news
stringlengths
299
12.4k
class
class label
3 classes
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV పెళ్లికి పిలుస్తావ్ కదా.. కూతురితో తండ్రి పాపులర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం నాడు విడుదల చేశారు. దర్శకుడు ఎన్ శంకర్ శిష్యుడు ప్రతాప్ తాతంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రిద్ధి కుమార్, రాధాలు హీరోయిన్లుగా నటించారు. Samayam Telugu | Updated: Oct 27, 2018, 06:24PM IST పెళ్లికి పిలుస్తావ్ కదా.. కూతురితో తండ్రి చేతిలో కళ పెట్టుకుని చంద్రకళ కోసం వెంటబడే కుర్రాడు ‘అనగనగా ఓ ప్రేమకథ’ అంటూ రొటీన్ లవ్ స్టోరీని వినిపిస్తున్నాడు. పాపులర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం నాడు విడుదల చేశారు. దర్శకుడు ఎన్ శంకర్ శిష్యుడు ప్రతాప్ తాతంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రిద్ధి కుమార్, రాధాలు హీరోయిన్లుగా నటించారు. ఈ టీజర్ విషయానికి వస్తే.. తొలిచూపులో అమ్మాయి ప్రేమలో పడటం, ఎలాగోలా అమ్మాయిప్రేమను సాధించడం.. పెళ్లికి అమ్మాయి తండ్రి అడ్డు చెప్పి విలన్‌గా మారడం.. చివర్లో ఫైట్ చేసి హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం. సింపుల్‌గా ఇదే ‘అనగగనగా ఓ ప్రేమ కథ’ సినిమా అని టీజర్‌ని బట్టి ఓ అంచనాకు వచ్చేయొచ్చు. ‘పెళ్లికి చెప్తావా? అని తండ్రి కూతుర్ని ఆటపట్టించడం.. కూతురు నాన్నా.. అంటూ అలగడం’ ఆసక్తికరంగా ఉంది. అయితే డెబ్యూ అంటే కాస్త రొటీన్‌కి భిన్నంగా పాత చింతకాయ కథలకు దూరంగా ఉండటం ఎందుకు దండగ అనుకున్నాడో ఏమో కాని దర్శకుడు రొటీన్ కమర్షియల్ కథనే మళ్లీ కొత్త జాడీలో పెట్టి చూపిస్తున్నారు. ‘అనుబంధాలు ఉన్న సంబంధం చూడమన్నా.. అక్రమ సంబంధం ఉన్న సంబంధం చూడమననేదు’ అంటూ కమెడియన్ వేణు జబర్దస్త్ స్థాయి జోక్‌లు పేల్చే ప్రయత్నం చేశారు. అయితే టెక్నికల్ పరంగా టీజర్ చాలా రిచ్‌గా ఉంది. విదేశీ లొకేషన్స్ చాలా గ్రాండ్ లుక్‌లో ఉన్నాయి. స్టంట్స్ విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సింది.. బక్కపలచగా ఉన్న హీరో ఎగెరెగిరి మరీ విలన్లను చితక్కొట్టేయడం రియలస్టిక్‌కి దూరంగా ఉంది. కె.సి అంజన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. ‘అనగనగా ఓ ప్రేమకథ’ టీజర్ X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
ఈపీఎఫ్‌ఓలో కొలువుల జాతర - 9న నిర్ణయం తీసుకోనున్న సీబీటీ న్యూఢిల్లీ: 'ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌' (ఈపీఎఫ్‌ఓ) సంస్థ పునర్‌నిర్మాణ ప్రక్రయ క్రమంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే టెక్నాలజీ పరంగా తమ సామర్థాన్ని పెంచుకున్న మెరుగైన సేవలను అందిస్తున్న సంస్థ ఇప్పుడు మానవ వనరుల కొరతను కూడా తీర్చుకొని ముందుకు సాగాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సంస్థలో కాళీగా ఉన్న వేలాది కొలువులను భర్తీ యోచిస్తోంది. సంస్థ పునర్‌నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీని చేపట్టనున్నారు. ఈ నెల 9న సమావేశం కానున్న 'ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్ట్సీ' (సీబీటీ) పునర్‌నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఉద్యోగులకు ప్రమోషన్లు, అన్ని క్యాడర్లలో కొత్త కొలువులను సృష్టించడం వంటి అంశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 123 ఈపీఎఫ్‌ఓ కార్యలయాల్లో ప్రస్తుతం 24 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. దాదాపు 6000 ఉద్యోగాలు దేశ వ్యాప్తంగా భర్తీ చేయాల్సి ఉందని కార్మిక శాఖ అధికారి ఒకరు తెలియజేశారు. సీబీటీ నిర్ణయం అనంతరం ఈ ఉద్యోగాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. అయిదు కోట్ల మంది ఖాతాదారులు, 50 లక్షల మంది పెన్షనర్లకు సేవలందించాలని సంస్థ గతంలో నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరేందుకు గాను ఈ కొత్త కొలువులు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. పునర్‌నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కమిటీ కూడా కొత్త ఉద్యోగాల గురించి ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినట్లు ఆ అధికారి వెల్లడించారు. అధికారులకు పని వత్తిడి పెరిగిన నేపథ్యంలో ఉద్యోగ భర్తీ, కొత్త పోస్టులను సృష్టించడాల్ని వెంటనే చేపట్టాలని కమిటీ వెల్లడించిందని తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ‘జియో ప్రైమ్’ మీకు మేలుచేస్తుందా? జియో ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్ మరో నెల రోజుల్లో ముగుస్తుంది. ఆ తరవాత ‘జియో ప్రైమ్’ సేవలు ప్రారంభమవుతాయి. TNN | Updated: Feb 23, 2017, 02:06PM IST రిలయన్స్ జియో కస్టమర్లకు మరో నెల రోజుల్లో ఉచిత ఆఫర్లు ముగియనున్నాయి. ప్రారంభమైన ఆరు నెలల తరవాత జియో తన సేవలకు రుసుం వసూలు చేయనుంది. కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకున్న జియో.. ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్ తరవాత మరో కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అదే రిలయన్స్ జియో ప్రైమ్ . అయితే జియో ప్రైమ్‌పై కొంత మంది వినియోగదారుల్లో కొన్ని డౌట్లు ఉన్నాయి. వాటిని ఇక్కడ తెలుసుకోవచ్చు.. ఏప్రిల్ 1 నుంచి పైసలిస్తేనే జియో సేవలు ఆరు నెలలపాటు విచ్చలవిడిగా వాడుకున్న జియో ఉచిత సేవలకు మరో నెల రోజుల్లో శుభం కార్డు పడుతుంది. ఏప్రిల్ 1 నుంచి డబ్బులు చెల్లించి మాత్రమే జియో సేవలు ఉపయోగించుకోవాలి. Recommended byColombia రూ. 99కి ఒక సంవత్సరం పాటు జియో ప్రైమ్ సభ్యత్వం రిలయన్స్ జియో కొత్తగా ప్రవేశపెట్టిన సభ్యత్వ ప్లాన్ పేరు జియో ప్రైమ్. ఈ సభ్యత్వానికి రూ. 99 వసూలు చేస్తోంది. కాల పరిమితి ఒక సంవత్సరం. నెలవారి చార్జీ రూ. 303 జియో ప్రైమ్‌లో చేరిన వినియోగదారులు నెలకు రూ. 303 చెల్లించి ఉచిత సేవలను ఉపయోగించుకోవచ్చు. అంటే ప్రస్తుతం వాడుతున్న ‘హ్యాపీ న్యూ ఇయర్’ ప్లానే కొనసాగుతుంది. ఇలా నెలకి రూ. 303 చెల్లించే జియో ప్రైమ్ యూజర్లు ఈ ఉచిత ఆఫర్‌ను 2018 మార్చి 31 వరకు పొందొచ్చు. కంపెనీ అందిస్తోన్న జియోటీవీ, జియోమ్యూజిక్, జియోమాగ్స్, జియో సినిమా, జియోఎక్స్‌ప్రెస్ న్యూస్ తదితర సేవలన్నీ ఉచితం. ప్రస్తుత జియో కస్టమర్లు కూడా ప్రైమ్‌లో చేరక తప్పదు జియో సర్వీసులను ప్రారంభించినప్పుడు కంపెనీ ‘వెల్‌కమ్ ఆఫర్’ను అందించింది. మూడు నెలల తరవాత దీన్ని ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్‌గా కంపెనీ మార్చింది. కస్టమర్ల ప్రమేయం లేకుండా వారి ఆఫర్‌ను జియోనే మార్చేసింది. ఈసారి మాత్రం అలా కుదరదు. కొత్త వాళ్లతో పాటు ప్రస్తుతం జియో వాడుతున్న వారు కూడా రూ. 99 చెల్లించి జియో ప్రైమ్‌లో చేరాల్సిందే. మార్చి 1 నుంచి జియో ప్రైమ్ నమోదు ప్రారంభం జియో ప్రైమ్ సభ్యత్వ కార్యక్రమం మార్చి 1 నుంచి మొదలవుతుంది. వినియోగదారుల సౌకర్యార్థం మరిన్ని ప్లాన్లను ప్రవేశపెడతామని కంపెనీ వెల్లడించింది. ఆ ఆఫర్లన్నిటినీ మై జియో యాప్‌లో చూసుకోవచ్చని వివరించింది. జియో ప్రైమ్ నమోదుకు ఆఖరి తేదీ మార్చి 31 జియో ప్రైమ్‌లో చేరడానికి ఈ ఏడాది మార్చి 31 ఆఖరి తేది. ప్రస్తుతం జియో వాడుతున్న వినియోగదారులు మైజియో యాప్ ద్వారా కానీ లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి కానీ జియో ప్రైమ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. జియో ప్రైమ్‌లో చేరిన వారికే ఇకపై సేవలు ఈ ఏడాది మార్చి 31లోగా జియో ప్రైమ్‌లో చేరినవారికి మాత్రమే సంవత్సరం నెలకి రూ. 303 టారిఫ్ ప్లాన్‌లో ఉచిత సేవలు అందుతాయని కంపెనీ స్పష్టం చేసింది. ఒక వేళ మార్చి 31 లోపల మీరు జియో ప్రైమ్‌లో చేరకపోతే రూ. 303తో రీచార్జ్ చేసుకోవడం కుదరదు, ఉచిత సేవలు అసలు కుదరదు. జియో ప్రైమ్‌లోనూ వాయిస్ కాల్స్ ఫ్రీ గతేడాది సెప్టెంబర్‌లో జియో సర్వీసులను ప్రారంభించినప్పుడు ప్రకటించిన ఉచిత వాయిస్ కాల్స్ (దేశీయంగా) ఆఫర్‌ను కంపెనీ కొనసాగిస్తోంది. జియో ప్రైమ్‌లో చేరిన వినియోగదారులు మరో సంవత్సరం పాటు ఉచితంగా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అయితే దీనికి డాటా తప్పనిసరి. రోమింగ్ చార్జీ లేదు రిలయన్స్ జియో నెట్‌వర్క్ పరిధిలో రోమింగ్ చార్జీ కూడా వసూలు చేయడంలేదని కంపెనీ స్పష్టం చేసింది. రోజుకి 1జీబీ డాటానే (4జీ స్పీడ్) 4జీ స్పీడుతో రోజుకి 1జీబీ డాటా మాత్రమే ఉపయోగించుకోడానికి అవకాశం ఉంది. 1జీబీ ఉపయోగించిన తరవాత 128 కేబీపీఎస్ స్పీడుతో బ్రౌజింగ్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్స్‌కి ఎలాంటి ఆటంకం ఉండదు.
1entertainment
శామ్‌సంగ్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా అభినవ్‌ PNR| ప్రపంచ డిజిటల్ టెక్నాలజీ రంగంలో పేరెన్నికగన్న కంపెనీలలో ఒకటైన శామ్‌సంగ్ ఇండియాకు బీజింగ్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా ప్రచారకర్తగా నియమితులయ్యారు. తన కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ (సిఇ) వ్యాపార ప్రచారకర్తగా ఒలింపిక్‌ బంగారు పతకం విజేత అభినవ్‌ బింద్రాను నియమించున్నట్టు శామ్‌సంగ్‌ నైరుతి ఆసియా హెడ్‌క్వార్టర్స్‌ ప్రెసిడెంట్‌, సిఇఒ హెచ్‌.బి.లీ న్యూఢిల్లీలో వెల్లడించారు. నాణ్యతతో కూడిన నూతన వస్తు ఉత్పత్తులకు, అద్భుతమైన పనితీరుకు శామ్‌సంగ్‌ పెట్టింది పేరని ఆయన ఈ సందర్భంగా అన్నారు. చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో షూటింగ్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా స్వర్ణ పతకం సాధించిన విషయం తెల్సిందే. దీంతో అభినవ్ ఒక్కసారి భారత ప్రజల గుండెల్లో హీరోగా మారారు. అలాగే పలు ప్రచార సంస్థలు తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా నియమించుకుంటున్నాయి. సంబంధిత వార్తలు
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV e-కామర్స్: కన్నం వేయకుండానే.. దోచేయొచ్చు! పాత నోట్ల రద్దుతో క్రెడిట్, డెబిట్ కార్డులను ఎక్కడిపడితే అక్కడ వినియోగిస్తున్నారా? అయితే, జాగ్రత్త సైబర్ దొంగలు పొంచివున్నారు. వారి బారిన పడకుండా ఉండాలంటే వీలైనంత వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయడం మేలు... TNN | Updated: Nov 25, 2016, 07:20PM IST పాత నోట్ల రద్దు తర్వాత.. చాలా మంది ఈ-పేమెంట్, ఈ-బ్యాంకింగ్, ఈ-కామర్స్ అంటూ ఊదరగొట్టేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే.. ఆన్‌లైన్ చెల్లింపులు, లావాదేవీల కోసం ఏకంగా ఉచిత మొబైళ్లను అందిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే, ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్లలో జరుగుతున్న మోసాలు, నేరాలపై మాత్రం ఎవరూ నోరు మెదపడం లేదు. మోదీ నిర్ణయం.. నల్ల కుభేరులపై ప్రభావం చూపుతుందో లేదో తెలియదు గానీ, వైట్ కాలర్ నేరగాళ్లకు మాత్రం ‘ఈ-వాలెట్’ నిండిపోతోంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత సైబర్ నేరగాళ్లు.. డెబిట్, క్రెడిట్ కార్డుల చెల్లింపులపై కన్నేశారు. ఖాతాదారుడు అప్రమత్తంగా లేకుంటే అకౌంట్లో మనీని మాయం చేసేస్తారు. బ్యాంకులు ఏం చేస్తున్నాయ్?: 2005 నుంచి ఈ-కామర్స్ ఊపందుకుంది. బ్యాంకులు పోటా పోటీగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులతో ఆర్థిక లావాదేవీల చెల్లింపులను ప్రోత్సహించడం మొదలుపెట్టాయి. అయితే, వాటి భద్రతను మాత్రం గాలికి వదిలేశాయి. RBI చొరవతో క్రెడిట్/డెబిట్ కార్డుల చెల్లింపుల్లో ‘పాస్‌వర్డ్’ను తప్పనిసరి చేయడం వల్ల నేరాలు కాస్త అదుపులోకి వచ్చినా.. కేటుగాళ్లు ప్రత్యామ్నయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ ఫ్రాడ్‌గాళ్ల వలలో ఖాతాదారులు చిక్కుకోకుండా చర్యలు చేపట్టాలని 2006లోనే RBI బ్యాంకులకు సూచించింది. అయితే, బ్యాంకులు ఈ విషయంలో శ్రద్ధ పెట్టడం లేదు. ఇందుకు 2013 నుంచి 2016 మధ్య నమోదైన కేసులే నిదర్శనం. ఇంటర్నెట్ బ్యాంకింగే బెటర్!: 2013-16 మధ్య చోటు చేసుకున్న ఆన్‌లైన్ నేరాలపై ఆర్థిక పరిశోధన మంత్రిత్వ శాఖ గణంకాలను పరిశీలిస్తే.. క్రెడిట్ కార్డు ఫ్రాడ్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 42,324 కేసుల్లో.. 30,048 కేసులు క్రెడిట్ కార్డులకు సంబంధించినవే కావడం గమనార్హం. మిగతా 11,718 డెబిట్ కార్డు నేరాలు. అయితే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఒక్కటే ‘కార్డు’ల కంటే మేలు అనిపిస్తోంది. మూడేళ్ల వ్యవధిలో 558 కేసులు మాత్రమే నెట్ బ్యాంకింగ్‌ నేరాల ఖాతాలో ఉన్నాయి. ఇటీవల డెబిట్ కార్డు నేరాలు కూడా 71.4 శాతం పెరిగాయి. దీన్నిబట్టి.. కార్డులతో లావాదేవీల కంటే.. ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ సేవలు అందుకోవడమే మంచిదని స్పష్టమవుతుంది. నోట్ల రద్దుతో ప్రజలు ఎలక్ట్రానిక్ పేమెంట్లకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం.. ‘ఈ’ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దేశంలోని కొన్ని కోట్ల డెబిట్/క్రెడిట్ కార్డులు ప్రమాదంలో ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ‌ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.
1entertainment
Visit Site Recommended byColombia కాగా తమిళ్‌లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ట్రెండ్ సెట్టర్ మూవీ నిలిచింది ‘96’ మూవీ. సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తమిళ్‌లోనూ ప్రేమ కుమార్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ మూవీ తెలుగు రైట్స్ నిర్మాత దిల్ రాజు ద‌క్కించుకోవడంతో రీమేక్‌కి సంబంధించిన విష‌యాలు ఇప్పటి వరకూ గోప్యంగానే ఉంచారు. కాగా రిప‌బ్లిక్ డేని పుర‌స్క‌రించుకొని 96 రీమేక్‌పై క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. Happy to announce our Production No. 34 starring Sharwanand and @Samanthaprabhu2. Directed by C. Prem Kumar. Shoot… https://t.co/tZkhtfgFdM — Sri Venkateswara Creations (@SVC_official) 1548484330000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
bollywood actor akshay kumar starrer housefull 4 first day collections has rock solid numbber despite bad reviews సినిమా దరిద్రం.. కలెక్షన్లు అద్భుతం! అక్షయ్ కుమార్ నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాయి. సినిమా దరిద్రంగా ఉందని సినీ విశ్లేషకులు, నెటిజన్లు రివ్యూలు ఇచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. Samayam Telugu | Updated: Oct 26, 2019, 12:41PM IST హౌస్‌ఫుల్ 4 బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ లక్ బాగుంది. అందుకే ఆయన నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాకు బ్యాడ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న విడుదలైన హౌస్‌ఫుల్ 4 సినిమా దేశవ్యాప్తంగా రూ.18.85 కోట్ల వసూళ్లు రాబట్టింది. హౌస్‌ఫుల్ ఫ్రాంచైస్‌లో వచ్చిన అన్ని సినిమాలు హిట్టయ్యాయి కానీ ఈ సినిమా తొలిరోజు రాబట్టిన వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయాయి. ఈ సినిమాకు చేసిన భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే సినిమా చాలా చెత్తగా ఉందని రివ్యూలు వచ్చాయి. Visit Site Recommended byColombia ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ సినిమాకు ఒక స్టార్ మాత్రమే ఇచ్చారు. డైరెక్షన్, యాక్టింగ్, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ ఏవీ బాలేవని అన్నారు. ఈ సినిమా తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపారు. ఆయనతో పాటు మరికొందరు సినీ విశ్లేషకులు కూడా ఇదే విధంగా ట్వీట్లు చేశారు. ఇక కొందరు నెటిజన్లైతే ఈ చెత్త సినిమాకు వెళ్లి అనవసరంగా తమ డబ్బు వేస్ట్ చేసుకున్నామని, డబ్బు తిరిగిచ్చేయాలంటూ కామెంట్లు పెట్టారు. బలవంతంగా నవ్వించడానికి కామెడీ చేసినట్లు ఉందని, నవ్వులు రాకపోగా బోర్ కొట్టిందని అభిప్రాయపడ్డారు. తొలిరోజు కాబట్టి సినిమాకు రూ18 కోట్లు వచ్చినట్లున్నాయ్. ఈ వారం రోజుల పాటు కలెక్షన్లు ఇదే జోరు మీదుంటే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. లేకపోతే అక్షయ్‌కు దీపావళి కానుకగా విడుదల చేసిన సినిమా తీవ్ర నిరాశనే మిగులుస్తుంది. ఇందులో రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్ మరో కథానాయకులుగా నటించారు. READ ALSO: స్విమ్మింగ్ పూల్‌లో కరిష్మా.. బికినీలో బోల్డ్‌గా! వీరికి జోడీగా కృతి సనన్, కృతి కర్బంద, పూజా హెగ్దే నటించారు. ఫర్హాద్ సంఝీ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కథ రాసింది ఫర్హాదే. అసలైతే సినిమాను సాజిద్ ఖాన్ డైరెక్ట్ చేయాలి. కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే సాజిద్‌పై ఇద్దరు నటీమణులు లైంగిక ఆరోపణలు చేశారు. దాంతో సాజిద్ ఉంటే తాను సినిమా చేయనని అక్షయ్ తెలిపారు. దాంతో సాజిదే అవమానంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక చేసేదేంలేక కథ రాసిన ఫర్హాద్ సంఝీనే డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. బహుశా సాజిద్ డైరెక్ట్ చేసుంటే సినిమా బాగా వచ్చుండేదేమో. డైరెక్టర్ క్రెడిట్స్‌లో ఆయన పేరు పడకపోవడం మంచిదే అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
0business
అఖిల్ కోసం రంగంలోకి దిగిన వర్మ Highlights అఖిల్ కోసం రంగంలోకి దిగిన వర్మ   విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగులు మార్చడంలో ఊసరవెల్లి ని మించిపోయాడని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన చేస్తోన్న ట్వీట్ లలో చాలా వరకు తెలియని ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. పైకి మనసు బండరాయి అనేట్లు కనిపిస్తాడు గాని సున్నితమైన ఫీలింగ్స్ అతనికి కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఆ విషయాన్ని పక్కనబెడితే.. వర్మ కరెక్ట్ గా ఒక కాన్సెప్ట్ సెట్ చేసుకున్నాడు అంటే చాలు ఆ కథకు తగ్గట్టు పాత్రలను సెట్ చేసుకుంటాడు.  చాలా కాలం తరువాత నాగ్ లాంటి స్టార్ హీరోతో జాతకట్టిన వర్మ ఆఫీసర్ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తరువాత ఆయన తనయుడితో కూడా ఓ సినిమా ప్లాన్ చేసినట్లు చెప్పేశాడు. అఖిల్ రీసెంట్ గా తన మూడవ సినిమా ను లాంచ్ చేశాడు. తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఆ తరువాత అఖిల్ నాలుగవ సినిమాని వర్మ డైరెక్ట్ చేస్తున్నట్లు చెప్పేశాడు. దీంతో అందరు షాక్ అయ్యారు. అఖిల్ కెరీర్ తో ఆటలు అవసరమా అనే తరహాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలే అఖిల్ కమర్షియల్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇలాంటి సమయంలో మరో డిజాస్టర్ అందితే కెరీర్ కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. కానీ నాగ్ మాత్రం వర్మను గట్టిగా నమ్మేశాడు. అప్పట్లో నేను డైరెక్ట్ చేసిన శివ సినిమాని నాగ్ నిర్మించాడు. 25 ఏళ్ల తరువాత నేను నాగ్ తో ఆఫీసర్ సినిమా నిర్మిస్తున్నాను. ఇక ఫైనల్ గా అఖిల్ నాలుగవ సినిమాను నాగ్ నిర్మిస్తుండగా నేను డైరెక్ట్ చేస్తున్నాను అని వర్మ ట్వీట్ చేశాడు. ఏమయ్యా వర్మా.. ఇలా అఖిల్ కెరియర్ తో ఆటల ఏలయ్యా? మరి కుర్రాడికి ఫ్లాపు మాత్రం ఇవ్వకు సామీ!!
