -బాబీ పవర్ స్టార్ గారంటేనే ఓ గౌరవం, భయం. అందులోనూ చిరంజీవి గారు కూడా ఇక్కడే వున్నారు. అందుకే ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. | Updated: Mar 21, 2016, 02:06AM IST పవర్ స్టార్ గారంటేనే ఓ గౌరవం, భయం. అందులోనూ చిరంజీవి గారు కూడా ఇక్కడే వున్నారు. అందుకే ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లకపోతే నాన్న తిట్టేవారు. కానీ పండగొస్తే మాత్రం ఆయనే దగ్గరుండి స్కూలు మాన్పించేవారు. ఆ పండగే చిరంజీవి గారి సినిమా రిలీజింగ్ డే. ఆ తర్వాత కాలేజీకొచ్చాకా.. పవన్ కళ్యాణ్ సినిమాలొచ్చాయి. అలా ఆ ఇద్దరి సినిమాలు చూస్తూ పెరిగాం. ఇండస్ట్రీకొచ్చాకా పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అనుకున్నా అది కుదరకుండా పదేళ్లు గడిచిపోయాయి. ఆ తర్వాత ఇప్పుడిలా పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేసే అవకాశం రావడం నిజంగా ఎంత అదృష్టమో! అని ఆనందం వ్యక్తంచేశాడు సర్ధార్ గబ్బర్‌సింగ్ డైరెక్టర్ బాబీ . యుద్ధం చేయడం, మొండితనం, కష్టపడేతనం అంటే ఏంటో పవన్‌ని చూసే నేర్చుకున్నాను. జ్వరంతో బాధపడినా, రెగ్యులర్ షూటింగ్ కారణంగా ఒళ్లునొప్పులతో ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన మాత్రం ఎప్పుడూ అలసిపోలేదు. ఆయన ఓ రాజైతే... మేమంతా ఆయన వెనకాల సైన్యం లాంటివాళ్లం అని చెప్పి పవన్, చిరంజీవిలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు బాబీ. అలాగే ఈ సినిమా నిర్మాణానికి సహకరించిన నిర్మాత శరత్ మరార్‌కి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు బాబీ. అంతకుముందు రవితేజ నటించిన పవర్ సినిమాని డైరెక్ట్ చేసిన బాబీకి రెండో సినిమాతోనే పవన్‌ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది.
0business
Visit Site Recommended byColombia ‘ధోనీ’ ఫేం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ సోమవారం యూట్యూబ్‌లో విడుదలైంది. ఇందులో సుశాంత్ ముస్లిం యువకుడిగా, సరా హిందూ యువతిగా కనిపించనుంది. ఈ ట్రైలర్‌లో ఉత్తరాఖండ్‌ ప్రళయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ట్రైలర్‌ మొత్తాన్ని ఎలాంటి డైలాగులు లేకుండా విజువల్‌ ఎఫెక్ట్స్‌తోనే చూపించడం గమనార్హం. వరదల్లో కొట్టుకుపోతున్న హీరోయిన్‌ను హీరో రక్షించడం, ప్రతికూల పరిస్థితులను దాటుతూ క్షేమంగా బయటపడటం.. ఈ సందర్భంగా ప్రేమలో పడటం వంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV భార్య ఆత్మహత్య కేసులో కబడ్డీ ప్లేయర్ అరెస్టు భార్య ఆత్మహత్య కేసులో జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు రోహిత్ చిల్లార్‌ను డిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రోహిత్‌పై అదనపు కట్నం కోసం వేధింపులు కేసు నమోదు చేశారు. TNN | Updated: Oct 21, 2016, 04:11PM IST భార్య ఆత్మహత్య కేసులో జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు రోహిత్ చిల్లార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రోహిత్ చిల్లార్ భార్య లలిత సోమవారం డిల్లీలోని నాగోలీస్ అశోక మెహల్లాలోని తన తల్లిదండ్రుల నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఇండియన్ నేవీలో అధికారిగా విధులు నిర్వహించే రోహిత్‌పై అదనపు కట్నం వేధింపులు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు రోహిత్‌ను ముంబైలో ఈ రోజు మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారని సౌత్ వెస్ట్ జాయింట్ కమిషనర్ దీపేంద్ర పాథక్ తెలిపారు. ఈ కేసులో రోహిత్ తండ్రి విజయ్ సింగ్ కూడా పోలీసులకు లొంగిపోయాడు. డిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న విజయ్ సింగ్‌ను విధుల నుంచి తప్పించారు. రోహిత్ భార్య లలిత అక్టోబరు 17 న తన తల్లిదండ్రుల ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. చిన్న చిన్న విషయాలకే రోహిత్ వేధించేవాడని, తన జీవితంలో నుంచి వెళ్లిపోవాలన్నాడని ఆమె తన ఆత్మహత్య లేఖలో పేర్కొంది. లేఖతోపాటు దీనికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగ్‌ ఆధారాలను కూడా ఆమె ఉంచింది. దీని ఆధారంగా పోలీసులు రోహిత్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. లలిత ఆత్మహత్య చేసుకున్న తర్వాత రోహిత్ తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. Truth should come forward;Court’s decision will be welcomed:Pro-Kabaddi player Rohit Chillar's father on his arrest over Lalita suicide case pic.twitter.com/5F1XKc3VCp
2sports
titan టైటాన్‌ నుంచి కొత్త సొనాటా వాచ్‌లు హైదరాబాద్‌, మే 29: శుభకార్యాలు, వివాహాల సీజన్‌ కోసం టాటాగ్రూప్‌ టైటాన్‌ కంపెనీ కొత్త డిజైనర్‌ వాచీలను ప్రవేశపెట్టింది. టైటాన్‌ బ్రాండ్‌ సొనాటా వాచీలు మహిళలు, పురుషులు ఇరువురికీ ప్రత్యేక డిజైన్లు రూపొందించింది. బంగారుకేసులు, స్ట్రాప్స్‌తో ఈ వాచీలు వివాహ దుస్తులను మరింత ప్రకాశింపచేస్తాయని టైటాన్‌ చెపుతోంది.వీటిధరలు రూ.1299 నుంచి గరిష్టం గా రూ.1999వరకూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా వరల్డ్‌ ఆఫ్‌ టైటాన్‌ స్టోర్లు, భారీ ఫార్మాట్‌ స్టోర్లు ఎంట్రల్‌; ఫాంట్లూన్స్‌, షాపర్స్‌స్టాప్‌ అధీకృత డీలర్లవద్ద లభిస్తాయి. సాలీనా 4.7 మిలియన్‌ వాచీలను అమ్ముతున్న టైటాన్‌ బ్రాండ్‌ సొనాటా కు దేశవ్యాప్తంగా ఎనిమిదివేలమందిడీలర్లు ఉన్న ట్లు కంపెనీప్రకటించింది. ప్రతి వాచ్‌ను గ్యారంటీ తో విక్రయిస్తామని కంపెనీ ప్రచారం చేస్తోంది.