0business
సరిహద్దుల్లో చెక్‌పోస్టులకు మంగళం - జీఎస్టీ ఈ-వే బిల్లు విధానానికి కౌన్సిల్‌ సూత్రప్రాయంగా సమ్మతి - రూ.50,000 దాటిన సరుకులకు'కొత్త' బిల్లులు - ఎలక్ట్రానిక్‌ రూపంలోనే పన్ను చెల్లింపుల సమీక్ష - 19 రకాల సేవలపై కరుణ చూపిన కౌన్సిల్‌ - పన్ను శ్లాబ్‌లను హేతుబద్దీకరిస్తూ నిర్ణయం - జీఎస్టీ ఫలాలు ప్రజలకందించాలి: అరుణ్‌ జైట్లీ - సమీక్షకు గాను ప్రత్యేకంగా రాష్ట్రాల్లో కమిటీలు - వచ్చే నెల 9న హైదరాబాద్‌లో తదుపరి మీట్‌ న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చిన 'వస్తు సేవల పన్ను' (జీఎస్టీ) అమలు తీరును సమీక్షించేందుకుగాను జీఎస్టీ కౌన్సిల్‌ శనివారం ఇక్కడ సమావేశమైంది. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సారథ్యంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు సభ్యులుగా సాగిన 20వ కౌన్సిల్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ-వే బిల్లు విధివిధానాలకు కౌన్సిల్‌ ఈ సమావేశంలో సమ్మతి తెలిపింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. రూ.50వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను సరఫరాకు పంపేందుకు ముందుగానే ఉత్పత్తిదారు లేదా సరఫరాదారు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసి ఈ-వే బిల్లును పొందాల్సి ఉంటుందని అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. వీటిని ఎలక్ట్రానిక్‌ రూపంలో తీసుకురానున్నట్లుగా చెప్పారు. అయితే మినహాయించిన గూడ్స్‌కు ఈ-వే బిల్లు అవసరం లేదని తెలిపారు. త్వరలోనే ఈ-వే బిల్లు విధివిధానాలను నోటిఫై చేయనున్నట్టుగా తెలిపారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అక్టోబరు 1 నుంచి దీనిని అమలులోకి తీసుకు వచ్చేందుకు కౌన్సిల్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఈ-వే బిల్లు విధానం తనిఖీనకు ఎలాంటి చెక్‌పోస్టులు అవసరం లేదని, కేవలం టెక్నాలజీతోనే వీటి పర్యవేక్షణను అమలు చేయనున్నట్టు జైట్లీ తెలిపారు. దీంతో రాష్ట్ర సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టులను ఎత్తివేసేందుకు మార్గం సుగమకానుంది. పలు రకాల సేవలపై పన్ను తగ్గింపు.. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పలు రకాల సేవలపై పన్ను భారాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో వస్త్రాల జాబ్‌వర్క్‌, ప్రభుత్వ కాంట్రాక్టులతో పాటు ట్రాక్టర్‌ విడిభాగాలపై పన్నును తగ్గించారు. ట్రాక్టర్‌ విడిభాగాలు, 20 అంగుళాల కంప్యూటర్‌ మానిటర్లపై ఉన్న 28 శాతం జీఎస్టీ పన్నురేట్లను 18 శాతానికి.. వర్క్‌ కాంట్రాక్ట్స్‌లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించినట్టు అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. వస్త్రాల జాబ్‌వర్క్‌పై పన్ను భారాన్ని 18 శాతం నుంచి 5 శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రచురణ సంస్థ తమ సొంత న్యూస్‌పేపర్లు, పుస్తకాలను ముద్రించుకుంటే 5 శాతం జీఎస్టీ, ఇతర సంస్థల ప్రచురణలను ప్రచురిస్తే 12 శాతం పన్నును చెల్లించాలని కౌన్సిల్‌లో తీర్మానించారు. పంట చేతికొచ్చాక చేపట్టే వ్యవసాయాధారిత సేవలపై కూడా కౌన్సిల్‌ కరుణ చూపింది. ధాన్యం నిల్వ చేయడంతో పాటుల పలు సేవలపై ఉన్న 18 శాతం పన్ను భారాన్ని 12 శాతానికి తగ్గించారు. దీనికి తోడు క్యాబ్‌ సేవలు, ప్లానిటోరియం ప్రవేశ రుసుములపై ఉన్న పన్ను భారాన్ని కూడా ఈ సమావేశంలో తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కఠిన చర్యలు తప్పవు దేశంలో కొత్త అందుబాటులోకి వచ్చిన వస్తుసేవల పన్ను వల్ల వివిధ రూపాల్లో కలిగే ప్రయోజనాల్ని దేశ ప్రజలకు బదిలీ చేయాలని జైట్లీ రాష్ట్రాలను కోరారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇలా చేయని సంస్థలపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టుగా ఆయన హెచ్చరించారు. ఇప్పటి వరకు 71 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులు జీఎస్టీలోకి మరలారని, కొత్తగా 15.67 లక్షల దరఖాస్తులు అందినట్టు తెలిపారు. కానీ వాటిలో 12 లక్షలకు మాత్రమే ఆమోదం తెలిపినట్టు చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్‌ తదుపరి సమావేశం వచ్చే నెల 9న హైదరాబాద్‌లో జరగనున్నట్లుగా జైట్లీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం తరఫున పాల్గొన్న ఐటీ మంత్రి తారకరామారావు పలు అంశాలను చర్చకు తీసుకు వచ్చారు. తమకు న్యాయం జరగపోతే కోర్టును ఆశ్రయించడానకి వెనకాడబోమని ఆయన తెలిపినట్టుగా సమాచారం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 6, Aug 2019, 3:12 PM IST Highlights కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ చాలా రోజుల తరువాత ఒక ప్రయోగాత్మక కథతో రెడీ అయ్యాడు. మొన్నటివరకు కమర్షియల్ సినిమాలు చేసిన అజిత్ శ్రేదేవి కోరిక ప్రకారం బోణి కపూర్ ప్రొడక్షన్ లో ఒక సినిమాను చేశాడు. పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన 'నెర్కొండ పార్వాయ్' ఈ నెల 8న రిలీజ్ కాబోతోంది.    కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ చాలా రోజుల తరువాత ఒక ప్రయోగాత్మక కథతో రెడీ అయ్యాడు. మొన్నటివరకు కమర్షియల్ సినిమాలు చేసిన అజిత్ శ్రేదేవి కోరిక ప్రకారం బోణి కపూర్ ప్రొడక్షన్ లో ఒక సినిమాను చేశాడు. పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన 'నెర్కొండ పార్వాయ్' ఈ నెల 8న రిలీజ్ కాబోతోంది.  ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్బంగా బోణి కపూర్ శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.  అజిత్ తో ఒక సినిమాను నిర్మించాలని శ్రీదేవి ఎప్పటి నుంచో నాతో చెబుతూ వస్తోంది. మామ్ సినిమాలో అజిత్ గెస్ట్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే  అజిత్ తో సినిమాని నిర్మించాలని బలంగా కోరుకుందని చెప్పారు.  అజిత్ సహకారంతో శ్రీదేవి కోరిక ఇప్పుడు నెరవేరుతోందని వరల్డ్ వైడ్ గా నెర్కొండ పార్వాయ్' గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్లు బోణి కపూర్ పేర్కొన్నారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన నెర్కొండ పార్వాయ్ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అజిత్ తో బోణి కపూర్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మరో బారి బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.  Last Updated 6, Aug 2019, 3:12 PM IST
0business
Hyderabad, First Published 22, Oct 2018, 2:23 PM IST Highlights రేపు ప్రభాస్ తన 39వ పుట్టినరోజును జరుపుకోనున్నాడు. ఈ సందర్బంగా సాహో టీమ్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేస్తోంది.  బాహుబలి సినిమాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ సాహూతో నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టడానికి సన్నద్ధమవుతున్నాడు. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సినిమా తెలుగుతో పాటు హిందీ తమిళ్ లో కూడా రూపొందుతున్న సంగతి తెలిసిందే.  అయితే రేపు ప్రభాస్ తన 39వ పుట్టినరోజును జరుపుకోనున్నాడు. ఈ సందర్బంగా సాహో టీమ్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేస్తోంది. నేడు సాయంత్రం 4గంటలకు ఒక కొత్త పోస్టర్ ని విడుదల చేయనున్నారు. ఇక రేపు సాహో మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.  ప్రభాస్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కు ఎలాగైనా డబుల్ బొనాంజా ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లానింగ్ లో ఉన్నట్లు టాక్.  సాహోలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోయే లవ్ స్టోరీని రీసెంట్ గా ప్రభాస్ ఇటలీలో స్టార్ట్ చేశాడు. ఆ సినిమాను కూడా రెబల్ స్టార్ వీలైనంత త్వరగా ఫినిష్ చెయ్యాలని కష్టపడుతున్నాడు. Last Updated 22, Oct 2018, 2:26 PM IST
0business
Visit Site Recommended byColombia ఐపీఎల్ 2018 సీజన్ ముంగిట మహ్మద్ షమీపై వరకట్నం వేధింపులు, గృహ హింస‌ కేసులు పెట్టిన హసీన్ జహాన్.. ఆదివారం రాత్రి అతడి ఇంటిలోకి ప్రవేశించి.. అక్కడ షమీ తల్లితో గొడవపడింది. దీంతో.. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జహాన్‌‌‌ని అరెస్టు చేశారు. గత ఏడాది షమీపై కేసులు పెట్టడంతో పాటు అక్రమ సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా జహాన్ చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2019 సీజన్‌‌లో ప్రస్తుతం ఆడుతున్న మహ్మద్ షమీ.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజా సీజన్‌లో ఇప్పటికే 11 మ్యాచ్‌లాడిన ఈ ఫాస్ట్ బౌలర్ 14 వికెట్లు పడగొట్టగా.. సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన పంజాబ్ ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి..! In Videos: Mohammad Shami: మహ్మద్ షమీ భార్య అరెస్ట్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV లోకనాయకుడి భార్యగా శివగామి? శివగామిగా రమ్యకృష్ణ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. TNN | Updated: Feb 4, 2016, 10:06AM IST లోకనాయకుడి భార్యగా శివగామి? శివగామిగా రమ్యకృష్ణ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ ... అందరి ఫేవరేట్ నటుడు. వీరిద్దరూ కలిసి పంచతంత్ర అనే సినిమలో నటించారు. అయితే అందులో కమల్ భార్యగా సిమ్రాన్ నటించినప్పటికీ, రమ్యకృష్ణది కూడా ప్రధానమైన పాత్రే. ఇప్పుడు కమల్‌ది ఓ కొత్త సినిమా ప్రారంభమవ్వబోతోంది. అందులో లోకనాయకుడి భార్యగా శివగామి నటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కమల్ నుంచి రమ్యకు పిలుపు వచ్చినట్టు సమాచారం. ఈ చిత్రానికి మళయాళ దర్శకుడు టీకే రాజీవ్ కుమార్ పనిచేస్తున్నారు. కాగా ఈ సినిమాలో మరో అద్భుతం కూడా చోటు చేసుకోబోతోంది. కమల కూతురుగా శ్రుతి హాసన్ నటించబోతోంది. ఎప్పటి నుంచో తండ్రీ కూతుళ్లు కలిసి నటించాలని అనుకుంటున్నారు. ఆ కోరిక ఈ సినిమాతో తీరనుంది. ఇళయారాజా ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. షూటింగ్ మొత్తం అమెరికాలో చేయనున్నారు. అయితే రమ్య ఇంకా ఈ సినిమాకు ఓకే చెప్పిలేదు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
అంతకంతకు పెరుగుతున్న ఎగవేతదారులు! బ్యాంకులో ఖాతాదారు: 'అయ్యా.. నాకు బ్యాంక్‌ రుణం కావాలి సార్‌' బ్యాంకు అధికారి: 'అలాగే.. సరేగాని మీకు ఎలాంటి లోన్‌ కావాలి' ఖాతాదారు: 'అదే సార్‌.. కింగ్‌ఫిషర్‌ విజరు మాల్యాకు ఇచ్చారే.. పెద్దగా పూచీకత్తులు లేకుండా కొట్లాది రూపాయల నగదు ఇచ్చి.. వాటిని చెల్లించకుండానే హుందాగా ఎగవేసే రుణం ఇవ్వండి సార్‌' బ్యాంక్‌ అధికారి: ఇది గత పది రోజులుగా ఫేస్‌బుక్‌లోనూ.. వాట్సాప్‌లోనూ బాగా చెక్కర్లు కొడుతూ అందరినీ నవ్విస్తున్న జోక్‌ ఇది.. అయితే భయటకు పొక్కింది కాబట్టి మాల్యా ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులను ముంచిన అతిపెద్ద ఎగవేతదారుగా లోకానికి కనిపిస్తున్నాడు. వాస్తవాలను తరచి చూస్తే.. మాల్యా లాంటి బడా ఎగవేతదారులు దాదాపు 5,275 మంది ఉన్నారట. వీరు సుమారు రూ.56,521 కోట్ల మేర రుణాలను సర్కారు బ్యాంకులకు ఎగనామం పెట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి. 'క్రెడిట్‌ ఇన్ఫర్‌మేషన్‌ బ్యూరో (ఇండియా)' (సిబిల్‌) వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మేరకు వీరి సంఖ్య ఏ ఏడాది కాయేడాది పెరుగుతూ పోతోంది. గత 13 ఏండ్లలో బ్యాంకులకు రుణాలను చెల్లించే హోదా ఉన్నా కూడా కావాలని వాటిని చెల్లించని ఎగవేతదారుల సంఖ్య దాదాపు 9 రెట్లు పెరిగిందట. ఈ మొత్తం ఇటీవలి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి వ్యవసాయం, అన్నదాతల సంక్షేమానికి కేటాయించిన దాని కంటే కూడా దాదాపు 1.5 రెట్లు అధికం. 'ఇండియా స్పెండ్‌' సంస్థ 'సిబిల్‌ ' వద్ద ఉన్న సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించింది. 'ఇండియాస్పెండ్‌' వద్ద ఉన్న సిబిల్‌ సమాచారం మేరకు మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ కావాలని రుణాలను కట్టని ఎగవేత దారుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. అతిపెద్ద ఎగవేతదారులు వీరే.. సిబిల్‌ వద్ద ఉన్న సమాచారం మన దేశంలో కావాలని రుణాలను చెల్లించని ఎగవేతదారులలో ముంబయి కేంద్రంగా ఉన్న 'విన్‌సమ్‌ డైమండ్స్‌ అండ్‌ జ్యువెల్లరీ' దాని అనుబంధ సంస్థ 'ఫర్‌ ఎవర్‌ ప్రీషియస్‌ జ్యువెల్లరీ అండ్‌ డైమండ్స్‌' సంస్థలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా దాదాపు రూ.3,263 కోట్ల మేర అప్పులు బాకీపడి ఉన్నాయి. తరువాత స్థానాల్లో ఇండోర్‌కు చెందిన స్థిరాస్తి సంస్థ 'జూమ్‌ డెవలపర్స్‌' (రూ.1647 కోట్లు),కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్‌్‌స రూ.1,200 కోట్లు, ముంబయికి చెందిన 'బీటా న్యాఫ్‌థోల్‌' (రూ.951 కోట్లు), కాన్పూరుకు చెంది 'రజా టెక్స్‌టైల్స్‌' (694 కోట్లు) ఉన్నాయి. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ పేరుతోనే కాకుండా దానికి అనుబంధంగా మాల్యా తీసుకున్న మొత్తం అప్పులు కలిపితే ఆయన ఎగవేసిన మొత్తం దాదాపు రూ.7000 కోట్లుకు చేరిన విషయం తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Jun 08,2018 కొనసాగిన స్టాక్‌ మార్కెట్ల జోష్‌ ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ జోష్‌ను కనబరిచాయి. ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ సంకే తాలు, మేటి వాతావరణ అంచనాలు నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం పరుగులు తీశాయి. ఇన్వెస్టర్లు ఉత్సాహంగా కొనుగోళ్లకు మొగ్గు చూపారు. కొనుగోళ్ల అండతో గురువారం ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 150 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన ఎన్‌ఎస్‌ఈ సెన్సెక్స్‌ కాసేపటికే భారీ లాభాల దిశగా దూసుకెళ్లింది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. అటు నిఫ్టీ కూడా 10,800 మైలురాయిని తాకింది. దాదాపు అన్ని రంగాల్లోనే కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రియల్టీ, మెటల్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌, ఐటీ బాగా లాభపడ్డాయి. దీంతో మార్కెట్‌సూచీలు లాభాల్లో పరుగులు తీశాయి. చివరి గంటలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్ల భారీ లాభాలు పతనమయ్యాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 284 పాయింట్లు ఎగబాకి 35,463 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 10,768 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.05 దరిదాపుల్లో నిలిచింది. ఐసీఐసీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, బ్రిటానియా, యునైటెడ్‌ బ్రూవరీస్‌ అత్యధికంగా లాభాలను అందుకున్నాయి. టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఐబీ హౌసింగ్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, యూపీఎల్‌, ఆర్‌ఐఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ లాభాల్లో నిలిచాయి. మరోవైపు టైటాన్‌, ఐషర్‌ మోటార్స్‌, బ్లూ డార్ట్‌ ఐషర్‌ టాప్‌లూజర్‌గా ఉన్నాయి. ఇంకా ఇండస్‌ఇండ్‌, కోల్‌ ఇండియా, లుపిన్‌ స్వల్పంగా నష్టపోయాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV షాపింగ్ మాల్ అవనున్న ఫేమస్ ఫిలిం స్టూడియో హైదరాబాద్ సిటీలోని పాతగుర్తులు చెరిగిపోతున్నాయి. సిటీలోని కొన్ని ప్రాంతాలకి ల్యాండ్ మార్కులుగా... | Updated: Oct 14, 2016, 03:59PM IST హైదరాబాద్ సిటీలోని పాతగుర్తులు చెరిగిపోతున్నాయి. సిటీలోని కొన్ని ప్రాంతాలకి ల్యాండ్ మార్కులుగా వున్న కొన్ని నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలు , థియేటర్లు ఇప్పటికే కనుమరుగై వాటి స్థానంలో కొత్త కొత్త షాపింగ్ కాంప్లెక్సులు, థియేటర్లు, హోటళ్లు వచ్చి చేరాయి. అలా తన పాత ఉనికిని కోల్పోయి... కొంగొత్త హంగులు అద్దుకోనున్న వాటిలో ఇకపై శ్రీ సారధి స్టూడియోస్ కూడా చేరిపోనుంది. తెలుగు సినీ, టీవీ పరిశ్రమతో ఎన్నో ఏళ్లుగా అనుబంధాన్ని పెనవేసుకుని వున్న ఫిలిం స్టూడియో ఇది. అమీర్‌పేటలోని మైత్రివనంకి ఎదురుగా వున్న ఈ సినీ స్టూడియోలో ఇప్పటివరకు లెక్కలేనన్ని చిత్రాలు, టీవీ ప్రోగ్రామ్స్, సీరియళ్లు ఎన్నో షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. అయితే, ఇప్పటివరకు కేవలం షూటింగులకే పరిమితమైన శ్రీ సారధి స్టూడియో ప్రాంగణం ఇకపై అపరిమితమైన వినోదానికి వేదిక కానుందని తెలుస్తోంది. ఈ స్టూడియోలోని ఆఫీస్, మరో మూడు ఇండోర్ షూటింగ్ ఫ్లోర్స్ మినహా.. మిగతా బహిరంగ ప్రాంతంలో ఇకపై షూటింగ్స్ కి దూరం కానున్నట్టు సమాచారం. సినీవర్గాల సమాచారం ప్రకారం.. ఈ బహిరంగ ప్రాంతంలో 97,442 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఓ మల్టీప్లెక్స్, మరో హోటల్‌తో కూడిన ఓ భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కానున్నట్టు తెలుస్తోంది. ఈ కమెర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం శ్రీ సారథి స్టూడియోస్ ప్రైవేటు లిమిటెడ్ చేసుకున్న దరఖాస్తుని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధింత విభాగం వారు అనుమతులు సైతం మంజూరు చేసినట్టు టాక్. స్టూడియో ప్రాంగణంలో నిర్మాణం పనులు మొదలుపెట్టిన అనంతరం అక్కడి బహిరంగ ప్రదేశం షూటింగులకి అందుబాటులో లేకుండాపోనుంది.
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV చెర్రీ బర్త్ డే.. ఉపాసన సర్‌ప్రైజ్ విషెస్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా.. ఉపాసన అతడికి థ్రిల్లింగ్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. Samayam Telugu | Updated: Mar 27, 2018, 09:09AM IST చెర్రీ బర్త్ డే.. ఉపాసన సర్‌ప్రైజ్ విషెస్ మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానుల నుంచి ఆయనకు బర్త్ డే విషెస్ వెల్లువలా వస్తున్నాయి. రెండు రోజుల గ్యాప్‌తో రంగస్థలం విడుదల ఉండటంతో.. చెర్రీ బర్త్ డే మెగా ఫ్యాన్స్‌కు మరింత ఆనందం కలిగిస్తోంది. రంగస్థలంతో చిట్టిబాబు సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అని ఘంటాపథంగా చెబుతున్నారు. అభిమానుల సంగతి అటుంచితే ఇప్పటికే చిరంజీవి తనయుడికి ఓ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీంతో రామ్‌చరణ్ భార్య ఉపాసన ఏం గిఫ్ట్ ఇచ్చారు..? ఎలా విష్ చేశారనేది..? మెగా ఫ్యాన్స్‌కు ఆసక్తికరంగా మారింది. ఉపాసన థ్రిల్లింగ్‌గా ‘మిస్టర్ సి’కి బర్త్ డే విషెస్ చెప్పింది. చెర్రీని ముద్దుగా మిస్టర్ సి అని పిలుచుకునే ఉపాసన.. హ్యపీ బర్త్ డే మిస్టర్ సి అని ఆంగ్ల అక్షరాలతో గులాబీ, పసుపు రంగు పూలను గుమ్మం ముందు అలకరించి చెర్రీకి బర్త్ డే విషెస్ చెప్పింది. గుమ్మం ముందు రామ్ చరణ్ నిలబడగా.. బర్త్ డే విషెస్ కనిపించేలా.. ఫొటో తీసిన ఉపాసన అర్ధరాత్రి పూటే ట్వీట్ ద్వారా తన హబ్బీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. గత ఏడాది మిస్టర్ సి బర్త్ డే సందర్భంగా ఉపాసన చిరంజీవికి ఓ ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. ‘మామయ్య చిరంజీవి నాకు ఇచ్చిన అతిపెద్ద బ‌హుమ‌తి రామ్ చ‌ర‌ణ్. అత‌డితోపాటు కుటుంబం మొత్తాన్ని ఎల్ల‌వేళ‌లా సంతోషంగా ఉంచ‌డానికి ప్ర‌య‌త్నిస్తా’నని ఉపాసన మెగాస్టార్‌కి మాటిచ్చింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
pujara పుజారా మరో ఘనత ధర్మశాల: పుజారా తన అద్బుతమైన ప్రతిభతో టీమిండియా జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు.మరో ఘనతను పుజారా సాధించాడు. టెస్టుల్లో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పుజారా 1288 పరుగులు చేసి రెండవ స్థానంలో నిలిచాడు.అతడి కంటే ముందు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ పాంటింగ్‌ 1483 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.పుజారా తరువాత హెడెన్‌,గంభీర్‌,లారాలు ఉన్నారు.ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టెస్టు రెండవ రోజు టీమిం డియా బ్యాట్స్‌మెన్‌ సత్తాచాటుతున్నారు.విజ§్‌ు స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నయావాల్‌ పుజారా 134 బంతులు ఆడి 50 పరుగులు చేసి హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV 11,000 దిగువ‌కు నిఫ్టీ ఉద‌యం ఉత్సాహంగా మొద‌లైన మార్కెట్లు మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ బాగానే ఉన్నా చివ‌ర‌కు నిరుత్సాహ‌ప‌రిచాయి. Samayam Telugu | Updated: Jul 18, 2018, 04:15PM IST ఉద‌యం ఉత్సాహంగా మొద‌లైన మార్కెట్లు మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ బాగానే ఉన్నా చివ‌ర‌కు నిరుత్సాహ‌ప‌రిచాయి. పార్ల‌మెంటులో ఎన్‌డీఏ ప్ర‌భుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టింద‌న్న వార్త మార్కెట్ వ‌ర్గాల‌ను చేర‌డంతో మార్కెట్లు డీలా ప‌డ్డాయి. దీంతో కీల‌క సూచీలు రెండూ న‌ష్టాల దిశ‌గా ప‌య‌నించాయి. ఈ ప్ర‌భావంతో మార్కెట్లు ముగిసే స‌రికి సెన్సెక్స్ 146 పాయింట్లు క్షీణించి 36,373 వ‌ద్ద ముగియ‌గా, మ‌రో వైపు నిఫ్టీ 27 పాయింట్లు దిగ‌జారి 10,980 వ‌ద్ద స్థిర‌ప‌డింది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ఓఎన్‌జీసీ(2.69%), ఏసియ‌న్ పెయింట్స్(0.95%), యెస్ బ్యాంక్(0.92%), హెచ్‌డీఎఫ్‌సీ(0.91%), హీరో మోటోకార్ప్(0.63%), బ‌జాజ్ ఆటో(0.32%) లాభ‌ప‌డిన వాటిలో ముందుండ‌గా, మ‌రో వైపు టాటా స్టీల్(5.22%), వీఈడీఎల్(2.74%), యాక్సిస్ బ్యాంక్(2.57%), హిందుస్తాన్ యూనిలీవ‌ర్ లిమిటెడ్(2.37%), టాటా మోటార్స్(2.19%), ఎం అండ్ ఎం(2.05%) అత్య‌ధికంగా న‌ష్ట‌పోయాయి.
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV Kangana Ranaut: పాపం.. బాలయ్యని చూస్తే జాలేస్తోంది: కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ డైరెక్టర్ క్రెడిట్ విషయంలో క్రిష్- కంగనా రనౌత్‌ల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సినిమా మొత్తం నేను పూర్తి చేస్తే.. కంగనా వేలు పెట్టి చెడగొట్టిందని క్రిష్ ఆరోపిస్తే.. క్రిష్‌కి అంతసీన్‌లేదని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది కంగనా. Samayam Telugu | Updated: Feb 26, 2019, 03:33PM IST పుండు మీద కారం చల్లడం అంటే ఇదేనేమో. అసలే ఎన్టీఆర్ బయోపిక్ మూవీస్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల ఓటమి భారంతో ఉన్న బాలయ్య, క్రిష్‌లపై అదును చూసి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ . ఆమె లీడ్ రోల్‌లో నటించిన ‘మణికర్ణిక’ సినిమా విషయంలో డైరెక్టర్ క్రెడిట్స్ విషయంలో క్రిష్-కంగనా మధ్య జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. సినిమా మొత్తం నేను పూర్తి చేస్తే.. కంగనా వేలు పెట్టి చెడగొట్టిందని క్రిష్ ఆరోపిస్తే.. క్రిష్‌కి అంతసీన్‌లేదని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది కంగనా. ఈ ఇద్దరి మధ్య డైరెక్టర్ క్రెడిట్ విషయంలో వివాదం రంజుగానే సాగింది. ఇదిలా ఉంటే.. తాజాగా టైం చూసి ఎన్టీఆర్ మహానాయకుడు చిత్ర దర్శకుడు క్రిష్‌పై సెటైర్లు వేసింది కంగనా. ‘మణికర్ణిక చిత్ర క్రెడిట్‌ను నేను కొట్టేశానంటూ చాలా మంది నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది? మణికర్ణిక సినిమాను ఇంకా బాగా తీసేవాడిని.. కంగనా చెడగొట్టిందని క్రిష్ అన్నారు. అంత బాగా తీసే టాలెంట్ ఉన్న క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఎందుకు హిట్ చేయలేకపోయారు. ఎన్టీఆర్ బయోపిక్‌ మూవీతో దర్శకుడు క్రిష్.. బాలకృష్ణకు చాలా ద్రోహం చేశారు. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్‌కి ఒక మచ్చలా మిగిలింది. క్రిష్‌ని నమ్మినందుకు బాలయ్యను చూస్తుంటే చాలా జాలిగా ఉందంటూ సైటైర్లు వేస్తుంది కంగనా రనౌత్. పడ్డోడు ఎప్పుడూ చెడ్డోడు కాదనే నిజం కంగానాకి తెలియాలంటే.. దర్శకుడు క్రిష్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని కంగనాకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇవ్వాలనే కోరుకుందాం.
0business
aadhar 81లక్షల ఆధార్‌లను నిలిపివేశాం న్యూఢిల్లీ, ఆగస్టు 15: 81 లక్షల ఆధార్‌ నంబర్లను ప్రస్తుతం చెలామణినుంచి తొలగించినట్లు యుఐడిఎఐ వెల్లడించింది. ఆధార్‌ వెబ్‌సైట్‌ను పరిశీలించుకుని వెరిఫై ఆధార్‌నంబరును చూసుకుంటే తొలగించారా లేక కొనసాగుతున్నదా వివరాలు తెలుసుకోవచ్చు. విశిష్టగుర్తింపుప్రాధికార సంస్థ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ సహాయ మంత్రి పిపిచౌదరి ఈసమాచారం క్రపటించారు. ఇప్పటివరకూ 81 లక్షల ఆధార్‌నంబర్లను చెలామణి నుంచి నిలిపివేసినట్లు మంత్రి రాజ్య సభలోప్రకటించారు. 12అంకెల గుర్తింపుసంఖ్య తో డిజిటల్‌బయోట్రిక్‌ ఆధారిత గుర్తింపు సంఖ్యగా యుఐడిఎఐ జారీచేసిందని అన్నారు. మొత్తం 115 కోట్ల మందికి దేశంలో ఆధార్‌ జారీచేసామని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఆధార్‌ను అనేక ప్రభుత్వ లావాదేవీలకు తప్పని సరిచేసింది. ఆదాయపు పన్ను రిటర్నులు, పాన్‌ కార్డులకు అనుసంధానంచేసింది. ఆధార్‌ వెబ్‌సైట్‌లో వెరిఫై ఆధార్‌నెంబర్‌ టూల్‌ను ఏర్పాటుచేసారని వాటినుంచి తమాధార్‌ నంబరును పూరించి అమలులో ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చని మంత్రి వివరించారు. ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న ఆధార్‌నంబర్లకు తదుపరిపేజీలో ఒక సందేశం వస్తుందని, దరఖాస్తులో పూరించిన ఆధార్‌నంబరు ఆధారంగా కార్డు అమలులో ఉన్నట్లు చెపుతుంది. ఆధార్‌ తనిఖీ ప్రాసెస్‌ పూర్తిచేసిన తర్వాత ఈ టూల్‌లోనే ప్రాథమిక సమాచారం కూడా అందిస్తుందని, వయసు, దరఖాస్తుదారు మొబైల్‌ నంబరు లోని చివరి మూడు అంకెలను కూడా తెలియజేస్తూ సందేశాలు పంపిస్తుందని మంత్రి వివరించారు.
1entertainment
పూరి సినిమాలో విజయ్‌ దేవరకొండ క్యారక్టర్, స్టోరీ లైన్! First Published 9, Sep 2019, 1:53 PM IST జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ కాస్త నత్తి వున్న పాత్ర చేసి అలరించాడు. అలాగే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో చెవిటివాడి పాత్ర చేసాడు. రవితేజ ఏకంగా అంధుడి పాత్రను చేసాడు. ఇప్పుడు ఇదే బాటలోకి హీరో విజయ్ దేవరకొండ కూడా నత్తితో గమ్మత్తుగా కనిపించబోతున్నారట.     రామ్ తో చేసిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' సూపర్ హిట్ తో జోరుమీదున్నారు మాస్‌ డైరక్టర్ పూరి జగన్నాథ్‌. దాంతో ఆయన అదే ఊపుని కంటిన్యూ చేస్తూ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండతో త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రానికి టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. పూరి-విజయ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఫైటర్‌' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర సైతం చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. డాన్ కొడుకుగా..: అందుతోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ...ఓ పెద్ద మాఫియా డాన్ కుమారుడు గా కనిపించబోతున్నారు. నత్తితో బాధపడే అతన్ని తన వారసుడుగా ఎలా ప్రకటించాలో తెలియక ఆ డాన్ ఇబ్బంది పడుతూంటాడట. అయితే విజయ్ దేవరకొండ ఆ సమస్యని ఎలా అధిగమిస్తాడు...తన తండ్రికి తగ్గ వారసుడుగా ఎలా నిలదొక్కుకుంటాడు..అనేది యాక్షన్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని తెలుస్తోంది. సీనియర్ హీరో : ఇక తండ్రి పాత్రకు గానూ ఓ సీనియర్ హీరోని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో కనుక ఓకే చెయ్యకపోతే...అప్పుడు జగపతిబాబుతో సినిమా చేయనున్నారు. అయితే ఆ సీనియర్ హీరో ఎవరనేది మాత్రం బయటకు రాలేదు. ఆ హీరో కనుక ఒప్పుకుంటే కనక ఇది మల్టిస్టారర్ అవుతుంది. ఇంతకీ ఆ హీరో వెంకటేష్ అయ్యిండే అవకాసం ఉందంటున్నారు. మరో ప్రక్క బాలయ్యను కూడా ఈ క్యారక్టర్ కు అడిగే ఆలోచన ఉందట. ఆ క్యారక్టర్ కు అదిరిపోయే ప్లాష్ బ్యాక్ ఉందిట. ప్రయోగం : జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ కాస్త నత్తి వున్న పాత్ర చేసి అలరించాడు. అలాగే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో చెవిటివాడి పాత్ర చేసాడు. రవితేజ ఏకంగా అంధుడి పాత్రను చేసాడు. ఇప్పుడు ఇదే బాటలోకి హీరో విజయ్ దేవరకొండ కూడా నత్తితో గమ్మత్తుగా కనిపించబోతున్నారట. ఎప్పటినుంచి : ఇక ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. హీరోలను మాస్ యాంగిల్‌లో తెరపై ప్రెజెంట్ చేసే పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ను తీసుకుంటారని టాలీవుడ్‌లో వార్త హల్‌చల్‌ చేస్తోంది. Recent Stories
0business
స్టేడియంలో వర్షపు నీరు చేరడంతో కరెంట్‌ షాక్‌ రెజ్లర్‌ విశాల్‌ దుర్మరణం రాంచీ: జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న రెజ్లర్‌ జీవి తం అర్థాంతరంగా ముగి సింది. తాను నిత్యం ప్రాక్టీస్‌ చేసే స్టేడియంలోనే కరెంట్‌ షాక్‌తో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. ఈ సంఘటన రాంచీలోని జైపాల్‌ సింగ్‌ స్టేడియంలో మంగళవా రం చోటు చేసుకుంది. జార్ఖం డ్‌ రాష్ట్రరెజ్లింగ్‌ అసోసియే షన్‌ ఆధీనంలోని స్టేడియంలో వర్షపు నీరుచేరడం,షార్ట్‌ సర్క్యూట్‌కావడంతో ఆ నీటిలో విద్యుత్‌ ప్రవహించి 25 ఏళ్ల రెజ్లర్‌ విశాల్‌ కుమార్‌ వర్మ చనిపోయాడు. విద్యుత్‌ షాక్‌తో విశాల్‌ వర్షపు నీటిలోనే అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీన్ని గమనించిన స్టేడియం సిబ్బంది విశాల్‌ కుమార్‌ వర్మను అక్కడి వారు సర్ధార్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని రాష్ట్ర రెజ్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బోలానాథ్‌ సింగ్‌ తెలిపారు. 1978లో నిర్మించిన ఈ ఇండోర్‌ స్టేడియం వర్షం కారణంగా పూర్తిగా నిండిపోయింది. అయితే నిండా నీటిలో మునిగి ఉన్న స్టేడియం కార్యాలయంలోకి ఆయన ఎం దుకు వెళ్లాడో తెలియడంలేదని అంటున్నారు. తక్షణ సాయంగా ఆయన కుటుంబానికి రూ.లక్ష, ఆయన నలుగురుచెల్లెళ్లకూ ఉద్యోగాలు లభించేంత వరకు నెలకు రూ.10వేల పింఛను ఇవ్వాలని నిర్ణయించనట్లు జార్ఖండ్‌ రాష్ట్ర రెజ్లింగ్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ, కోచ్‌ భాలోనాథ్‌ సింగ్‌ చెప్పారు. కేంద్ర క్రీడా శాఖకూడా రూ.10లక్షలు ఇప్పించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, 2005లో తన కెరీర్‌ను ప్రారంభించిన విశాల్‌, ఇటీవలే జాతీయ సీనియర్‌ జాతీయ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్స్‌ వరకు చేరుకున్నాడు.
2sports
Suresh 82 Views Shami Arrest Issue:Court Given Stay Shami Arrest Issue:Court Given Stay కోల్‌కతా: భారత ఆటగాడు మహ్మద్‌ షమి అరెస్టుపై పశ్చి మ బెంగాల్‌లోని అలీపోర్‌ న్యాయస్థాం స్టే విధించింది. న్యా యస్థానం దాదాపు 2నెలల పాటు స్టే విధించిందని షమి తరపు న్యాయవాది సలీంరెహ్మాన్‌ తెలిపారు. ఈకేసు తదు పరి విచారణ నవంబర్‌ 2న జరుగుతుందని ఆయన పేర్కొ న్నారు. గృహ హింస కేసులో షమిపై అరెస్టు వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. వెస్టిం డీస్‌ నుంచి వచ్చి న 15 రోజుల లోపు లొంగిపో వాలని షమిని కోర్టు ఆదేశించిం ది. గత ఏడాది మార్చిలో షమిభార్య హసీన్‌జహాన్‌ అతడిపై కేసు పెట్టింది. అప్పటినుంచి షమి న్యాయస్థానం ముందు హాజరు కాలేదు. దీంతో కోర్టు అతడిపై అరెస్టు వారెంటు జారీ చేసింది. భార త్‌ తరపున షమి ఇప్పటివరకు 42 టెస్టు, 70వన్డేలు, ఏడు టీ20లు ఆడాడు. టెస్టుల్లో 153, వన్డేల్లో 131, టీ20ల్లో 8వికెట్లు పడగొట్టాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో అతడు హాట్రిక్‌తో చెలరేగిన విషయం తెలిసిందే.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV 23న 24 ముద్దులు.. హెబ్బా దాటికి అబ్బా అనాల్సిందే హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటిస్తోన్న ‘24 కిస్సెస్’ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. Samayam Telugu | Updated: Nov 4, 2018, 07:27PM IST 23న 24 ముద్దులు.. హెబ్బా దాటికి అబ్బా అనాల్సిందే నువ్వే నా బాయ్ ఫ్రెండ్.. నీతోనే నా ఫస్ట్ కిస్.. నీతోనే అన్నీ అంటూ రాజ్ తరుణ్‌‌కి హాల్స్ అవసరం లేకుండా కిస్సులో ఉన్న ఒరిజినల్ ఫ్లేవర్‌ని అందించి ‘కుమారి 21F’ చిత్రంతో సన్సేషన్ హిట్ కొట్టింది బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్ . తాజాగా తనకు కలిసొచ్చిన ఉన్న కిస్‌నే కాన్సెప్ట్‌గా మలిచి ‘24 కిస్సెస్’ అంటూ మరోసారి ముద్దుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల విడదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌లకు కిస్ లవర్స్ నుండి మంచి స్పందన రావడంతో తాజాగా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్.
0business
padmaavat star deepika padukone talks on mental wellness in wcit 2018 ఆ సమయంలో అమ్మ అండగా నిలిచింది: దీపికా పదుకోన్ మానసిక కుంగుబాటు ఓ అంటువ్యాధిలా మారుతోందని బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఆవేదన వ్యక్తంచేసింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఐటీ సదస్సులో మూడో రోజైన బుధవారం ఆమె పాల్గొంది. TNN | Updated: Feb 21, 2018, 11:32PM IST తమను తాము ఒంటరిననే భావనను దరిచేరనీయకుండా ప్రతిఒక్కరూ చూసుకోవాలని బాలీవుడ్ నటి దీపికా పదుకోణ్ తెలిపింది. మానసిక కుంగుబాటు ప్రపంచ వ్యాప్తంగా ఓ అంటువ్యాధిలా మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. భాగ్యనగర వేదికగా జరుగుతున్న ప్రపంచ ఐటీ సదస్సులో మూడో రోజైన బుధవారం (ఫిబ్రవరి 21) దీపికా పదుకోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సదస్సులో ‘మానసిక దృఢత్వం’ అంశంపై ఆమె మాట్లాడింది. అనంతరం మానసిక ఆనందంపై పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. సామాజిక చైతన్యంతోనే కుంగుబాటుకు పరిష్కారం లభిస్తుందని దీపికా పేర్కొంది. నిత్యం మనతో కలిసి ఉండేవారు ఏం చెబుతున్నారో, ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని సూచించింది. తమవాళ్లలో వస్తోన్న మార్పులేమిటో గమనిస్తూ.. చిరాకు, కుంగుబాటు లక్షణాలు గుర్తిస్తే వెంటనే అప్రమత్తమవాలని, వారికి అండగా నిలవాలని చెప్పింది.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV నాలుగో వన్డే.. స్టేడియంలో సగం సీట్లు ఖాళీ..! భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగా గురువారం జరుగుతున్న నాలుగో వన్డేకి ప్రేక్షకుల ఆదరణ కరవైంది TNN | Updated: Aug 31, 2017, 03:40PM IST భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగా గురువారం జరుగుతున్న నాలుగో వన్డేకి ప్రేక్షకుల ఆదరణ కరవైంది. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే శ్రీలంక 3-0తో వెనకబడటం, పల్లెకలె వేదికగా గత ఆదివారం ముగిసిన మూడో వన్డేలో అభిమానులు వాటర్ బాటిల్స్ మైదానంలోకి విసిరి మ్యాచ్‌కి అంతరాయం కలిగించడం తదితర అంశాలు ఈ వన్డేపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. 32వేల సీట్ల సామర్థ్యం ఉన్న కొలంబో స్టేడియం‌‌ కనీసం సగం కూడా నిండకపోవడంతో చాలా సీట్లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ వన్డేకి దాదాపు వెయ్యిమంది పోలీసుల్ని అదనంగా మొహరించారు. స్టేడియంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మైదానంలోకి వాటర్ బాటిల్స్, ఏదైనా వస్తువులను విసిరితే వెంటనే అరెస్ట్ చేస్తామని కూడా ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. అయితే.. ఈ సిరీస్‌లో శ్రీలంక ప్రదర్శనతో విసుగుచెందిన ప్రేక్షకులు మ్యాచ్‌పై ఆసక్తి కనబర్చలేదు. సగంమంది సీనియర్ ఆటగాళ్లు గాయం కారణంగా సిరీస్‌కి దూరమవగా.. జట్టులో ఉన్న క్రికెటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో మ్యాచ్‌లు చప్పగా సాగుతున్నాయి.
2sports
కొంచెం ఇబ్బందిగానే ఉంది..! - లండన్‌లోనే ఎక్కువ కాలం ఉండాల్సి వస్తోంది -  ఇష్టమైన పనికి ఎక్కువ కాలం వెచ్చించగలుగుతున్నా - వారానికి ఆరు రోజులు పని చేస్తున్నా: విజరు మాల్యా -  'ఫార్ములా 1' రేసింగ్‌లో ప్రత్యక్షం సిల్వర్‌స్టన్‌ (లండన్‌): భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు తరలిపోయిన లిక్కర్‌ డాన్‌ కింగ్‌ఫిషర్‌ విజరు మాల్యా చాలా రోజుల తరువాత బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం ఇక్కడ 'ఫార్ములా 1 బ్రిటీష్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌' రేసింగ్‌కు హాజరై అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు రేసింగ్‌ అంటే అమితమైన ఇష్టమని అన్నారు. పాస్‌పోర్టును భారత ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో లండన్‌లోనూ ఉండిపోవాల్సి వస్తోందంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రయాణాలకు దూరమై లండన్‌లోనే ఉండిపోవాల్సి రావడం వల్ల తనకు కావల్సిన పనులపై ఎక్కువగా సమయాన్ని వెచ్చించేందుకు వీలు పడుతోందని ఆయన మోటార్‌స్పోర్ట్‌.కామ్‌కు తెలియజేశారు. వారానికి ఆరు రోజులు పని చేస్తున్నాను. దీంతో కొంత ఒళ్లు చేశాను కూడా అని మాల్యా చమత్కరించారు. అయినా తాను బాగానే ఫిట్‌గానే ఉన్నానని అన్నారు. తన ప్రస్తుత జీవన పరిస్థితి గురించి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ప్రతికూల పరిస్థితులున్నంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు కదా..! అన్ని అన్నారు. ఒడిదొడుకులతో సంబంధం లేకుండా జీవితం సాగిపోవాల్సిందే కదా అంటూ నిట్టూర్చారు. బ్రిటన్‌ తనకు ఎల్లప్పుడు పుట్టినిల్లు వంటిదేనని ఆయన వ్యాఖ్యానించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రబాడ టాప్ బ్యాటింగ్ విభాగంలో.. 935 పాయింట్లతో కోహ్లీ నెం.1 స్థానంలో నిలవగా.. ఆ తర్వాత వరుసగా స్టీవ్‌స్మిత్ (910), కేన్ విలియమ్సన్ (876), జో రూట్ (807), డేవిడ్ వార్నర్ (803) టాప్-5లో నిలిచారు. Samayam Telugu | Updated: Nov 28, 2018, 06:48PM IST ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి తన నెం.1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శ్రీలంకపై ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో ఒక శతకంతో పాటు మ్యాచ్‌లను మలుపు తిప్పిన ఇన్నింగ్స్‌లు ఆడిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 807 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలవగా.. ఆ దేశ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (874 పాయింట్లు) అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయాడు. దీంతో.. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ 882 పాయింట్లతో నెం.1 స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియా డిసెంబరు 6 నుంచి భారత్ జట్టు నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడనుంది. ఈ నేపథ్యంలో.. ఐసీసీ ఈరోజు ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌ని ఓసారి పరిశీలిస్తే..!
2sports
సంచలనాలు సృష్టిస్తున్న "నేనే రాజు నేనే మంత్రి" ట్రైలర్ Highlights రామా నాయుుడు జయంతి సందర్భంగా రానా నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్ విడుదల విడుదలైన కొద్ది గంటల్లనే సంచలనాలు సృష్టిస్తున్న నేనే రాజజు నేనే మంత్రి ట్రైలర్ 24 గంటల్లోనే 4 మిలియన్ వ్యూస్ సాధించి ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెంచిన ట్రైలర్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". సురేష్ బాబు-కిరణ్ రెడ్డి-భారత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. రాణా టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పోలిటికల్ థ్రిల్లర్ లో కాజల్, కేథరీన్ లు  కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలై సంచలనం సృష్టించింది. కేవలం 24 గంటల్లోపే 4 మిలియన్ వ్యూస్ సాధించి సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచింది. నేటితో చిత్రీకరణ పూర్తి చేసుకొంది. రామోజీ ఫిలిం సిటీలో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు.    చిత్ర దర్శకులు తేజ మాట్లాడుతూ.. "రాణాలోని సరికొత్త యాంగిల్ ను "నేనే రాజు నేనే మంత్రి"లో చూస్తారు. ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ చిత్రంలో రాణా యాటిట్యూడ్ ఉంటుంది. జోగేంద్ర పాత్రలో రాణా ఒదిగిపోయిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది" అన్నారు.    చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "రాణా కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచే చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా పై మాకున్న నమ్మకం ద్విగుణీకృతం అవుతోంది. తేజ టేకింగ్ చాలా కొత్తగా ఉండబోతోంది. లక్ష్మీ భూపాల్ సంభాషణలకి థియేటర్లలో విజిల్స్ వేస్తున్నారు, ఆయన డైలాగ్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నేటితో చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి" అన్నారు.      రానా, కాజ‌ల్, అశితోష్ రాణా, కేథ‌రిన్ థెరిస్సా, న‌వ‌దీప్‌, పోసాని, జెపీ, ర‌ఘు కారుమంచి, బిత్తిరి స‌త్తి, ప్ర‌భాస్ శీను, శివాజీ రాజా, జోష్ ర‌వి, న‌వీన్ నేలి, ఫ‌న్ బ‌కెట్ మ‌హేష్ త‌దిత‌రులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.    నిర్మాణ సంస్థ‌:  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సంగీతం:  అనూప్ రూబెన్స్‌, ఛాయాగ్ర‌హణం:  వెంక‌ట్ సి.దిలీప్‌,, కూర్పు:  కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, క‌ళ‌:  నారాయ‌ణ రెడ్డి, పరుచూరి బ్రదర్స్-లక్ష్మీ భూపాల్-సురేంద్ర కృష్ణ-శంకర్-రవివర్మ, నిర్మాత‌లు:  సురేష్ బాబు, కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి, ఎగ్జిక్యూటీవ్ నిర్మాత‌లు:  అభిరామ్ ద‌గ్గుబాటి, వివేక్ కూచిబొట్ల‌, స‌మ‌ర్ప‌ణ‌:  డి. రామానాయుడు, క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  తేజ‌ Last Updated 25, Mar 2018, 11:46 PM IST
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV పవన్ వల్ల బరువెక్కిన ‘హృదయ కాలేయం’ పవన్ కారణంగా సంపూర్ణేష్ బాబు గుండె బరువెక్కింది. దేనికో తెలుసా? ఇంతకూ సంపూది ఏ ప్రాంతమనే విషయం మీకు ఐడియా ఉందా? TNN | Updated: Aug 30, 2016, 04:49PM IST పవన్ కారణంగా సంపూ గుండె బరువెక్కడం అంటే చెడు ఉద్దేశాలు వెతుక్కోకండి. తిరుపతి సభలో పవన్ ప్రసంగం విన్నాక సంపూకి కలిగిన ఫీలింగ్ ఇది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ మాట్లాడిన విధానం చూసి తెలంగాణ వాడినైన నా మనసు కూడా చలించిందంటూ సంపూర్ణేశ్ బాబు చెప్పాడు. ప్రాంతాలు, రాష్ట్రాలు వేరైనా మనమంతా తెలుగు వారమని, ఒకరి కష్టం మరొకరికి కూడా కష్టమేనని వ్యాఖ్యానించాడు. సీమాంధ్రులు బాధను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడి మీద ఉందని సంపూ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా సినీ పరిశ్రమ మీద ఈ బాధ్యత ఉందన్న సంపూ.. ప్రజలు ఇచ్చే టిక్కెట్ల డబ్బు మీద ఆధారపడే మనం బతుకుతున్నామన్నాడు. పవన్ కళ్యాణ్ చేపట్టిన ఉద్యమంలో నేను కూడా ఓ గొంతునవుతానని.. నా చేరిక వల్ల మరొకరు ధైర్యంగా ముందుకు వచ్చే అవకాశం ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. మొత్తానికి సంపూ స్పందన బాగుంది కదూ. ​అన్నట్టు ప్రత్యేక హోదా విషయంలో మాజీ ప్రధాని దేవేగౌడ కూడా పవన్‌కు మద్దుతు పలికారు. ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా కోసం ఇలానే ముందుకు వస్తే.. కేంద్రం దిగిరాక తప్పదేమో. Special status kosam poraduthubba @PawanKalyan gariki manamdharam madhathu telapaali pic.twitter.com/BQUXwqPcho
0business
Hyderabad, First Published 6, Mar 2019, 4:38 PM IST Highlights సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు 'మహర్షి' సినిమా రిలీజ్ డేట్ విషయంలో రోజుకో వార్త వినాల్సి వస్తోంది. ఏప్రిల్ 5న సినిమా విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించిన చిత్రబృందం దాన్ని కాస్త ఏప్రిల్ 25కి మార్చింది.  సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు 'మహర్షి' సినిమా రిలీజ్ డేట్ విషయంలో రోజుకో వార్త వినాల్సి వస్తోంది. ఏప్రిల్ 5న సినిమా విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించిన చిత్రబృందం దాన్ని కాస్త ఏప్రిల్ 25కి మార్చింది. ఈ డేట్ న సినిమా రావడం పక్కా అంటూ రెండు సార్లు అనౌన్స్ కూడా చేసింది. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ డేట్ మారింది. నిన్నటి నుండి ఈ సినిమా మేలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈ సినిమాను మే 9న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ని నిర్వహించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నిజానికి మహేష్ బాబుకి మే సెంటిమెంట్ ఉంది. తన సినిమాలను మేలో రిలీజ్ చేయడానికి ఇష్టపడడు. కానీ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బరువెక్కిన హృదయంతో బయటకి వస్తారంటూ, సినిమాలో ఎమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాడు దిల్ రాజు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు.  #Maharshi Releasing on May 9th — Sri Venkateswara Creations (@SVC_official) March 6, 2019 Last Updated 6, Mar 2019, 4:39 PM IST
0business
Hyderabad, First Published 1, Oct 2019, 6:01 PM IST Highlights నిర్మాతగా 'సైరా' ఓ అధ్బుతమైన ప్రయాణమని, దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులతో కలిసి పని చేయడం, 'సైరా నరసింహారెడ్డి' తీయాలనే తన తండ్రి పెద్ద కలను నిజం చేయడం.. జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలని అన్నారు. 'సైరా నరసింహారెడ్డి' సినిమా రిలీజ్ అవుతోన్న నేపధ్యంలో నిర్మాత రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. నిర్మాతగా 'సైరా' ఓ అధ్బుతమైన ప్రయాణమని, దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులతో కలిసి పని చేయడం, 'సైరా నరసింహారెడ్డి' తీయాలనే తన తండ్రి పెద్ద కలను నిజం చేయడం.. జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలని అన్నారు. సినిమా  విడుదల దగ్గరపడుతున్న కొద్దీ మనసు మొత్తం అన్ని రకాల ఎమోషన్స్ తో నిండిపోతోందని అన్నారు. టీమ్ మొత్తాన్ని ఓ కుటుంబంగా తయారు చేసిన ఈ సినిమా పూర్తి కావడం తనను బాధిస్తోందని అన్నారు. కానీ తామంతా కష్టపడి శ్రమించి తీసిన సినిమా ఎట్టకేలకు ప్రేక్షకులు చూడబోతుండడం ఎంతో సంతోషాన్నిస్తుందని అన్నారు. ప్రతీ సినిమా విడుదలకు ముందు ఉండే కంగారు, ఎగ్జైట్మెంట్ ఇప్పుడు కూడా ఉన్నాయని అన్నారు.  ఓ సినిమా ఈ స్థాయికి తీసుకురావడం అంత సులభం కాదని.. దానికి కారణమైన అభిమానులు, మీడియా, పంపిణీదారులు , మొత్తం చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పారు. దర్శకుడు సురేందర్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. సినిమా మేకింగ్ లో కీలకపాత్ర పోషించి, కొన్ని ఏళ్లుగా ఈ కథ తన తండ్రికి మాత్రమే సరిపోతుందని భావించిన వారు పరుచూరి బ్రదర్స్ అని, రత్నవేలు విజువల్స్ అధ్బుతంగా అందించారని, అమిత్ త్రివేది గొప్ప సంగీతం అందించారని చెప్పారు. 'సైరా'తో దేశంలోనే ఎంతో నైపుణ్యం ఉన్న నటులతో కలిసి పనిచేసే అద్రుష్టం తమకు దక్కిందని చెప్పారు. నటీనటులు ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు.
0business
hyderabad, First Published 6, Sep 2018, 12:54 PM IST Highlights బుల్లితెరపై పాపులారిటీ దక్కించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ షో ముందంజలో దూసుకుపోతుంది. బుల్లితెరపై పాపులారిటీ దక్కించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ షో ముందంజలో దూసుకుపోతుంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఈ షోని హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ షో 11 సీజన్లను పూర్తి చేసుకొని 12వ సీజన్ లోకి ఎంటర్ అయింది. ఈ నెల 16 నుండే ఈ షో టెలికాస్ట్ కానుంది. 'విచిత్ర జోడీస్' అనే థీమ్ తో ఈ సీజన్ నడవనుంది. అయితే ఇప్పుడు ఈ షోలో ఎవరు పాల్గొనున్నారనే విషయంలో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. తను శ్రీ దత్తా, తన సోదరితో కలిసి ఈ షోలో పాల్గొనుందని సమాచారం. అలానే కమెడియన్ భారతి తన భర్తతో కలిసి ఈ షోలో పాల్గొనడానికి వారానికి రూ.50 లక్షలు డిమాండ్ చేసిందట. ఇక తాజాగా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పేరు వినిపిస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా జీవితకాల నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్ బిగ్ బాస్ షోలో పాల్గొనున్నట్లు సమాచారం. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ లో జైలు జీవితం కూడా గడిపాడు. ఆయన ఈ షోలో పాల్గొంటే షోపై హైప్ మరింత పెరగడం ఖాయం!  Last Updated 9, Sep 2018, 2:10 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV డోపీగా తేలిన ఇంద్రజిత్ సింగ్ డోపింగ్ పరీక్షల్లో ఇప్పటికే రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పట్టుబడగా తాజాగా షాట్‌పుట్ ఆటగాడు ఇంద్రజిత్ సింగ్ కూడా డోపీగా తేలాడు. TNN | Updated: Jul 26, 2016, 10:03AM IST రియో ఒలింపిక్స్‌‌ బృందంలో సభ్యుడిగా ఉన్న షాట్‌పుట్ ఆటగాడు ఇంద్రజిత్ సింగ్ డోపీగా తేలాడు. అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు డోపింగ్ పరీక్షల్లో తేలింది. జూన్ 22న నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో ఇంద్రజిత్ పట్టుబడ్డాడు. ఇంతకు ముందు రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కూడా డోపీగా తేలగా, ఇప్పుడు ఇంద్రజిత్ కూడా డోపింగ్ పరీక్షల్లో విఫలమవడం రియో ఒలింపిక్స్ ముందు భారత్‌కు పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. హర్యానాకు చెందిన ఇంద్రజిత్ 2014 ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించాడు. డోపీగా తేలడంతో వీరిద్దరూ రియో ఒలింపిక్స్ బరిలో దిగే అవకాశాలు మూసుకుపోయాయి. అంతే కాకుండా కొత్తగా అమల్లోకి వచ్చిన వాడా కోడ్ ప్రకారం నాలుగేళ్లపాటు నిషేధం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఈ ఏడాది తొలినాళ్లలో టార్గెట్ ఒలింపిక్స్ పోడియం పథకంలో భాగంగా భారత ప్రభుత్వం ఇంద్రజిత్‌ను అమెరికా పంపి శిక్షణ ఇప్పించింది.
2sports
AIRTEL టాటాటెలీ ఎయిర్‌టెల్‌లో విలీనమా? ముంబయి, జూలై 8: టాటాగ్రూప్‌ మొబైల్‌షేవలసంస్థ టాటా టెలీసర్వీసెస్‌(మహారాష్ట్ర)ను దేశీయ మొబైల్‌ దిగ్గజంగా భావిస్తున్న భారతి ఎయిర్‌టెల్‌లో విలీనం చేస్తు న్నదన్న వార్తలు జోరందుకున్నాయి. దీనితో టాటా టెలీ సర్వీసెస్‌ స్టాక్‌ జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఇ లో ఈ కంపెనీ షేర్లు 14.4శాతం దూసుకువెళ్లి 8.35వద్ద ట్రేడింగ్‌ జరుగుతోంది. టెలికాంసేవలతో పాటు డిటిహెచ్‌ బిజినెస్‌ ను సైతం విలీనంచేసేందుక భారతీ ఎంటర్‌ప్రైజెస్‌తో టిటిఎంఎల్‌ మాతృసంస్థ టాటాగ్రూప్‌ చర్చలు నిర్వహి స్తున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. మొత్తం మూడు సంస్థలను విలీనం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఎస్‌ఇలో భారతి ఎయిర్‌టెల్‌షేర్లు 1.1శాతంపెరిగి 386 సమీపంలో ఉన్నాయి. ఇటీవల ర్యాలీబాటలో ఉన్న టాటా కమ్యూనికేషన్స్‌ ప్రస్తుతం 0.5శాతంనష్టంతో రూ.673వద్దట్రేడ్‌ అవుతోంది.
1entertainment
సుమ డాన్స్ కు బోట్ బోల్తా (వీడియో).. Highlights . సెలబ్రిటీలతో సందడి చేసే ఈ ప్రోగామ్ లో డాన్స్ చేస్తూ పడిపోయింది సుమ సీనియర్ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించే షోలలో ఈటీవీ క్యాష్ ప్రోగ్రామ్ ఒకటి. ఈ షో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. సెలబ్రిటీలతో సందడి చేసే ఈ ప్రోగామ్ లో  డాన్స్ చేస్తూ పడిపోయింది సుమ. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు ఆమె దగ్గరకు వచ్చి లేపడానికి ప్రయత్నం చేశారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి!
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV మాస్‌ మహరాజ్‌ సినిమాకు మెగా ప్రొడ్యూసర్‌ క్లాప్‌ రవితేజ, గోపిచంద్‌ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ మూవీ క్రాక్‌ గురువారం ప్రారంభమైంది. మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ తొలి షాట్‌కు క్లాప్‌ ఇవ్వగా , రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. Samayam Telugu | Updated: Nov 14, 2019, 01:16PM IST క్రాక్‌ సినిమాకు క్లాప్‌ ఇస్తున్న అల్లు అరవింద్‌ మాస్ మ‌హారాజ్‌ ర‌వితేజ 66వ చిత్రానికి `క్రాక్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. గురువారం హైద‌రాబాద్‌లో ఈ సినిమా ఘ‌నంగా ప్రారంభ‌మైంది. స‌రస్వతి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు నిర్మాత‌గా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెరకెక్కునుంది. రవితేజ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కనుంది. యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు దిల్‌రాజు, డి.సురేష్‌బాబు, ఎన్‌.వి.ప్రసాద్‌, సురేంద‌ర్ రెడ్డి, రాఘ‌వేంద్రరావు, అల్లు అర‌వింద్‌, సుధాక‌ర్ రెడ్డి, న‌వీన్ ఎర్నేని, ప‌రుచూరి బ్రద‌ర్స్‌, దాము, బీవీఎస్ఎన్ ప్రసాద్‌, రామ్ తాళ్లూరి లతో పాటు పలువరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. తొలి స‌న్నివేశానికి మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అర‌వింద్ క్లాప్ కొట్టగా, ప‌రుచూరి వెంక‌టేశ్వర‌రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. Also Read: `మాట తప్పిన తమన్నా.. ఆ పనిచేయనని చెప్పి.. చేసేసింది` ద‌ర్శకేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు తొలి షాట్‌కు గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు. దిల్‌రాజు, సురేంద‌ర్ రెడ్డిలు దర్శకుడు గోపిచంద్‌ మలినేని స్క్రిప్ట్‌ను అందించారు `డాన్‌శీను`, `బ‌లుపు` లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ క్రాక్‌. ఈ సినిమాలో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. సినిమాలో ర‌వితేజ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో హింట్‌ ఇచ్చేలా టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు చిత్రయూనిట్. సినిమా క్యారెక్టర్ ప‌రంగా ర‌వితేజ గ‌డ్డం, మెలితిప్పిన మీసాల‌తో ఉన్న డిఫ‌రెంట్ లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు. Also Read: అల వైకుంఠపురములో సాంగ్ టీజర్‌.. స్పెషల్‌ గెస్ట్స్‌ ఎవరంటే..? ఓపెనింగ్‌ సంద‌ర్భంగా దర్శకుడు గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ - `మా `క్రాక్‌` మూవీ ఓపెనింగ్‌కి వ‌చ్చిన అతిథులంద‌రికీ థ్యాంక్స్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన యథార్థ ఘ‌ట‌న‌లను ఆధారంగా చేసుకుని ఈ సినిమా ఉంటుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పించే ఇన్‌టెన్స్ క‌థ‌. ఈ నెల‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. వ‌చ్చే ఏడాది స‌మ్మర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం` అన్నారు. See Photo Story: కళ్లజోడులో కలువ కన్నుల బ్యూటీ..కన్ను గీటి శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్రఖ‌ని ప‌వ‌ర్‌ఫుల్ పాత్రల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. `మెర్సల్‌`, `బిగిల్‌` వంటి చిత్రాల‌కు సినిమాటోగ్రఫీ అందించిన జి.కె.విష్ణు ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు. Also Read: స్విమ్మింగ్‌ పూల్‌లో అందాలు ఆరబోసిన శ్రియ.. హాట్‌ వీడియోతో హల్‌చల్‌   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
internet vaartha 401 Views న్యూఢిల్లీ : భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ పాకిస్థాన్‌ అభిమాని ఉమర్‌ దర్జ్‌కు పాకిస్థాన్‌ న్యాయస్థానం బెయిల్‌ను తిరస్కరించింది.కాగా ఈ కేసులో వాదనలు తొమ్మిదిసార్లు వాయిదా పడ్డ తరువాత స్థానిక కోర్టు ఉమర్‌ బెయిల్‌ దరఖాస్తును కొట్టిపారేసింది.కోహ్లీ అభిమాని తన ఇంటి మీద భారతీయ జెండాను ఎగురవేయడంతో పాకిస్థాన్‌ పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. జనవరి 25న పాకిస్థాన్‌లోని సర్ధార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉమర్‌ను సెక్షన్‌ 123-ఎ,16 ఎంపిఓ కేసు కింద అరెస్ట్‌ చేశారు. ఆ తరువాత కొన్ని రోజులు అతన్ని రిమ్‌ాంలో ఉంచారు.అయితే లాయర్‌ అమీర్‌ అజీమ్‌ బాట్టి ఈనెల 4న ఉమర్‌ తరపున బెయిల్‌ కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేశారు.ఈ కేసుకు సంబంధించిన రికార్డు సమర్పించాలంటూ ఈనెల 6న పోలీసులకు ఆ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.కాగా మొత్తం 9 వాయిదాల తరువాత ఉమర్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించారు.ఈ కేసులో అతను పదేళ్ల శిక్షను ఎదుర్కొంటున్నాడు.
2sports
Mar 23,2016 వాహ్‌.. విటారా బ్రెజ్జా ముంబయి: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సంస్థ కొత్తగా మార్కెట్లోకి ఆవిష్కరించిన 'విటారా బ్రెజ్జా'కు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వాహన ఆవిష్కరణ జరిగిన కేవలం పక్షం రోజులలోనే దాదాపు దేశ వ్యాప్తంగా 20,000 బుకింగ్‌లు లభించినట్లు ఎంఎస్‌ఐ వెల్లడించింది. ఈ సరికొత్త వాహనాల డెలివరీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విటారా బ్రెజ్జా గురించి దాదాపు 70,000 మంది వాకబు చేశారనీ.. ఇప్పటి వరకు 20,000 బుకింగ్‌లు లభించినట్లుగా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 8న ఆవిష్కరించిన ఈ కారు ప్రారంభ ధరను కంపెనీ రూ.6.99 లక్షల నుంచి రూ.9.68 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌, న్యూఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. కేవలం డీజిల్‌ వేరియెంట్‌లోనే లభించే ఈ వాహనం తయారీకి గాను సంస్థ దాదాపు రూ.860 కోట్ల ఖర్చ చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV AB de Villiers: కోహ్లీలేని టీమిండియా.. ఇప్పుడు దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మరికొంతకాలం క్రికెట్ ఆడి ఉండాల్సిందని ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్‌స్మిత్ అభిప్రాయపడ్డాడు. వారం క్రితం Samayam Telugu | Updated: May 30, 2018, 12:52PM IST AB de Villiers: కోహ్లీలేని టీమిండియా.. ఇప్పుడు దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మరికొంతకాలం క్రికెట్ ఆడి ఉండాల్సిందని ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్‌స్మిత్ అభిప్రాయపడ్డాడు. వారం క్రితం ఎవరూ ఊహించనిరీతిలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టులో అతడు లేని లోటు పూడ్చలేనిదని.. భారత జట్టులో విరాట్ కోహ్లి లేకుంటే ఎలా ఉంటుందో.. ఇప్పుడు సఫారీ జట్టు పరిస్థితి అలా ఉందంటూ గ్రేమ్‌ స్మిత్ ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం.. 2019 ప్రపంచకప్‌ వరకైనా ఏబీ డివిలియర్స్ ఆడి ఉంటే బాగుండేదని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
2sports
రూ.1800 కోట్లను తిరిగి చెల్లించండి! - సత్యం కేసులో సెబీ తాజా ఆదేశాలు - జాబితాలో రాజు, కుటుంబ సభ్యులు, ఇతర ఎన్‌టిటీలూ 'ఫిక్స్‌' ముంబయి: ఏడేళ్ల నాటి సత్యం కుంభకోణం విషయంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మరో ఉత్తర్వులను జారీ చేసింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను నిర్వహించినందుకు గాను ప్రధాన నిందితుడు రామలింగరాజు, అతినితో సంబంధం ఉన్న అతని తల్లి, సోదరుడు, కుమారులతో సహా పది మంది అక్రమంగా కూడబెట్టిన దాదాపు రూ.1,800 కోట్లను తిరిగి చెల్లించాల్సిందిగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కోరింది. దీంతో పాటు సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజు నేరం అంగీకరించిన 2009 జనవరి 7 నుంచి అక్రమ సొమ్ముపై వడ్డీ రూపంలో ఆర్జించిన దాదాపు మరో రూ.1,500 కోట్లను కూడా తిరిగి జమ చేయాల్సిందింగా సెబీ ఆదేశాలను జారీ ఇవ్వనున్నట్లు సమాచారం. గత ఏడాది జులైలో సెబీ వెలువరించిన ఉత్తర్వుల తరువాత మార్కెట్‌ నియంత్రణ సంస్థ జారీ చేసి తాజా ఉత్తర్వులు ఇవే. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజుతో సహా నలుగురిపై సెబీ 14 సంవత్సరాల నిషేధాన్ని విధించడంతో పాటు, అక్రమంగా ఆర్జించిన దాదాపు రూ.1,849 కోట్లను తిరిగి చెల్లించాల్సిందిగా ఆదేశాలను జారీ చేసిన సంగతి విదితమే. సత్యం రాజుతో పాటు అతని సోదరుడు రామరాజు (ఎండీ, సత్యం), వడ్డమాని శ్రీనివాస్‌ (మాజీ సీఎఫ్‌ఓ), జి.రామకృష్ణ (మాజీ ఉపాధ్యక్షుడు), వీఎస్‌ ప్రభాకర గుప్త (మాజీ ఇంటర్నల్‌ ఆడిటర్‌) తదితరులును ఉద్దేశించి అప్పట్లో సదరు ఆదేశాలు జారీ అయ్యాయి. సెబీ తాజాగా విడుదల చేసిన ఆదేశాలలో రామలింగరాజుకు చెందిన వ్యక్తిగత ఆస్తులతో పాటు ఆయన ఇద్దరు సోదరులు, ప్రమోటర్ల కుటుంబానికి చెందిన కంపెనీలను ఫిక్స్‌ చేసింది. సెబీ తాజాగా జారీ చేసిన ఆదేశాలలో రాజు సోదరులకు చెందిన ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్‌ హోల్డింగ్స్‌, రాజు అతని ఇద్దరు కుమారులకు చెందిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇంజినీరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ (గతంలో మేటాస్‌) సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు సత్యం రాజు తల్లి అప్పల నర్సమ్మ, కుమారులు తేజ రాజు, రామరాజు, సోదరుడు సూర్యనారాయణ రాజు, ఆయన సతీమణి ఝాన్సీరాణి, సత్యం డైరెక్టర్‌ చింతలపాటి శ్రీనివాస్‌, అతని తండ్రి అంజిరాజు చింతలపాటి అతని చెందిన చింతలపాటి హోల్డింగ్స్‌ ఉన్నాయి. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంస్థకు సత్యం కుంభకోణంతో ఎక్కడా సంబంధం లేని కారణంగా ఆ సంస్థపై ఎలాంటి నిషేధం విధించలేదని సెబీ వివరణనిచ్చింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
Sep 29,2018 సిటిజన్స్‌ హాస్పిటల్‌లో 'మేక్‌ ఏ ప్రామిస్‌'! నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'వరల్డ్‌ హార్ట్‌ డే'ను పురస్కరించుకొని సిటిజన్స్‌ హాస్పిటల్‌ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. 'మేక్‌ ఏ ప్రామిస్‌ టూ యువర్‌ హార్ట్‌ హెల్తీ' (మీ హృదయం ఆరోగ్యం కోసం ఒక వాగ్ధానం చేయండి) అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సుధీర్‌ కోగంటి మాట్లాడుతూ వరల్డ్‌ హార్ట్‌ డేను పురస్కరించుకొని పలు మేటి ఆరోగ్యపు అలవాట్ల గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మధ్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. మానసిక ఒత్తిడికి గురి అవకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. కార్యక్రమంలో యాంకర్‌ కిషోర్‌ దాస్‌తో పాటు చంద్రోదయం హీరో వినోద్‌ నువ్వుల తదితరులు పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
READ ALSO: నేను అబ్బాయిల్ని ముద్దు పెట్టుకోను:Bigg Bossలో ప్రియాంక గాంధీ మరిది రచ్చ ‘నాకు అవకాశాలు వస్తున్నా కూడా నేనే సంతకం చేయడంలేదు. ఎందుకంటే నాకు ఇక పెళ్లి చేసుకోవాలని ఉంది. పిల్లల్ని కనాలని ఉంది. నాకంటూ ఓ కుటుంబం ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది’ అని వెల్లడించారు. అదనమాట సంగతి. మరి పూనమ్ కోరిక మేరకు ఇంట్లో వారు సంబంధాలు చూస్తున్నారో. లేకపోతే పూనమ్ మనసులో ఎవరైనా ఉన్నారో ఆమే చెప్పాలి. మరో విషయం ఏంటంటే.. త్వరలో జరగబోతున్న ప్రతిష్ఠాత్మక కర్తార్‌పూర్ కారిడర్ ఆవిష్కరణ కార్యక్రమం నిమిత్తం పూనమ్ పాకిస్థాన్ వెళ్లబోతోంది. ఈ వేడుకకు హాజరుకావాలని స్వయంగా పాకిస్థాన్ ప్రధాని పూనమ్‌ను ఆహ్వానించారట. READ ALSO: పూల బికినీలో ప్రభాస్ హీరోయిన్.. హాట్‌నెస్ ఓవర్‌లోడెడ్ ‘కర్తార్‌పూర్ కారిడార్ ఆవిష్కరణకు పాకిస్థాన్ నుంచి నాకు ఆహ్వానం అందింది. ఇందుకోసం నేను నా వీసా పనులు చూసుకుంటున్నాను. ఇది నాకు ఎంతో భావోద్వేగంతో కూడుకున్న నిర్ణయం. సిక్కులు గర్వపడే విషయం. నాకు అధికారులు అవకాశం ఇస్తే నేను ఇమ్రాన్ ఖాన్‌ను కలవాలని అనుకుంటున్నాను. 1947లో విభజన అనంతరం దర్బార్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లిన మొదటి భారతదేశ సిక్కు మహిళను నేనే’ READ ALSO: భర్తతో ‘నువ్వు నేను’ హీరోయిన్ బాత్‌టబ్ రొమాన్స్ ‘ గతేడాది వెళ్లినప్పుడు నా వీడియో కూడా వైరల్ అయింది. అలా నా గురించి పాక్‌ ప్రధానికి తెలిసింది. అందుకే కారిడర్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించారు. ఓ యాత్రికురాలిగా మాత్రమే నేను కారిడర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్నాను. నా ఆలోచనలు, ఉద్దేశం కరెక్ట్ అయినప్పుడు ఫలితం కూడా అలాగే ఉంటుంది. గతేడాది నన్ను ఇరు దేశాల మధ్య శాంతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ పాకిస్థాన్ అవార్డ్ ఇవ్వాలనుకుంది. కానీ ఆ సమయంలో పుల్వామా దాడులు జరుగుతున్నందుకు నేను వెళ్లలేకపోయాను. ఈ విషయంలో ప్రజలు నన్ను టార్గెట్ చేసినా ఫర్వాలేదు. నాకు అలవాటైపోయింది’ అని వెల్లడించారు. See Photo Story: తెలుగు తెరకు 'నమస్తే నేస్తమా' అంటోన్న బ్యూటీ   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
It’s an honour I accept with gratitude. But it’s an honour which also comes with responsibility. I’m living for the… https://t.co/PgOj2KG2fo — Gautam Gambhir (@GautamGambhir) 1548445027000 చెస్ తెలుగు క్రీడాకారిణి, 20ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న ద్రోణవల్లి హారిక‌‌కి పద్మశ్రీ దక్కగా.. సికింద్రాబాద్‌లో జన్మించి తెలంగాణలో చదువుకున్న భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రిని కూడా పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. వీరితో పాటు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించిన భారత తొలి రెజ్లర్‌గా నిలిచిన భజరంగ్ పునియా, టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్, ఆర్చరీ క్రీడాకారిణి బాంబేలా దేవి, భారత కబడ్డీ టీమ్ కెప్టెన్ అజయ్ ఠాకూర్, బాస్కెట్‌ బాల్ ప్లేయర్ ప్రతిమా సింగ్‌కి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. ఇక 1984లో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళగా రికార్డుల్లో నిలిచిన బచేంద్రి పాల్‌కి పద్మభూషన్ అవార్డు దక్కింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 21, Mar 2019, 10:50 AM IST Highlights ఐపీఎల్( ఇండియన్ ప్రీమియర్ లీగ్) 12వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్( ఇండియన్ ప్రీమియర్ లీగ్) 12వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ల కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా జట్టు పేసర్ లుంగీ ఎంగిడీ పూర్తి సీజన్‌కి దూరం అయ్యాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో అతని పక్క భాగంలో గాయం కావడంతో ఈ సిరీస్ నుంచి అతను తప్పుకుంటున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. గత సీజన్2లో జరిగిన వేలంలో సీఎస్‌కే ఎంగిడిని దక్కించుకుంది. గత సీజన్‌లో ఏడు మ్యాచులు ఆడిన ఇతను 11 వికెట్లు తీశాడు. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ లోకి అడుగుపెడుతోంది. దీంతో... జట్టుపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే.. మ్యాచ్ మొదలుకాకుండానే లుంగీ ఎంగిడీ దూరం కావడం నిరాశకు గురిచేస్తోంది.  Last Updated 21, Mar 2019, 10:50 AM IST
2sports
Hyderabad, First Published 5, Feb 2019, 9:46 AM IST Highlights విజయదేవరకొండ వరస పెట్టి సినిమాలు కమిటవ్వుతున్నారు. అయితే అంతా యంగ్ బ్యాచ్ తోనే సినిమాలు చేస్తున్నారు. కొద్దిగా స్పార్క్ కనపడినా తనతో సినిమాకు ఓకే అనేస్తున్నారు. విజయదేవరకొండ వరస పెట్టి సినిమాలు కమిటవ్వుతున్నారు. అయితే అంతా యంగ్ బ్యాచ్ తోనే సినిమాలు చేస్తున్నారు. కొద్దిగా స్పార్క్ కనపడినా తనతో సినిమాకు ఓకే అనేస్తున్నారు. అదే దేవరకొండకు పెద్ద ప్లస్ అవుతోంది. యూత్ పల్స్ ని పట్టే దర్శకులతోనే సినిమాలు చేస్తే నిలబడిపోతామనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ‘హుషారు’ దర్శకుడుకు సినిమా ఇచ్చారు. ‘హుషారు’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు శ్రీ హర్ష కొనుగంటి. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం యువత ను బాగా ఆకట్టుకుంది. ఆ విషయం తెలిసిన విజయదేవరకొండ పిలిచి మరీ ఆ సినిమా చూసి ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. దాంతో ఈ దర్శకుడి పరిస్దితి గాల్లో తేలినట్లు ఉంది. దేవరకొండ తో ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యారట. తన రెండో చిత్రాన్ని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో చేయటం అనేది గొప్ప విషయమే. ఈ సినిమా కనుక హిట్ అయితే ఇక ఆ దర్శకుడుకు తిరుగు ఉండదు. అతి త్వరలోనేఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలుబడనున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ అలాగే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమాలతో బిజీ గా వున్నాడు. ఇక హుషారు చిత్రం తమిళ , హిందీ భాషల్లో రీమేక్ కానుంది. ఈ చిత్రాలకు కూడా శ్రీ హర్ష నే డైరెక్ట్ చేయమని ఆఫర్ వచ్చిన ఆయన నో చెప్పేసి, దేవరకొండతో ముందుకు వెళ్తున్నారు.  Last Updated 5, Feb 2019, 9:46 AM IST
0business
Jun 04,2015 విజయా ఏజెన్సీస్‌ 32వ వార్షికోత్సవం హైదరాబాద్‌: వంటింటి గృహోపకరణాల సంస్థ విజయా ఏజెన్సీస్‌ 32 వార్షికోత్సవాన్ని జరుపుకుంది. హైద్రాబాద్‌లోని లియోనియా రిసార్ట్స్‌లో సోమవారం ఫ్యామిలీ మీట్‌ నిర్వహించి సంస్థ డీలర్లకు అవార్డులు ప్రదానం చేసింది. సంస్థ కోసం పనిచేసిన, 65 సంవత్సరాలు నిండిన 32 మంది డీలర్లను ఘనంగా సత్కరించింది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. 1984లో తమ సంస్థను ప్రారంభించామని, అంచెలంచెలుగా ఎదిగి ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగామని తెలిపింది. పలు స్కీంలు, లక్కీడ్రాలు నిర్వహించి గృహిణులకు మరింత దగ్గరయ్యామని తెలిపింది. త్వరలో వినియోగదారుల అభిమానాన్ని చూరగొనేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టబోతున్నామని పేర్కొంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
May 06,2015 భారత్‌కు ఆ సత్తా ఉందిొ 9శాతం ఆర్థిక వృద్ధి రేటుపై అరుణ్‌జైట్లీ బాకు: భారత్‌కు 9-10శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధించే సత్తా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. మంగళవారం ఆయన అజర్బైజాన్‌ దేశ రాజధాని బాకులో జరిగిన ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వార్షిక సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత సంవత్సర కాలంగా తాము తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా దేశ ఆర్థిక పురోగతి కనబడుతోందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి తాము పలు సంస్కరణలు చేశామన్నారు. 10 శాతం వృద్ధి కచ్చితంగా సాధిస్తామన్న నమ్మకం తనకుందన్నారు. దీనికోసం గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు, నీటి పారుదల రంగాల్లో పెట్టుబడులను పెట్టనున్నామని తెలిపారు. అవస్థాపనా రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమవుతాయని అన్నారు. దీని ప్రయోజన కరమైన ప్రభావం తయారీరంగంపై ఉంటుందని అన్నారు. ఇలా ఒక దశాబ్ధం పాటు చేస్తేనే 9-10 శాతం ఆర్థిక వృద్ధి రేటును అందుకోగలమన్నారు. పేదరికాన్నీ తగ్గించవచ్చని అన్నారు. వస్తు సేవల బిల్లు(జిఎస్‌టి)పై మాట్లాడుతూ.. దీని కోసం అన్ని పార్టీల ఏకాభిప్రాయన్ని సాధించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
sumalatha 178 Views DEEPAK , india team deepak గయానా : భారత యువ స్పీడ్‌స్టర్ దీపక్ చాహర్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తన అద్భత స్వింగ్ బౌలింగ్‌తో వెస్టిండీస్‌ను బెంబేలెత్తిచ్చిన దీపక్ చాహర్ కొత్త రికార్డు సృష్టించాడు. విండీస్‌తో జరిగిన చివరి టి20లో దీపక్ మూడు వికెట్లు పడగొట్టాడు. మూడు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి విండీస్ ఇన్నింగ్స్‌ను శాసించాడు. ఈ మ్యాచ్‌లో అతడు రికార్డును సాధించాడు. టి20లలో వెస్టిండీస్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా అత్యుత్తమ ఎకానమీ ఇచ్చిన రెండో ఆటగాడిగా దీపక్ (1.23) నిలిచాడు. భువనేశ్వర్ (1.00) తొలి స్థానంలో ఉన్నాడు. కొత్త బంతిని అందుకున్న దీపక్ వెస్టిండీస్‌పై నిప్పులు చెరిగే బంతులతో విండీస్ టాప్ ఆర్డర్ హడలెత్తించాడు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/business/
2sports
నిజజీవితంలో డైరెక్టర్లను పెళ్ళాడిన హీరోయిన్స్ First Published 8, Mar 2019, 2:41 PM IST యాక్షన్ చెబుతూ హీరోయిన్ ను డైరెక్ట్ చేసే దదర్శకులు ఎప్పుడు లవ్ లోకి దింపుతారో గాని సడన్ గా పెళ్లిచేసుకొని అభిమానులకు షాక్ ఇస్తారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆ విధంగా ఒకటైన వారు చాలా మంది ఉన్నారు. అయితే కొందరు పెళ్లి చేసుకున్నాక కొన్నాళ్లకే మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. ఇక దర్శకులను పెళ్లాడిన నటీమణుల టాప్ లిస్ట్ ఇదే..  యాక్షన్ చెబుతూ హీరోయిన్ ను డైరెక్ట్ చేసే దదర్శకులు ఎప్పుడు లవ్ లోకి దింపుతారో గాని సడన్ గా పెళ్లిచేసుకొని అభిమానులకు షాక్ ఇస్తారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆ విధంగా ఒకటైన వారు చాలా మంది ఉన్నారు. అయితే కొందరు పెళ్లి చేసుకున్నాక కొన్నాళ్లకే మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. ఇక దర్శకులను పెళ్లాడిన నటీమణుల టాప్ లిస్ట్ ఇదే.. కల్కి కోయిచ్చిన్ - అనురాగ్ కశ్యప్ (డైవర్స్) రాణి ముఖర్జీ - ఆదిత్యా చోప్రా రమ్యకృష్ణ - కృష్ణవంశీ సుహాసిని - మణిరత్నం ఉదితా గోస్వామి - మోహిత్ సూరి సోని రాజ్ ధన్ - మహేష్ భట్ దీప్తి నవెల్ - ప్రకాష్ ఝా సోనాలి బింద్రే - గోల్ది బేహి కిరణ్ జునేజా అండ్ రమేష్ సిప్పి మనసి సాల్వి - హేమంత్ ప్రభు జ్యోత్స్నా ఛండోలా - నితేష్ సింగ్ దీపికా సింగ్ - రోహిత్ రాజ్ లిస్సి - ప్రియదర్శన్ ముస్మీతా ముఖర్జీ - సుధీర్ మిశ్రా సుచిత్రా కృష్ణమూర్తి - శేఖర్ కపూర్ రాఖీ - గుల్జర్ బిండియా గోస్వామి - జెపి దత్త షెఫలి - విపుల్ షా మీనా కుమారి - కమల్ అమ్రోహీ సాధన - ఆర్కే నాయర్ బెహ్రా సుల్తానా - బీఆర్ ఇశ్రా సోనియా అగర్వాల్ - సెల్వా రాఘవన్ (డైవర్స్) అమలా పాల్ - AL విజయ్ (డైవర్స్) Recent Stories
0business
Suresh 265 Views   కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) టి20 టోర్నమెంట్‌లో పుణే జట్టుకు చీఫ్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ స్టీఫెన్‌ ప్లీమింగ్‌ను నియమిస్తూ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది.కాగా ఈ మేరకు పుణే ప్రాంచైజీ విడుదల చేసిన అధికారిక ప్రకటన వెల్లడించింది.టీమిండియా వన్డే,టి20 కెప్టెన్‌ ధోనీ సూచన మేరకు స్టీపెన్‌ ప్లెమింగ్‌ను చీఫ్‌ కోచ్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.గతంలో జరిగిన ఐపిఎల్‌ టోర్నమెంట్స్‌లో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌,చైన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు చీఫ్‌ కోచ్‌గా వ్యవహరించారు.అయితే స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో చెన్నై సూపర్‌ కింగ్స్‌,రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై రెండేళ్ల పాటు నిషేదం విధించిన సంగతి తెలిసిందే.పుణే ప్రాంచైజీ జట్టుకు ఓనర్‌ సంజ§్‌ు గోయెంకా న్యూజిలాండ్‌ కెప్టెన్‌ స్టీఫెన్‌ ప్లెమింగ్‌ ను చీఫ్‌ కోచ్‌గా నియమించడాన్ని స్వాగతించారు.భారత్‌లో అత్యంత ఖరీదైన టోర్నమెంట్‌గా పేరొందిన ఐపిఎల్‌లో చైన్నై సూపర్‌ కింగ్స్‌ను రెండు సార్లు టైటిల్‌ బరిలో నిలపడంలో ధోనీ,ఫ్లెమింగ్‌లు కీలక పాత్ర పోషించారు.కాగా ఈ ఏడాది ఐపిఎల్‌ వేలం పాటతో తొలి ఆటగాడిని ఎంచుకునే బాధ్యత పుణే జట్టుకు లభించిన సంగతి తెలిసిందే.పుణే జట్టులో అశ్విన్‌,స్టీవెన్‌స్మిత్‌ లాంటి అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు.ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభం కానుంది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కోహ్లి దోస్త్.. కేఎల్ రాహుల్‌పై వేటు పడింది..! శ్రీలంకతో జరుగుతున్న ఐదో వన్డే‌లో భారత తుది జట్టు ఎంపిక అందర్నీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ కోహ్లి ఏకంగా జట్టులో TNN | Updated: Sep 3, 2017, 03:42PM IST శ్రీలంకతో జరుగుతున్న ఐదో వన్డే‌లో భారత తుది జట్టు ఎంపిక అందర్నీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ కోహ్లి ఏకంగా జట్టులో నాలుగు మార్పులు చేశాడు. ఇందులో తన తల్లి అనారోగ్యం కారణంగా భారత్‌కి వచ్చేసిన శిఖర్ ధావన్ స్థానంలో అజింక్య రహానె వస్తాడని శనివారం రాత్రే అందరికీ తెలిసినా.. మిగిలిన మూడు మార్పులు మాత్రం ఎవరూ ఊహించనివే. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ అక్షర్ పటేల్‌ని తుది జట్టు నుంచి తప్పించిన కోహ్లి వారి స్థానంలో కేదార్ జాదవ్, భవనేశ్వర్ కుమార్, చాహల్‌కి అవకాశమిచ్చాడు. ఇందులో కేఎల్ రాహుల్‌పై వేటు పడినట్లు తెలుస్తుండగా.. మిగిలిన ఇద్దరికీ విశ్రాంతినిచ్చారు. ఐదు వన్డేల ఈ సిరీస్‌ ఆరంభం నుంచి కేఎల్ రాహుల్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. తొలి వన్డేలో బ్యాటింగ్ అవకాశం రాకపోయినా.. రెండో వన్డేలో భారత్ జట్టు కష్టాల్లో నిలిచిన దశలో అతను పేలవ షాట్‌ కోసం యత్నించి ఔటైన తీరు తీవ్ర విమర్శలకి గురి చేసింది. తర్వాత జరిగిన రెండు వన్డేల్లోనూ రాహుల్ పేలవ ఫామ్‌ని కొనసాగించాడు. దీనికి నిదర్శనమే అతను ఈ వన్డే సిరీస్‌లో చేసిన 4, 17, 7 స్కోర్లు. ఒకవైపు జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో కోహ్లి కూడా కేఎల్ రాహుల్‌పై కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతున్న ఈ ఇద్దరు గత రెండేళ్లుగా చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో కూడా కేఎల్ రాహుల్ కోసం.. తొలి టెస్టులో 80పైచిలుకు పరుగులు చేసిన అభినవ్ ముకుంద్‌పై వేటు వేసేందుకు కోహ్లి వెనుకాడలేదు.
2sports
internet vaartha 163 Views ముంబై : భారతీయ స్టేట్‌బ్యాంకు పర్యాటకరంగ సంస్థ థామస్‌కూక్‌ కంపెనీతో టైఅప్‌తో ప్రత్యేక హాలిడే సేవింగ్స్‌ఖాతాలను కస్టమర్లకు అందిస్తోంది. ఎస్‌బిఐ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ కస్టమర్లు ముందుగా థామస్‌ కూక్‌ హాలిడేను ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగానే రికరింగ్‌ డిపాజిట్‌ రూపంలో బ్యాంక్‌వద్ద పొదుపుచేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ వాయిదాల్లో కూడా చివరివరకూ కొనసాగాల్సి ఉంటుంది. థామస్‌ కూక్‌ కస్టమర్లకు ప్రత్యేక హాలిడేను చూపిస్తారు. థామస్‌కూక్‌ ఇండియా పోర్టల్‌కు వచ్చి హాలిడే ప్యాకేజ్‌ను ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్‌ఎస్‌బిఐ డాట్‌కామ్‌నుంచి రికరింగ్‌ డిపాజిట్‌ను ప్రారంభించాలి. ప్యాకేజిని మొత్తం 121 నెలల వాయిదాల్లో ఉండాలి. 13వ వాయిదాలో వడ్డీతోకూడిన థామస్‌కూక్‌ ఇడియా టాపప్‌తో ఉంటుంది. దేశీయంగాను, అంతర్జాతీయంగాను థామస్‌కూక్‌ ఈ పాకేజిలను అమలుచేస్తుంది. ఈకార్యక్రమంలో ఎస్‌బిఐ నేషనల్‌బ్యాంకింగ్‌గ్రూప్‌ ఎండి రజనీష్‌కుమార్‌, థామస్‌కూక్‌ ఇండియా సిఎండి మాధవన్‌మీనన్‌లు పాల్గొన్నారు.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఎవరా సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ? హీరోయిన్ త్రిష ఆల్రెడీ ఎవరో ఓ బాయ్ ఫ్రెండ్ ని చూసి పెట్టుకుందని సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. TNN | Updated: Jul 21, 2015, 04:15PM IST బిజినెస్ మేన్ వరుణ్ మణియన్ తో పెళ్లి క్యాన్సిల్ అయ్యాక అంతకుముందుకన్నా ఎక్కువ ఆఫర్లు అందిపుచ్చుకుంటున్న త్రిష ఆ సినిమాల్ని పూర్తిచేసి తిరిగి పర్సనల్ లైఫ్ లో సెటిలవ్వాలనే ప్రయత్నాల్లో వున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన త్రిష... వరుణ్ తో పెళ్లి క్యాన్సిల్ అయ్యిందనే బాధ తనకేమీ లేదని.. మళ్లీ ఏదో ఓ రోజు కచ్చితంగా తన పెళ్లి జరుగుతుందని చెప్పుకొచ్చింది. తనని పెళ్లి చేసుకోబోయే ఓ మంచి వ్యక్తి కచ్చితంగా దొరుకుతాడని ధీమా వ్యక్తం చేసిందామె. త్రిష మాటల్నిబట్టి చూస్తోంటే ఈసారి కాబోయే లైఫ్ పార్టనర్ విషయంలో ఆమె ఓ క్లారిటీకి వచ్చిందని, ఈసారి ఏ తేడాలు రాకుండా ఆల్రెడీ ఎవరో ఓ బాయ్ ఫ్రెండ్ ని చూసి పెట్టుకుంది కనుకే ఆమె అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతోందని చెన్నై సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అంతేకాదు, ''త్రిషా... ఎవరే అతగాడు... ఇట్టే నీ మనసుని దోచాడు'' అంటూ తమిళ పాటలు పాడుకుంటున్నారు కూడా.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV లంకలో భారత క్రికెటర్లకి ఊహించని కష్టం..! ముక్కోణపు టీ20 సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత క్రికెటర్లకి ఊహించని కష్టం ఎదురైంది. శ్రీలంకలో మత ఘర్షణలు TNN | Updated: Mar 8, 2018, 01:58PM IST లంకలో భారత క్రికెటర్లకి ఊహించని కష్టం..! ముక్కోణపు టీ20 సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత క్రికెటర్లకి ఊహించని కష్టం ఎదురైంది. శ్రీలంకలో మత ఘర్షణలు చెలరేగడంతో 10 రోజుల పాటు ఎమర్జెన్సీని ప్రకటించిన అక్కడి ప్రభుత్వం.. సోషల్ మీడియాపై కూడా తాజాగా నిషేధం విధించింది. దీంతో.. భారత క్రికెటర్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో పాటు కనీసం వాట్సాప్ కూడా వినియోగించుకోలేకపోతున్నారు. మంగళవారం రాత్రి శ్రీలంక చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు.. గురువారం రాత్రి 7 గంటల నుంచి బంగ్లాదేశ్‌తో రెండో మ్యాచ్‌లో ఢీకొట్టనుంది. ఎమర్జెన్సీ కారణంగా.. బుధవారం కనీసం ఒక సెషన్‌ కూడా టీమిండియా ప్రాక్టీస్ చేయలేకపోయింది. ఆటగాళ్లందరూ హోటల్‌ గదులకే పరిమితమైనట్లు మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ‘నాకు వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయి. కానీ.. వాటిని నేను చదవలేకపోతున్నా. కనీసం కాల్స్ కూడా చేసుకోలేకపోతున్నా. చాలా చిరాకు కలుగుతోంది’ అని భారత క్రికెటర్ ఒకరు మీడియాతో గురువారం వెల్లడించారు. మంగళవారం మత ఘర్షణలు చెలరేగడంతో శ్రీలంక ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భారత క్రికెటర్లకి ఇది ఊహించని కష్టమే మరి..!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కీల‌క రేట్లను య‌థాత‌థంగా ఉంచిన ఆర్బీఐ అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఆర్బీఐ పాల‌సీ స‌మీక్ష‌లో ఎటువంటి సానుకూల నిర్ణ‌యం లేదు. కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను య‌థాతథంగా ఉంచుతూ రిజ‌ర్వ్ బ్యాంక్ నిర్ణ‌యం తీసుకుంది. రెపో రేటును 6%, రివ‌ర్స్ రెపో రేటు 5.75%గా ఉంచారు. న‌వంబ‌ర్, డిసెంబ‌ర్ నెల‌ల్లో ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డం, ద్ర‌వ్య లోటు ల‌క్ష్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం పెంచిన నేప‌థ్యంలో కేంద్ర బ్యాంకు రేట్ల మార్పుకు సిద్ధ‌ప‌డ‌లేదు. TNN | Updated: Feb 7, 2018, 03:50PM IST అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఆర్బీఐ పాల‌సీ స‌మీక్ష‌లో ఎటువంటి సానుకూల నిర్ణ‌యం లేదు. కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను య‌థాతథంగా ఉంచుతూ రిజ‌ర్వ్ బ్యాంక్ నిర్ణ‌యం తీసుకుంది. రెపో రేటును 6%, రివ‌ర్స్ రెపో రేటు 5.75%గా ఉంచారు. న‌వంబ‌ర్, డిసెంబ‌ర్ నెల‌ల్లో ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డం, ద్ర‌వ్య లోటు ల‌క్ష్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం పెంచిన నేప‌థ్యంలో కేంద్ర బ్యాంకు రేట్ల మార్పుకు సిద్ధ‌ప‌డ‌లేదు. *ప్ర‌స్తుతం రెపో రేటు 6.0శాతంగా ఉంది. *రివ‌ర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉంది * మార్జిన‌ల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 6.25% బ్యాంక‌ర్లు, విశ్లేష‌కుల అంచ‌నా వేసిన‌ట్లుగానే ఆర్బీఐ కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను య‌థాత‌థంగా ఉంచింది. మంగ‌ళ‌వారం మొద‌లైన రెండు రోజుల ద్రవ్య ప‌ర‌ప‌తి విధాన క‌మిటీ(ఎంపీసీ) స‌మావేశం ఈ రోజు ముగిసింది. ఈసారి వ‌డ్డీ రేట్ల‌ను పెంచనూలేదు, త‌గ్గించ‌లేదు. అయితే గ‌త స‌మీక్ష జ‌రిగిన డిసెంబ‌రులోనూ ఎంపీసీ రేట్ల కోత‌కు మొగ్గుచూప‌లేదు. 2017 ద్వితీయార్థంలో అభివృద్ది చెందుతున్న దేశాల్లో ఆర్థిక కార్య‌క‌లాపాలు బాగా పెరిగాయి. భ‌విష్య‌త్తులోనూ ఇది కొన‌సాగుతుంద‌ని భావిస్తున్నారు.
1entertainment
MS Dhoni is the best captain: Sachin Tendulkar compliment ధోనినే ది బెస్ట్: సచిన్ టీమిండియా మాజీ సారథి, దిగ్గజాలకే సాధ్యంకాని చోట భారత్‌కు రెండుసార్లు ప్రపంచకప్ అందించిన మిస్టర్ కూల్ ధోనిపై పలువువరు ప్రశంసలు కురిపించడం తరచుగా గమనిస్తూనే ఉంటాం. అయితే ఈసారి క్రికెట్ దేవుడు సచిన్ నుంచి మహేంద్రుడికి ఊహించని కాంప్లిమెంట్ వచ్చింది. TNN | Updated: Nov 4, 2017, 05:08PM IST టీమిండియా మాజీ సారథి, దిగ్గజాలకే సాధ్యంకాని చోట భారత్‌కు రెండుసార్లు ప్రపంచకప్ అందించిన మిస్టర్ కూల్ ధోనిపై పలువువరు ప్రశంసలు కురిపించడం తరచుగా గమనిస్తూనే ఉంటాం. అయితే ఈసారి క్రికెట్ దేవుడు సచిన్ నుంచి మహేంద్రుడికి ఊహించని కాంప్లిమెంట్ వచ్చింది. ‘నేను అనేక మంది కెప్టెన్ల సారథ్యంలో ఆడాను. వారందరిలో ధోనినే ది బెస్ట్’ ఎంఎస్ ధోనికి సచిన్ ఇచ్చిన కితాబు ఇది. ఈ క్రికెట్ దిగ్గజం మిస్టర్ కూల్‌పై మరిన్ని ప్రశంసలు కురిపించాడు. భారత్‌కు వరల్డ్ కప్ అందించాలన్న తన చిరకాల కోరిక మహేంద్రుడి వల్లే నెరవేరిందని సచిన్ చెప్పుకొచ్చాడు. ధోని గురించి మరో ఆసక్తికరమైన విషయం కూడా తెలిపాడు. ‘ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ధోనీని చూస్తే మా నాన్న రమేశ్‌ టెండూల్కర్ గుర్తుకు వస్తారు. మొదటిసారి ధోనీని కలిసినప్పుడు నాకెంతో గౌరవమిచ్చాడు. అప్పుడే నాకు మా నాన్న గుర్తొచ్చారు. జట్టు గెలిచినా.. ఓడినా ధోని చాలా సైలెంట్‌గా ఉండేవాడు. మా నాన్న కూడా అంతే. అందుకే ధోనీని చూస్తే నాకు మా నాన్న గుర్తుకు వచ్చేవారు' అని సచిన్‌ అన్నాడు.
2sports
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
1entertainment
Hyderabad, First Published 12, Aug 2019, 11:59 AM IST Highlights చాలా కాలం తరువాత టాలీవుడ్ లో ఒక డిఫరెంట్ హిట్ సౌండ్ వినబడుతోంది. సంపూర్ణేష్ బాబు కల్మషం లేని కామెడీ సినిమా కొబ్బరిమట్ట హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది. పోటీగా కింగ్ మన్మథుడు 2 ఉన్నప్పటికీ కొబ్బరిమట్ట మాస్ ఆడియెన్స్ సపోర్ట్ తో మంచి లాభాలను అందుకుంటోంది.    చాలా కాలం తరువాత టాలీవుడ్ లో ఒక డిఫరెంట్ హిట్ సౌండ్ వినబడుతోంది. సంపూర్ణేష్ బాబు కల్మషం లేని కామెడీ సినిమా కొబ్బరిమట్ట హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది. పోటీగా కింగ్ మన్మథుడు 2 ఉన్నప్పటికీ కొబ్బరిమట్ట మాస్ ఆడియెన్స్ సపోర్ట్ తో మంచి లాభాలను అందుకుంటోంది.  మరోవైపు శుక్రవారం రిలీజైన నాగ్ మన్మథుడు 2 మొదటిరోజు కలెక్షన్స్ డీసెంట్ గానే ఉన్నప్పటికీ శని ఆదివారాల్లో కలెక్షన్స్ ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. సినిమాలో అడల్ట్ కంటెంట్ డోస్ ఎక్కువవ్వడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ చాలా వరకు సినిమాను దూరం పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇక మాస్ ఆడియెన్స్ కి చాలా వరకు కొన్ని సీన్లు బోర్ కొట్టించే విధంగా ఉన్నట్లు టాక్ రావడంతో కొబ్బరిమట్టకు బాగా కలిసొచ్చింది.  పైగా విజయయాత్రతో చిత్ర యూనిట్ ప్రతి జిల్లాను కవర్ చేస్తుండడంతో అన్ని వర్గాల ఆడియెన్స్ సినిమా వైపు చూస్తున్నారు. మొత్తానికి సినిమాకు పెట్టిన బడ్జెట్ వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం కూడా సెలవుదినం కావడం అలాగే రాఖీ ఫెస్టివల్ కూడా వస్తుండడంతో సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది, మొత్తంగా సంపూర్ణేష్ బాబు ఏ స్థాయిలో లాభాల్ని అందిస్తాడో చూడాలి.   Last Updated 12, Aug 2019, 11:59 AM IST
0business
Vaani Pushpa 162 Views practice , Sachin Tendulkar , water pinch sachin tendulkar న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసి దిగ్గజ క్రికెటర్‌గా మన్ననలు అందుకుంటున్న సచిన్‌ టెండూల్కర్‌ ఈ స్థాయికి రావడానికి కఠోర సాధన చేశాడు. సచిన్‌ క్రికెట్‌ ఆడే సమయంలో తాను ఎలా ప్రాక్టీస్‌ చేశాడో చెప్పే వీడయోను ఒకటి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. పూర్తిగా నీరు ఉంచిన పిచ్‌పై సచిన్‌ ప్రాక్టీస్‌ చేసిన వీడియో…ఇలా కూడా సాధన చేస్తారా అనిపిస్తోంది. ఫాస్ట్‌ పిచ్‌లపై బౌలర్లను ఎదుర్కోవడానికి నీరు నింపిన పిచ్‌ను సిద్ధం చేసుకుని రబ్బరు బంతులతో సచిన్‌ ప్రాక్టీస్‌ చేసిన ఒకనాటి వీడియో అది. దాన్ని సచిన్‌ షేర్‌ చేశాడు. ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా వంటి ఫాస్ట్‌ పిచ్‌లపై ఆడటానికి ఇలా ప్రాక్టీస్‌ చేశాడట. ప్రత్యేకంగా నీటితో తడిసిన పిచ్‌లపై రబ్బరు బంతి వేగంగా రావడమే సచిన్‌ ఇలా ప్రాక్టీస్‌ చేయడానికి ప్రధాన కారణం. ఈ వైరల్‌గా మారిన సచిన్‌ పోస్ట్‌ చేసిన వీడియోకు ఒక చక్కటి క్యాప్షన్‌ ఇచ్చాడు. ఆటపై అంకితభావం, ప్రేమ ఉంటే మనకు అదే కొత్త మార్గాలను చూపిస్తుంది. దీనికి స్పందించిన భారత మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌…సచిన్‌ ప్రాక్టీస్‌ అత్యంత స్పూర్తిదాయకమైనదిగా అభివర్ణించారు. ఇటీవల లింక్‌డన్‌లో వీడియో పోస్ట్‌ చేసిన సచిన్‌….ఒక్క చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. రిస్క్‌లేని చోటు ఉండదని, మనం సక్సెస్‌ కావాలంటే రిస్క్‌ చేయకతప్పదన్నాడు. మనకు నచ్చిన ఫీల్డ్‌లో రిస్క్‌ చేస్తే ఫలితం తప్పకుండా వస్తుందన్నాడు. తాను కూడా ఓపెనర్‌గా వెళ్లడానికి టీమిండియా మేనేజ్‌మెంట్‌ను వేడుకున్నానని, చివరకు వారికి సవాల్‌ విసిరి మరీ ముందుకెళ్లానన్నాడు. ఒకవేళ తాను ఓపెనర్‌గా విజయవంతం కాలేకపోతే మళ్లీ దాని ప్రస్తావన తీసుకురానని చాలెంజ్‌ చేసి ఆ బాధ్యతలను తీసుకున్నానన్నాడు. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/
2sports
New Delhi, First Published 10, May 2019, 9:41 AM IST Highlights కొన్నేళ్లలోనే వీడియో ఓవర్ ది టాప్ (ఓటీటీ) దిగ్గజంగా భారత్ నిలువనున్నది. 2022 నాటికి టాప్‌ 10లో చోటు దక్కించుకోనున్నది. భారత్‌లో వీడియో ఓవర్ ది టాప్ మార్కెట్ విలువ రూ.5000 కోట్లకు చేరుతుందని అసోచామ్–పీడబ్ల్యూసీ అధ్యయనం నిగ్గు తేల్చింది. న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నా దేశీయ వీడియో ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) మార్కెట్‌ 2022 నాటికి అంతర్జాతీయంగా టాప్‌ 10 మార్కెట్లలో ఒకటిగా ఎదగనున్నది. అప్పటికి భారత వీడియో ఓటీటీ మార్కెట్‌ పరిమాణం 823 మిలియన్‌ డాలర్లకు అంటే సుమారు రూ. 5,363 కోట్లకు చేరనున్నదని పరిశ్రమల సమాఖ్య-అసోచామ్, కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ సంయుక్త అధ్యయనంలో తేలింది. ‘భారత వీడియో ఓటీటీ మార్కెట్‌ ప్రస్తుతం శైశవ దశలో ఉంది. అంతర్జాతీయంగా ఈ మార్కెట్‌ వృద్ధి బాటలో సాగుతోంది. 2017–2022 మధ్య ఈ మార్కెట్‌ ఏటా 22.6% వృద్ధితోపాటు అంతర్జాతీయ ఓటీటీ మార్కెట్లో  10.1 శాతం వృద్ధితో టాప్‌ 10లో ఒకటిగా నిలుస్తుంది’ అని నివేదిక పేర్కొంది.  దేశీయంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, యూట్యూబ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు ఓటీటీ సేవలు అందిస్తున్నాయి. దేశీయంగా ఓటీటీ మార్కెట్‌ వృద్ధికి పలు అంశాలు దోహదపడనున్నాయి.  నిరంతరాయ కనెక్టివిటీ, కంటెంట్‌ కోసం ఎక్కువగా మొబైల్‌ ఫోన్లు ఉపయోగించడం పెరుగుతుండటం, కస్టమర్ వ్యక్తిగత అభిరుచులకు అనుగుణమైన కంటెంట్‌ను అందించే వీలు ఉండటం తదితరాలు ఇమిడి ఉన్నాయి. మరోవైపు 2022 నాటికి స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య 12.9% వార్షిక వృద్ధి రేటుతో 85.9 కోట్లకు చేరుతుందనేది అసోచామ్ - పీడబ్ల్యూసీ నివేదిక అంచనా. 2017లో వీరి సంఖ్య 46.8 కోట్లుగా ఉంది. డేటా టారిఫ్‌లు భారీగా తగ్గిపోవడం, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతుండటంతో ప్రధానంగా వీడియో ఆన్‌ డిమాండ్‌ (వీవోడీ) మార్కెట్‌కు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. ‘భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆన్‌లైన్‌ వీడియోలను వీక్షించేందుకు అనువైన డివైజ్‌ల లభ్యత పెరుగుతుండటం వీవోడీ పరిశ్రమకు తోడ్పడుతుంది. కంటెంట్‌ వినియోగం ఎక్కువగా స్మార్ట్‌ఫోన్స్‌తోనే జరుగుతోంది‘ అని నివేదిక వివరించింది. స్మార్ట్‌ ఫోన్లతోపాటు ట్యాబ్లెట్స్‌ కూడా వీవోడీ పరిశ్రమకు కీలకంగా మారుతున్నాయి.  స్మార్ట్‌ఫోన్స్తతో పోలిస్తే హెచ్‌డీ కంటెంట్‌ చూడటానికి ట్యాబ్లెట్స్‌ అనువుగా ఉంటాయని అసోచాం–పీడబ్ల్యూసీ అధ్యయనం తెలిపింది. వినోద, మీడియా పరిశ్రమలో టీవీ అతి పెద్ద ప్రధాన విభాగమని, భవిష్యత్‌లోనూ అలాగే కొనసాగుతుందని వివరించింది.  2017–2022 మధ్య కాలంలో భారత టెలివిజన్‌ పరిశ్రమ 10.6 శాతం వార్షిక వృద్ధితో 13.3 బిలియన్‌ డాలర్ల నుంచి 22 బిలియన్‌ డాలర్లకు చెందుతుందని నివేదిక పేర్కొంది. ఇదే వ్యవధిలో అంతర్జాతీయంగా టీవీ పరిశ్రమ వృద్ధి సగటు అత్యంత తక్కువగా 1.4 శాతంగా మాత్రమే ఉండగలదని వివరించింది.  ‘కంటెంట్‌ పరిశ్రమలో పెను మార్పులు వస్తున్నా భారత్‌లో సంప్రదాయ వినోద సాధనాల ఆధిపత్యమే కొనసాగుతోంది. అత్యంత చౌకగా కంటెంట్‌ను వినియోగించుకోవడానికి అనువైన సాధనాల్లో టీవీ ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో వినోదానికి ఇదే ప్రధాన వనరుగా ఉంటోంది‘అని నివేదిక వివరించింది. ఇదిలా ఉంటే 2020 నాటికి భారత్‌లో ఆన్‌లైన్‌ వీడియోలు వీక్షించే వారి సంఖ్య 50 కోట్లకు చేరుతుందని టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఒక నివేదికలో తెలిపింది. భారతీయ వినియోగదారులు సమాచార సేకరణ, కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆన్‌లైన్‌ వీడియోలు గణనీయంగా మారుస్తున్నాయన్నది.  భారతీయులు అన్వేషించే కంటెంట్‌పై బ్రాండ్స్‌కు అవగాహన కల్పించేందుకు రూపొందించిన నివేదిక ప్రకారం.. ఆన్‌లైన్‌ వీడియో సెర్చిలో మూడింట ఒక వంతు వినోద సంబంధ అంశాలే ఉంటున్నాయి. జీవన శైలి, విద్య, వ్యాపారం వంటి అంశాలు గత రెండేళ్లలో 1.5 నుంచి 3 రెట్లు దాకా వృద్ధి నమోదు చేశాయి. కార్ల కొనుగోళ్ల నిర్ణయాలను ఆన్‌లైన్‌ వీడియో గణనీయంగా ప్రభావితం చేస్తోంది. కొనుగోలు చేసే కారుపై అధ్యయనానికి కార్ల కొనుగోలుదారుల్లో 80 శాతం మంది ఇదే మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రతి పది మంది కొత్త ఇంటర్నెట్‌ యూజర్లలో తొమ్మిది మంది భారతీయ ప్రాంతీయ భాషా కంటెంట్‌ను ఉపయోగిస్తున్నారు.  ఏటా 4 కోట్ల మంది భారతీయులు కొత్తగా ఇంటర్నెట్‌ వినియోగదారులుగా మారుతు న్నారని గూగుల్ నివేదిక పేర్కొంది. ఈ విషయంలో ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి భారత్‌లోనే ఉంటోందన్నది. దేశీయంగా ప్రతీ యూజర్ సగటున నెలకు 8 జీబీ మొబైల్‌ డేటాను వినియోగిస్తున్నారు. సంపన్న దేశాల్లో వినియోగానికి ఇది సరిసమానం అని గూగుల్ తెలిపింది. ఆన్‌లైన్‌ సెర్చి విషయంలో ప్రస్తుతం మెట్రోయేతర ప్రాంతాలు .. మెట్రో నగరాలను మించి పోతున్నాయి. మెట్రో నగరాలతో పోలిస్తే ఇతర ప్రాంతాల వారే ఎక్కువగా బీమా, సౌందర్యం, పర్యాటక రంగ అంశాల సమాచారం కోసం అన్వేషిస్తున్నారు. గూగుల్‌ ప్లాట్‌ఫాంపై నమోదయ్యే బ్యాంకింగ్, ఆర్థిక, బీమా సేవలకు సంబంధించిన సమాచార సేకరణలో 61 శాతం భాగం మెట్రోయేతర ప్రాంతాల నుంచే ఉంటోంది. వాహనాలకు సంబంధించి ఇది 55 శాతంగా ఉందని గూగుల్ నివేదిక వివరించింది.
1entertainment
bollywood actress sonakshi sinha says she never hided her body curves but still netizens trolled her నా వంపులు దాచుకోలేదు, చూస్తే చూడండి లేకపోతే లేదు: సోనాక్షి సిన్హా బొద్దుగా ఉన్నా ఎంతో ముద్దొచ్చే అందం సోనాక్షి సిన్హాది. కానీ ఆమె అందరు హీరోయిన్లలా జీరో సైజ్ ఫిగర్‌ను మెయింటైన్ చేయడంలేదు. దాంతో చాలా మంది సోనాక్షిని ఏనుగులా ఉన్నావని వెక్కిరించేవారు. వారందరికీ ముఖం పగిలేలా సోనాక్షి జవాబిచ్చింది. Samayam Telugu | Updated: Oct 30, 2019, 05:40PM IST సోనాక్షిసిన్హా హీరోయిన్ అంటే సన్నగానే ఉండాలా? కాస్త లావుంటే అస్సలు చూడరా? లావుగా ఉన్నా అందం, నైపుణ్యం ఉండాలే కానీ ఎందుకు చూడరు. ఈ మూడు కలగలిపిన నటీమణులు మన తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువే. కానీ బాలీవుడ్‌లో సోనాక్షి సిన్హా, జరీన్ ఖాన్ లాంటి ఎందరో హీరోయిన్లు ఉన్నారు. వారంతా తమ బరువునే అందంగా మార్చుకుంటున్నారు. అలనాటి నటుడు శత్రుఘ్న సిన్హా కూతురు అయిన సోనాక్షి సిన్హా 2010లో వచ్చిన ‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె కాస్త లావు ఉన్నప్పటికీ ప్రేక్షకుల మన్ననలు పొందారు. Visit Site Recommended byColombia ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నారు. బాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్న కొద్దీ సోనాక్షికి ఫ్యాన్స్‌తో పాటు ట్రోల్స్ చేసేవారు కూడా పెరిగిపోయారు. ఇందుకు కారణం ఆమె కాస్త లావుగా ఉండటమే. ఓసారి సోనాక్షి అందంగా తయారై చక్కటి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోపై కొందరు సానుకూలంగా స్పందిస్తే.. మరికొందరు మాత్రం ‘ఏనుగుకి మేకప్ వేసినట్లుంది’ అని కామెంట్ చేశారు. దాంతో చాలా రోజుల పాటు సోనాక్షి ఎంతో బాధపడ్డారు. ఆ తర్వాత అనేవారు అంటూనే ఉంటారని పట్టించుకోవడం మానేశారు. అయితే సోనాక్షి ఈ మధ్యకాలంలో కాస్త బరువు కూడా తగ్గారు. అయినప్పటికీ తనపై కామెంట్లు చేయడం మానలేదట. అలాంటివారందరికీ బుద్ధి చెప్పడానికి సోనాక్షి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. READ ALSO: Amitabh Bachchan ఇంట్లో అపశృతి, షారుక్ ఖాన్‌కి గాయాలు ‘ఇప్పుడు మనం ఏనుగు గురించి మాట్లాడుకుందాం. మీరంతా నన్ను అలాగే ఎగతాళి చేసేవారు కదా. కొన్నేళ్ల పాటు మీరు నా బరువుపై కామెంట్లు చేశారు. కానీ ఎప్పుడూ రియాక్ట్ అవ్వకూడదని అనుకున్నాను. ఎందుకంటే ఏనుగు అన్ని జంతువుల్లో పెద్దది. ట్రోల్స్ చేసేవారంతా మన మూడ్‌ని కూడా నరకం చేసేస్తారు. వారందరికీ వేరే పని లేక ఇతరులను ఎగతాళి చేస్తుంటారు. కాబట్టి వారు నోటికొచ్చినట్లు వాగుతుంటారు. ఇదివరకు వారి కామెంట్స్‌కు మనకు కోపం వచ్చేది. బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు వారు ఓ జోక్ అయిపోయారు. విని నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయలేం. ఆ తర్వాత నేను 30 కిలోలు బరువు తగ్గాను. అయినా కూడా నాపై కామెంట్లు చేయడం మానలేదు. వారి చావు వారే చస్తారు అని వదిలేశాను. నేను ఇండస్ట్రీలో నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి వచ్చాను. తెచ్చుకున్నాను కూడా. నా శరీరం గురించి నేను దాచుకోవాల్సింది ఏమీ లేదు. నా నడుం సైజ్, వంపులు, నా బరువు ఇవేవీ నేను దాచుకోలేదు. ఎందుకంటే కొలవడానికి నేను స్కేల్‌ని కాను. ఆడపిల్లని’ అని వెల్లడించారు సోనాక్షి.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV హర్మన్‌ప్రీత్ ఆల్‌రౌండ్ షో.. భారత్ ఘన విజయం హర్మన్ ప్రీత్‌ కౌర్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన వేళ ఆసియా కప్‌లో భారత మహిళ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. Samayam Telugu | Updated: Jun 4, 2018, 02:04PM IST హర్మన్‌ప్రీత్ ఆల్‌రౌండ్ షో.. భారత్ ఘన విజయం హర్మన్ ప్రీత్‌ కౌర్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన వేళ ఆసియా కప్‌లో భారత మహిళ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం కౌలాలంపూర్ వేదికగా థాయ్‌లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 66 రన్స్ తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. బదులుగా థాయ్‌లాండ్ 8 వికెట్ల నష్టానికి 66 పరుగులకే పరిమితమైంది.
2sports
Hyd Internet 97 Views team india won team india won నాగ‌పూర్ః భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు జరిగిన ఐదో వన్డేలో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన ఈ వన్డేలో 7 వికెట్ల తేడాతో ఆసీస్ పై విజయం సాధించింది. 42.5 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 243 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 242 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా విజయ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. దీంతో, ఐదు వన్డేల సిరీస్ లో 4-1 ఆధిక్యంలో భారత్ నిలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. దీంతో, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ధోనీ సేన నిలిచినట్టయింది.
2sports
Visit Site Recommended byColombia టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా భారత్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 0, 17, 11 పరుగులతో నిరాశపరిచిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో చాలా పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. ఊరించే బంతులు విసిరినా.. పవర్ ప్లేలో ఎలాంటి సాహసాలకీ వెళ్లకుండా జాగ్రత్తపడిన రోహిత్ శర్మ చివర్లో ఆకాశమే హద్దుగా భారీ షాట్లతో చెలరేగిపోయాడు. ఆరంభంలో రోహిత్ శర్మ ఇబ్బంది పడుతుండటంతో.. స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్ (35: 27 బంతుల్లో 5x4, 1x6) తనదైన శైలిలో బౌండరీలు బాదేశాడు. దీంతో భారత్ జట్టు.. 9.4 ఓవర్లు ముగిసే సమయానికి 70/0తో మెరుగైన స్థితిలో నిలిచింది. భారీ స్కోరు దిశగా సాగిపోతున్న భారత్‌ జోరుకి రుబెల్ హుస్సేన్ కళ్లెం వేశాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన రుబెల్ బౌలింగ్‌లో యార్కర్‌ని ఆడటంలో విఫలమైన శిఖర్ ధావన్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే అప్పటికే క్రీజులో కుదురుకున్న రోహిత్ శర్మ.. ధావన్ ఔట్ తర్వాత వచ్చిన సురేశ్ రైనాతో కలిసి ఇన్నింగ్స్‌ని నడిపించాడు. అర్ధ శతకం వరకూ నెమ్మదిగా ఆడిన రోహిత్ 15వ ఓవర్ తర్వాత గేర్ మార్చి.. ఎడా పెడా బౌండరీలు బాదేశాడు. మరో ఎండ్‌లోని రైనా కూడా బ్యాట్ ఝళిపించడంతో.. బంగ్లా బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీంతో.. 15 ఓవర్లు ముగిసే సమయానికి 117/1తో ఉన్న టీమిండియా.. ఆ తర్వాత ఓవర్లలో వరుసగా 9, 14, 21, 11, 4 పరుగులు రాబట్టేసింది. చివరి ఓవర్‌లో తొలి బంతికి రైనా ఔటవగా.. ఆఖరి బంతికి రోహిత్ శర్మ రనౌటయ్యాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
internet vaartha 218 Views బెంగళూరు : టాటాహిటాచి నుంచి ఉత్పత్తి చేస్తున్న భారీ ఎక్స్‌కేవేటర్లు ఇప్పటివరకూ 50వేలు మెషిన్లు పంపిణీచేసినట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ ధార్వాడ్‌ ప్లాంట్‌ నుంచి 50 వేలవ సూపర్‌షిరీస్‌ ఎక్స్‌కవేటర్‌ను హుబ్లిలోని డిఆర్‌ఎస్‌ ఇన్‌ఫ్రాకు చెందిన ఆర్‌ఎన్‌నాయక్‌, దినేస్‌ ఆర్‌ నాయక్‌లకు అంద చేసింది. డిఆర్‌ఎస్‌ తమ ప్రాజెక్టుల్లో 100కుపైగా టాటా హిటాచి మెషిన్లు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మేనేజింగ్‌ భాగస్వామి దీపా దినేస్‌ నాయక్‌ మాట్లాడుతూ టాటాహిటాచీలకు సుదీర్ఘకాలంగా కష్టమర్లుగా ఉన్నట్లు తెలిపారు. 2006లో కంపెనీ నుంచి 10వేలవ యంత్రాన్ని అందుకున్నామన్నారు. తిరిగి మరో సారి 50వేల ఎక్స్‌కవేటర్‌ను తీసుకున్నట్లు ఆమె తెలిపారు. త్వరలోనే కంపెనీ నుంచి లక్ష యూనిట్లు దాటితే ఆ యూనిట్‌ ను కూడా తామే కొనుగోలు చేస్తామని డిఆర్‌ఎస్‌ ఎండి వివరించారు. టాటా హిటాచి ఆల్డ్‌ డైరెక్టర్‌ కె.కిమురా మాట్లాడుతూ కంపెనీ 50వేల భారీ యంత్రాలను ఉత్పత్తిచేయడం తమకు గర్వకారణ మని పేర్కొన్నారు. కంపెనీకి ధార్వాడ్‌లో 118 ఎకరాల విస్తీర్ణంలో టాటా హిటాచి భారీ యంత్ర సామగ్రి యూనిట్‌ ఉందని, 60శాతం టాటా హిటాచి విడిభాగాలు తయారు చేస్తుందని, మినీ, మిడి ఎక్స్‌కవేటర్‌ బ్యాగ్‌హోలోడర్‌ విభాగాలను ఈ యూనిట్‌లోనే తయారు చేస్తున్నట్లు వివరించారు.
1entertainment
ఇంగ్లండ్‌ను వణికిస్తున్న రవీంద్ర జడేజా TNN| Dec 20, 2016, 12.43 PM IST చెన్నై టెస్టులో ఆఖరి రోజు జడేజా చెలరేగుతున్నాడు. వరుసగా వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను వణికిస్తున్నాడు. జడేజా ధాటికి 50 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. అలెస్టర్ కుక్‌ను 49 పరుగుల వద్ద, మరో ఓపెనర్ జెన్నింగ్స్‌ను 54 పరుగుల వద్ద జడేజా పెవిలియన్‌కు పంపాడు. కీలక బ్యాట్స్‌మెన్ జో రూట్‌ను కూడా 6 పరుగుల వద్ద ఎల్బీగా అవుట్ చేశాడు. భారత్ గెలవాలంటే.. మరో 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ డ్రా కోసం పోరాడుతున్నారు. ఇంగ్లండ్ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది. ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్.. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మధ్య ప్రేమాయణం సాగుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ తొమ్మిదిసార్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో అవుటైన కుక్ ఏకంగా ఆరుసార్లు జడేజా బౌలింగ్‌లో వెనుదిరగడం విశేషం. మిగతా మూడు సార్లు అశ్విన్ అతణ్ని ఔట్ చేశాడు. ఏదైనా సిరీస్‌లో ఓ బౌలర్ చేతిలో ఐదుసార్లు అవుట్ కావడమే రికార్డు కాగా.. ఇప్పుడు కుక్ ఆరోసారి అవుటై మరింత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. జడేజా 2012-13 ఆస్ట్రేలియా కెప్టెన్ మైకెల్ క్లార్క్‌ను ఐదుసార్లు ఇలాగే అవుట్ చేశాడు. 2015-16 సిరీస్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆమ్లాను కూడా మూడుసార్లు అవుట్ చేశాడు.
2sports
Apr 25,2015 లోక్‌సభలో జిఎస్‌టి బిల్లు           న్యూఢిల్లీ : చాలా కాలం నుండి పెండింగ్‌లో ఉన్న వస్తువులు, సేవల బిల్లు (జిఎస్‌టి) శుక్రవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన వెలువడగానే సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్షాలన్నీ బిల్లును వ్యతిరేకిస్తూ మూకుమ్మడిగా వాకౌట్‌ చేశాయి. స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలపకముందే సవరణల బిల్లుపై సభలో ఎలా చర్చిస్తారని కాంగ్రెస్‌ ఎంపి భూపేంద్రసింగ్‌ హుడా ఆందోళనకు దిగారు. ఇదే తీరును ప్రభుత్వం కొనసాగిస్తే పార్లమెంటరీ కమిటీల ఏర్పాటు ఎందుకని కాంగ్రెస్‌ సభాపక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే ప్రశ్నించారు. జిఎస్‌టి చట్టానికి సవరణల వల్ల జిడిపి రెండు శాతం మేర వృద్ధి చెందడమే కాకుండా అనేక ప్రయోజనాలు కలుగుతాయనీ, ఈ బిల్లుతో రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లదనీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సభ్యులకు వివరించే ప్రయత్నం చేశారు. చర్చకు సహకరించాల్సిందిగా కోరారు. గత వారం ఢిల్లీలో జరిగిన ఆర్థిక మంత్రుల సమావేశంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన సిఎస్‌టి బకాయిలు చెల్లించిన తర్వాతే వస్తువులు, సేవల పన్ను(జిఎస్‌టి)ని అమలు చేయాలని మన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేంధర్‌ కేంద్రానికి స్పష్టం చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV విరుష్క రిసెప్షన్‌కి శ్రీలంక టీమ్ డుమ్మా..? భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వచ్చే మంగళవారం ముంబయిలో ఇవ్వనున్న వివాహ విందుకి శ్రీలంక క్రికెటర్లు దూరంకానున్నారు. భారత్‌తో TNN | Updated: Dec 23, 2017, 05:28PM IST విరుష్క రిసెప్షన్‌కి శ్రీలంక టీమ్ డుమ్మా..? భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వచ్చే మంగళవారం ముంబయిలో ఇవ్వనున్న వివాహ విందుకి శ్రీలంక క్రికెటర్లు దూరంకానున్నారు. భారత్‌తో ప్రస్తుతం టీ20 సిరీస్ ఆడుతున్న శ్రీలంక జట్టు చివరి టీ20 మ్యాచ్‌ని ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం రాత్రి ఆడనుంది. సుదీర్ఘ సిరీస్‌లో ఇదే ఆఖరి మ్యాచ్ కావడంతో సోమవారం ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుని.. మంగళవారం విందుకి హాజరవుతారనే ఉద్దేశంతో కోహ్లి ప్లాన్ చేశాడు. కానీ.. శ్రీలంక క్రికెటర్లు సోమవారమే భారత్‌ని వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2sports
ప్రభాస్ తో గొడవ పడ్డ కంగనా రనౌత్ Highlights ప్రభాస్ తో ఏక్ నిరంజన్ సినిమాలో నటించిన కంగనా రనౌత్ ఆ సినిమా సందర్భంగా ప్రభాస్ తో గొడవపడ్డ కంగన అప్పట్నుంచీ ఇద్దరి మధ్య మాటల్లేవని చెప్పిన కంగనా బాహుబలి తర్వాత ప్రభాస్ గురించి అభిప్రాయం మారిందన్న కంగన ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది కంగన. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రభాస్ తో ఎన్నోసార్లు గొడవ పడిందట. ఆఖరికి స్విట్జర్లాండ్ లో జరిగిన షూటింగ్ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోవటం కూడా మానేశారట.   ఆ షాకింగ్ న్యూస్ ఇప్పుడు చెప్తోంది కంగన. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండేది అనడిగితే.. అలా సమాధానం చెప్పింది. అయితే ప్రభాస్ బాహుబలి లాంటి సినిమాతో దేశవ్యాప్తంగానే కాక ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకోవడం సంతోషకరమని చెప్పింది కంగన.   తన తాజా చిత్రం రంగూన్ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన కాసేపు మీడియాతో మాట్లాడింది. సైఫ్ ఆలీఖాన్, షాహిద్ కపూర్ ల సరసన నగ్నంగా నటించిన కంగన బాహుబలిగా ప్రభాస్ ఎదగటం తనకు ఆనందాన్నిచ్చిందని అంటోంది.    తనకు నచ్చే కథలు వస్తే తెలుగులో మళ్లీ నటించడం తనకెంతో ఇష్టమని కంగన తెలిపింది. Last Updated 25, Mar 2018, 11:55 PM IST
0business
New Delhi, First Published 3, Oct 2018, 8:05 AM IST Highlights దేశీయంగా, అంతర్జాతీయంగా ఈ – గ్రాసరీ మార్కెట్‌ పట్టు పెంచుకుంటున్నది. ఈ సెగ్మెంట్‌లో పట్టు కోసం పలు కంపెనీల ప్రయత్నాలు ప్రారంభించాయి. అందులో భాగంగా బిగ్‌బాస్కెట్‌లో వాటాకోసం పేటీఎమ్‌ మాల్‌ శరవేగంగా చర్చలు ప్రారంభించింది. మార్కెట్‌లో పట్టు కోసం వాల్‌మార్ట్‌–ఫ్లిప్‌కార్ట్‌ భారీగా పెట్టుబడులు పెడుతున్నది.  ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌లో ఈ – గ్రాసరీ సెగ్మెంట్‌ ఇప్పుడొక హాట్‌‌కేక్‌. భవిష్యత్‌లో భారీ రాబడి, లాభాలు వస్తాయన్న అంచనాలు ఉన్న ఈ–గ్రాసరీ సెగ్మెంట్లో పట్టు, మార్కెట్‌ వాటా పెంచుకోవడం కోసం పలు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థల్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం, పెట్టుబడులను మరింత గుమ్మరించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో టాప్‌లో ఉన్న ‘బిగ్‌బాస్కెట్‌’లో మెజారిటీ వాటా కొనుగోలు కోసం పేటీఎమ్‌ అనుబంధ వేదిక పేటీఎం మాల్‌ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ చర్చలు వేగంగా సాగుతున్నాయి. అయితే బిగ్ బాస్కెట్ విలువపైనే పీటముడి పడిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్‌ సంస్థ ఈ–గ్రాసరీ సెగ్మెంట్‌ పట్టు సాధించడం కోసం కోసమే భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇంకొక వైపు రిటైల్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ రిటైల్‌ తన ఈ కామర్స్‌ నెట్‌వర్క్‌ను మరింత పటిష్ట పరుచుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేగాక ఇటీవలే మోర్‌ సూపర్‌ మార్కెట్లను కొనుగోలు చేసిన అమెజాన్‌ కంపెనీ కూడా ఈ–గ్రాసరీ సెగ్మెంట్‌ కోసం భారీ పెట్టుబడులు గుమ్మరించేందుకు సిద్ధమవుతోంది.  తొలుత బిగ్‌బాస్కెట్‌ బెంగళూరులో తన కార్యకలాపాలను మొదలు పెట్టింది. ప్రస్తుతం 25 నగరాల్లో కిరాణా సరుకులు, స్నాక్స్‌ డెలివరీ చేస్తోంది. 20 వేలకు పైగా ఉత్పత్తులను, వెయ్యికి పైగా బ్రాండ్ల వస్తువులను 40 లక్షల మంది వినియోగదారులకు అందిస్తోంది. ఇందులో అత్యధిక మార్కెట్‌ వాటా బిగ్‌ బాస్కెట్‌దే. ఇతర సంస్థలతో పోల్చితే బిగ్‌బాస్కెట్‌కు అధికంగా ఆర్డర్లు వస్తాయి. నెలకు దాదాపు 70 లక్షల ఆర్డర్లు వస్తాయని అంచనా. ఈ స్థాయిల్లో ఆర్డర్లు వచ్చినా, ఈ కంపెనీ ఇంకా కీలక మైలురాయిని చేరుకోలేదు. ఈ కంపెనీలో మెజారిటీ వాటా కోసం డిజిటల్‌ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌కు చెందిన ఈ టైల్‌ ప్లాట్‌ఫార్మ్‌  పేటీఎమ్‌ మాల్‌ ప్రయత్నస్తోంది. ఈ వాటా కొనుగోలు విషయమై గత ఏడాదే  చర్చలు ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయని సమాచారం. కానీ బిగ్‌బాస్కెట్‌తో ఎలాంటి చర్చలు జరపడం లేదని పేటీఎమ్‌ ప్రతినిధి పేర్కొన్నారు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో పేటీఎంకు దన్నుగా నిలిచిన చైనా ఆన్ లైన్ రిటైల్ మేజర్ అలీబాబా.. బిగ్‌బాస్కెట్‌లో 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఆ సమయంలోనే మరింత వాటా కొనుగోలు చేయగలమని పేర్కొంది.   బిగ్‌బాస్కెట్‌–పేటీఎమ్‌ మాల్‌ డీల్‌ విషయమై బిగ్‌బాస్కెట్‌ విలువను ఎంతగా నిర్ణయించాలనే అంశంపైనే పీటముడి పడినట్లు బిగ్‌బాస్కెట్‌ వర్గాలు చెప్పాయి. ఈ అంశం తేలనందు వల్లే చర్చలు ముందుకు సాగట్లేదని  ఆయా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మెజారిటీ వాటా ఇచ్చినందుకు పేటీఎమ్‌ మాల్‌లో తమకొక డైరెక్టర్‌ పదవి కావాలని కూడా బిగ్‌బాస్కెట్‌ కోరుతోందని సమాచారం. డీల్‌ విషయంలో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, బిగ్‌బాస్కెట్‌కు ప్రీమియమ్‌ విలువ కట్టాలని కోరుతున్నామని ఆ వర్గాలంటున్నాయి.   ఈ కామర్స్‌ స్పేస్‌లో అమెజాన్‌–ఫ్లిప్‌కార్ట్‌ల వాటా దాదాపు 95 శాతంగా ఉంది. పేటీఎమ్‌ మాల్‌ ఈ కామర్స్‌ స్పేస్‌లో మరింతగా విస్తరించాలంటే ఒక పటిష్టమైన సంస్థ కావాలి. అందుకే బిగ్‌బాస్కెట్‌లో వాటా కొనుగోలు కోసం పేటీఎం మాల్‌ తీవ్రమైన ప్రయత్నాలే చేస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. బిగ్‌బాస్కెట్‌తో టై అప్‌ వల్ల పేటీఎమ్‌ మాల్‌కు రిపీటెడ్‌ కస్టమర్లు లభిస్తారని,  ఈ రంగంలో అత్యంత ముఖ్యమైన సంస్థ, బిగ్‌బాస్కెట్‌తో జత కడితే అది పేటీఎమ్‌ మాల్‌కు, బిగ్‌బాస్కెట్‌.. ఇరు సంస్థలకు కూడా ప్రయోజనకరమని వారంటున్నారు.   ఆన్‌లైన్‌ మార్కెట్‌ సంస్థలకు భవిష్యత్తులో గ్రాసరీ వల్లనే అధిక ఆదాయం వస్తుందని  రెండేళ్ల క్రితమే అమెజాన్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ అగర్వాల్‌ అంచనా వేశారు. కానీ అప్పట్లో ఈ అంచనాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రానున్న ఐదేళ్లలో ఆన్‌లైన్‌ వ్యాపారంలో సగం వాటా గ్రాసరీలు, వినియోగవస్తువులదేనని ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా  పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఈ గ్రోసరీ సెగ్మెంట్‌ విలువ 2,800 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా.  ఈ గ్రాసరీ మార్కెట్‌ జోరు అంతకంతకూ పెరగనున్నదని గుర్తించిన అన్ని ఈ–కామర్స్‌ సంస్థలు గ్రాసరీస్పేస్‌లో మరింత మార్కెట్‌ వాటా కోసం ఇప్పుడు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్‌ తదితర సంస్థలు ఈ గ్రాసరీ సెగ్మెంట్‌లో మరింత వాటా కొల్లగొట్టడంపైనే దృష్టి పెట్టాయి. ఈ గ్రాసరీ సెగ్మెంట్‌ కోసమే వాల్‌మార్ట్ 40 కోట్ల డాలర్లు కేటాయించింది. ఈ సంస్థ ఇప్పటికే తన ఆన్‌లైన్‌ గ్రాసరీ విభాగాన్ని సూపర్‌మార్ట్‌ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. గతంలో నియర్‌బై ద్వారా ఈ–గ్రాసరీ సెగ్మెంట్‌లో ఎదురు దెబ్బలు తిన్న ఫ్లిప్‌కార్ట్‌ ఈసారి మాత్రం విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ప్రతిరోజూ డిస్కౌంట్లు ఇవ్వడం, సొంత సరఫరా నెట్ వర్క్‌ను ఏర్పాటు చేయడం తదితర చర్యలు తీసుకుంటోంది. ఇక రిలయన్స్‌ అతి పెద్ద ఈ గ్రోసరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్‌ రిటైల్‌ ఇప్పటికే 8,000 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. భారత్‌లో నాలుగో అతి పెద్ద రిటైల్‌ చెయిన్‌ మోర్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఈ–గ్రోసరీ సెగ్మెంట్‌ను మరింత పటిష్టం చేసుకోవాలని అమెజాన్‌ ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం మీద ఈ–గ్రోసరీ మార్కెట్లో మరింత మార్కెట్‌ వాటా కోసం కంపెనీల మధ్య పోరు మరింతగా వేడెక్కుతోందని, కొన్నాళ్లు వినియోగదారులకు డిస్కౌంట్ల నజరానాలు లభిస్తాయని నిపుణులంటున్నారు. కాగా బిగ్ బాస్కెట్ సంస్థలో చైనా రిటైల్ మేజర్ ఆలీబాబా  రూ.1,460 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ‘ఈ- గ్రాసరీ’ మార్కెట్ కోసం వాల్‌మార్ట్‌–ఫ్లిప్‌కార్ట్‌ రూ.2,920 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఇక ఆదిత్య బిర్లా సంస్థకు చెందిన ‘మోర్’ కోసం అమెజాజన్, సమర క్యాపిటల్ రూ.4,200 కోట్లు వెచ్చించింది. దేశవ్యాప్తంగా రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లు 8,000 ఉన్నాయి. వీటిని ఈ –గ్రాసరీ కోసం వాడాలని  రిలయన్స్‌ భావిస్తోంది.  Last Updated 3, Oct 2018, 8:05 AM IST
1entertainment
-  స్థిరాస్తి రంగం అభివృద్ధికి పలు చర్యలు - సవాళ్ల పరిష్కారానికి వివిధ సంస్కరణలు -  ప్రపంచ నగరంగా హైదరాబాద్‌ సిటీ - క్రెడారు ప్రాపర్టీషో ప్రారంభోత్సవంలో ఈటల - రియల్‌ ఎస్టేట్‌కూ టీఎస్‌-ఐపాస్‌ : క్రెడారు - మొదలైన స్థిరాస్తి ప్రదర్శన నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలోనే ఉత్తమ నివాసయోగ్యమైన నగరం హైదరాబాద్‌ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నైలకంటే కూడా నివాసయోగ్య నగరం భాగ్యనగరమని, అధిక కాలుష్యం లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్‌ సొంతం అని వివరించారు. అన్ని తరగతుల వారు ఇక్కడ ఇండ్లను కొనుక్కొని బతుకగలిగే పరిస్థితి భాగ్యనగరంలోనే ఉన్నట్టుగా తెలిపారు. హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్లో 'కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా'(క్రెడారు) ఏర్పాటు చేసిన 6వ హైదరాబాద్‌ ప్రాపర్టీషోను ఆయన శుక్రవారం ప్రారంభించారు. 'రైజింగ్‌ హైదరాబాద్‌' థీమ్‌తో ప్రారంభమైన ఈ ప్రాపర్టీషో ఆదివారం (4వ తేదీ) వరకు కొనసాగనుంది. ఈ ప్రాపర్టీషోలో దాదాపు 120 డెవలపర్లు పలు ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు. రాష్ట్రంలో స్థిరాస్తి రంగం కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. వాటిని దూరం చేసి పరిశ్రమ రానున్న రోజుల్లో మరింతగా విస్తరించేందుకు గాను తాము అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్టగా ఆర్థిక మంత్రి వివరించారు. జీఎస్టీ తగ్గింపు దిశగా కృషి.. దేశంలో వ్యవసాయం తరువాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న స్థిరాస్తి రంగంపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) భారం అధికంగా ఉండడం పట్ల ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. స్థిరాస్తి రంగానికి తక్కువ జీఎస్టీని వర్తింపజేయాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయనున్నట్టుగా ఆయన వివరించారు. ఇందులో భాగంగా రానున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తనున్నట్టుగా మంత్రి తెలిపారు. ప్రస్తుతం స్థిరాస్తి రంగంపై 12 శాతం జీఎస్టీ, స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డ్యూటీ ఆరు శాతంగా ఉంది. దీనిని మొత్తంగా ఆరు శాతానికి కుదించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. కేవలం చౌక ధరల గృహ నిర్మాణాలు చేపట్టే వారికే ప్రస్తుతం 8 శాతం జీఎస్టీ వర్తిస్తోంది. ఈ సందర్భంగా క్రెడారు హైదరాబాద్‌ విభాగం అధ్యక్షుడు రామ్‌రెడ్డి మాట్లాడుతూ నాలా పన్ను, విద్యుత్తు టారీఫ్‌తో పాటు జీఎస్టీ తదితర అంశాలు స్థిరాస్తి రంగాన్ని బాగా ప్రభావితం చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ విషయంలో సర్కారు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ త్వరలో వ్యాపార నిర్వహణ సులభతరం చేసేందుకు గాను వివిధ రంగాలలో సవరణలు తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రెడారు హైదరాబాద్‌ విభాగం ప్రధాన కార్యదర్శి పి. రామకృష్ణారావు మాట్లాడుతూ నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సరసమైన ధరలకు ప్రజలకు గృహాలను అందించేందుకు గాను స్థిరాస్తిపై జీఎస్టీ భారాన్ని 12 నుంచి 8 శాతానికి కుదించాలని కోరారు. ఈ చర్య వల్ల స్థిరాస్తి రంగానికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. పరిశ్రమ హోదా కల్పించండి: క్రెడారు స్థిరాస్తి రంగం వేగంగా విస్తరించేందుకు గాను సర్కారు ఈ రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలని క్రెడారు సర్కారుకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం స్థిరాస్తి రంగానికి రుణాలను మంజూరు చేసేందుకు బ్యాంకులు విముఖత చూపుతున్నాయని పరిశ్రమ హోదాతో ఈ సమస్య దూరమవుతుందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీఎస్‌-ఐపాస్‌ విధానాన్ని స్థిరాస్తి రంగానికి కూడా వర్తింపజేయాలని ఆయన కోరారు. ఫలితంగా సింగ్‌ విండో విధానంలో అనుమతులు మంజూరవడమే కాకుండా పరిశ్రమ ఎదుగుదలకు ఇది దోహదం చేస్తుందని క్రెడారు పేర్కొంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV అమెరికాలో సన్నీకి చేదు అనుభవం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ను క్రికెట్ స్టేడియంలోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. TNN | Updated: Aug 30, 2016, 10:44AM IST భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. వెస్టిండీస్‌, భారత్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ చెప్పడానికి అమెరికాకు వెళ్లిన ఆయన్ను స్టేడియంలోకి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. గావస్కర్ వద్ద స్టేడియంలోకి వెళ్లేందుకు పాస్ లేకపోవడంతోనే ఆయన్ను లోపలికి అనుమతించలేదని తెలుస్తోంది. ఫ్లోరిడాలోని లాడర్ హిల్‌లో టీ20 మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాస్ లేకపోవడంతో ఆయనెవరనే విషయం తెలియని భద్రతా సిబ్బంది లోపలికి పంపేందుకు నిరాకరించారు. దీంతో చేసేదేంలేక ఆయన అభిమానులతో మాట్లాడుతూ, ఫొటోలు దిగుతూ గేట్ ముందే గడిపారు. కాసేపటి తర్వాత ఈ విషయం తెలుసుకున్న అధికారులు వచ్చి ఆయన్ను లోపలికి తీసుకెళ్లారు. ఈ విషయంలో సునీల్ గావస్కర్ ఎంతో సంయమనం పాటించారంటూ సంబంధిత అధికారులు ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు. క్రికెట్ గురించి తెలిసిన దేశాల్లో అయితే సన్నీకి ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. కానీ అది అమెరికా.. అక్కడ క్రికెట్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. దీంతో లిటిల్ మాస్టర్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. నిబంధనలు, తనిఖీలంటూ ఓవర్ యాక్షన్ చేసే అమెరికా సెక్యూరిటీ సిబ్బంది గురించి తెలియనిదేం కాదు. ఇటీవలే లాస్ ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో షారూక్ ఖాన్‌ను కూడా ఆపేసి, అవమానించిన సంగతి తెలిసిందే.
2sports
INFOSYS1 ఐటి దిగ్గజాలు అమెరికా బాట న్యూఢిల్లీ, మే 4: అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నాయంటూ అవుట్‌సోర్సింగ్‌ సంస్థలపై గుర్రుగా ఉన్న డొనాల్డ్‌ట్రంప్‌ సర్కారు ను ప్రసన్నం చేసుకునేందుకు దేశీయ ఐటీ దిగ్గజాలు కసరత్తు చేస్తున్నాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వచ్చే రెండేళ్లలో 10,000 మంది అమెరికన్లను రిక్రూట్‌ చేసుకోనున్నట్లు వెల్లడించింది. అలాగే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మెషిన్‌ లెర్నింగ్‌ వంటి కొంగొత్త టెక్నాలజీల కోసం అమెరికాలో నాలుగు ఇన్నోవేషన్‌ సెంటర్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సొంత రాష్ట్రమైన ఇండియానాలో ఆగస్టులో మొదటిదాన్ని ప్రారంభించనుంది. 2021 నాటికల్లా ఈ కేంద్రం 2,000 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించే అవ కాశం ఉందని ఇన్ఫీ సిఇఒ విశాల్‌ సిక్కా వెల్లడించారు. అయితే, ఇవన్నీ అమెరికా కఠనతర వీసా నిబంధనల ప్రభావం గురించి ఆందోళనతో చేపడుతున్న చర్యలు కాదని ఆయన వివరించారు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో స్థానిక, అంతర్జాతీయ నిపుణుల మేళవింపు కీలకమని, ఈ కార ణంగానే స్థానిక నిపుణులను మరింతగా రిక్రూట్‌ చేసుకోవాల్సిన అవసరం పెరుగుతోందని సిక్కా పేర్కొన్నారు. అయితే, అమెరికాలో పెట్టుబడులు, స్థానిక, విదేశీ ఉద్యోగుల మేళవింపు ఏ విధంగా ఉంటాయన్నది వెల్లడించడానికి ఆయన నిరాకరిం చారు. టెక్నాలజీ ఆవిష్కరణలకు ఉద్దేశించిన ఇన్నోవేషన్‌ సెంటర్స్‌ లో మరో మూడింటిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై మరి కొద్ది నెలల్లో ఇన్ఫీ నిర్ణయం తీసుకోనుంది. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ అంశాల్లో శిక్షణ కల్పించడంతోపాటు ముఖ్యమైన ఫైనాన్షియల్‌సర్వీ సెస్‌, తయారీ, హెల్త్‌కేర్‌, రిటైల్‌, ఎనర్జీ తదితర విభాగాల క్లయింట్లకు సేవలందించడానికి కూడా ఈసెంటర్స్‌ ఉపయోగపడు నున్నాయి. ఇన్ఫీకి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2,00,000 మందికిపైగా ఉద్యోగులుఉన్నారు. సిఇఒగా సిక్కా పగ్గాలు చేపట్టిన తర్వాత గడిచిన కొన్నాళ్లలో ఇన్ఫోసిస్‌ అమెరికాలో రెండువేల మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకుంది. కొత్తగా తీసుకో బోయే 10,000 మందిలో అనుభవజ్ఞులైన టెక్నాలజీ నిపుణులు, ఇటీవలే గ్రాడ్యుయేట్స్‌ అయిన వారు ఉండనున్నారు. యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బిగ్‌ డేటా తదితర అంశాల్లో ఇన్ఫోసిస్‌ వారికి శిక్షణ కూడా ఇవ్వనుంది. పెరగనున్న రక్షణాత్మక ధోరణులకు తెరతీసిన అమెరికా, ఇతరదేశాలు వృత్తి నిపు ణులను పంపించడం చాలా ఖరీ దైన వ్యవహారంగామార్చేస్తూ వీసా నిబంధనలు కఠనతరం చేసిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్‌తో పాటు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ కూడా హెచ్‌1బి వర్క్‌ వీసాల విధా నాన్ని దుర్వినియోగం చేశాయని కూడా అగ్రరాజ్యం ఆరోపించింది. దీంతోఆదాయాల్లో కీలక మార్కెట్‌ అయిన అమెరికాలో ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే దిశగాఇన్ఫోసిస్‌ అక్కడి సిబ్బందిని మరింతగా రిక్రూట్‌ చేసుకోవడంపై దృష్టిపెట్టిం ది. అయితే, స్థానికులకు అధిక జీతభత్యాలివ్వాల్సిరానున్నందున ఇన్ఫీ వ్యయాలూ ఆ మేరకు పెరగనున్నాయి. 2016-17లో ఇన్ఫీ ఆర్జించిన 10.2బిలియన్‌ డాలర్ల ఆదాయంలో దాదాపు 60శాతం వాటా ఉత్తరఅమెరికా మార్క్‌ెదే ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ వ్యూహం ఫలించింది. ఇప్పటికే అమెరికన్లకు భారీగా ఉద్యోగాలి స్తున్నట్లు దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్‌, విప్రోలు ప్రకటించగా, వచ్చే రెండేళ్లలో పదివేలమంది అమెరికన్లకు ఉగ్యోగాలిస్తామని తాజాగా ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ సిఇఒ విశాల్‌ సిక్కా తెలిపారు. ఐటీ కంపెనీలు హెచ్‌1బి వీసాపై విదేశీ కార్మికులను రప్పించి స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు దక్కకుండా చేయడాన్ని అను మతించబోమనే హామీపై అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్‌ ఈ వీసా కార్యక్రమాలను కట్టడిచేస్తూ నిర్ణయాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఉద్యోగులనే నియమించక తప్పని పరిస్థితుల్లో ఐటీ దిగ్గజాలు అక్కడి స్థాని కులకే ఉద్యోగాలివ్వడానికి నిర్ణయించాయి. అలాగే విదేశా ల్లో స్థానికుల రిక్రూట్‌మెంట్‌ పెంచుతున్నట్లు విప్రో సిఇఒ అబిదాలి జెడ్‌ నీముచ్‌వాలా కూడా ఆ కంపెనీ ఫలితాల ప్రకటన సమయం లో ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతొలి త్రైమాసికం ఆఖరు నాటికి అమెరికాలో తమ ఉద్యోగుల్లో సగభాగంపైగా స్థానికులే ఉండగలరని విప్రో సిఇఒ తెలపారు. హెచ్‌1బి వీసాలతో తక్కువ జీతాలు ఉండాయని ప్రకటించింది. ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీలు హెచ్‌1బి వీసాలతో తక్కువ జీతాలిచ్చి ఇండియా నుంచి సిబ్బందిని అమెరికాకు తరలిస్తున్నాయి. ఇన్ఫీ సగటున ఒక్కో హెచ్‌1బి వీసా దరఖాస్తుదారుకు 81,705 డాలర్ల వేతనాన్ని కిందటేడాది ఇవ్వజూపిందని మైవీసాజాబ్స్‌.కామ్‌ వెల్లడించింది. అయితే మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి అత్యంత భారీ గ్లోబల్‌ టెక్‌ కంపెనీలు సగటున 1,30,000 డాలర్లు ఆఫర్‌ చేశాయి.
1entertainment
Hyderabad, First Published 11, Aug 2019, 6:01 PM IST Highlights ఆగస్ట్ 30న వరల్డ్ వైడ్ గా సాహో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం మీడియాతో ముచ్చటించిన ప్రభాస్ - శ్రద్దా కపూర్ సరదగా వారి అభిప్రాయాలను తెలియజేశారు. ముఖ్యంగా ప్రభాస్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రతి ప్రశ్నకు నవ్వుతూ మాట్లాడారు. సినిమాలో సిక్సర్ డైలాగ్ గురించి మాట్లాడుతూ.. నేను కొడితే సిక్స్ మాత్రమే కొట్టాలని అనుకుంటా. నాకు డిఫెన్స్ ఆడటం ఇష్టం ఉండదు అని ఆన్సర్ ఇచ్చాడు. ఇక హిందీలో డైలాగ్ చెప్పాలని అందరూ కోరగా ప్రభాస్ సింపుల్ గా జై హింద్ అని చెప్పడం అందరిని ఎట్రాక్ట్ చేసింది.  ఇకపోతే హిందీ తానే డబ్బింగ్ చెప్పానని మాట్లాడుతూ..నాకు హిందీ రాయడం - చదవడం వచ్చినప్పటికీ బాలీవుడ్ లో హిందీ డబ్బింగ్ చెప్పడం కష్టంగా ఉండేది. అయితే మాస్టర్ ని సెట్ చేసుకొని నేర్చుకొని డబ్బింగ్ చెప్పాను. అలాగే శ్రద్దా కూడా చాలా అద్భుతంగా నటించింది. సినిమాలో స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే విజువల్స్ అందరిని ఆకట్టుకుంటాయి.  బాహుబలి 1 కంటే ముందే ఈ కథ నేను విన్నాను. కానీ బాహుబలి 2 తరువాత సినిమాలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. యాక్షన్ విజువల్స్ పరంగా కొన్ని చేంజ్ చేయాల్సి వచ్చింది.  జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. టీజర్ చూసినప్పుడు బ్యాక్ గ్రౌండ్ చూసి మేమందరం షాకయ్యాం అని ప్రభాస్ వివరణ ఇచ్చాడు.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ‘టీమిండియాకు మరో పరాభవం తప్పదు’ నెంబర్ వన్ జట్టు అని భావించి భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో పరాభవాలు ఎదుర్కొందని, బ్యాటింగ్ లోపాలు సరిదిద్దుకోవాలని సలహాఇచ్చాడు. | Updated: Sep 17, 2018, 04:38PM IST ఇంగ్లాండ్ గడ్డమీద టీమిండియా ఎదుర్కొన్న పరాభవాల నుంచి టీమిండియా పాఠాలు నేర్చుకోవాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సూచించాడు. పటిష్టంగా ఉండే బ్యాటింగ్ విషయంలోనే భారత జట్టు మరింత బలహీనంగా కనిపిస్తోందని, మరో రెండు నెలల్లో ఆ లోపాలు సరిదిద్దుకోవాలన్నాడు. లేని పక్షంలో కోహ్లీతో పాటు టీమిండియాకు మరో పరాభవం తప్పదని హెచ్చరించాడు చాపెల్. విరాట్ కోహ్లీ సేన ఈ నవంబర్‌ 21 నుంచి జనవరి 18 వరకు ఆసీస్ లో పర్యటించనుంది. పేస్ బౌలింగ్‌కు అనుకూలించే ఆసీస్ గడ్డపై భారత్‌ 3 ట్వంటీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు ఆడేందు షెడ్యూలు ఖరారైంది. అయితే ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో ప్రదర్శన ఆధారంగా టీమిండియా బ్యాటింగ్ శైలిని చాపెల్ విశ్లేషించాడు. ఇంగ్లండ్ కంటే పటిష్ట బౌలింగ్ దళం ఉన్న ఆసీస్ పేసర్లను కోహ్లీ సేనను అత్యంత కష్టతరమని చెప్పాడు. ఇంగ్లాండ్ గడ్డమీద స్పిన్నర్లను సైతం ఆడలేక భారత ఆటగాళ్లు చేతులెత్తేశారని గుర్తుచేశాడు. ఇప్పటికే నెంబర్ వన్ జట్టు అని భావించి భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో పరాభవాలు ఎదుర్కొందని, బ్యాటింగ్ లోపాలు సరిదిద్దుకుంటే పోరాడే అవకాశం ఉంటుందన్నాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లేకున్నా సొంతగడ్డపై ఆసీస్ జట్టుకు ఏ ఇబ్బంది ఉండదని ధీమా వ్యక్తం చేశాడు. మిచెల్‌ స్టార్క్‌, జోష్ హజెల్‌వుడ్‌, ప్యాట్‌ కమిన్స్‌, నాథన్ లయన్ సిరీస్‌ ఆసాంతం ఫిట్‌గా ఉంటే టీమిండియా గడ్డుకాలం తప్పదన్నాడు. కోహ్లీని మినహాయిస్తే బౌన్స్ బంతులను ఎదుర్కొనే బ్యాట్స్‌మెన్ జట్టులో లేరని, రోహిత్ శర్మ మాత్రం ఎదురుదాడికి దిగి ఆసీస్ బౌలింగ్‌లో పరుగులు సాధిస్తాడని ఇయాన్ చాపెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
2sports
పెట్రోల్ ధరలు తగ్గుతాయ్ Oil prices predicted న్యూఢిల్లీ: ఆర్థిక స‌ల‌హాదారు కృష్ణ‌మూర్తి సుబ్ర‌మ‌ణ్య‌న్ రూపొందించిన ఈ నివేదికను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే 201920 ఆర్ధిక సంవత్సరానికి గానూ భారత జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఆర్ధిక సర్వే అంచనా వేసింది. 201819 ఆర్ధిక సంవత్సరంలో సాధారణ ద్రవ్యలోటు 5.8 శాతంగా ఉందనీ.. 201718 సంవత్సరంలో ఇది 6.4 శాతంగా ఉందనీ వెల్లడించింది. 2019 ఆర్థిక సర్వేలో కీలక అంశాలు ఎన్నికల ప్రక్రియ జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్ధిక మందగమనానికి దారితీసింది. జీడీపీ వృద్ధి రేటు మందగిస్తే 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రెవెన్యూ వసూళ్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఆహార ధరల క్షీణత కారణంగా రైతులు 2019 ఆర్ధిక సంవత్సరంలో ఉత్పత్తి తగ్గించి ఉండొచ్చు 2018-19లో మందగమనానికి ఎన్‌బీఎఫ్‌సీ ఒత్తిళ్లు కూడా ఓ కారణం. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సర్దుబాటు విధానం వడ్డీ రేట్లు తగ్గింపునకు తోడ్పడే అవకాశం ఉంది. అధిక రుణ వృద్ధితో 2019-20లో పెట్టుబడులు పెరుగుతాయి. నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) తగ్గుదల మూలధన వ్యయం చక్రానికి ఊతమిస్తుంది వచ్చే ఆర్ధిక సంవత్సరంలో చమురు ధరలు దిగివచ్చే అవకాశం ఉంది. 2018 ద్వితీయార్థం నుంచి గ్రామీణ వేతన వృద్ధి పెరగడం శుభ పరిణామం. తాజా అంతర్జాతాయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/
1entertainment
హలో టీజర్ యూ ట్యూబులోంచి గయాబ్.. అఖిల్ కు ఇదేం షాక్.. Highlights అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన హలో డిసెంబర్ 22న హలో మూవీ రిలీజ్ కోసం ప్లాన్ చేసిన టీమ్ తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ను కాపీరైట్ కారణంగా తొలగించిన యూట్యూబ్ అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా నటించిన 'హలో' మూవీ వచ్చే నెల 22న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతున్న వేళ ఊహించని షాక్ తగిలింది. ఆ మధ్య విడుదలైన 'హలో' టీజర్‌ను యూట్యూబ్ తొలగించింది. ఈ చిత్రాన్ని స్వయంగా నాగార్జున నిర్మిస్తుండటంతో అన్నపూర్ణ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్‌లో దీన్ని అప్ లోడ్ చేశారు. ఈ టీజర్‌కు మిలియన్స్‌లో వ్యూస్, లక్షల్లో లైక్స్ వచ్చాయి. అయితే ఉన్నట్టుండి టీజర్ యూట్యూబ్ నుండి మాయం కావడంతో అభిమానులు షాకవుతున్నారు.   ఈ టీజర్ తొలగించడానికి కారణం ఇందులో వాడిన మ్యూజిక్ అని తెలుస్తోంది. అది కాపీ రైట్ ఉన్న మ్యూజిక్ కావడం, దాని వినియోగ హక్కులు పొందకుండా టీజర్లో వాడేయటంతో పసిగట్టిన యూట్యూబ్ దాన్ని తొలగించింది. ఆ మ్యూజిక్ సొంత హక్కు దారులు వారే ఫిన్‌లాండ్‌కి చెందిన ఎపిక్ నార్త్ కంపెనీ టీజర్స్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ తయారు చేస్తుంది. ఎంతో క్వాలిటీగా ఉండే ఆ మ్యూజిక్‌ని చిత్ర సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ టీజర్‌కి వాడాడట. దీంతో కాపీరైట్ క్లైమ్ కావడంతో హలో టీజర్‌ని యూట్యూబ్ నుండి తీసేశారు.   విషయం తెలిసిన వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ వారు చర్యలు చేపట్టారు. కాపీ రైట్ ఉన్న ఆ మ్యూజిక్ హక్కులు కొని... తిరిగి టీజర్ అప్ లోడ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ‘హలో' చిత్ర యూనిట్‌కు ఇది ఊహించని చేదు అనుభవమే. సినిమా విడుదల ముందే ఇలా జరగడంతో నాగార్జున కూడా అసంతృప్తికి గురైనట్లు సమాచారం. అఖిల్ నటించిన తొలి సినిమా ప్లాప్ కావడంతో నాగార్జున స్వయంగా రంగంలోకి దిగారు. చిత్ర నిర్మాణ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.   ‘మనం' సినిమాతో నాగార్జున ఫ్యామిలీకి మంచి హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 22న ‘హలో' మూవీ విడుదల కాబోతోంది. Last Updated 25, Mar 2018, 11:40 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ICC T20 Rankings: టాప్-10లో రాహుల్ ఒక్కడే, మెరిసిన మ్యాక్స్‌వెల్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కేఎల్ రాహుల్ ఆరోస్థానానికి చేరుకున్నాడు. భారత్ నుంచి టాప్-10లో ఉంది రాహుల్ ఒక్కడే. భారత్‌పై చెలరేగిన మ్యాక్స్‌వెల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Samayam Telugu | Updated: Mar 1, 2019, 01:35PM IST ICC T20 Rankings: టాప్-10లో రాహుల్ ఒక్కడే, మెరిసిన మ్యాక్స్‌వెల్ హైలైట్స్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కేఎల్ రాహుల్ ఆరోస్థానానికి చేరుకున్నాడు. భారత్ నుంచి టాప్-10లో ఉంది రాహుల్ ఒక్కడే. భారత్‌పై చెలరేగిన మ్యాక్స్‌వెల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. కాఫీ విత్ కరణ్ వివాదం క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. కానీ దీని నుంచి త్వరగానే బయటకొచ్చిన రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటాడు. దీంతో ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్‌పై రెండు టీ20ల్లో కలిపి 97 పరుగులు చేసిన రాహుల్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. టీ20ల్లో టాప్-10లో నిలిచిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్ రాహుల్ కావడం విశేషం.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘సర్కార్’ టీజర్ తెలుగులో.. టార్గెట్ 2019 ఎలక్షన్స్? ‘వాడొక కార్పోరేట్ రాక్షసుడు ఏ దేశానికి వెళ్లినా వాళ్లని నాశనం చేసే వెళ్తాడు.. వాడు ఇప్పుడు ఇండియా వచ్చాడు’ .. Samayam Telugu | Updated: Oct 23, 2018, 07:35PM IST ‘సర్కార్’ టీజర్ తెలుగులో.. టార్గెట్ 2019 ఎలక్షన్స్? ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘సర్కార్’ మూవీ టీజర్‌ను విజయదశమి కానుకగా విడుదలై యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. తుపాకి, కత్తి సినిమాల తరువాత మురుగదాస్-విజయ్ కాంబినేషన్ మూవీ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టింది. కాగా.. తెలుగులో అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ తెలుగు టీజర్‌ను మంగళవారం నాడు విడుదల చేసింది చిత్రయూనిట్. ఫ్రేమ్ టు ఫ్రేమ్ తమిళ టీజర్‌ మాదిరే ఉండి తెలుగులో డబ్బింగ్ వినిపించారు. #SarkarTeluguTeaser https://t.co/P01LE19AEo @actorvijay @ARMurugadoss @arrahman @KeerthyOfficial @varusarath @SonyMusicSouth — Sun Pictures (@sunpictures) 1540297820000 Visit Site Recommended byColombia వరలక్ష్మి శరత్ కుమార్ వాయిస్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌లో ‘వాడొక కార్పోరేట్ రాక్షసుడు ఏ దేశానికి వెళ్లినా వాళ్లని నాశనం చేసే వెళ్తాడు.. వాడు ఇప్పుడు ఇండియా వచ్చాడు’ లాంటి డైలాగ్‌కి ఆలోచింపజేసేదిగా ఉంది. ‘నేను ఏ కంపెనీని కొనడానికి రాలేదు. ఈ రోజు ఎలక్షన్ డే కదా నేను నా ఓటు వేయడానికి వచ్చాను’ అంటూ వేలు చూపించడం .. ‘ఇంకా ఒక్కరోజులో ఏం మారుతోందో.. మారబోతోందో ఓ మూలన కూర్చొని వేడుక చూడండి.. నేనో కార్పోరేట్ క్రిమినల్‌ని’, ‘మీ ఊరి నాయకుడ్ని మీరే కనిపెట్టండి ఇదే మన ‘సర్కార్’ లాంటి పొలిటికల్ పంచ్‌లు విజిల్స్ వేయించేవిగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పొలిటికల్ జానర్ మూవీ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందే చూడాలి. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయిక పాత్రలో కనిపిస్తున్నారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించగా.. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిచింది. దీపావళి కానుకగా నవంబర్ 6న భారీ స్థాయిలో విడుదలకానుంది ‘సర్కార్’. Sarkar Telugu Teaser: ‘సర్కార్’ టీజర్ తెలుగులో X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
ఎస్‌బీఐలో 2000 ఖాతాలతో రూ 8 కోట్లు వైట్‌ - నల్లడబ్బు మార్చేందుకు ఖాతాలు తెరిచారు న్యూఢిల్లీ:నోట్ల రద్దు నేపథ్యంలో నల్లకుబేరులు బరితెగించిన తీరు బట్టబయలైంది.నల్ల ధనాన్ని మార్చుకునేందుకు ఎస్‌బీఐ బరేలి శాఖలో ఏకంగా 2000 ఖాతాలను తెరిచి దాదాపు రూ 8కోట్ల పాత నోట్లను డిపాజిట్‌ చేసి వైట్‌గా మార్చుకున్నట్టు సీబీఐ నిగ్గుతేల్చింది.దీనికి సంబంధించి బ్యాంక్‌ అధికారులు,బాధ్యులపై సీబీఐ నేరపూరిత కుట్ర,మోసం,అవినీతి అభియోగాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లోని బరేలి సివిల్‌ లైన్స్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు చేపట్టగా ఈ అక్రమాలు వెలుగు చూశాయి.గత ఏడాది నవంబర్‌ 8న నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత బ్రాంచ్‌లో కొత్తగా తెరిచిన ఖాతాల్లో పెద్దమొత్తంలో నగదు డిపాజిట్లు చోటుచేసుకున్నాయని తనిఖీల్లో సీబీఐ గుర్తించింది.నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 31 మధ్య 2,441 కొత్త ఖాతాలను బ్యాంక్‌ అధికారులు తెరిచినట్టు తేలింది.వీటిలో 667 సేవింగ్స్‌ ఖాతాలు కాగా,53 కరెంట్‌ ఖాతాలు,94 జన్‌ధన్‌ ఖాతాలు, 50 పీపీఎఫ్‌ ఖాతాలు, మరికొన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాలుగా గుర్తించారు.వీటిలో రెండు సీనియర్‌ సిటిజన్‌ ఖాతాలు, ఒక ప్రభుత్వ ఖాతా కూడా ఉన్నట్టు వెల్లడైంది.ఈ ఖాతాల్లో రూ లక్షకు పైగా డిపాజిట్‌ అయిన ఉదంతాలు 794 వరకూ ఉన్నాయని విచారణలో తెలిసింది.మరికొన్ని ఖాతాల్లో భారీ మొత్తంలో డిపాజిట్‌ అయినప్పటికీ ఆ మొత్తాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.సరైన రికార్డులు లేకుండా భారీ మొత్తంలో నగదు డిపాజిట్‌ ద్వారా ప్రయివేటు వ్యక్తులతో బ్యాంకు అధికారులు కుమ్మక్కై నగదు మార్పిడికి సహకరించారని సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది.అధికారులు తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు పాత నోట్లను స్వీకరించే రసీదులు,టెల్లర్‌ నివేదికలు,నూతన నోట్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి రికార్డులు నిర్వహించలేదని తెలిపింది. రూ 5400 కోట్ల నల్లధనం గుర్తించాం సుప్రీంకు తెలిపిన సర్కార్‌ నోట్ల రద్దు అనంతరం ఈ ఏడాది జనవరి 10 వరకూ రూ 5400 కోట్ల లెక్కతేలని సొమ్మును నిఘా,దర్యాప్తు సంస్థలు గుర్తించాయని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది.పాత నోట్లతో బంగారం కొనుగోలు చేయడం వంటి పలు అక్రమాలను వెలికితీసినట్టు వెల్లడించింది.నోట్ల రద్దు సమయంలో జరిగిన డిపాజిట్లను డేటా అనాలిసిస్‌ ద్వారా ఈ వెరిఫికేషన్‌తో ఆదాయ పన్ను శాఖ ఆపరేషన్‌ క్లీన్‌ మనీని చేపట్టిందని వివరించింది.నవంబర్‌ 8 నుంచి జనవరి 10 మధ్య వివిధ వ్యక్తులపై దాదాపు వేయికి పైగా దాడులు,సర్వేలను ఆదాయ పన్ను శాఖ చేపట్టిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సుప్రీంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.దాడుల ద్వారా రూ 610 కోట్ల నగదును ఐటీ విభాగం సీజ్‌ చేసిందని తెలిపింది.పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు సంబంధించి 5100 నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించింది.400 కేసులను తదుపరి దర్యాప్తు కోసం సీబీఐ,ఈడీలకు అప్పగించినట్టు పేర్కొంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు   ముంబై: మార్కెట్లలో ముందురోజున్న లాభాల ఒరవడి బుధవారం కనిపించలేదు. ట్రేడిం గ్‌ ఆసాంతం పునరేకీకరణ బాటలో కొనసాగింది. రోజుమొత్తం ప్రతికూలంగా ఆసాంతం ఊగిసలాట గానే ముగిసింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 44 పాయింట్లు క్షీణించి 29,398 పాయింట్లవద్ద నిలిచింది. నిఫ్టీ తొలుత 9100 పాయింట్లను అధిగ మించినా చివరికి బలహీనపడి రెండుపాయింట్ల స్వల్పనష్టంతో 9085వద్ద స్థిరపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో భిజెపి భారీవిజయం నేపథ్యంలో మంగళ వారం దేశీయ స్టాక్‌మార్కెట్లు కొత్తరికార్డులు నమోదుచేసాయి. ట్రేడర్లు కూడా లాభాల స్వీకరణకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరో పక్క అమెరికా కేంద్రబ్యాంకు ఫెడ్‌ రిజర్వు విధాన సమీక్ష నేడు ముగుస్తున్నది. సమీక్షలో పావుశాతం వడ్డీరేట్ల పెంపు ఉంటుందన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్లనే ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవ హరించారు. ట్రేడింగ్‌లో ఐటి కౌంటర్లలో అమ్మకా లు పెరిగాయి. డాలరు మారకంలో దేశీ కరెన్సీ రెండున్నరేళ్ల గరిష్టం 65.67కు చేరింది. ఎన్‌ఎస్‌ఇ లో ఐటిరంగం అత్యధికంగా 1.7శాతం దిగజారింది. మిగిలిన అన్నిసూచీలు లాభపడగా పిఎస్‌యు బ్యాంకు 1.3 శాతం పెరిగింది. ఆటోరంగం 0.8శాతం బలపడింది. ఇక నిఫ్టీ దిగ్గజాల్లో ఐడియా పదిశాతం పెరిగింది. వొడాఫోన్‌తో విలీనానికి ముందుగానేటవర్ల బిజినెస్‌ను ఏటిసికి విక్ర యిస్తుందన్న వార్తలు డిమాండ్‌ పెంచాయి. ఇదే బాటలో భెల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, అరబిందో, టాటాపవర్‌, టాటామోటార్స్‌, కోటక్‌ బ్యాంకు, హీరోమోటో, టాటాస్టీల్‌, 1-3శాతం లాభపడ్డాయి. మరోపక్క టెక్‌ దిగ్గజాలు టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సిఎల్‌ టెక్‌, విప్రో 1.3నుంచి 2.7శాతం మధ్య నీర సించాయి.హెచ్‌యుఎల్‌, ఐసిఐసిఐ, కోల్‌ఇండియా, ఎన్‌టిపిసి, ఎల్‌అండ్‌టి 0.7శాతం చొప్పున బల హీనపడ్డాయి. చిన్నషేర్ల హవా కొనసాగించాయి.
1entertainment
త్రివిక్రమ్ భయపడుతున్నాడా.. ట్రైలర్ రిలీజ్ ఆపిన కారణమిదే.. Highlights పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి జనవరి 10న సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ కు రంగం సిద్ధం ట్రైలర్ విడుదల చేయకపోవడంపై అనుమానాలు జనవరి పది మరో నాలుగు రోజుల్లో... సినిమా రిలీజ్ చేయాల్సిన సమయం దగ్గర పడుతోంది. కౌంట్ డౌన్ మొదలైంది. ఫ్యాన్స్ తో పాటు అంతా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న తరుణం.. ఇప్పటికే రిలీజైన ఆడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పటికే అజ్ఞాతవాసిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.   ఇంతగా హైప్ క్రియేటైన అజ్ఞాతవాసి ట్రైలర్ రిలీజ్ ఇంకా ఎందుకు ఆలస్యమవుతోంది. కనీసం ఎప్పుడొస్తుంది అనే దానిపై కూడా క్లారిటీ లేదు. నేడో.. రేపో.. ట్రైలర్ విడుదల ఖాయమన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. నిజానికి ట్రైలర్ ఇప్పటికే కట్ చేసి సిద్దం చేసినప్పటికీ.. రిలీజ్ చేయడానికి మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ తటపటాయిస్తున్నారట. ఇంతకీ ఆ కారణమేంటీ..   ఫ్రెంచ్ దర్శకుడు జెరోం సల్లే దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్రెంచ్ మూవీ 'లార్గో వించ్' సినిమాకు అజ్ఞాత‌వాసి కాపీ అన్న ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ విడుదల చేసినప్పటి నుంచి ఈ ప్రచారం జోరందుకుంది. అయితే ఇప్పుడు ట్రైలర్ కూడా విడుదలైతే ఆ ప్రచారం మరింత ఊపందుకుంటుందని త్రివిక్రమ్ భయపడుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో సీన్లకు లార్గో వించ్ తో పోలికలు ఉంటే.. కాపీ అన్న ముద్ర పడిపోవడం ఖాయమంటున్నారు.   కాపీరైట్ వివాదం చెలరేగుతుందనే భయం వల్లే ట్రైలర్ కట్ చేసి సిద్దంగా ఉంచినా.. విడుదల చేయడానికి మాత్రం త్రివిక్రమ్ ధైర్యం చేయట్లేదట.   అయితే ట్రైలర్ ఎలాగూ రిలీజ్ చేయక తప్పదు కాబట్టి.. నేడో.. రేపో.. అజ్ఞాత‌వాసి ట్రైలర్ విడుదల చేస్తారని అంటున్నారు. అయితే అది ఏ సమయంలో అన్నది త్రివిక్రమ్ మూడ్‌పై ఆధారపడి ఉంటుందట. ఆయన ఎప్పుడు ఓకె అంటే అప్పుడు యూట్యూబ్ లో ట్రైలర్ దర్శనమిస్తుందన్నమాట. మరి ఈ రెండు రోజుల్లో కూడా అజ్ఞాత‌వాసి ట్రైలర్ రిలీజ్ చేయకపోతే.. కాపీ ఆరోపణలకు త్రివిక్రమ్ ఊతమిచ్చినవారవుతారు.   ఇక ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ డైరెక్టర్ జెరోం సల్లె కూడా అజ్ఞాత‌వాసి సినిమా చూడాలనుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా చెప్పిన సంగతి తెలిసిందే. మరు హక్కులు దక్కించుకున్న టి-సిరీస్ విషయాన్ని తేలుస్తుందా?  లేదా అన్నది చూడాలి. ఎటొచ్చీ పవన్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావటం మాత్రం ఖాయం. మరి ఏం చేస్తారో చూడాలి. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఐపీఎల్ ప్రియులకు 'జియో' బంపర్ ఆఫర్..! 'ఐపీఎల్ సీజన్ 11' కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రేమికుల కోసం రిలయెన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం 'జియో క్రికెట్ సీజన్ ప్యాక్‌' పేరుతో రూ.251 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనికింద యూజర్లకు 102 జీబీ డేటాను అందించనుంది. TNN | Updated: Apr 5, 2018, 01:02PM IST ఐపీఎల్ ప్రియులకు 'జియో' బంపర్ ఆఫర్..! 'ఐపీఎల్ సీజన్ 11' కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రేమికుల కోసం రిలయెన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం 'జియో క్రికెట్ సీజన్ ప్యాక్‌' పేరుతో రూ.251 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనికింద యూజర్లకు 102 జీబీ డేటాను అందించనుంది. దీనిద్వారా వినియోగదారులు ఏప్రిల్ 7న ఐపీఎల్ ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో 51 రోజుల పాటు జరిగే అన్ని మ్యాచ్‌లను ఉచితంగా చూడవచ్చు. జియో క్రికెట్ సీజన్ ప్యాక్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లు 'జియో ధన్ ధనా ధన్ లైవ్' కింద క్రికెట్ కామెడీ షోలను కూడా వీక్షింవచ్చు. ఐపీఎల్ ప్రారంభ తేదీ నుంచే ఈ షోలు కూడా ప్రారంభం కానున్నాయి. రాత్రి 7.30 గంటల నుంచి ఈ షోలు ప్రసారమవుతాయి. ఈ షోలో కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్‌‌లతోపాటు ప్రముఖ యాంకర్‌లు, కమెడియెన్లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నారు. నాన్ జియో కస్టమర్లకు కూడా ఈ కామెడీ షోలు అందుబాటులో ఉంటాయి.
1entertainment
sandhya 311 Views AUS vs PAK , World Cup 2019 AUS vs PAK టాంటన్‌: కాసేపట్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ పోరు ప్రారంభం కానుంది. మ్యాచ్‌లో భాగంగా టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు సిద్ద మవుతుంది. మరోవైపు టాంటన్‌లో వర్షం పడే సూచనలైతే ప్రస్తుతానికి కనిపించడం లేదు. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఇక ఐపీఎల్ స్పాన్సర్ ‘వివో’ ఇంతవరకు ఐపీఎల్ స్పాన్సర్ గా ఉన్న పెప్సీ ఆ స్థానం నుంచి తప్పుకుంది. TNN | Updated: Oct 24, 2015, 02:12PM IST ఇంతవరకు ఐపీఎల్ స్పాన్సర్ గా ఉన్న పెప్సీ ఆ స్థానం నుంచి తప్పుకుంది. ఆ స్థానంలోకి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో వచ్చింది. 2016, 2017 సంవత్సరాలలో జరిగే ఐపీఎల్ మ్యాచులకు వివోనే స్పాన్సర్ గా ఉంటుంది. అందుక్కావాల్సిన బ్యాంకు వ్యవహారాలన్నింటినీ వివో పూర్తి చేసింది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ‘బిగ్ బాస్’ విజేతకు అర కోటి! తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షోగా ప్రారంభమైన ‘బిగ్ బాస్’ మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. TNN | Updated: Aug 6, 2017, 10:24AM IST తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షోగా ప్రారంభమైన ‘బిగ్ బాస్’ మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో విజేతకు ఎంత మొత్తం చెల్లిస్తారనేదానిపై ఇప్పటి వరకు స్పష్టతలేదు. స్టార్ ఛానల్ కానీ, బిగ్ బాస్ నిర్వాహకులు గానీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే శనివారం ప్రసారమైన 21వ ఎపిసోడ్‌లో బిగ్ బాగ్ షో విజేతకు ఎంత చెల్లించనున్నారో ఎన్టీఆర్ ప్రకటించారు. ‘నా టీవీ’ ద్వారా హౌజ్‌లో ఉన్న పోటీదారులకు, ప్రేక్షకులకు ఒకేసారి సర్‌ప్రైజ్ ఇచ్చారు. విజేతకు అక్షరాల రూ. 50 లక్షలు చెల్లించనున్నట్లు చెప్పారు. ఇంకా మున్ముందు చాలా బహుమతులే ఉంటాయని హౌజ్‌మేట్స్‌ను ఉత్సాహపరిచారు. ‘ఒకవేళ రూ. 50 లక్షలు గెలుచుకుంటే వాటితో మీరు ఏంచేస్తారు?’ అని హౌజ్‌మేట్స్ ఎన్టీఆర్ అడిగారు. దీనికి ఒక్కక్కొరు ఒక్కో సమాధానం ఇచ్చారు. రూ. 50 లక్షలు గెలుచుకుంటే ఏంచేస్తారని ఎన్టీఆర్ మొదటిగా ధనరాజ్‌ను అడిగారు. ‘నాకు మాటిచ్చావ్.. కచ్చితంగా షోలో గెలిచే ఇంటికి రావాలి అని మీ భార్య మిమ్మల్ని అడిగారు. మరి ఈ డబ్బుతో ఏంచేస్తారు?’ అని ఎన్టీఆర్ ధనరాజ్‌ను ప్రశ్నించారు. దీనికి ధనరాజ్ సమాధానం చెపుతూ.. ‘ఒక మంచి ఇంటిని గిఫ్ట్‌గా ఇస్తానని మా ఆవిడకి మాటిచ్చానన్న. ఈ డబ్బులు గెలుచుకుంటే కొత్త ఇంటిని కొని మా ఆవిడకి, బాబుకి గిఫ్టుగా ఇస్తాను. ఒకవేళ ఈ షోలో గెలవకపోయినా నేను చచ్చిపోయే లోపు ఎలా అయినా ఇల్లుకొని మా ఆవిడకి గిఫ్టుగా ఇస్తాను’ అని చెప్పి చప్పట్లు కొట్టించుకున్నాడు.
0business
Hyd Internet 106 Views india practice session india practice session నాగ్‌పుర్‌: విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఐదో వన్డే ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇక చివరి వన్డేలో గెలిచి వన్డే ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవడం లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. బెంగళూరు వేదికగా జరిగిన నాలుగో వన్డేలో అనూహ్యంగా పుంజుకొని గెలుపొందిన కంగారులు.. మరో విజయంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా శనివారం కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌లో తీవ్రంగా సాధన చేసింది. ప్రధాన, సహాయకోచ్‌ల పర్యవేక్షణలో ముఖ్యంగా ఫీల్డింగ్‌కు సంబంధించిన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 3-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
2sports
GANGOOLY కంగారొద్దు..ఈడెన్‌ మ్యాచ్‌ పక్కా: గంగూలీ కోల్‌కతా: కోల్‌కతాలో గత కొద్దిరోజులుగా భారీ వర్షం పడుతున్నా ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానాన్ని చక్కగా సంరక్షిస్తున్నా మని భారత మాజీ కెప్టెన్‌, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. భారత్‌- ఆస్ట్రేలియా మధ్య ఈనెల 21న ఈడెన్‌ గార్డెన్స్‌లో రెండో వన్డే జరగాల్సి ఉంది. కానీ భారీ వర్షాల కారణంగా మైదా నం పాడయిందంటూ వస్తున్న వార్తల్ని ఖండించిన గంగూలీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈడెన్‌ గార్డెన్స్‌ మైదా నం మునుపటి రూపు రేఖల్ని ఏమీ కోల్పోలేదు. రెండో వన్డే కోసం మేము పిచ్‌, మైదానాన్ని సిద్ధం చేయగలం. గత కొద్ది రోజులుగా భారీవర్షం పడుతున్న మాట వాస్తవమే. కానీ…మైదానాన్ని చక్కగా కవర్లతో కప్పి ఉంచి సంరక్షిస్తు న్నాం అని వివరించాడు.శ్రీలంకతో బుధవారం ముగిసిన సుదీర్ఘ సిరీస్‌లో వరుస విజయాలు సాధించిన భారత్‌ జట్టు నూతనోత్తేజంతో సొంతగడ్డపై ఆస్ట్రేలియాను ఢీకొట్ట బోతోంది. సెప్టెంబర్‌ 17న చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది.
2sports
Williams విలియమ్సన్‌ వీరబాదుడు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు పలుమార్లు వర్షంతో అంతరాయం న్యూజిలాండ్‌ 45ఓవర్లలో 291పరుగులు ఆస్ట్రేలియాకు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్థతిలో 33 ఓవర్లలో 235లక్ష్యం లండన్‌: ఛాంపియన్స్‌ ట్రోఫీ లో భాంగా గ్రూప్‌-ఎలో ఆస్ట్రే లియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలి యమ్సన్‌ శతకం నమోదు చేశాడు. 96 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో సెం చరీ చేశాడు. తద్వారా ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును విలియ మ్సన్‌ సాధించడమే కాకుం డా, ఆజట్టుపై తొలి వన్డే శత కాన్ని నమోదు చేశాడు. అం తకుముందు ఆసీస్‌పై విలియ మ్సన్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు 81. ఈమ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నెమ్మదిగా ఇన్సింగ్‌ను ఆరంభించింది. న్యూజిలాండ్‌ ఓపెనర్లు గస్టిల్‌, ల్యూక్‌ రోంచీలు ఇన్నింగ్స్‌ను ఎటువంటి తడబాటు లేకుండా ప్రారంభించాడరు. అయితే న్యూజిలాండ్‌ స్కోరు 40పరుగుల వద్ద గప్టిల్‌ (26) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. రోంచీతో జతకలిసిన విలియమ్సన్‌ స్కోరు బోర్డును చక్కదిద్దాడు. అయితే ఇన్సింగ్‌ పదో ఓవర్‌లో వర్షం రావడంతో మ్యాచ్‌ను 46ఓవర్లకు కుదించారు. మ్యాచ్‌ ముగిసిన తరువాత తిరిగి క్రీజ్‌లోకి వచ్చిన రోంచీ-విలియమ్సన్‌లు 70పరుగులు జోడించి స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కాగా, రోంచీ(65) రెండో వికెట్‌గా అవుట్‌ కావడంతో కివీస్‌ కాస్త తడబడినట్లు కనిపించింది. అయితే ఆపై రాస్‌ టేలర్‌-విలియమ్సన్‌ల జోడి కుదురుగా బ్యాటింగ్‌ చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లడంతో న్యూజిలాండ్‌ తిరిగి గాడిలో పడింది. ఈజోడీ 99పరుగులు జత చేసిన తరువాత టేలర్‌(46) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరువాత కాసేపటికి విలియమ్సన్‌ సెంచరీతో మె రిశాడు. కాగా, శతకం సాధిం చిన వెంటనే విలియమ్స్‌ను అనవసర పరుగు కోసం యత్నించి నాలుగో వికెట్‌గా పెవిలియన్‌ చేశారు. అయితే న్యూజి లాండ్‌ 45ఓవర్లలో 291పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు ప్రారం భించిన ఆసిస్‌ మరోమారు వర్షం అంతరాయం కలిగించడంతో గంటకు పైగా వర్షం కురియడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఆసీస్‌కు 33ఓవర్లలో 235లక్ష్యంగా నిర్ధేశించారు. చివరి వార్తలు అందే సరికి ఆస్ట్రేలియా 6ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 35పరుగులు చేసింది.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV పవన్ క్రేజ్‌కి.. ముంబయి ఏజెన్సీ షాక్ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిర..మిర.. మీసం పాటకి అభిమానుల నుంచి భారీగా స్పందన TNN | Updated: Mar 8, 2017, 12:20PM IST పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోల సినిమా పంక్షన్ ఏదైనా పవన్ కల్యాణ్ నామస్మరణతో అభిమానులు ఊగిపోతారు. ఇప్పుడు తాజాగా ముంబయిలోని ఓ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అభిమానుల్లో పవన్ కల్యాణ్ క్రేజ్ చూసి షాక్‌కి గురైందట. మార్చి 24న విడుదలకు సిద్ధంగా ఉన్న ‘కాటమరాయుడు’ సినిమా ప్రమోషన్ బాధ్యతలను నిర్మాత శరత్ మరార్ సదరు డిజిటల్ ఏజెన్సీకి ఇటీవల అప్పగించారు. కొద్ది రోజుల ముందు విడుదలైన కాటమరాయుడు టీజర్, గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిర..మిర.. మీసం పాటకి అభిమానుల నుంచి భారీగా స్పందన రావడంతో ఏజెన్సీ ఆశర్చపోయిందట. ఇప్పటి వరకు టీజర్‌ను 96లక్షల మంది వీక్షించగా.. పాటను 29 లక్షల మంది చూశారు. శరత్ మరార్‌కి డిజిటల్ మీడియాపై మంచి అవగాహన ఉండటంతోనే ఈ ఏజెన్సీని ఎంచుకుని సినిమాని బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. డాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెండోసారి పవన్ కల్యాణ్‌ సరసన శ్రుతి హాసన్ ఆడిపాడనుంది.
0business
Dec 07,2016 రూ.29 వేల దిగువకు పుత్తడి న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధరలు దిగి వస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు వల్ల అమ్మకాల్లో స్తబ్దత నెలకొనడంతో వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా పుత్తడి ధర దిగి వచ్చింది. పది గ్రాముల బంగారం ధర రూ.29 వేల దిగువకు చేరి ఆరు మాసాల కనిష్టం వద్ద నమోదయ్యింది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.250 మేర తగ్గి వరుసగా రూ.28,800, రూ.28,650గా నమోదయ్యింది. ఇంతక్రితం సెషన్‌లో పుత్తడి ధర రూ.200 మేర తగ్గింది. గత మే 31న బంగారం ధర రూ.28,850గా పలికింది. తాజాగా న్యూయార్క్‌ మార్కెట్‌లో అమెరికా ధర 0.6 శాతం తగ్గి ఒక్క ఔన్స్‌ ధర 1,170 డాలర్లుగా పలికింది. వెండి ధర కూడా 0.06 శాతం కోల్పోయి 16.71 డాలర్లుగా నమోదయ్యింది. కిలో వెండిపై రూ.100 తగ్గి రూ.41,100గా నమోదయింది. 100 వెండి నాణేల ధర రూ.74,000గా పలికింది. నవంబర్‌ 8న కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడంతో పసిడి కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఓటమి భయమే శ్రీలంకని ముంచేస్తోంది..! భారత్‌తో జరుగుతున్న సుదీర్ఘ సిరీస్‌లో శ్రీలంక ఓటమి భయంతోనే ఒత్తిడికి గురై పరాజయాలను చవిచూస్తోందని TNN | Updated: Aug 24, 2017, 07:15PM IST భారత్‌తో జరుగుతున్న సుదీర్ఘ సిరీస్‌లో శ్రీలంక ఓటమి భయంతోనే ఒత్తిడికి గురై పరాజయాలను చవిచూస్తోందని ఆ దేశ మాజీ క్రికెటర్ మహేల జయవర్దనె అభిప్రాయపడ్డాడు. టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 3-0తో క్లీన్‌స్వీప్‌కి గురైన ఆ జట్టు.. తొలి వన్డేలోనూ పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయం చవిచూసింది. తాజాగా గురువారం జరుగుతున్న రెండో వన్డేలోనూ భారత బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 236/8కే పరిమితమైంది. ‘శ్రీలంక జట్టు ఆత్మవిశ్వాసం ప్రస్తుతం పూర్తిగా సన్నగిల్లింది. వారిలో ఓటమి భయం స్పష్టంగా కనబడుతోంది. మ్యాచ్ గెలవాలనే పట్టుదల, గెలుస్తామనే ధీమా ఇసుమంతైనా వారిలో నాకు కనిపించడం లేదు. జట్టుతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కార మార్గం కనిపెట్టాలి. టెస్టు సిరీస్‌లో తమ ప్రదర్శనపై జట్టులోని క్రికెటర్లందరూ చాలా నిరాశలో ఉన్నారు. కనీసం వన్డేల్లోనైనా భారత్‌కి పోటీనివ్వాలంటే.. వారిలో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపాల్సిందే’ అని జయవర్దనె వివరించాడు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV 2.0 మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఇదే 2.0 మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ TNN | Updated: Oct 17, 2016, 06:01PM IST తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 2.0 మూవీ ఫస్ట్ లుక్ ముంబైలో రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే. అయితే, ఆ రోజు ఎప్పుడు, ఏంటనే వివరాలు మాత్రం పెద్దగా బయటకి పొక్కలేదు. కానీ ఈ సినిమాని నిర్మిస్తున్న లికా ప్రొడక్షన్స్‌కి చెందిన రాజు మహాలింగం చేసిన ట్వీట్‌తో ఇటీవలే ఆ వివరాలు కూడా వెల్లడయ్యాయి. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌కి సెల్యూలాయిడ్ రూపంతో గ్లోబల్ స్టాండర్డ్స్‌తో వస్తోన్న 2.0 మూవీ ఫస్ట్ లుక్‌ని నవంబర్ 20వ తేదీన ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నట్టు ఈ ట్వీట్ ద్వారా తెలిపారు. "Make in India" a reality on celluloid!! 2.0 team delivers Global Standard's!!We will tease you'll on 20th Nov-2016. pic.twitter.com/UXv7YS6j6B — raju.mahalingam (@rajumahalingam) October 14, 2016 శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రజినీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. తొలిసారిగా అక్షయ్ కుమార్ తమిళంలో నటిస్తున్న సినిమా ఇదే. 2010లో రిలీజైన రోబో(తమిళంలో ఎంథిరన్) సినిమాకి ఇది సీక్వెల్. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 2.0 మూవీ భారీ బడ్జెట్ పరంగా దేశవ్యాప్తంగా వున్న సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుందీ సినిమా.
0business
kajol as brand ambassidor కొత్త ఓలే టోటల్‌కు కాజోల్‌ ప్రచారం ముంబై, అక్టోబరు 12: ప్రముఖ సౌందర్యసాధనాల ఉత్పత్తి సంస్థలే టోటల్‌కు బాలివుడ్‌ నటి కాజోల్‌ప్రచారకర్తగా వ్యవహరి స్తోంది. చర్మసంరక్షణతో వయసు 20లోపే కనిపిస్తుందని కాజోల్‌చేత కంపెనీ ప్రచారం చేయి స్తోంది. గడచిన 25 ఏళ్లుగా తన జీవి తం మొత్తం మారిపోయిందని, ఓలే మూడు స్టెప్‌ల చర్మసంరక్షణ ద్వారా ఎంతో సత్ఫలితాలు సాధించినట్లు కాజోల్‌ ప్రచారం చేస్తోంది. ఓలే కంపెనీ కొత్తగా టోటల్‌పేరిట కొత్త తేలికపాటి తేమపూరిత లేపనాన్ని మార్కెట్‌కు ప్రవేశపెట్టింది. వయోభారంతో సత మతం అవుతున్న మహిళలకు ఓలే టోటల్‌ మంచి ఫలి తాలిస్తుందని కంపెనీ ప్రచారంచేస్తోంది. విటమిన్‌ బి3, ప్రొబిట మిన్‌ బి5, సూపర్‌ మల్టి వితమిన్‌ కాంప్లెక్స్‌ వైటల్‌ నియాసిన్‌ వంటి ఔషధీకృత వనరులు ఓలేలోఉన్నట్లు కంపెనీ చెపుతోంది.
1entertainment
ITEL ఐటెల్‌ నుంచి పవర్‌ప్రొ పి41 న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఐటెల్‌మొబైల్‌ 4జి అనుభవాలనుమరింత చేరువచేస్తోంది. పవర్‌ప్రొ పి41ను విడుదలచేసింది. వోల్టే, 4జి వోల్టే సౌక ర్యాలు రెండూ ఉంటాయని, 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, రూ.5999ల ధరలోనే లభిస్తుందని ఐటెల్‌ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ తాజా నౌగట్‌ వ్యవస్థతో పనిచేస్తుంది. 5 అంగుళాల డిస్‌ప్లే, 1.3 జిహెచ్‌జడ్‌ క్వాడ్‌కోర్‌, 8జిబి స్టోరేజి, వన్‌జిబిరామ్‌, 5ఎంపి వెనుకకెమేరా ఆటో ఫోకస్‌తో పనిచేస్తుంది. డ్యూయల్‌ లెడ్‌ఫ్లాష్‌ అమర్చింది. వైఫై, 3జి,4జి,2జి, జిపిఎస్‌, బ్లూటూత్‌ ఫీచర్లున్నాయి. గ్రాఫైట్‌, వెండి, గ్రే ,షాంపేన్‌రంగుల్లో లభిస్తున్నది. కంపెనీ సిఇఒ సుధీర్‌కుమార్‌ మాట్లాడుతూ తమ ఐటెల్‌ స్మార్ట్‌ఫోన్‌ మొబైళ్లు కస్టమర్లకు మరింత చేరువ అవుతాయని, పవర్‌ప్రొ పి41తో ఎంతో అనుభూతిని ఇస్తుందని అన్నారు. ఈ ఫోన్‌లో గ్జెండర్‌ యాప్‌ ఉంది. వీటితో ఫైళ్ల షేరింగ్‌, ఫోటోలు వంటివాటిని ఇతర ఉత్పత్తులకు పంపించుకోవచ్చు. ట్రాన్సిషన్‌ హోల్డింగ్స్‌ కంపెనీగా ఉన్న ఐటెల్‌ అత్యధిక విలువలున్న ఉత్పత్తులను తక్కువధరల్లోనే అందించేందుకు నిర్ణయించిందని కంపెనీ సిఇఒ వెల్లడించారు.
1entertainment