1entertainment
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
Suresh 244 Views  గుజరాత్‌ : 158, బెంగళూరు లక్ష్యం : 159 బెంగళూరు: ఐపిఎల్‌ 9 సీజన్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ లయన్స్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు 159 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. డ్వేన్‌ స్మిత్‌ 73, దినేష్‌ కార్తీక్‌ 26 పరుగులు చేసి జట్టుకు ఒకవిధంగా ఆదుకున్నారు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV క్రికెటర్ల కోసం డ్రింక్స్‌ మోసిన ఆస్ట్రేలియా ప్రధాని మ్యాచ్ మధ్యలో డ్రింక్స్ బ్రేక్ రాగానే.. ఆటగాళ్లకి సాధారణంగా రిజర్వ్ బెంచ్‌‌ క్రికెటర్లు డ్రింక్స్ తీసుకెళ్తూ ఉంటారు. కానీ.. ఆస్ట్రేలియా‌ క్రికెటర్ల కోసం ఆ దేశ ప్రధాని స్వయంగా డ్రింక్స్ తీసుకెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. Samayam Telugu | Updated: Oct 25, 2019, 02:46PM IST Photo Credit: Twitter ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్, శ్రీలంక జట్ల మధ్య తాజాగా ముగిసిన టీ20 మ్యాచ్‌లో ఓ ఘటన క్రికెట్ అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ మధ్యలో ఫీల్డ్ అంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇవ్వగా.. ఆస్ట్రేలియా టీమ్ క్యాప్ ధరించిన ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ ఆటగాళ్ల కోసం డ్రింక్స్ తీసుకుని మైదానంలోకి పరుగెత్తుకెళ్లాడు. దీంతో.. ఆశ్చర్యపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్లు.. తమ ప్రధానిని అభినందిస్తూ.. ఆ డ్రింక్స్ తాగారు. Also Read: భారత్ టీ20 జట్టులోకి 6,6,6,6,6 పవర్ హిట్టర్..! ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య త్వరలో మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌కి ముందు రెండు జట్లూ ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్‌కి కొద్దిసేపు కామెంట్రీ బాక్స్‌లో కూర్చుని వ్యాఖ్యానం అందించిన మారిసన్.. అనంతరం మైదానంలోకి డ్రింక్స్ తీసుకెళ్లి.. క్రికెట్‌పై తనకి ఉన్న ప్రేమని చాటుకున్నాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 131 పరుగులు చేయగా.. ఛేదనలో పీఎం ఎలెవన్ జట్టు 9 వికెట్లు చేజార్చుకుని ఓడిపోయేలా కనిపించింది. కానీ.. ఆఖర్లో డేనియల్ క్రిస్టియన్ 15 బంతుల్లో విలువైన 13 పరుగులు చేయడంతో.. ఒక వికెట్ తేడాతో పీఎం ఎలెవన్ జట్టు విజయాన్ని అందుకుంది. Read More: భారత్‌లో బంగ్లాదేశ్ టూర్.. మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే పాకిస్థాన్‌తో ఇటీవల లాహోర్ వేదికగా ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకున్న శ్రీలంక జట్టు ఇప్పుడు మంచి ఊపుమీదుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టులోకి సుదీర్ఘ విరామం తర్వాత స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్ మళ్లీ వచ్చారు.
2sports
Sep 14,2016 డోజోన్స్‌ స్థిరత్వ సూచీలోకి డాక్టర్‌ రెడ్డీస్‌                న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఔషధ తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అమెరికా మార్కెట్‌ నాస్డాక్‌ డోజోన్స్‌ స్థిరత్వ సూచీలో (ది డోజోన్స్‌ సస్టైనబులిటీ ఇ) స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మేటి ఫార్మాస్యూటికల్స్‌, బయోటెకాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ విభాగంలోని కంపెనీలన్నింటిలోకి వ్యాపార నిర్వహణ విభాగంలో స్థిరత్వ ధోరణితో దూసుకుపోతున్నందుకు గాను డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థకు డోజోన్స్‌లో స్థిరత్వ సూచీలో స్థానం లభించింది. అద్భుతమైన కార్పొరేట్‌ నాయకత్వ నిర్వహణ, మెరుగైన పనితీరుతో పాటు స్థిరత్వాన్ని అన్ని విభాగాల్లో కొనసాగింతకు తార్కాణంగా ఈ గుర్తింపు లభించినట్లుగా సంస్థ బీఎస్‌ఈకి అందించిన ఒక సమాచారంలో తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment